Satavahana University
-
వాట్సాప్ గ్రూపులపై పోలీసుల నజర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన విశ్వవిద్యాలయం: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులపై పోలీసులు దృష్టిసారించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులను గుర్తించేందుకు సీజ్ చేసిన తొమ్మిది మొబైల్ ఫోన్లను సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపించడంతో ఆయా కళాశాలలకు, వాట్సాప్ గ్రూపులకు చెందిన వారిలో కలవరం మొదలైంది.విచారణలో కొన్ని కొత్త వాట్సాప్ గ్రూపులు, మరింత అదనపు సమాచారం రావడంతో వారందరికీ నోటీసులు పంపిస్తూ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశ్నపత్రం లీక్పై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు ముమ్మరమైంది. నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వైస్ చాన్స్లర్ మల్లేశ్, రిజిస్ట్రార్ భరత్, పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగప్రసాద్తో మాట్లాడి ఆ వ్యవహారంపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్షల విభాగాన్ని పరిశీలించి అందులో పనిచేసే సిబ్బందితో మాట్లాడారు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! కరీంనగర్ నగరంలోని ఓ ప్రభు త్వ కళాశాలతోపాటు మరో ప్రైవేట్ కళాశాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపు ల్లో పేపర్లు లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించి ఇందులో 22 మందిని విచారించారు. 55 పరీక్షాకేంద్రాలకు పోలీసులు నోటీసులు పంపడంతో వివిధ కళాశాలల్లో వణుకు మొదలైంది. పశ్నపత్రాలు వచ్చిన గ్రూపుల్లో సదరు కళాశాలలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉండటాన్ని బట్టి చూస్తే వారికి తెలిసే ఈ లీక్ వ్యవహారం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచి అరగంట ముందే లోనికి ... సాధారణంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుండగా, తీరా పరీక్షల సమయందాకా విద్యార్థులను అనుమతించేవారు. ఇక నుంచి ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైతే అరగంట ముందుగానే అంటే 9.30గంటలకు, మధ్యాహ్నం పరీక్ష రెండు గంటలకు ప్రారంభమైతే 1.30 గంటలకే విద్యార్థులు పరీక్షాకేంద్రంలో ఉండాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీని వల్ల ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఈ సమయం తర్వాత విద్యార్థులు వస్తే అనుమతించబోరు. -
ప్రశ్నపత్రం లీకేజీలో ప్రశ్నలెన్నో..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహా రం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయం లో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాలతో వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వర్సిటీ అధికారులు అందజేసిన సెల్ఫోన్ నంబర్ల ఆధారంగా ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పేపర్ లీకైన ఫొటోల్లోని ఓ ఫొటోను ‘సాక్షి’ సంపాదించింది. 17వ తేదీన ప్రశ్నపత్రం రాగానే ఇంకా డౌన్లోడ్ చేయకముందే.. ఓ కాలేజీ సిబ్బంది నేరుగా కంప్యూటర్ మానిటర్తో సహా ఫొటో తీసి పంపారు. కంప్యూటర్లో ప్రశ్నపత్రం ఫొటో తీసే క్రమంలో సిరిసిల్లలోని ఓ డిగ్రీ కాలేజీ కోడ్, పేరు ఉన్న డీఫామ్ (విద్యార్థుల హాల్టికెట్లు, వివరాలు తెలిపే పత్రం) కూడా ఈ ఫొటోకు చిక్కింది. దీంతో సిరిసిల్లలోని సదరు డిగ్రీ కాలేజీ నుంచే పేపర్ లీకైందని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఎవరెవరి పాత్ర ఎంతెంత... ఈ విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రం రూపొందించినప్పటి నుంచి ప్రిన్సిపాల్కు అక్కడ నుంచి విద్యార్థులకు చేరేవరకు ఎవరెవరి పాత్ర ఉందో తేల్చనున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ మొత్తం ఏడు జిల్లాల పరిధిలో 98 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 55 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా 55 మందిని ప్రశ్నించాలని పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాబితా కూడా సిద్ధం చేశారు. తొలిరోజు విచారణ కోసం 11 మందిని పిలిపించి వారి వివరాలు నమోదు చేసుకుని, నోటీసులు ఇచ్చి పంపారు. ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్న.. తొమ్మిది సెల్ఫోన్లకు సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ (సీడీఆర్)ను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా అనుమానితుల జాబితాను రూపొందిస్తున్నారు. ఈ తొమ్మిది సెల్ఫోన్లలో డేటా సేకరణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపారు. పరీక్షలు జరిగిన ప్రతి కాలేజీ నుంచి విద్యార్థుల హాల్టికెట్లు, అటెండెన్స్ వివరాలు, సీసీ ఫుటేజీ, డీఫామ్స్ తదితర వివరాలను తెప్పిస్తున్నారు. ఈ కేసుపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఏసీపీ తుల శ్రీనివాస్, టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ తోట మహేశ్తో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేశారు. తొలుత 55 మందికి నోటీసులు ఇచ్చి విచారించిన అనంతరం మిగిలిన పాత్రధారులను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. -
చాలా చోట్ల పేపర్ లీక్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలో ఒక్కొక్కటిగా బాగోతాలు బయటపడుతున్నాయి. పరీక్షకు దాదాపు పావు గంట ముందే పలు కాలేజీల సిబ్బంది పేపర్ను లీక్ చేయడంతో విద్యార్థులు సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. అలా పదుల సంఖ్యలో పేపర్ను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారంపై ‘సాక్షి’వరుస కథనాలతో కదిలిన వర్సిటీ అధికారులు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను శాతవాహన సిబ్బంది సోమవారం పోలీసులకు అప్పగించింది. తొమ్మిది సెల్ఫోన్ల నంబర్ల ఆధారంగా కాల్డేటా రికార్డులను తెప్పించే పనిలో పడ్డారు. లీకైన రోజు ముందు నిందితులు ఎవరెవరితో మాట్లాడారో గుర్తిస్తే కేసు సగం ఛేదించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమయ్యే ముందు, తర్వాత ఈ వ్యవహారంతో సంబంధమున్న వారు ఫోన్ మాట్లాడుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఫోన్లను స్వాధీనం చేసుకునే లోపే నంబర్లను డీయాక్టివ్ చేసుకుని, వాట్సాప్ సమాచారం డిలీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ డేటా డిలీట్ అయినా.. డేటాను రీట్రైవ్ చేసే సాంకేతికత తమ వద్ద ఉందని పోలీసులు ధీమాతో ఉన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపాలా లేక తమ వద్ద ఉన్న డేటా రీట్రైవ్ యంత్రం సరిపోతుందా అన్న విషయంపై పోలీసు అధికారులు ఇంకా నిర్ణయానికి రాలేదు. ప్రత్యేక బృందాల ఏర్పాటు అనివార్యం.. శాతవాహన వర్సిటీ లీకేజీ వ్యవహారం కరీంనగర్ కమిషరేట్ పరిధిలోనే వెలుగు చూసినా ఇతర జిల్లాల్లోని కాలేజీల నుంచి కూడా పేపర్లు బయటకు వచ్చాయని సమాచారం. వర్సిటీ పరిధి కరీంనగర్తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. గతంలో ఎంసెట్ (మెడికల్)–2 పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రాలు దాటిన వ్యవహారం కావడంతో సీఐడీ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనూ ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు అనివార్యమని పోలీసులు భావిస్తున్నారు. -
పరీక్షకు పావుగంట ముందే లీక్..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ శాతవాహన యూనిర్సిటీ: పరీక్షల నిర్వహణలో శాతవాహన యూనివర్సిటీ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా పరిగణించలేదు. దీనిపై ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కావడంతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. శనివారం మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. వాస్తవానికి ఈనెల 18న ఉదయం ఈ ఉదంతం వెలుగుచూడగానే.. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. కానీ నిబంధనల పేరు చెప్పి, కమిటీ వేసి దాని రిపోర్టు వచ్చేదాకా ఆగడంతో.. ఈ విషయాన్ని యూనివర్సిటీ చాలా తేలిగ్గా తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమానిత విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న తొమ్మిది మొబైల్స్ను శనివారం ఓపెన్ చేసిన కమిటీ సభ్యులు వాటిలో ఆధారాలు అప్పటికే డిలిట్ చేసి ఉండటంతో తెల్లమొహం వేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక.. తొలుత ఏసీపీ తుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాలేజీ సిబ్బంది పనే.. ఈ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత 18న నిర్వహించిన 6వ సెమిస్టర్ ఫిజిక్స్ పేపర్–2 లీకైందని అంతా అనుకున్నారు. ఈ వ్యవహారంలో ‘సాక్షి’పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా లీకైన పేపర్లను, వాటిని పోస్టు చేసిన విద్యార్థుల నంబర్లను మరిన్ని ‘సాక్షి’సంపాదించింది. అందులో 16న జరిగిన మ్యాథ్స్, 17న జరిగిన ఫిజిక్స్ పేపర్–1 కూడా లీకైనట్లు తేలింది. ఈ పేపర్లను కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేయకముందే.. నేరుగా ఫొటోలు తీసి పంపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా.. 9.38 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష పత్రాన్ని మ.1.47 నిమిషాలకు వాట్సాప్లో షేర్ చేశారు. అయితే ఇది యూనివర్సిటీలో జరిగిందా? లేదా ఇతర కాలేజీలో జరిగిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వర్సిటీ అధికారులు ప్రైవేటు కాలేజీ సిబ్బంది చేసిన పనిగా అనుమానిస్తున్నారు. మరోవైపు శాతవాహన పరిధిలోని ప్రభుత్వ కాలేజీలోని సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై జిల్లాకు చెందిన ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నత విద్యా మండలికి శనివారం మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. విద్యామండలి సూచనల మేరకు చర్యలు: వీసీ ప్రొ.మల్లేశ్ పేపర్ లీక్కు సంబంధించి వేసిన విచారణ కమిటీ సిఫార్సుల మేరకు పోలీస్స్టేషన్లో సిబ్బంది ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యామండలికి ఫిర్యాదు చేస్తాం. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. -
‘వర్సిటీ’లో ఇష్టారాజ్యం..?
సాక్షి, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్) : శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ చాన్స్లర్(వీసీ) లేక ఐదేళ్లు అవుతోంది. అప్పటి నుంచీ ఇన్చార్జిల పాలనే కొనసాగుతోంది. ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండడం, వర్సిటీకి చుట్టం చూపులాగే వచ్చిపోతుండడంతో పత్యక్ష పర్యవేక్షణ కొరవడింది. దీంతో కిందిస్థాయి అధికారులు వివిధ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఏళ్ల తరబడిగా వస్తున్నాయి. అయినా పట్టించుకోకుండా యూనివర్సిటీకి ఇన్చారి్జలనే కేటాయిస్తున్నారు. ఇన్చార్జిల పాలన కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ పనిచేసిన రిజిస్ట్రార్లు అధ్యాపక, అధ్యాపకేతర నియమాకాల్లో, అభివృద్ధి పనుల్లో, రిజిస్ట్రార్గా కొనసాగడం వంటివి నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు వివిధ అంశాలకు సంబందించి శాతవాహన అధ్యాపకుల సంఘం ప్రతినిధులు, లోక్సత్తా పార్టీతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా గవర్నర్, ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ కొనసాగుతోంది. యూనివర్సిటీలో ఏ పని జరిగినా వీసీకి తెలియకుండా జరగదని, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నింటిలో ఇన్చార్జి వీసీల పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలు ఇన్చార్జి వీసీలకు తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఆరోపణల అపవాదును మాత్రం మూటగట్టుకుంటన్నారని విద్యారంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రార్ ఉమేష్కుమార్పై వివిధ ఆరోపణలు రావడంతో రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ టి.భరత్ను నియమించారు. ఆ తర్వాత ఉన్నతా విద్యామండలి ప్రత్యేక కమిటీతో ఉమేష్కుమార్పై వచ్చిన ఆరోపణలపై ఇద్దరితో కూడిన కమిటీతో విచారణ జరిపిస్తోంది. కమిటీ నివేదిక రాగానే సంబంధిత చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. కమిటీ నివేదిక ఏం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. పట్టించుకోని ఇన్చార్జిలు... శాతవాహన యూనివర్సిటీ 2015 నుంచి ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతుండడంతో వివిధ వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇన్చార్జి వీసీలు మరో ముఖ్యమైన బాధ్యతల్లో ఉండడంతో దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదని, దీంతో ఇక్కడున్న రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యాపక, విద్యార్థి సంఘాలు బలంగా ఆరోపిస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీలో ఐదేళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతోంది. 19 ఏప్రిల్ 2012 నుంచి రెగ్యులర్ వీసీగా కె.వీరారెడ్డి బాధ్యతలు చేపట్టి 18 ఏప్రిల్ 2015 వరకు రెగ్యులర్ వీసీగా పనిచేశారు. ఆ తర్వాత ఆగస్టు 2015 వరకు ఇన్చార్జిగా విధులు నిర్వర్తించారు. 13 ఆగస్టు 2015న ప్రస్తుత విద్యాశాఖ కార్యదర్శి, అప్పుటి జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి బి.జనార్దన్రెడ్డి ఇన్చారి్జగానే నియమించబడ్డారు. కానీ ఆయన మున్సిపల్ శాఖ బాధ్యతల్లోనే బిజీగా ఉండడం, యూనివర్సిటీకి తగిన సమయం కేటాయించలేదు. ఆయన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) కమిషనర్ టి.చిరంజీవులును 30 ఆగస్టు 2017న నియమించింది. ఎప్పుడో ఒకసారి వస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికి ప్రతీ పనికి వర్సిటీ అధికారులు హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్చార్జిలు.. శాతవాహనలో గత కొన్నేళ్లుగా ఇన్చార్జి పాలన కొనసాగడంతో యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని వివిధ వర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో రిజిస్ట్రార్ కోమల్రెడ్డి పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని యూనివర్సిటీ వ్యాప్తంగా చర్చ జరగడం, రాజకీయ పార్టీల నాయకులు స్వయంగా హైదరాబాద్లో దీనిపై సమావేశాలు ఏర్పాటు చేసి మరీ శాతవాహన అక్రమాల గురించి ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. ఆ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారులకు సైతం పాత్ర ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం టి.చిరంజీవులు ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. ఇన్ని రోజులు రిజిస్ట్రార్గా పనిచేసిన ఉమేష్కుమార్పై నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారని, పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తెరతీశాడని, ఇష్టారాజ్యంగా అంతర్గత బదిలీలు చేశారని శాతవాహన అధ్యాపకుల సంఘం, లోక్సత్తా పార్టీ, వివిధ విద్యార్థి సంఘాలు గవర్నర్, ఉన్నత విద్యామండలికి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఈ నెల 18న శాతవాహనలో కేయూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విశ్రాంత రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ జగన్నాథస్వామి, ప్రొఫెసర్ వెంకటయ్యలతో కూడిన కమిటీ ద్వారా విచారణ జరిపించారు. దీనికి సంబంధించిన నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందనున్నట్లు తెలిసింది. కానీ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులుకు తెలియకుండా ఒక్క పనికూడా చేయలేదని, పై అధికారి సూచనలతోనే శాతవాహనలో పనులు చేశానని ఉమేష్కుమార్ తెలిపారు. ఒకవేళ ఉమేష్కుమార్ అక్రమాలు చేశారని తేలితే దానిలో ఇన్చార్జి వీసీ చిరంజీవులుకు కూడా పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల వివిధ అక్రమాలకు తావివ్వడం సహజమేనని ఇన్చార్జి వీసీకి తెలిసి జరిగినా, తెలియకుండా జరిగినా సంబంధిత అపవాదులను మూటగట్టుకోవడం తప్పదని, రెగ్యులర్ వీసీ ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని విద్యారంగనిపుణులు విశ్లేషిస్తున్నారు. -
సెర్చ్ కమిటీ సైలెంట్.. !
సాక్షి, కరీంనగర్ : రెగ్యులర్ వీసీ నియామకానికి ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ సైలెంట్ అయిందా..? అనే ప్రశ్నకు శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా అవుననే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో గల వివిధ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగియడంతో అన్ని యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులను ఇన్చార్జీలుగా నియమించారు. శాతవాహనకు మాత్రం గతంలోనే ఐఏఎస్ అధికారి ఇన్చార్జి వీసీగా ఉండడంతో తిరిగి ఆయననే కొనసాగించారు. శాతవాహన యూనివర్సిటీకి వీసీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గత నెలలో ముగ్గురితో కూడిన సెర్చ్ కమిటీని వేశారు. ఈ కమిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా నేటికి వీసీ నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని విద్యావేత్తల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇన్చార్జి పాలన నుంచి విముక్తి ఎన్నడో..? యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఐదుగురు వీసీలుగా పని చేయగా వీరిలో ఇద్దరు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ఆరేళ్ల పాటు వీరి పాలన కొనసాగింది. తర్వాత నాలుగేళ్లపాటు ముగ్గురు ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం వీసీగా ఉన్న హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులును 30 ఆగస్టు 30, 2017న ప్రభుత్వం నియమించింది. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్లినా, కీలక నిర్ణయాలు, సాధారణ పనులకు యూనివర్సిటీ అధికారులు హైద్రాబాద్కు పరుగులు తీయాల్సి వస్తోంది. అలాగే అక్కడ ఆయన సమయం కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో శాతవాహనకు కొత్త వీసీని నియమించాలనే నిర్ణయానికి వచ్చి దరఖాస్తులు ఆహ్వానించారు. కాని సెర్చ్ కమిటీ వేశాక కూడా ప్రక్రియ ఎందుకు ముందుకు సాగడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యం వీసీ నియామక ప్రక్రియలో సెర్చ్ కమిటీ నియామకం కీలకం. శాతవాహన యూనివర్సిటీకి గత నెల 20 తేదిన ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో శాతవాహన ఈసీ నామినీగా మాజీ జెఎన్టీయూ హైద్రాబాద్కు వీసీ ప్రొఫెసర్ రామేశ్వర్రావును, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నామినీగా యూజీసీ మెంబర్, భగత్పూల్సింగ్ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుష్మయాదవ్, రాష్ట్ర ప్రభుత్వ నామినీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఐఏఎస్ అధికారి సోమేష్కుమార్ను నియమించారు. . ఇన్ని రోజులు గడిచినా ఈ ప్రక్రియలో జాప్యంపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. వీసీని నియమిస్తేనే ఖాళీగా ఉన్న పోస్టులు నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులు సైతం ఆశపడుతున్నారు. ప్రభుత్వం తొందరగా వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
పైసామే అడ్మిషన్..!
సాక్షి , శాతవాహనయూనివర్సిటీ(కరీంగనర్): ఇంజనీరింగ్ ప్రవేశాల తీరును చూస్తే ఇంజినీరింగ్ విద్య ఇంతకు దిగజారిందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఏ మాత్రం నాణ్యత ప్రమాణాలు చూడని కొందరు తల్లిదండ్రులు, విద్యార్థుల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశాల కోసం దిగజారుడుతనం ప్రదర్శించి ప్రవేశాలను ‘కొని’ తెచ్చుకుంటున్నాయని తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క అడ్మిషన్కు అభ్యర్థులకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తూ వీటితోపాటు రూ.10 వేలు నగదును కూడా నజరానాగా అందిస్తున్నట్లు దూమారం రేగుతోంది. కొన్ని కళాశాలలు ఎంసెట్ ఫలితాలు రాకముందు నుండే ఇంటర్ విద్యార్థుల కోసం గాలించి వివిధ రకాల ఆఫర్లను ఇచ్చి ప్రవేశాలు తీసుకొవాలని వ్యూహం పన్నాయి. గత సంవత్సరం ప్రవేశాల కంటే ఈ సంవత్సరం ఎలాగైనా మెరుగైన విధంగా సీట్లు నింపుకోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచే రంగం సిద్ధం చేసుకొని ప్రత్యేకంగా ప్రవేశాల కోసం పీఆర్వోలు, మధ్యవర్తులు, అధ్యాపకులను కేటాయించుకొని అక్రమాలకు ఒక వ్యవస్థ ఏర్పర్చుకున్నాయి. వీరందరికీ ముందుగానే ప్రవేశానికి కొంత మొత్తం చొప్పున ముందుగానే డీల్ కుదుర్చుకున్నాయి. ఇంకేముంది వారు సంపాదనే ధ్యేయంగా విద్యార్థుల వేటలోపడి కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన ఆఫర్లను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించి వారిని ప్రలోభపెట్టి అక్రమంగా ప్రవేశాలు సంపాదించుకుంటున్నాయని గత నాలుగు రోజులుగా సోషల్మీడియాల్లో, బయట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రవేశాల విషయంలో పలు ప్రైవేటు కళాశాలల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొనడంతో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రవేశాలు సంపాదించడం చూస్తుంటే ఇంజినీరింగ్ కోర్సు ఇంతటికి దిగజారిందా అని విద్యారంగ నిపుణులు వాపోతున్నారు. మొదటి విడతలో 46 శాతమే... మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల తీరును పరిశీలించినట్లయితే ఇంజినీరింగ్ కోర్సుకు డిమాండ్ తగ్గిందా అనే సందేహం కలుగక మానదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 46 శాతం సీట్ల భర్తీ జరగగా ఊహించని రీతిలో ప్రముఖ కళాశాలలకు కూడా షాక్ తగిలేలా సీట్ల కేటాయింపు జరిగింది. జిల్లా వ్యాప్తంగా 13 ఇంజినీరింగ్ కళాశాలలుండగా ఇందులో 2 ప్రభుత్వ కళాశాలలు, 11 ప్రవేట్ కళాశాలలున్నాయి. అన్ని కళాశాలల్లో కలుపుకొని 3,025 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. కాగా మొదటి దశలో కోర్సుల వారిగా చూసినట్లయితే సివిల్ 368 సీట్లకు 125, సీఎస్ఈలో 777 సీట్లకు 707, ఈసీఈలో 882 సీట్లకు 368, ఈఈఈలో 662 సీట్లకు 146, మెకానికల్లో 336 సీట్లకు 43 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 3,025 సీట్లకు 1,389 సీట్లు భర్తీ కాగా 46 భర్తీ శాతం నమోదైంది. ఇందులో రెండు ప్రభుత్వ కళాశాలల్లో నూటికి నూరు శాతం సీట్ల భర్తీ జరుగగా 90 శాతం ఒక కళాశాల, 60–70 శాతం ఒక కళాశాల, 40–60 శాతం 03 కళాశాలలు, 30–40 శాతం 05 కళాశాలలు, 0–5 శాతం వరకు ఒక కళాశాలల్లో సీట్ల భర్తీ శాతాలు నమోదయ్యాయి. పోటాపోటీగా ఆఫర్లు... ఇంజినీరింగ్ రెండవ దశ సర్టిఫికెట్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి 26న వెరిఫికేషన్ ముగిసింది. మొదటి దశలో జిల్లాలోని కళాశాలల్లో నిరాశనే మిగిల్చినా పలు ప్రవేట్ కళాశాలలు రెండవ దశలో సీట్ల భర్తీ శాతాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకొని ఇష్టారాజ్యంగా ఆఫర్లు కుమ్మరిస్తున్నాయని తెలుస్తోంది. వెబ్ఆప్షన్లకు నేటి వరకు ఉండడంతో విద్యార్థుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. పోటాపోటీగా విద్యార్థుల వద్దకు వారి కళాశాలలు ఇస్తున్న ఆఫర్లు చెబుతూనే ఒక కళాశాల మీద మరొక కళాశాల వారు ఆరోపణలు చేసుకోవడం జరుగుతోందని తెలిసింది. కొన్ని ప్రైవేట్ కళాశాలలు మొదటి దశలో కూడా ప్రలోభాలతోనే ప్రవేశాలు ‘కొని’ తెచ్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. రెండద దశలో సైతం ఇలాంటి పద్ధతిలోనే ప్రవేశాలు సంపాదించుకోవడానికి ప్రణాళికతో పనిచేసినట్లు ప్రచారం. విద్యార్థులకు చాలా మంది ఏ కళాశాలలో బాగుంటుందో ఏ కళాశాలలో చేరాలనే విషయంలో స్పష్టత ఉండదు కాబట్టి వారి తల్లిదండ్రులు కళాశాలల చరిత్ర క్షుణ్ణంగా, స్వయంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలు, క్యాంపస్ ఇంటర్వూలు, అన్ని విషయాలు ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను అడిగి తెలుసుకొని చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కానీ మొదటి దశలో మెరుగ్గా ఉన్న కళాశాలలు వారి ప్రవేశాలు పోకుండా జాగ్రత్తపడగా , తక్కువ సీట్లతో నిరాశకు చెందిన వారు సీట్లు నిండడానికి వివిధ మార్గాలను ఆశ్రయించినట్లు సమాచారం. రెండవ దశ సీట్లు కేటాయింపు ఈ నెల 29న ఉండడంతో అదే రోజు ఏయే కళాశాలల ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయో తెలుస్తుంది. కళాశాలలపై చర్యలు తీసుకోవాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు అడ్డదారిలో అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంటు దోచేయాలనే దురుద్దేశంతో విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తూ ఒక్కో అడ్మిషన్కు 10 వేల వరకు చెల్లిస్తున్నాయి. కళాశాలలోని వివిధ రకాల ఫీజులు, కన్వీనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజుకు అదనంగా కావాల్సిన ఫీజును కళాశాలల వారే భరించుకొని విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకొని ప్రవేశాలు చేపడుతున్నారు. బీటెక్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఫీజులు అడగబోమని బాండ్లు కూడా ఇస్తున్నారు. అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్న కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సిరిశెట్టి రాజేశ్గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు -
చదువుతో పాటు.. ఉద్యోగం
సాక్షి,కరీంనగర్ : తరగతి పాఠాలు మాత్రమే సరిపోదు.. కోర్సులు పూర్తికాగానే కొలువులు కొట్టాలంటే ఇంకా లోతైన పరిజ్ఞానం, ఉద్యోగ సాధనాంశాలైన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తోపాటు వివిధ నైపుణ్యాలు తోడైతేనే సాధ్యపడుతుంది. కార్పొరేట్ కంపెనీలతోపాటు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే వారి అవసరాలకు తగ్గట్టుగా ఉండే విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా చదువుతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు పెద్దపీట వేయడంతో నైపుణ్య శిక్షణ తప్పనిసరవుతుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు అందిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్లోని వాణినికేతన్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి 19వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉద్యోగాంశాలపై శిక్షణ, ఓరాకిల్, జావాలపై శిక్షణ అందిస్తున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్య సామర్థ్యాలను పెంచడానికి వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది. ఉద్యోగాలకు కావాల్సిన కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇంటర్వూ స్కిల్స్, వ్యక్తిగత నైపుణ్యాలు, మాట్లాడే భాష, గ్రూప్డిస్కషన్, రాతపరీక్ష, సాప్ట్స్కిల్స్తోపాటు వివిధ అంశాలలో శిక్షణ అందిస్తున్నారు. దీంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను పరిక్షించి, వారి కావాల్సిన విధంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. టాస్క్తోపాటు కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో బందచర్చలు, జామ్తోపాటు పలు అంశాలపై పట్టుకల్పించే విధంగా ప్రయోగాత్మకంగా శిక్షణ అందిస్తున్నారు. కోర్సులవగానే ఉద్యోగాలు విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, పాఠ్యాంశాలపై లోతైన అవగాహనతోపాటు వివిధ అంశాలపై పట్టుంటేనే భవిష్యత్లో ఉద్యోగాలు సులభంగా పొందవచ్చు. టాస్క్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓరాకిల్, జావాపై వారం రోజుల శిక్షణ జరుగుతుంది. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగాలు సాధించేలా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నాం. – లక్ష్మీదీపిక, వాణినికేతన్ డిగ్రీ,పీజీ కళాశాల కరస్పాండెంట్ కొత్త విషయాలు తెలిశాయి తరగతి గదుల్లో చదివే పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలుంటేనే తొందరగా జాబ్లు సాధించవచ్చు. టాస్క్ ఆధ్వర్యంలో మాకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. టెక్నికల్ స్కిల్స్, జావా, ఓరాకిల్లో లోతుగా విశ్లేషణ చేసి చెప్పడంతో వీటిపై పట్టు సాధించవచ్చు. ఇదే కాకుండా కొలువులకు కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నారు. – ఏ.శ్రీనిధి, డిగ్రీ విద్యార్థిని -
శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం కల నెరవేరనుంది. యూనివర్సిటీ ఏర్పడిన దశాబ్దం దాటినా స్నాతకోత్సవం జరగలేదు. చాలాసార్లు అధికారులు ప్రయత్నించినా వివిధ కారణాలతో కుదరలేదు. తాజాగా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవ నిర్వహణకు గ్రీన్సిగ్నల్ రావడంతో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2017 వరకు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈనెల 31 తేదీ వరకు కాన్వకేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేష్కుమార్ వెల్లడించారు. పలుమార్లు ప్రయత్నాలు..శాతవాహన యూనివర్సిటీలో స్నాతకోత్సవం నిర్వహించాలని చాలాసార్లు అధికారులు ప్రయత్నించారు. కానీ వివిధ కారణాలతో కుదరలేదు. వీరారెడ్డి వీసీగా పనిచేస్తున్నప్పడు 2014లో నిర్వహించేందుకు ప్రయత్నించినా ప్రత్యేక తెలం గాణ ఉద్యమం తీవ్రతరం కావడంతో అప్పుడు అటకెక్కింది. 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్రెడ్డి ఇన్చార్జీ వీసీగా ఉన్నప్పుడూ మరోసారి స్నాతకోత్సవం జరుపాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్చార్జి వీసీగా 2018 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు కొనసాగుతున్న క్రమంలో ఆదిలో స్నాతకోత్సవ ప్రయత్నాలు కొనసాగినా కార్యరూపం దాల్చలేదు. రిజిస్ట్రార్గా ఉమేష్కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్నాతకోత్సవం నిర్వహణకు కసరత్తు తీవ్రంగా కృషిచేశారు. ఫలితంగా పలుమార్లు వాయిదా పడుతూ చివరకు ఆగస్టు మొదటి వారంలో నిర్వహిం చాలని శాతవాహన అధికారులు భావిస్తున్నారు. గవర్నర్ పచ్చజెండా.. రాష్ట్ర గవర్నర్ శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి పచ్చజెండా ఊపారు. దీనికి సంబందించిన లేఖ గవర్నర్ కార్యాలయం నుంచి శాతవాహన యూనివర్సిటీ వీసీకి అందించినట్లు సమాచారం. ఇంత వరకు స్నాతకోత్సవం నిర్వహించని శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం విషయంలో వివిధవర్గాల నుంచి అపవాదు ఎదుర్కొంది. ఈ విషయంపై వివిధ సామాజిక సంఘాలు, పార్జీలు, విద్యార్థిసంఘాలు, పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తుల ప్రక్నియ కొనసాగుతూ వచ్చింది. గవర్నర్ నుంచి లేఖ రావడంతో మార్గం సుగమమై ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జూలై 31 వరకు దరఖాస్తులు... శాతవాహన యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి 2017 వరకు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు స్నాతకోత్సవం పట్టా పొందడానికి దరఖాస్తులు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఉమేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 తేదీ వరకు గడువు ఉందని, అర్హులందరూ శాతవాహన యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. స్నాతకోత్సవం నిర్వహించడంపై శాతవాహన యూనివర్సిటీ వర్గాల్లో చాలా రోజుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి వీసీ ఉండగా స్నాతకోత్సవం అవసరమా అని కొన్నివర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయగా... కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ వీసీని నియమించాలని దరఖాస్తులు కూడా ప్రభుత్వం కోరిందని, రెగ్యులర్ వీసీ వచ్చాక స్నాతకోత్సవం జరుపాలని మరికొన్నివర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవంపై సముఖత వ్యక్తం చేస్తూ లేఖ రావడంతో శాతవాహన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సన్నద్ధమవుతోంది. -
శాతవాహనకు మళ్లీ నిరాశే..!
సాక్షి, కరీంనగర్ : డిగ్రీ సీట్ల కేటాయింపు మూడో దశలోనూ నిరాశే మిగిల్చింది. జూన్ 30న మూడో దశ సీట్లు కేటాయింపు జరిగింది. ఇందులో 3,438 సీట్లు కేటాయించగా సీట్ల భర్తీ శాతం తగ్గుతూ వచ్చింది. ఇప్పటికే మొదటి, రెండో దశ సీట్ల కేటాయింపుల్లో ఆశించనంతంగా సీట్ల భర్తీ కాలేదు. మూడో దశపైనే ఆశలన్నీ పెట్టుకోగా.. ఆశించినంత సీట్ల భర్తీ కాక ప్రైవేటు యాజమాన్యాలు తల పట్టుకున్నారు. గత సంవత్సరం కంటే కూడా తక్కువగా భర్తీ అవుతుండడంతో ఆవేదన మొదలైంది. ప్రభుత్వం ఆది నుంచి డిగ్రీలో ప్రవేశాలు పెంచాలని వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాంప్రదాయ కోర్సులతోపాటు వివిధ నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. ఏంచేసినా సీట్ల భర్తీ శాతం పడిపోతూనే ఉంది. దీనికి కారణం ఏమిటో తెలియక తికమక పడుతున్నాయి. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువశాతం మంది సాంప్రదాయ డిగ్రీ కోర్సుపై ఆనాసక్తి కలిగి ఉండడంతో నూతన మార్గాలతోపాటు బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు వెళ్లడానికి మార్గాలు అన్వేషించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో సీట్ల నిండకుంటే దాదాపు 5 దశల్లో ప్రవేశాలు చేపట్టారు. ఇప్పటికి మూడు దశలు పూర్తయినా పెద్దగా సీట్ల భర్తీ కాలేదు. దీనివల్ల ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాల శాతం పెంచడానికి ప్రత్యేకంగా ఇంకా ఒకటి రెండు దశలు పెట్టే అవకాశాలు లేకపోలేదని విద్యారంగనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రవేశాలు చేపడితేనే సీట్ల భర్తీ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు దశల్లో అంతంతే... దోస్త్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ఇప్పటికి మూడు దశలు పూర్తయ్యాయి. మూడో దశ సీట్ల కేటాయింపు కూడా జూన్ 30 సాయంత్రం జరిగింది. మొదటి దశలో 12,354 సీట్లు కేటాయించగా.. 5,126 సీట్లు నిర్ధారించుకున్నారు. రెండో దశలో 4,881 సీట్లు కేటాయించగా ఇందులో బాలురు 1,872, బాలికలు 3,009 ఉన్నారు. మూడో దశలో 3,438 సీట్లు కేటాయింపు జరగడంతో శాతవాహన యూనివర్సిటీలో మొత్తం సీట్లలో సగం కూడా కాకపోవడం గమనార్హం. ఏటేటా కూడా ప్రవేశాలు కూడా నేలచూపే చూస్తున్నాయి. మూడో దశలో సీట్లు కేటాయించిన వారు జూలై 1 నుంచి 4 వరకు సెల్ఫ్రిపోర్టింగ్ చేసుకొని కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి గడువుంది. మరో అవకాశమిస్తే వివిధ కారణాల వల్ల సీట్లు పొందని వారు, నమోదు చేసుకోని వారితో ఖాళీ సీట్లను భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది. సగం కూడా భర్తీకాలేదు.. శాతవాహన యూనివర్సిటీ 3 దశలు సీట్ల కేటాయింపు తర్వాత చూస్తే మొత్తం సీట్లలో సగం కూడా భర్తీ కాలేదు. యూనివర్సిటీ వ్యాప్తంగా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో మొత్తం 43,820 సీట్లున్నాయి. ఇందులో గిరిజన, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో కలుపుకొని 1,230 సీట్లున్నాయి. వీటికి దోస్త్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి పోగా మిగిలిన 42,040 సీట్లు దోస్త్ ద్వారా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 12,355 సీట్లు, 2వ దశలో 4,881 సీట్లు, 3వ దశలో 3,438 సీట్లు కేటాయించారు. మొత్తం 42,040 సీట్లకు మూడు దశల్లో కలుపుకొని 20,677 సీట్లు మాత్రమే కేటాయించారు. ఇంకా ఇందులో కేటాయించబడిన వారందరూ సీట్లు నిర్ధారించుకుంటారో లేదో తెలియదు. అంటే ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదముంది. తల పట్టుకుంటున్న యాజమాన్యాలు... యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమానులు సీట్లు నిండక తల పట్టుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన నాటి నుంచి పలు కళాశాలలు తీవ్రమైన ప్రచారాలు, ప్రలోభాలు చేస్తూ వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సీట్లు మాత్రం భర్తీ కాలేదు. దాదాపు రెండు మూడు నెలల నుంచే లక్షల్లో ఖర్చు చేస్తూ క్యాన్వేసింగ్ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. మరికొన్ని కళాశాలల పరిస్థితి కొనసాగించే బదులు మూసుకుంటేనే మంచిదనే ఆలోచనలో యాజమాన్యాలున్నట్లు తెలిసింది. కరీంనగర్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో ప్రముఖ కళాశాలల్లో మాత్రమే సీట్లు చెప్పుకునే స్థాయిలో నిండినట్లు సమాచారం. అది కూడా వేళ్లమీద లెక్కబెట్టే కళాశాలల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. చాలావరకు కళాశాలలు నిరాశతోనే ఉన్నాయని, సీట్ల భర్తీకి కొట్టుమిట్టాడుతూ కష్టాలతోనే నెట్టుకొస్తున్నాయని సమాచారం. ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం కళాశాలల సంఖ్య కూడా తగ్గుతుందని, స్వచ్ఛందంగా కళాశాలలు మూతబడే పరిస్థితులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆచార్యడొకరు తెలిపారు. ఏదేమైనా ప్రవేశాలకు గతంలో వలే మరో అవకాశమిస్తేనే ఇంకొన్ని సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగనిపుణుల విశ్లేషణ. -
‘చత్తీస్గఢ్ వెళ్లి మావోయిస్టులను కలుస్తున్నట్టు సమాచారం..’
సాక్షి, కరీంనగర్ : శాతవాహన యూనివర్శిటీలోని తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) పై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. పోలీసులే తమపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లుగా టీవీవీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. టీవీవీకి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు గతంలో చాలా సార్లు రుజువైందని చెప్పారు. టీవీవీలో పనిచేసే కొంతమంది నేతలు తరుచూ చత్తీస్గఢ్ వెళ్లి మావోయిస్టు నేతలను కలుస్తున్నట్లుగా మా దగ్గర సమాచారం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు పోలీసు స్టేషన్లలో మావోయిస్టులతో సంబంధాలున్నట్లు టీవీవీ నేతలపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అమాయక విద్యార్థులకు మాయమాటలు చెప్పి మావోయిస్టు అజ్ఞాత దళంలో చేర్పించేందుకు టీవీవీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!) టీవీవీ రాష్ట్రాధ్యక్షుడు మహేశ్ వద్ద గతంలో విప్లవ సాహిత్యం దొరికిందని గుర్తు చేశారు. అతనిపై నల్గొండ జిల్లాలో పోలీసు కేసు నమోదైందని చెప్పారు. శాతవాహన యూనివర్శిటీలోని టీవీవీ నేతలపై సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై నిజనిజాలు ఇంకా ధ్రువీకరణ కాలేదని ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. యూనివర్శిటీ ప్రొఫెసర్ పై వచ్చిన ఆరోపణలపై మాదగ్గర ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నక్సల్స్ బాధితుల సంక్షేమం సంఘం పేరుతో సర్క్యులేట్ అవుతోన్న పోస్టులను ఎవరు చేశారో గుర్తిస్తామని చెప్పారు. యూనివర్శిటీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మావోయిజం వల్ల గడిచిన మూడు దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది చనిపోయారని, ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల మావోయిజాన్ని ఇక్కడ లేకుండా చేయగలిగామని సీపీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
చదువులమ్మ ఒడిలో మావోల కలకలం..!
-
శాతవాహనలో స్నాతకోత్సవం ఎప్పుడూ..?!
యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు స్నాతకోత్సవం కీలక ఘట్టం. అలాంటి స్నాతకోత్సవాన్ని శాతవాహన యూనివర్సిటీ స్థాపించి దశాబ్దం దాటినా ఇంతవరకు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో విద్యార్థులు పట్టాపండుగ భాగ్యానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నప్పటికీ శాతవాహన అధికారులు మాత్రం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్నాతకోత్సవం నిర్వహించాలని విద్యార్థులు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా.. అధికారులు పెడచెవినపెడుతున్నారు. యూనివర్సిటీ అధికారులు, పరీక్షల విభాగం పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సాక్షి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. వందల సంఖ్యల్లో విద్యార్థులు పట్టభద్రులై వెళ్తున్నప్పటికీ వారు వర్సిటీ ఛాన్స్లర్ చేతులమీదుగా పట్టాలు అందుకునే భాగ్యం మాత్రం కోల్పోతున్నారు. గతంలో ఒకరిద్దరు వీసీల కాలంలో ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అంతా ఇన్చార్జి వీసీల పాలనే జరుగుతుండడంతో సాధ్యపడలేదని కనిపిస్తోంది. కానీ సంబంధిత విభాగం అధికారుల సోమరితనంతోనే.. స్నాతకోత్సవానికి బ్రేక్ పడుతున్నట్లు యూనివర్సిటీ వర్గాల ద్వారా సమాచారం. ఏదిఏమైనా యూనివర్సిటీ ఈ సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే పదేళ్లు గడిచినా పట్టా పండగ నిర్వహించలేదనే అపవాదును ఎదుర్కొవడం ఖాయమని విద్యారంగ నిపుణుల భావన. కార్యరూపం దాల్చని స్నాతకోత్సవం స్నాతకోత్సవం నిర్వహించాలని గతంలో వీరారెడ్డి వీసీగా ఉన్నప్పుడు 2014లో గవర్నర్ చేతులమీదుగా నిర్వహించాలని భావించినా రాష్ట్ర విభజన సమయం కావడంతో అప్పటి పరిస్థితుల్లో ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్రెడ్డి ఇన్చార్జి వీసీగా విధులు నిర్వహించిన సమయంలో మరోసారి స్నాతకోత్సవం అంశం తెరమీదికొచ్చినా.. ఆయన మున్సిపల్శాఖ కీలక బాధ్యతల్లో ఉండడంతో కుదరలేదు. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించాలనే ఆలోచనకు కూడా ఆయన సమయం కేటాయించే పరిస్థితులు లేకపోవడంతో అది కాస్తా అటకెక్కింది. ఆయన తర్వాత 2017 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నప్పటికీ ముఖ్య బాధ్యతల్లో భాగంగా ఆయన హైదరాబాద్లోనే ఉంటుండడంతో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వర్సిటీకి సమయం కేటాయించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ఈ తరుణంలో ఇన్చార్జి వీసీ స్నాతకోత్సవ నిర్వహణకు సముఖత చూపేలా లేరని తెలుస్తోంది. ఇలా దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్నాతకోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు దూరమవుతున్నారు. రాష్ట్రంలోనే నిర్వహించని ఏకైక వర్సిటీ రాష్ట్రంలో శాతవాహన యూనివర్సిటీతోపాటు మహాత్మగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలను ఒకేసారి ప్రారంభించారు. ఒక్క శాతవాహన తప్ప అన్ని వర్సిటీలు ఒక్కోసారి స్నాతకోత్సవాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా పరీక్షల విభాగం అధికారుల నుంచి ప్రయత్నాలు లేకపోవడమే దీనికి కారణమని విద్యార్థుల్లో చర్చ జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ఉమేశ్కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తీవ్రంగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఈసారి ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏదిఏమైనా శాతవాహన యూనివర్సిటీ అధికారులు స్నాతకోత్సవంపై దృష్టిసారించి విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించాలని వివిధ కోర్సుల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే మే లోగా నిర్వహిస్తాం శాతవాహన యూనివర్సిటీ ఏర్పడిన నాటినుంచి స్నాతకోత్సవం నిర్వహించనిది వాస్తవమే. గతంలో కొన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలిసింది. బాధ్యతలు చేపట్టిన యూనివర్సిటీలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంతో పాటు స్నాతకోత్సవంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. మే 2019 లోపు స్నాతకోత్సవానికి ప్రణాళిక రూపొందించి కచ్చితంగా నిర్వహిస్తాం. – ఉమేష్కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
వద్దంటున్న ఫార్మసీ విద్యార్థులు
శాతవాహనయూనివర్సిటీ: ఎల్ఎండీ కాలనీలోని శాతవాహ న యూనివర్సిటీ ఫార్మసీ ప్రాంగణం వసతిగృహాలు సరైన సదుపాయాలు లేక అధ్వానంగా మారాయి. వీటిలో సరైన సౌకర్యాలు కల్పించాలని, హాస్టళ్లను ఇక్కడినుంచి తరలించా లని విద్యార్థులు గతంలో పలుమార్లు యూనివర్సిటీ అధికా రులను కోరారు. దీంతో యూనివర్సిటీ ఫార్మసీ హాస్టళ్లను వాటి స్థానంలో నూతనంగా నిర్మించడానికి రూ.18 కోట్లకు పైగా నిధులు సిద్ధం చేశారు. ఇప్పుడు అక్కడున్న బాలబాలికలను మెయిన్ క్యాంపస్కు తరలించాలనే ఆలోచనలో అధి కారులున్నారు. అయితే కొంతమంది ఫార్మసీ విద్యార్థులకు అక్కడి నుంచి మెయిన్ క్యాంపస్కు రావడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు మెయిన్ క్యాంపస్లో ఉన్న విద్యార్థులు ఫార్మసీ విద్యార్థులు వస్తే ఇక్కడ వసతులు సరిపోవని అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆలోచనలో పడ్డారు. ఎన్నికలు ముగిసేవరకూ తరలింపు అంశంపై ఎలాంటి నిర్ణ యం తీసుకోబోమని, ఆలోపు వసతిగృహాల తరలింపుపై స్ప ష్టమైన వైఖరిని వెల్లడించాలని విద్యార్థులకు సూచించారు. దీంతో ఎన్నికలు ముగిసేవరకూ విద్యార్థులు తీసుకున్న నిర్ణయంపై తరలింపు పక్రియ ఆధారపడనుందని తెలుస్తోంది. రూ.18కోట్లతో నూతన హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీలో ఇన్ని రోజుల నుంచి రేకులషెడ్డుల్లో బాలబాలికల వసతిగృహాలు నిర్వహించబడుతున్నాయి. ఫార్మసీ హాస్టళ్లలో మొత్తం 111 మంది ఉండగా.. ఇందులో బాలురు 32 మంది, బాలికలు 79 మంది ఉన్నారు. గతంలో విద్యార్థులు వసతిగృహాలతోపాటు అంతర్గత రోడ్లు, భవనాలు వంటి వసతులను మెరుగుపర్చాలని గతంలో యూనివర్సిటీని ముట్టడించి అధి కారులను నిలదీశారు. పలు విద్యార్థిసంఘాలు సైతం సమస్యలపై పోరాటాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అధికారులు స్పందించి అక్కడ నూతనంగా బాలబాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు నిర్మించాలని నిర్ణయించి ప్రభుత్వానికి సూచించగా రూ.18కోట్ల నిధుల కూడా మంజూరయ్యాయి. కొద్దిరోజుల నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. ఎన్నికలు ముగియగానే నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని అధికా రులు సిద్ధమయ్యారు. దీనికోసం విద్యార్థులతో వసతిగృహా ల తరలింపుపై సంప్రదింపులు జరిపారు. కొంతమంది విద్యార్థులు తరలింపునకు సుముఖత చూపకపోవడంతో అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఎన్నికలు ముగిశాకే తుది నిర్ణయం ప్రస్తుతం హాస్టళ్లు నిర్మించడం సాధ్యపడదు కాబట్టి ఎన్నికలు ముగిశాక నిర్మాణాలు ప్రారంభించడానికి వీలవుతుందని యూనివర్సిటీ అ ధికారులు భావిస్తున్నారు. మెయిన్ క్యాంపస్లోని హాస్టళ్ల వి ద్యార్థులు కూడా ఫార్మసీ విద్యార్థుల రాకను వ్యతిరేకిస్తున్నా రు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవులు సోమవా రం ఫార్మసీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇందులో కొంతమంది ఫార్మసీ విద్యార్థులు తరలింపుపై పెదవి విరవడంతో తరలింపుపై తుది నిర్ణయం వి ద్యార్థులకే వదిలేసినట్లు సమాచారం. విద్యార్థి సంఘాల కన్నెర్ర ఫార్మసీ హాస్టళ్ల తరలింపుపై వివిధ విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే 40 ఎకరాలు ఉన్న ఎల్ఎండీలోని శాతవాహన ఫార్మసీ క్యాంపస్ లో ఐదెకరాలు ఉర్దూ యూనివర్సిటీకి, ఐదెకరాలు ఫిషరీస్ కళాశాలకు కేటాయించారని, ఇప్పుడు అక్కడ నుంచి తరలిస్తే మిగితా 30 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యూనివర్సి టీ అధికారులు తరలింపును నిలిపివేసి అక్కడే తాత్కాలిక వ సతిని ఏర్పాటు చేసి వసతిగృహాల భవనాలను పూర్తిచేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టళ్ల తరలింపు ఆపాలి:కరికె మహేష్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు యూనివర్సిటీ అధికారులు ఫార్మసీ వసతిగృహాల తరలింపు నిర్ణయాన్ని ఆపాలి. ఇప్పటికే 40 ఎకరాలున్న యూనివర్సిటీ భూమి 10 ఎకరాలు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. తరలిస్తే ప్రభుత్వం మిగితా 30 ఎకరాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. తరలింపు ప్రక్రియ ఎక్కువశాతం ఫార్మసీ విద్యార్థులకు ఇష్టం లేదు. మెయిన్ క్యాంపస్ హాస్టళ్ల విద్యార్థులకు కూడా వారు ఇక్కడికి వస్తే వసతులు సరిపోయేలా లేవు. అధికారులు తరలింపు ప్రక్రియను విరమించుకోవ్చాట. -
‘అకాడమిక్’ అయోమయం..!
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: ఓ సెమిస్టర్ చివరి దశకు వస్తున్నా.. నేటికీ పలు కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల సిలబస్ పూర్తి కాలేదంటే నమ్మాల్సిందే..!! నెల రోజుల్లో ప్రస్తుత సెమిస్టర్ కావాల్సి ఉంది. కానీ.. పలు కళాశాలల్లో ఆ పరిస్థితి లేదు. దీంతో అంతా అయోమయం నెలకొంది. అకాడమిక్ అల్మానాక్ అమలులో శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులకు తలనొప్పిగా మారింది. జూన్లో సెమిస్టర్ ప్రారంభమైనా సెప్టెంబర్ నెల వరకు సిలబస్ పూర్తిస్థాయిలో నిర్ణయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమిస్టర్ ప్రారంభానికి ముందే ప్రకటించాల్సి ఉన్నా.. వర్సిటీ తీరులో మార్పు రావడం లేదు. అకాడమిక్ అల్మానాక్ ప్రకారం షెడ్యూల్ జరగాల్సి ఉంది. దాని అమలుపై వర్సిటీ పట్టింపు లేకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరంభంలో ఊహాజనితంగా పలానా అంశాలు సిలబస్లో ఉంటాయని భావించి బోధన చేపట్టారు. తీరా చూస్తే సిలబస్ పరిశీలించాక బోధించిన అంశాలు కాకుం డా ఇంతరత్రా ఉండడంతో ఖంగుతిన్నారు. తిరిగి కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అకాడమిక్ అల్మానాక్ అమలుపై దృష్టి సారించి దాని ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిలబస్ నిర్ణయించడంపై నిర్లక్ష్యం.. శాతవాహన యూనివర్సిటీ సిలబస్ విషయంలో కొన్నేళ్లుగా నిర్లక్ష్య వైఖరే కనిపిస్తోంది. గతంలో రెండో సెమిస్టర్లోని జెండర్ సెన్సిటైజేషన్ అనే కామన్ సబ్జెక్టు పేపర్ సిలబస్ కూడా సెమిస్టర్ ముగిసే 20 రోజుల ముందే ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఆయా అంశాలు 20 రోజుల్లో బోధించడానికి నానా అవస్థలు పడ్డారు. చివరకు ఫలితాలపై ప్రభావం పడింది. వివిధ సబ్జెక్టుల విషయంలోనూ ప్రారంభంలో ఇవ్వకుండా జాప్యం చేయడంతో కష్టాలు తప్పడంలేదు. ఇప్పుడు కూడా సెమిస్టర్ ప్రారంభమైన నెల రోజులు దాకా కూడా స్పష్టమైన సిలబస్ అంశాలు ప్రకటించలేదు. ఒకటి రెండు సబ్జెక్టులకు సంబందించిన సబ్జెక్టుల విషయంలో వర్సిటీ అధికారులు సిలబస్ ప్రకటించినా కళాశాలల్లో నేటికీ స్పష్టత లేదు. సెమిస్టర్ పూర్తి కావస్తున్నా ఇంకా అధ్యాపకులు వాటిని ఎప్పుడు బోధిస్తారు.. విద్యార్థులు వాటిని ఎప్పుడు చదువుతారు.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో గందరగోళం.. యూనివర్సిటీ అధికారులు కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ప్రకటించిన తీరుపై అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. డిగ్రీ 5వ సెమిస్టర్ వారికి ‘పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్’ అనేది బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ అన్ని కోర్సుల వారికి సిలబస్ ప్రకటించారు. ‘వెర్బల్ రీజనింగ్ ఫర్ అప్టిట్యూడ్’ అనే సెలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వారికి అందరికీ ఉండాలని సెప్టెంబర్లో ఇచ్చారు. దీంతో బీఎస్సీ వారితోపాటు బీకాం, బీఏ విద్యార్థులకు దీనికి సంబంధించిన సిలబస్ బోధించడం ప్రారంభించారు. దాదాపు 15 రోజుల తర్వాత బీకాం విద్యార్థులకు మళ్లీ కొత్తగా ‘ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్’ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టడంతో అధ్యాపకులు తలలు పట్టుకున్నారు. ఇదే కాకుండా బీకాం వారికి మార్చినప్పుడు బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్లకూ ఇది చదవడం కఠినంగానే ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఏటా సిలబస్లో అస్పష్టత, సరైన సమయంలో నిర్ణయించకపోవడంతోపాటు పలు కారణాలతో అకాడమిక్ అల్మానాక్ అమలుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పరీక్షల తేదీని పొడగిస్తాం.. డిగ్రీ కోర్సుల్లో సిలబస్ను నిర్ణయించడంలో కొంత ఆలస్యమైంది. నేను ఇటీవలే శాతవాహన రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం నవంబర్లో పరీక్షలు ఉండాల్సింది. కానీ.. ఎన్నికల దృష్ట్యా వాటిని ఇంకా పొడగించే అవకాశం ఉంది. పరీక్షల సమయం పొడగించడంతో సిలబస్ పూర్తి చేసుకోవడానికి సమయం కూడా ఉంటుంది. వచ్చే సెమిస్టర్ నుండి సిలబస్, అకాడమిక్ అల్మానాక్ అమలు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– యూ.ఉమేష్కుమార్, శాతవాహనయూనివర్సిటీ రిజిస్ట్రార్ -
కాసుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్) : పాలిటెక్నిక్ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో ఉండాల్సిన పారిశ్రామిక శిక్షణపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆరో సెమిస్టర్ను కొనసాగించడానికి స్టేట్బోర్టు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు సూచించిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని విద్యారంగ నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సాకుతో ఎస్బీటీఈటీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించేలా నియమనిబంధనలకు విరుద్ధంగా అనుసరించడానికి ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ డిప్లొమా కళాశాలలు వ్యూహాలు పన్నుతున్నాయి. చివరి సెమిస్టర్లో స్టేట్బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు చివరి సెమిస్టర్లో విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్హౌజ్ ప్రాజెక్టు అనే రెండుదారులు సూచించారు. ఇందులో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పారిశ్రామిక శిక్షణ వైపే మొగ్గుచూపుతున్నారు. అయినా వివిధ సాకులను చూపిస్తూ తమ కళాశాలల్లోనే మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్హౌజ్ ప్రాజెక్టు వైపు విద్యార్థులకు ఇష్టం లేకుండానే మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలలు విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు దండుకోవచ్చనే పన్నాగంతో వారి అభిప్రాయాలకు సంబంధం లేకుండానే ఇన్హౌజ్ ప్రాజెక్టు వైపునకు బలవంతంగా మళ్లిస్తున్నారని సమాచారం. ఎస్బీటీఈటీ అధికారులు దీనిపై దృష్టి పెట్టి విద్యార్థులు కోరుకున్న విధంగా చివరి సెమిస్టర్ అమలు చేయాలని పలు ప్రైవేట్ కళాశాలల పాలిటెక్నిక్ విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచీ తర్జనభర్జనే.. పాలిటెక్నిక్ కోర్సుల్లో గతంలో దాదాపు చివరి సంవత్సరంలో ఏదైనా ఒక సెమిస్టర్లో ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ ఉండేది. తర్వాత దీనిని తొలగించి సబ్జెక్టులు జోడించి కేవలం వేసవి సెలవులు, ఇతర సెలవుల్లో నెలరోజుల శిక్షణ పెట్టారు. ఈ నిర్ణయంతో నిపుణులు, విద్యావంతులతోపాటు వివిధ వర్గాల నుంచి పాలిటెక్నిక్ కోర్సులో కచ్చితంగా ఆర్నెల్ల శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మళ్లీ ఆర్నెల్లకు మార్చారు. 2018–19 విద్యాసంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్హౌజ్ ప్రాజెక్టు ఉండాలనే రెండు ఆప్షన్లు ఇవ్వడం వారిని అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ విధంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటినుంచి పారిశ్రామిక శిక్షణపై సరైన స్పష్టత లేకుండానే గడుస్తూ వచ్చింది. తీరా చూసేసరికి అధికారులు రెండు ఆప్షన్లతో కూడిన నిర్ణయానికి వచ్చారు. ఇదే అదునుగా తీసుకుని విద్యార్థులను సంప్రదించకుండానే నేరుగా ఇన్హౌజ్ ప్రాజెక్టు వైపునకే మళ్లిస్తున్నట్లు సమాచారం. కొన్ని కళాశాలలు పారిశ్రామిక శిక్షణ వైపునకు వెళ్లాలని భావిస్తుండగా, మరికొన్ని ఇన్హౌజ్ ప్రాజెక్టు వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రాజెక్టు సాకుతో దండుకునే పన్నాగం..? ఎస్బీటీఈటీ అధికారులు రూపొందించిన పాలిటెక్నిక్ సెమిస్టర్లో పాటించాల్సిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణకు పంపితే విద్యార్థులు నేరుగా పరిశ్రమలకే సంబంధిత ఫీజు చెల్లించే అవకాశాలుంటాయని.. దీంతో కళాశాలలకు ఒరిగేదేమీ ఉండదని భావించి, సబ్జెక్టులతో కూడిన ప్రాజెక్టు వర్క్ ఆప్షన్ ఎంపిక చేస్తే విద్యార్థులు కళాశాలలోనే ఉండడంతోపాటు ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే పన్నాగం పన్నుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేర కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోకుండానే నేరుగా కళాశాల యాజ మాన్యాలే ప్రాజెక్టు వైపు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆరో సెమిస్టర్లో విద్యార్థులకు అన్యాయం జరగడంతోపాటు కళాశాలలకు కాసుల వర్షం కురవడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కళాశాలలు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ వైపునకు మొగ్గుచూపగా పలు కళాశాలలు ప్రాజెక్టు పేరుతో డబ్బులు దండుకోవాలనే ఊగిసలాటలో నిర్ణయాన్ని బయట పెట్టడంలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న ఒక పాలిటెక్నిక్ యాజమాన్యం మాత్రం విద్యార్థులను నామమాత్రంగా సంప్రదించి మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్హౌజ్ ప్రాజెక్టు వైపు మళ్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సొంత అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఆశలకు గండికొడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆరో సెమిస్టర్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు దారులు ఆప్షన్లు కా కుండా ఏదో ఒకటే అధికారులే నిర్ణయించి నిబంధనలు రూపొందిస్తే బాగుంటుందని, రెండు దారులుండడంతో అయోమయానికి గురవుతున్నామని పలువురు విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. ఎస్బీటీఈటీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ ఆరో సెమిస్టర్లో అవలంబించే తీరుపై ప్రత్యేక నిఘాపెట్టి అక్రమాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
శాతవాహన రిజిస్ట్రార్ ఎవరో..?
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీకి కొత్త రిజిస్ట్రార్ ఎవరు వస్తారనే చర్చ యూనివర్సిటీతోపాటు పరిధిలోని వివిధ కళాశాలల్లో ప్రారంభమైంది. ఈనెల 31తో ప్రస్తుతం పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఎం.కోమల్డ్డి ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత ఎవరు వస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. నాలుగేళ్లుగా ఇన్చార్జి పాలనలో కొనసాగుతున్న యూనివర్సిటీకి కీలకంగా రిజిస్ట్రార్ స్థానమే బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇన్చార్జి వీసీలు ఇక్కడ పెద్దగా సమయం కేటాయించకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం.. సమస్యలొస్తే పరిష్కరించడానికి రిజిస్ట్రార్ అందుబాటులో ఉండి పర్యవేక్షించారు. అలాంటి రిజిస్ట్రార్ పోస్టు ఇప్పుడు ఖాళీ అయితే ఎలా..? అనేది అందరి ఆలోచన. నాలుగేళ్లుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించకుండానే ప్రభుత్వం నెట్టుకొస్తున్న ఈ తరుణంలో రెగ్యులర్ రిజిస్ట్రార్ నియామకం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరోవైపు పోస్టు ఖాళీ అయిన వెంటనే రిజిస్ట్రార్ పోస్టును భర్తీ చేయాలని విద్యారంగనిపుణులు, విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు శాతవాహన యూనివర్సిటీకి కోమల్రెడ్డితోపాటు ఇప్పటివరకు నలుగరు బాధ్యతలు చేపట్టారు. వర్సిటీ ప్రారంభమయ్యాక మొద టి రిజిస్ట్రార్గా ఏ.వినాయక్రెడ్డి (28 ఆగస్టు 2008 నుంచి 27 ఆగస్టు 2009 వరకు), ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ (31 ఆగస్టు 2009 నుంచి 27మే 2012), ప్రొఫెసర్ బి.భద్రయ్య (28 మే 2012 నుంచి 27 మే 2014) తర్వాత 28 మే 2014 నుంచి ఎం.కోమల్రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనుండడంతో పోస్టు ఖాళీ కానుంది. యూనివర్సిటీలో కీలకమైనస్థానం ఖాళీ అవుతుండడంతో తర్వాత ఎవరు వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. యూనివర్సిటీలో నుండే వస్తారా..? వర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్లున్నారు. వీరిలో ఒకరు కోమల్రెడ్డి, ఇంకొకరు గతంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్గా పనిచేసిన టి.భరత్. అనుభవం ప్రకారం చూస్తే వర్సిటీలో మొదటి అవకాశం ఇతనికే ఉంటుందన్న చర్చ వర్సిటీవర్గాల్లో జరుగుతోంది. వివిధ యూనివర్సిటీ ల రిజిస్ట్రార్ల నియామకాలు పరిశీలిస్తే ఎవరినైనా పోస్టు వరించవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. తుదకు రిజిస్ట్రార్ ఎవరనేది నిర్ణయించేది వీసీ చేతులో ఉంటుంది. ఇద్దరూ ఒకేసారి వచ్చే అవకాశం ప్రస్తుతం యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా టి.చిరంజీవులు కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమించాలనే ఆలోచనతో ఉంది. దీనికోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశం ఈనెల 10న ఉండగా.. అనుకోకుండా వాయిదాపడింది. త్వరలోనే వీసీ నియామకం కూడా చేపట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారవర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రార్ను నియమించాలంటే వీసీ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీసీతోపాటు రిజిస్ట్రార్ను కొత్తవారినే నియమించే అవకాశాలూ ఉన్నట్లు విద్యారంగ నిపుణుల్లో చర్చ సాగుతోంది. మొదట వీసీని నియమించి.. ఆ తర్వాత రిజిస్ట్రార్ను నియమిస్తారా..? ప్రస్తుతం ఖాళీ అవనున్న రిజిస్ట్రార్ కుర్చీ భర్తీ చేసి ఆ తర్వాత వీసీని నియమిస్తారా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని విద్యారంగ నిపుణులు ఎదురుచూస్తున్నారు. -
ఈసారైనా పెరిగేనా..!
శాతవాహనయూనివర్సిటీ : అర్హులైన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో సీటు వచ్చేవిధంగా దోస్త్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో పలుమార్లు ప్రవేశాలకు అవకాశమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో భారీగా మిగులుతున్న సీట్లును భర్తీచేయాలనే ఉద్దేశంతో ఐదోసారి దోస్త్ ద్వారా కొత్తవారికి, గతంలో నమోదు చేసుకున్న వారికి కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశమిస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ పరిధిలో 45,471 సీట్లుండగా నాలుగు దశల్లో 20,350 సీట్లు భర్తీ అయ్యాయి. 25,121 మిగులు సీట్లతో డిగ్రీప్రవేశాలు నేలచూపు చూస్తున్నాయి. ఐదోదశలో ప్రవేశాలకు అవకాశమివ్వడంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలతో పాటు శాతవాహనలో కూడా ప్రవేశాలు పెరిగే అవకాశముండొచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు. 16 తేదీతో నమోదు, వెబ్ ఆప్షన్లు పూర్తవనుండడంతో ప్రవేట్ కళాశాలలు దీనినే చివరి అవకాశంగా భావించి పోటీపడుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు కళాశాలలో సదుపాయాలు పరిశీలించి మారడానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే దాదాపు మూడు వేల సీట్ల వరకు మార్పులు చేర్పులు జరుగుతాయనేది అంచనా. పెరగనున్న సీట్ల భర్తీ ... దోస్త్ అధికారులు డిగ్రీసీట్ల భర్తీని పెంచడానికి గతంలో ఎన్నడూ కనివిని ఎరగని అవకాశాలు అందిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 16వరకు డిగ్రీ ప్రవేశాలకు నమోదు, వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రవేశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. దీంతో ఆయా కోర్సుల్లో సీటు రాని వారు ఇటువైపుగా వచ్చే అవకాశముంది. ఇదీ పరిస్థితి.. వర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు తిరోగమనంలోనే ఉంటున్నాయి. కొన్నిసార్లు భర్తీ కన్నా ఖాళీగా మిగులుతున్న సీట్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశలో 13,177, రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో ‘దోస్త్’ అందరినీ నిరాశ పరిచింది. మూడో దశ కేటాయింపు తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించబడి 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన నాలుగోదశలో 20,350 సీట్ల భర్తీ జరిగింది. ఇప్పుడు ఐదోదశకు అవకాశం ఇవ్వడంతో దాదాపు 2వేల పైగానే సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కళాశాలల మధ్య పోటీ.. ‘దోస్త్’ అధికారులు ఐదోసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వడంతో ప్రయివేటు కళాశాలల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పలు కళాశాలల మధ్య ఆనారోగ్యకరమైన పోటీ నెలకొని ఒకరికి మించి ఒకరు ఆఫర్లు ప్రకటించి విద్యార్థులను ఆకర్షించారు. ఎన్ని తిప్పలు పడ్డా ఆనుకున్నస్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. మూడు, నాలుగు దశల సీట్ల కేటాయింపు పూర్తయినా కరీంనగర్తో పాటు వివిధ ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లోనే చెప్పకోదగ్గస్థాయిలో ప్రవేశాలు జరిగాయి. మిగిలినివి కొన్ని పర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం మూసివేసే దశకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రకటించిన 5వ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగపరుచుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రవేట్ కళాశాలలు తప్పుడు మార్గంలో ప్రలోభాలు ప్రకటించి డిగ్రీ ప్రవేశాలను చేపడుతున్నాయని సమాచారం. -
డిగ్రీ, ఇంజినీరింగ్ అనుసంధానం..!
శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఎంసెట్, దోస్త్ ప్రవేశాలకు సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరే విద్యార్థులు డిగ్రీలో కూడా చేరేందుకు సిద్ధపడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే చాలామంది విద్యార్థులకు రెండింటిలో సీట్లు రావడంతో ఇంజినీరింగ్తోపాటు ఇతర కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. డిగ్రీ ప్రవేశాలనురద్దు చేసుకునే అవకాశం లేకపోవడంతో డిగ్రీ కళాశాలల్లో సీట్ల మిగులుకు కారణమవుతోంది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల గందరగోళానికి తెరతీస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు వృథాగా పోకుండా ఉండడానికి ఎంసెట్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయాలని ప్రవేశాలకు సంబంధించిన అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఈ విషయమై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల(దోస్త్) కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం సమావేశమైనట్లు సమాచారం. డిగ్రీ కోర్సుల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాల గురించి సంబంధిత అధికార వర్గాలు చర్యలు చేపడుతున్నారు. ఇదే జరిగితే కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా పలు కళాశాలల్లో సీట్ల మిగులుకు అడ్డుకట్టవేసే అవకాశాలుంటాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఇంజినీరింగ్లో వస్తే డిగ్రీలో ఖాళీ.. శాతవాహనలో గతేడాది విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్కు వెళ్లడంతో దాదాపు 2 వేల వరకు సీట్లు డిగ్రీలో వృథాగా మిగిలిపోయాయని సమాచారం. విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరాక కూడా డిగ్రీ కోర్సుల్లో వారి ప్రవేశాలు రద్దుచేసుకోకపోవడంతో సీట్ల విషయంలో గందరగోళం తలెత్తేది. కానీ ప్రభుత్వం అనుసంధానం నిర్ణయం వల్ల టాప్ కళాశాలల్లో సీట్ల వృథాను అరికట్టవచ్చని వివిధ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరాలనే ఆసక్తితో ఉంటే ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయడం ద్వారా వారు ఇంజినీరింగ్లో చేరగానే డిగ్రీలో అతడికి వచ్చిన సీటు ఖాళీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో టాప్ కళాశాలల్లో సీట్లు మిగలకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఇదేకాకుండా డిగ్రీలో సీటు వచ్చిన విద్యార్థులు వారి సీట్లను కన్ఫార్మ్ చేసుకునేటప్పుడు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే నిబంధన విధించనున్నారు. ఇది ఓసీలకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.500 ఉండనున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని విద్యార్థి కళాశాలలో చేరాక లేదా ఆ సీటును వదులుకున్నాక ఇచ్చేలా నిబంధన విధించనున్నట్లు తెలిసింది. గతేడాది శాతవాహన వ్యాప్తంగా దాదాపు 2 వేలకుపైగా విద్యార్థులు బీటెక్ వైపునకు వెళ్లడంతో డిగ్రీలో మిగిలిపోయాయి. 22,986 సీట్ల మిగులు... 2017–18 విద్యాసంవత్సరం శాతవాహన యూనివర్సిటీ ప్రవేశాలను పరిశీలిస్తే యూనివర్సిటీ వ్యాప్తంగా 46,310 సీట్లకు 22,986 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో బీఏలో 3,950 సీట్లకు 2,489 సీట్లు, బీబీఏలో 660 సీట్లకు 444, బీసీఏలో 60కి 60, బీకాంలో 20,280కి 9,244, బీఎస్సీలో 21,360 సీట్లకు10749 సీట్లు మిగిలిపోయాయి. 49.64 శాతం సీట్లు మిగులు శాతం నమోదైంది. దీనిలో దాదాపు రెండు వేలకు పైగా సీట్లు విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ రెండింటికీ దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్ వైపు వెళ్లిపోవడంతో డిగ్రీల్లో ప్రముఖ కళాశాలల్లో సీట్ల మిగులుకు దారితీసింది. ఈ సారి అనుసంధాన ప్రక్రియ అందుబాటులోకి వస్తే ఇలాంటి పరిస్థితులుండవని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుసంధానం మంచిదే... ప్రభుత్వం చేయనున్న ప్రవేశాల అనుసంధాన ప్రక్రియ వల్ల డిగ్రీచేసేవాళ్ళకు లాభం చేకూరుతొంది. గతంలో ఇంజినీరింగ్, డిగ్రీ రెండు ధరఖాస్తు చేసుకొన్న తర్వాత రెండింటిలో సీటు వస్తే ఆసక్తి గల అభ్యర్థులు ఇంజినీరింగ్లో చేరినా డిగ్రీలో సీటు రద్దయ్యేదికాదు. దీనితో సీట్లు వృథా అయిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితిఉండదు. విద్యార్థులకు, యాజమాన్యాలకు అందరికీ మంచిదే. – పి.వేణు, తెలంగాణ ప్రవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు -
శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధులు ఆందోళన
-
పనికిరాని పట్టా
శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో అందరూ (అధ్యాపకులతోపాటు ప్రిన్సిపాల్ కూడా) కాంట్రాక్టు ఉద్యోగులే.. శాశ్వత అధ్యాపకులు లేనికారణంగా పీసీఐకి బ్రేక్ పడింది. గతంలో పీసీఐ కమిటీ యూనివర్సిటీ కళాశాలకు తనిఖీలకు వచ్చినప్పుడు ప్రయోగశాలలు, గ్రంథాలయం, భవనాలు, తరగతి గదులతోపాటు వివిధ అంశాలను పరిశీలించి పలులోపాలు గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. వారుచెప్పినట్లు అధ్యాపకుల నియామక ప్రక్రియ మినహా మిగతావన్నీ విషయాల్లో సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు ప్రభుత్వం నుంచి రూపొందించి యూనివర్సిటీకి పంపించగా.. త్వరలో వర్సిటీ వివిధ విభాగాల్లో కలిపి 40 పోస్టులకు ప్రకటన విడుదల చేయనుంది. ఇందులో ఫార్మసీ విభాగంలో 18 పోస్టులున్నాయి. ఈ పోస్టులు భర్తీ అయ్యేవరకూ పీసీఐ రావడం కష్టమేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల పీసీఐ గురించి ఢిల్లీ వెళ్లిన యూనివర్సిటీ అధికారులకు వర్సిటీ త్వరలో వెలువరించే నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీచేస్తున్నట్లు సూచించారు. ఇంతలో పీసీఐ అధికారులు మరోసారి శాతవాహనకు వచ్చి తనిఖీలు నిర్వహించి సంతృప్తి చెందితేనే గుర్తింపురానుంది. లేకుంటే పోస్టుల భర్తీ అయ్యాకే పీసీఐ సంగతి తేలనుంది. 238 ఫార్మసిస్ట్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 25 జనవరి 2018న నోటిఫికేషన్ నంబర్ 04/2018 ద్వారా 238 ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 125 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 58 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 55 పోస్టులున్నాయి. ప్రకటన విడుదల చేసిన సమయంలో కేవలం ఇంటర్మీడియెట్తోపాటు డిఫార్మసీ చేసి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలని తెలపగా.. రెండురోజుల క్రితం డీ ఫార్మసీతోపాటు అంతకంటే హైయ్యర్కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించింది. దీంతో శాతవాహన యూనివర్సిటీ ద్వారా బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుందామంటే పీసీఐ గుర్తింపు లేకపోవడంతో అనర్హులుగా మిగిలి నిరాశచెందుతున్నారు. 200పైగా విద్యార్థులకు అనర్హత శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో 2009లో బీ ఫార్మసీ కోర్సు ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు బ్యాచ్లు పూర్తయ్యాయి. 270 మంది కోర్సులో ఉన్నారు. ఇందులో 200పైగా విద్యార్థులు పాసై ఉద్యోగాల వేటలో ఉన్నారు. వీరికి వర్సిటీకి పీసీఐ గుర్తింపు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ఫార్మసిస్ట్ ఉద్యోగాలే ఉంటాయని, వాటికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం మెడికల్ షాపులు కూడా పెట్టుకునేందుకు అవకాశం లేక ఉపాధిని కోల్పోతున్నామని మదనపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టి యూనివర్సిటీకి త్వరగా పీసీఐ గుర్తింపు తీసుకురావాలని, ఈ నోటిఫికేషన్కైనా పీసీఐతో సంబందం లేకుండా వారిని దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. పీసీఐతో సంబంధం పెట్టొద్దు వర్సిటీలో కోర్సు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడిచింది. ఇప్పటివరకు పీసీఐ గుర్తింపు లేదు. సమస్యపై ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. మా గోడు వెల్లబోసుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందామంటే అవకాశం లేకుండాపోతోంది. అధికారులు సమస్యను గుర్తించి పీసీఐతో సంబంధం లేకుండా నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలి. – పి.శిరీష, బీఫార్మసీ త్వరలోనే పీసీఐ కమిటీ రాక పీసీఐ అధికారులు గతంలో తనిఖీలకు వచ్చినప్పుడు పలు లోపాలు గుర్తించి సవరించుకోవాలని సూచించారు. వారు అడిగిన సమాచారంతో ఢిల్లీ వెళ్లి వచ్చాం. దీంతోపాటు యూనివర్సిటీలో శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మళ్లీ కమిటీ యూనివర్సిటీకి పరిశీలనకు రానుంది. – ఎం.కోమల్రెడ్డి, శాతవాహన రిజిస్ట్రార్ -
శాతవాహనలో నిర్లక్ష్యపు ‘పరీక్ష’
శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో సోమవారం జరిగిన తెలుగు పరీక్షలో 50 శాతానికి పైగా మార్కులకు సంబంధించిన ప్రశ్నలు సిలబస్లో లేనివి వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం గ్రూపుల్లో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు సోమవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉండగా దాదాపు 46 మార్కులకు సిలబస్లో లేని ప్రశ్నలే ఉన్నాయి. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందికి సమాచారమివ్వగా వారు వర్సిటీ అధికారులకు వివరించారు. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. సిలబస్లో లేని ప్రశ్నలకు పూర్తి మార్కులు కలపాలని విద్యార్థులు కోరుతున్నారు. పదే పదే తప్పులు.. వర్సిటీ ప్రారంభం నుంచి పరీక్షల నిర్వహణలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. పరీక్షల విభాగం పటిష్టంగా లేకపోవడమే ప్రధాన కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తప్పులు దొర్లాయని అధికారులు చెబుతున్నారు. గతంలో డిగ్రీ ఫైనలియర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రం ముద్రణనే మరిచారు. సీబీసీఎస్(చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) పద్ధతిలో జరిగిన ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ పరీక్షలో 40 మార్కులకు ప్రశ్నపత్రంలో 2 గంటలకు బదులు 3 గంటలని ముద్రించారు. బీకాం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 80 మార్కులు, ప్రాక్టికల్ 20 మార్కులుంటాయని సిలబస్లో నిర్ణయించారు. కానీ, ప్రశ్నాపత్రం 60మార్కులకే ఇచ్చారు. మార్కులు, మోమోల విషయంలోనూ పలుమార్లు తప్పులు దొర్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు అనేకం. న్యాయం చేస్తాం.. డిగ్రీ మొదటి సెమిస్టర్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో కొన్ని సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రం తయారీలో పొరపాటుతో ఇలా జరిగింది. వీసీ అనుమతి తీసుకొని విద్యార్థులు నష్టపోకుండా న్యాయం చేస్తాం. – వి.రమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
నిఘా నీడలో శాతవాహన
శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్): కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసు బలగాలు వర్సిటీ పరిసరాల్లో నిఘా పెంచాయి. సోమవారం రాత్రి హాస్టళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం వర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను కొనసాగించారు. వర్సిటీలో భవనాలు, బాలుర, బాలికల వసతిగృహాలు, కళాశాలలను పోలీసులు తనిఖీచేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా అడుగడుగునా గాలించారు. వర్సిటీకి వచ్చిన వారిని పోలీసులు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని వివరాలు అడిగి లోపలికి అనుమతించారు. రిజిస్ట్రార్ కార్యాలయం, పరిపాలన విభాగం మంగళవారం సెలవు దినమైనప్పటికి ఒకరిద్దరు సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం నుంచే ఉస్మానియా, కాకతీయతో పాటు వివిధ వర్సిటీల నుంచి విద్యార్థి సంఘాల నాయ కులు వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారమే విద్యార్థులు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో వర్సిటీ నిర్మానుష్యంగా మారింది. మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్రెడ్డి వర్సిటీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘాలతో సీపీ సమావేశం కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్రెడ్డి అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కమిషనరేట్లో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. విద్యార్థి సంఘాల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నా కక్ష పూరితంగా కాకుండా మంచి వాతావరణంలో తమ భావాలను వెల్లడించాలని కోరారు. వాట్సాఫ్, ఫేస్బుక్లలో అనవసరమైన పోస్టింగ్లు చేస్తూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని సూచించారు. విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి చందాల వసూళ్ళకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. సోమవారం వర్సిటీ ఘటనలో పాల్గొన్న విద్యార్థి సంఘాలపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేసే అవకాశమున్నా.. వారి భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని నోటీసులు మాత్రమే ఇచ్చామని, మున్ముందు వారి తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. బుధవారం నిర్వహించే బంద్ను విరమించుకో వాలని కోరారు. అందుకు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకే చేస్తున్నామని, శాంతియుతంగా జరుపుతామని వామపక్ష, బహుజన విద్యార్థిసంఘాల నేతలు సీపీకి వివరించారు. -
శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జనవరి 1వరకు వర్సిటీ హాస్టల్ను అధికారులు మూసివేశారు. రేపు జరగాల్సిన ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. యూనివర్సిటీ ఎదుట మను స్మృతి ప్రతులను పీడీఎస్యూ, డీఎస్యూ, బీఎస్ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా హాస్టల్కు సెలవు ప్రకటించామని, వర్సిటీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా వర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు బంద్కు పిలుపునిచ్చాయి. -
రాళ్లు.. కర్రలతో దాడులు చేసుకున్న విద్యార్థి సంఘాలు
-
రణరంగంగా ‘శాతవాహన’
శాతవాహన యూనివర్సిటీ : కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ రణరంగంగా మారింది. సోమవారం పీడీఎస్యూ, డీఎస్యూ, బీఎస్ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సం ఘాలు.. వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్ప రం రాళ్లురువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇరుసంఘాల నేతలు నినాదాలు చేసుకోవడం, రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. భరతమాత చిత్రపటాన్ని దహనం చేస్తున్నారన్న సమాచారం మేరకు బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు రావటంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బీజేపీ నాయకులతో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. నాలుగు గంటలపాటు వర్సిటీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. వర్సిటీ ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో సమావేశమైన సీపీ కమలాసన్రెడ్డి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సీపీ అనుమతించలేదు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవం తంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు సహకరించాలని సీపీ కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. వర్సిటీ బంద్: ఎం.కోమల్రెడ్డి, రిజిస్ట్రార్ గొడవల నేపథ్యంలో వర్సిటీని నిరవధికంగా బంద్ చేసినట్లు రిజిస్టార్ ఎం. కోమల్రెడ్డి ప్రకటించారు. ఎంబీఏ 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. వర్సిటీ సైన్స్, ఆర్ట్స్, ఫార్మసీ కళాశాలలతో పాటు సంబంధిత మెస్లు, çహాస్టళ్లు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వర్సిటీలో శాంతిని నెలకొల్పాలని కోరారు. జనవరి 2న జరగనున్న పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ల పరీక్షలపై ఈ నెల 27న ప్రకటిస్తామని తెలిపారు. దాడులకు నిరసనగా రేపు బంద్ దాడులకు నిరసనగా బుధవారం (27న) విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సం ఘాలు పిలుపునిచ్చాయి. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. 27న జరుగనున్న బంద్ను విజయవంతం చేయాలన్నారు. వర్సిటీలో శాంతియుతంగా కార్యక్రమం చేపడుతుంటే బీజేపీ నేతలు వచ్చి ఆటకం కల్పించడంతో పాటు గొడవలకు కారణమయ్యారని ఆరోపించారు. విచారణకు ఆదేశించాం విద్యార్థులు అల్లర్లకు పాల్పడితే వారి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుంది. వర్సిటీ ఘటనపై గురించి విచారణకు ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బలగా లను ఏర్పాటు చేశాం. విద్యార్థి సంఘాల మధ్య జరిగిన దాడుల గురించి యూనివర్సిటీ అధికారులతో సమీక్షించి తెలుసుకున్నాం. – కమలాసన్రెడ్డి, కరీంనగర్ సీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ వామపక్ష విద్యార్థి సంఘాలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోం దని పార్టీలు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. విద్యార్థులపై ఏబీవీపీ దాడులను నిరసిస్తూ సీపీఐ కార్యాలయంలో ప్రజాసంఘాల నేతలు సమావేశమయ్యారు. మనుధర్మశాస్త్ర దిష్టిబొమ్మను శాంతియుతంగా దహనం చేసేందుకు యత్నిస్తున్న వామపక్ష, బహుజన విద్యార్థి సంఘాలపై ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడులు హేయమైనచర్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి తెలిపారు. కాగా, 27న విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దాడులను ఖండించాలని కోరారు. ప్రొఫెసర్ను సస్పెండ్ చేయాలి బీజేపీ నేతలు బండి సంజయ్, కొత్త శ్రీనివాస్రెడ్డి కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అల్లర్లకు ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సూరేపెల్లి సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్రెడ్డిలు డిమాండ్ చేశారు. వర్సిటీలో దేశభక్తి, మంచి నడవడిక నేర్పాల్సిన ప్రొఫెసర్లు విద్యార్థులను చెడుమార్గంలోకి మళ్లీస్తూ గొడవలకు కారకులవుతున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ సుజాత విద్యార్థులను రెచ్చగొట్టి భరతమాత చిత్రపటాలను దహనం చేసేందుకు ప్రేరేపించడం వల్లే సంఘటన జరిగిందని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
శాతవాహన వర్సిటీ వద్ద ఉద్రిక్తత
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వద్ద స్థానిక యువకులకు, కాలేజీ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ దగ్గర మనుధర్మ శాస్త్రాన్ని పీడీఎస్యు, డీఎస్యు, బీఎస్ఎఫ్ విద్యార్థులు తగులబెట్టారు. దీంతో ఈ సంఘాల విద్యార్థులు, స్థానిక యువకులు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నగర పోలీసు కమిషనర్ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అక్కడకు చేరుకుని కమలాసన్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఆయన వారితో మాట్లాడి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
‘‘శాతవాహన’పై నిర్లక్ష్యమెందుకు?’
► వెంటనే ప్రభుత్వ మెస్ ప్రారంభించాలి ► కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా కరీంనగర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరించడం శోచనీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ అన్నారు. వర్సిటీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్యూలో ప్రైవేట్ మెస్ను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వపరంగా ప్రారంభించాలన్నారు. విద్యార్థుల పాత మెస్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. విద్యార్థుల భోజన ఖర్చులను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే భరించాలన్నారు. వర్సిటీలో 80 శాతం గ్రామీణ, బలహీనవర్గాల పేదలే చదువుకుంటున్నారని, సుమారు 500 మంది పస్తులుంటున్నారని పేర్కొన్నారు. వర్సిటీకి మూడేళ్లుగా వైస్ చాన్స్లర్ లేకుంటే పాలన, అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధ్యాపకులు, సిబ్బంది కొరతతో పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. సర్కారు స్పందించిన వర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని, అధ్యాపకులు, సిబ్బంది కొరత తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు అక్కెనపల్లి కుమార్, నగర అధ్యక్షుడు ఇంజినీర్ సాన రాజన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరాల శ్రీనివాస్, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ఎడ్ల సురేందర్రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోగె పద్మ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ కంది వెంకటరమణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వన్నారం అక్షయ్, మానకొండూర్, చిగురుమామిడి, రామడుగు మండలాల పార్టీ అధ్యక్షులు మహిపాల్రెడ్డి, గడ్డం విద్యాసాగర్రెడ్డి, వరాల అనిల్, నాయకులు రాచమల్ల నర్సయ్య, పచ్చునూర్ గ్రామ అధ్యక్షుడు సీపల్లి సంతోష్, డి.విజయ్, దేవునూరి శ్రీనివాస్, గుంట సంజీవ్, గుంట మహేశ్, పొన్నాల అనిల్, పోన్నాల అజయ్, దాల్వ మారుతి, రేపాక శ్రీకృష్ణ, మధుపాక అరవింద్, గడ్డం సాయికృష్ణ, తాండ్ర రాకేశ్, చిట్యాల సాయి ప్రీతమ్, దాచారం రామన్న, బానోతు సాయి తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫ్ ఫైనాన్స్ కష్టాలు...
భారమవుతున్న ‘వర్సిటీ’ చదువులు కంప్యూటర్ సైన్స్, ఫుడ్సైన్స్ కోర్సుల విద్యార్థుల ఇక్కట్లు ఫలించని ‘రెగ్యులర్’ డిమాండ్ కమాన్చౌరస్తా : శాతవాహన యూనివర్సిటీలో ఏళ్ల తరబడి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా కొనసాగుతున్న ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ నేటివరకు రెగ్యులర్ కోర్సులుగా మారలేదు. దీంతో ఆయా కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు ఆర్థికభారం తప్పడంలేదు. సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. పలుమార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ఫీజు భారమే.... కంప్యూటర్ సైన్స్కోర్సుకు ప్రస్తుతం రూ.25,010, ఫుడ్సైన్స్, టెక్నాలజీ కోర్సుకు రూ.36,865 ఉంది. మిగతా రెగ్యులర్ సైన్స్కోర్సులకు రూ.3,160 ఉంది. కంప్యూటర్ సైన్స్ కోర్సు 15ఏళ్ల నుంచి, ఫుడ్సైన్స్, టెక్నాలజీ నాలుగేళ్లనుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా కొనసాగుతున్నాయి. వీటిని రెగ్యులర్ కోర్సులుగా మార్చితే విద్యార్థులకు ఫీజులభారం తగ్గనుంది. పరిశోధన, సదస్సులు, ప్రాజెక్టుల విషయంలో ముందుకు సాగే అవకాశాలుంటాయి. సదరు కోర్సులకు పరీక్ష ఫీజులు ఎక్కువగానే ఉంటున్నాయని, వసతి గహాల్లో ఉండడానికి సైతం ప్రాధాన్యత తక్కువగానే ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. పెరుగుతున్న సీట్ల సంఖ్య ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ 30 సీట్ల చొప్పున ఉండేవి. ప్రస్తుతం వాటిని 40కి పెంచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేరొందిన కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణ ప్రాంతాలకు తరలిరావడంతో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. దీంతో కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతున్న తరుణంలో అధిక ఫీజులుండడంతో విద్యార్థుల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయని విమర్శలున్నాయి. ఫుడ్సైన్స్ కోర్సు చేసిన వారు ఫుడ్సెఫ్టీ శాఖలో ఉద్యోగాలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రై వేట్ ఆహార రంగసంస్థలలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఫీజుల భారంతో లక్ష్యాలను చేరుకోలేమని, తక్షణమే వీటి నుంచి విముక్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫలించని విన్నపాలు సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులుగా ఉన్న కంప్యూటర్ సైన్స్, ఫుడ్సైన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా పరిస్థితి మారలేదు. ఈ కోర్సులను రెగ్యులర్ చేయాలని గతంలో వీసీ వీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2015 డిసెంబర్ 11న రెండు కోర్సుల విద్యార్థులు ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వినతిపత్రంఇచ్చారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ జూలై 29న యూనివర్సిటీని సందర్శించినప్పుడు విద్యార్థులు సమస్యను విన్నవించారు. ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య గతంలో విశ్వవిద్యాలయానికి వచ్చిన సమయంలో వర్సిటీ అధికారులు రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని కోరినట్లు తెలిసింది. ఉన్నత విద్యామండలికి చేరిన విషయం ? కంప్యూటర్సైన్స్, ఫుడ్సైన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని యూనివర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖకు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ ఉన్నత విద్యాశాఖ నుంచి ఉన్నత విద్యామండలికి చేరినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖలు ఈ విషయంపై దష్టి సారించి ఈ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చితే విద్యార్థుల బాధలు దూరమవుతాయని కోరుతున్నారు. రెగ్యులర్ కోర్సుగా మార్చాలి –ఆనంద్రావు, విద్యార్థి శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగానే కొనసాగుతూనే ఉంది. దీంతో ఆర్థిక భారమవుతోంది. ఈ విద్యా సంవత్సరం ముగియక ముందే స్పందించి రెగ్యులర్ కోర్సుగా మార్చితే విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఇబ్బందులకు గురవుతున్నాం –నవీన్, విద్యార్థి వర్సిటీలో ఫుడ్సైన్స్, టెక్నాలజీ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా సెల్ప్ఫైనాన్స్ కోర్సులాగే ఉంది. ఆహార రంగంలో ప్రస్తుతం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దీనిని ఎంచుకుంటే ఫీజులు భారం భరించలేకపోతున్నాం. ప్రభుత్వం స్పందించి కోర్సును రెగ్యులర్ కోర్సుగా మార్చాలి. -
విద్యకే తొలి ప్రాధాన్యం
మంత్రి ఈటల రాజేందర్ శాతవాహన వర్సిటీని తనిఖీ చేసిన మంత్రి కమాన్చౌరస్తా: శాతవాహన యూనివర్సిటీని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. వర్సిటీ పాలన విభాగం, నిర్మాణంలో ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనం, సెంట్రల్ లైబ్రరీ, సైన్స్ కళాశాలను పరిశీలించారు. సైన్స్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. భోజన శాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కళాశాల ఎదుట మొక్కలు నాటారు. ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని అని మంత్రి ఈటల అన్నారు. విద్యాభివృద్ధి కోసం జిల్లాలోని ప్రతి నియోజకవర్గాని రూ. 10 కోట్ల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ. 15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వర్సిటీ కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పారు. విద్యాపర్యవేక్షణకు ఒక కమిటీని వేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కంప్యూటర్సైన్స్, ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీలను త్వరలో రెగ్యూలర్ కోర్సులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల చదువు, వసతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. 12–బీ గుర్తింపునకు కావాల్సి వనరులను అందిస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ కావాల్సిన గుర్తింపు, కేంద్రం నుంచి వచ్చే నిధులు త్వరగా వచ్చేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, కరీంన గర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్సింగ్, శాతవాహన రిజిస్ట్రార్ ఎం.కోమల్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిశోర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరెపల్లి సుజాత, టీఆర్ఎస్ నాయకులు సిద్దం వేణు, కట్ల సతీష్, ఏనుగు రవీందర్రెడ్డి, రెడ్డవేని తిరుపతి, బోనాల శ్రీకాంత్, చల్లహరిశంకర్, బండారి వేణు, మల్లెంకి శ్రీనివాస్, సయ్యద్ అక్బర్ హుస్సేన్ వర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నివ్వెరబోయూరు..
► ఇంగ్లిష్లో బీఈడీ ప్రశ్నపత్రం ► ఆందోళన చెందిన విద్యార్థులు ► ఏం రాయూలో తెలియక అయోమయం కమాన్చౌరస్తా : బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు నివ్వెరబోయూరు. గతంలో మాదిరిగా కాకుండా కేవలం ఇంగ్లిష్లోనే ప్రశ్నపత్రం ఉండడంతో కొందరు విద్యార్థులు కేవలం హాల్టికెట్ నంబర్ మాత్రమే రాసి బయటకు వెళ్లిపోయూరు. ప్రశ్నాపత్రం గతంలో మాదిరిగా తెలుగులోనే ఇవ్వాలని కోరుతున్నారు. 5 కేంద్రాల్లో 1400 మంది బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఎస్సారార్ కళాశాల, వివేకనందా డిగ్రీ, పీజీ కళాశాల, వాగేశ్వరీ డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాల, పెద్దపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా బీఈడీ కళాశాలలకు చెందిన 1400 మంది విద్యార్థులు హాజరయ్యూరు. ఇక నుంచి ఇంతే ! శాతవాహన యూనివర్సిటీ బీఈడీ విద్యార్థులకు మొదటిసారిగా సెమిస్టర్ విధానం అమలు చేయడంతో నిబంధనలు మారారుు. బీఈడీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్లోనే ఉంటుందని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. మొదటి పరీక్షనే కాదు ఇక ముందు జరుగబోయే పరీక్షలన్నింటీ ప్రశ్నపత్రాలు ఆంగ్లమాధ్యమంలోనే వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే ఉండాలి గతంలో బీఈడీ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో వచ్చేది. కానీ ఇప్పుడు సెమిస్టర్ విధానం అమలవడంతో కోర్సు నిబంధనలు మారి ఇంగ్లిష్ మీడియంలోనే వస్తున్నారుు. తెలుగు మీడియం విద్యార్థులు మాత్రం కేవలం హాల్టికెట్ నంబర్ రాసి పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని మరో సెంటర్లో ప్రశ్నపత్రాన్ని తెలుగులో అనువదించి చెప్పడంతో అక్కడి విద్యార్థులు గట్టెక్కారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్లో వచ్చినప్పటికీ సమాధానాలు మాత్రం తెలుగులో రాసుకునే వెసులుబాటు ఉందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. -
పరీక్ష రాయకున్నా పాస్!
శాతవాహన యూనివర్సిటీ : తప్పులమీద తప్పులు చేయడం శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగానికి అలవాటుగా మారింది. బీఈడీ విద్యార్థులకు ఒక ఫెయిల్ మెమో, మరో పాస్ మెమో ఇచ్చి కన్సాలిడేటెడ్ మెమో ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్న వర్సిటీ తాజాగా పరీక్ష రాయకున్నా విద్యార్థులను పాస్ చేస్తూ మెమోలు ఇస్తోంది. డిగ్రీలో విద్యార్థులకు ఇంటర్నల్గా పరీక్ష నిర్వహణ ఉంటుంది. ప్రశ్నపత్రాలు యూనివర్సిటీ నుంచి పంపిస్తారు. ఎలాగూ పరీక్షలను యూనివర్సిటీ అధికారులు తనిఖీ చేయబోరని కాబోలు... పలు కళాశాలలలు కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేదు. పరీక్ష రాయకుండానే ఏకంగా 300 మంది విద్యార్థులు పాసైనట్లు వెల్లడైంది. ‘పరీక్షే రాయలేదు... ఎలా పాసయ్యానని సదరు విద్యార్థులే నోరు వెళ్లబెట్టే వింత పరిస్థితి దాపురించింది. ఇంటర్నల్స్ ఇష్టారాజ్యం డిగ్రీలో విద్యార్థులకు ఆయా కోర్సు మెయిన్ సబ్జెక్టులతోపాటు వర్సిటీ అధికారులు అందరికీ కామన్గా ఓ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు కాంటెంపరరీ ఇండియా (సీఐఈపీఎస్), సెకండియర్ విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఫైనలియర్ విద్యార్థులకు సైన్స్ అండ్ సివిలైజేషన్ పరీక్షలను కళాశాలలో ఇంటర్నల్గా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలతో విద్యతోపాటు సామాజిక దృక్పథం అలవడుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంటోంది. కానీ, కొన్ని కళాశాలలు పరీక్ష నిర్వహించకుండానే మార్కులు వేసి పంపించారు. దీంతో తాము అసలు పరీక్ష రాయకుండానే ఎలా పాసయ్యామని అవాక్కవుతున్నారు. కామన్ పరీక్షగా నిర్వహించినా... ఈ మార్కులు జాబితాలో రావని, కేవలం ఇంటర్నల్ అని యూనివర్సిటీ ముందుగా ప్రకటిస్తుండడంతోనే విద్యార్థులు పరీక్షలు రాయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు తాము పరీక్షే రాయలేదని విద్యార్థులు చెబుతుండగా... వీరి జవాబు పత్రాలను విధిగా స్వీకరించామని అధికారులు చెబుతుండడం... అనుమానాలకు దారితీస్తోంది. యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణాలోపంతోనే ఇలా జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. -
ముదిరిన శాతవాహన వివాదం
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో రగలిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ప్రొఫెసర్పై దాడికి పాల్పడ్డ 23 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను సస్పెండ్ చేయడం సరికాదంటూ కళాశాల భవనం ఎదుట వారు ధర్నాకు దిగారు. తమపై పోలీస్ కేసులు పెట్టి మళ్లీ సస్పెండ్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. బాలకృష్ణ అనే విద్యార్థి పరిపాలన భవనంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించాడు. విద్యార్థులకు, ఆధ్యాపకులకు మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆర్ట్స్ కళాశాల, వసతిగృహాలకు రిజిస్ట్రార్లు సెలవులు ప్రకటించారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్పై విద్యార్థుల దాడి
కరీంనగర్: శాతవాహన వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీవీ. లక్ష్మీప్రసాద్పై వర్సిటీ విద్యార్థులు దాడి చేశారు. ఎంఏ ఇంగ్లిష్ ఇంటర్నల్లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్థులు ఆయన చాంబర్లోనే చితకబాదారు. ఈ ఘటనపై వర్సిటీ రి జిస్ట్రార్ ఆచార్య ఎం.కోమల్రెడ్డి విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామనడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా, దాడికి పాల్పడ్డ 24 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదుచేశారు. -
నిబంధనలు తూచ్..
శాతవాహన యూనివర్సిటీ : తమ రూటే సెప‘రేటు’ అని మరోసారి నిరూపించారు శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని పలు డిగ్రీ కళాశాలల యూజమాన్యాలు. వార్షిక పరీక్షలకు హాజరుకాకున్నా సప్లిమెంటరీలో పరీక్షలు రాయించడానికి పలు ప్రైవేట్ కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. వార్షిక పరీక్షలు రాయని విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజు తీసుకుని పరీక్ష రాయిస్తామని నమ్మబలుకుతున్నాయి. విద్యార్థులను నుంచి అదనంగా వసూలుచేస్తూ ఆయా కళాశాలలు యూనివర్సిటీలోని పలువురు సిబ్బందితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విధానం.. డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలంటే సదరు విద్యార్థి వార్షిక పరీక్ష ఫీజు కట్టి, పరీక్షల్లో ఏదేని పరీక్షకు విధిగా హాజరుకావాలన్నది యూనివర్సిటీ నిబంధన. అలాకాకుండా పరీక్ష ఫీజు మాత్రమే చెల్లించి ఏదేని కారణంతో పరీక్షకు హాజరుకాకపోతే సదరు విద్యార్థి మళ్లీ పునఃప్రవేశం పొంది తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రైవేట్ కళాశాలల యూజమాన్యాలు వార్షిక పరీక్ష ఫీజు చెల్లించకున్నా.. తరగతులకు హాజరుకాని విద్యార్థులకు అక్టోబర్ 8 నుంచి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేలా చూస్తామని పలువురి నుంచి అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. అడ్డదారి కళాశాలలపై చర్యలు? చొప్పదండి నియోజకవర్గంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యూజమాన్యం పలువురు విద్యార్థులను అడ్డదారిలో పరీక్షలు రాయించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి పరీక్ష రుసుం తీసుకుని పరీక్షలు ముగిసి ఒకవేళ ఆ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారి నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా యూనివర్సిటీ అధికారుల ప్రమేయం లేకుండా జరుగుతుందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలోని కొంతమంది అధికారుల అండదండలతోనే ఈ తతంగం చక్కబెడుతున్నట్లు కొందరు బహిరంగంగానే విమర్శలు చేసున్నారు. మచ్చుకు చెప్పిన ఈ కళాశాలనే కాదు దాదాపు 20పైగా కళాశాలల్లో ఈ తతంగం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డదారిలో నడిచే కళాశాలలపై యూనివర్సిటీ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే..! -
బీఈడీ.. అంతా వ్యాపారమే!
దూరవిద్యను తలపిస్తున్న రెగ్యులర్ బీఈడీ - తరగతుల నిర్వహణ అస్తవ్యస్థం - కౌన్సెలింగ్ నాటికి అఫిలియేషన్స్ శాతవాహన యూనివర్సిటీ: ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, రాజకీయ ఒత్తిళ్లతో ఉపాధ్యాయ విద్య భ్రష్టుపడుతోంది. రెగ్యులర్ బీఈడీ కోర్సు దూరవిద్యా విధానాన్ని తలపిస్తోంది. కళాశాలల్లో సౌకర్యాల లేమి, అధ్యాపకుల నియామకాల్లో నిబంధనలు పాటించని పక్షంలో యూనివర్సిటీ అఫిలియేషన్ రాదని నిబంధనలున్నా.. తీరా వార్షిక పరీక్షల సమయానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుని వాటి మనుగడ సాగిస్తున్నాయి. 2014-15 విద్యాసంవత్సరానికి ఈనెల 21 నుంచి 28 వరకు ఎడ్సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని 19 బీఈడీ కళాశాలల పర్యవేక్షణ పూర్తయిందని, వాటి అఫిలియేషన్ను కౌన్సెలింగ్కు ముందే అందించే యోచనలో ఉన్నట్లు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోమల్రెడ్డి తెలిపారు. ఎన్నో ఆరోపణలు జిల్లాలోని చాలా బీఈడీ కళాశాలలు ఉపాధ్యాయ విద్యను వ్యాపార కోణంలోనే చూస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆటస్థలం, లైబ్రరీ, సెమినార్హాళ్లు, అర్హత గల అధ్యాపకులు లేకున్నా నెట్టుకొస్తున్నాయి. కన్వీనర్ కోటా నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, మేనేజ్మెంట్ కోటాతో వచ్చే డబ్బులను అప్పన్నంగా మింగేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజు వివరాలు కన్వీనర్ కోటాలో సీటు పొందిన ఉపాధ్యాయ విద్యార్థి పైసా చెల్లించకుండానే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. కళాశాల స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.14,400 నుంచి రూ.16,500 వరకు రీయింబర్స్మెంట్ వస్తోంది. స్కాలర్షిప్ రూపేణ రూ.4500- రూ.5 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. 2013-14లో బీఈడీ అభ్యసించిన వారికిఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని యాజమాన్యాలు తెలిపాయి. ఎవరి కోటా ఎంత? బీఈడీ కళాశాలలో మొత్తం వంద సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలో 75 శాతం, మేనేజ్మెంట్కు 25 శాతం సీట్లు కేటాయించింది. గతంలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ల అమ్మకాలు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటే ప్రస్తుతం రెండింతలైనట్లు తెలుస్తోంది. కోర్సు విధానం కోర్సులో చేరిన విద్యార్థులు తరగతులకు కనీసం 80 శాతం హాజరు కావాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాక్రో టీచింగ్ కోసం కళాశాల కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులుగా బోధన చేయాలి. యూనివర్సిటీ ప్రకారం పరీక్ష ఫీజులు అన్ని కలిపి మొత్తంగా రూ.2,530 చెల్లించాలి. నిబంధనలకు నీళ్లు జిల్లాలో 19 బీఈడీ కళాశాలల్లో 2 వేల మంది ఉపాధ్యాయ కోర్సు అభ్యసిస్తున్నారు. పలు కళాశాలల్లో సిబ్బంది సరిగాలేకపోవడంతో విద్యార్థులు తరగతులకు హాజరుకావడం లేదు. అన్ని మెథడ్స్ బోధించే అధ్యాపకులు మెజార్టీ కళాశాలలో లేకున్నా యాజమాన్యాలు ప్రభుత్వానికి ఏవో పేర్లు చూపి గుర్తింపును కాపాడుకుంటున్నాయి. లేని వసతులకు ఫీజులు అనేక కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు లేవు. ఉన్నా అవి అలంకారప్రాయమేననే విమర్శలున్నాయి. లేనివాటికి కంప్యూటర్ రికార్డ్స్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడడంతోనే బీఈడీ ప్రమాణాలు పడిపోయాయనే వాదన వినిపిస్తోంది. ఎన్సీటీఈ ప్రకారం కళాశాలకు సొంత భవనం ఉండాలి. కాని నేటికీ కొన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఏడాదిలో కనీస తరగతులు కూడా నిర్వహించే స్థితిలో లేవు. వార్షిక పరీక్షకు హాజరు విషయాల్లోనూ విద్యార్థుల నుంచి డబ్బులు దండుకుంటున్నాయి. బయోమెట్రిక్ అటెండెన్స్ ఈ విద్యాసంవత్సరం బీఈడీ కళాశాలలో విద్యార్థులకు, అధ్యాపకుల హాజరును బయోమెట్రిక్ సిస్టమ్తో నమోదు చేస్తాం. ఈ విధానం అమలుకు ఎస్యూ వీసీ గత విద్యాసంవత్సరమే సిద్ధమైనా కొన్ని కారణాలతో చేయలేకపోయాం. ఈసారి కచ్చితంగా అమలు చేస్తాం. నిబంధనలు పాటించని కళాశాలలను ఉపేక్షించేది లేదు. - ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి, ఎడ్యుకేషన్ డీన్ ఫ్యాకల్టీ, కేయూ వరంగల్ -
వర్సిటీకి తాళం
- ఆందోళన ఉధృతం - కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా సమస్యలపై కమిటీ? - 10 నుంచి ఎంబీఏ పరీక్షలు జరిగేనా? శాతవాహన యూనివర్సిటీ : శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల సమస్య చినికిచినికి గాలివానలా మారింది. వారి వరుస ఆందోళనలు ఏకంగా వర్సిటీకి తాళం వేసేవరకూ తీసుకె ళ్లాయి. వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాలని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత నెల 23 నుంచి ఆందోళన చేస్తున్నారు. కారణమిదీ.. వారం క్రితం విద్యార్థులు వసతిగృహానికి రావాలని అధికారులు సూచించారు. వారి పిలుపుతో కొంతమంది అక్కడకు చేరుకున్నారు. అయితే గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఈ సారి మెస్ డిపాజిట్ కొంత పెంచామని, దానిని చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. వసతులు లేని గృహంలో ఉండడమే మిన్న.. దానికి రుసుం చెల్లించాలా..? అంటూ విద్యార్థులు మొండికేశారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బాలుర వసతి గృహానికి వచ్చి తరగతుల కు హాజరుకావాలని విద్యార్థులను ఆదేశించా రు. అయితే సమస్య పరిష్కరించేవరకూ రాబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. అలా మొదలై న ఆందోళన తారస్థాయికి చేరింది. అధికారులు బుధవారం సుమారు 12 గంటలపాటు వర్సిటీలోని 10 మంది రెగ్యులర్, 60 మంది అకాడమిక్ కన్సల్టెంట్స్, నాన్టీచింగ్ స్టాఫ్తో చర్చిం చి విద్యార్థులకు నచ్చజెప్పినా వారు మొండికేశారు. దీంతో వర్సిటీని నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కోమల్రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. కలెక్టరేట్ ముట్టడి.. గురువారం ఉదయం టిఫిన్ ముగించుకున్న విద్యార్థులు బ్యాగులు పట్టుకుని ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. మూడు గంటలపాటు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విద్యార్థుల ద్వారా సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఎంబీఏ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వర్సిటీ నిరవధిక బంద్ సడలించేలా విద్యార్థులే సహకరించాలని సూచించారు. కొందరి ఆందోళన.. అందరికీ శిక్ష సమస్యల పరిష్కారం కోసం ఆర్ట్స్ విద్యార్థులే ఆందోళన చేస్తుండగా.. ఆ శిక్ష వర్సిటీలోని అన్ని విభాగాల విద్యార్థులూ అనుభవిస్తున్నారు. డ్యాం సమీపంలోని ఫార్మసీ, సైన్స్ కళాశాల తరగతులు కూడా ఉండవనే అధికారుల నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కమిటీ? విద్యార్థులకు మెస్, ఇతరత్రా సమస్యలు పరిష్కరించేందుకు వీసీ ఆధ్వర్యంలో కమిటీ వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్సిటీలో రెగ్యులర్, అకామిక్ కన్సల్టెంట్స్, నాన్టీచింగ్ స్టాఫ్తో వీసీ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెల్సింది. పరీక్షల నిర్వహణ జరిగేనా...? శాతవాహన యూరివర్సిటీ పరిధిలోని ఎంబీఏ విద్యార్థులకు ఈ నెల 10 నుంచి ఫస్టియర్ సెకం డ్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టైంటేబుల్ కూడా ఎస్యూ పరీక్షల నియంత్రణ బోర్డు ప్రకటించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో దాదాపు వారం పది రోజుల పాటు వర్సిటీ నివరధిక బంద్ పాటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అని విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. -
శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్ట్స్ కాలేజి ప్రిన్స్ పాల్ ను తొలగించాలని, హాస్టల్ ను యూనివర్సిటీ అధికారులే నిర్వహించాలనే డిమాండ్ తో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్ధుల ఆందోళనతో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో ఎంబీఏ విద్యార్ధిని సృహతప్పి పడిపోయింది. వెంటనే విద్యార్ధిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విద్యార్ధులతో పోలీసులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. -
రండి బాబూ.. రండి!
శాతవాహన యూనివర్సిటీ : పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా మారింది ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి. వీటిల్లో ప్రవేశాలకు గతంలో ఎగబడిన విద్యార్థులు.. ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల సీట్లు నిండడమే గగనం అంటున్నారు. ఈ క్రమంలో పలు కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న ఫీట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చే బాధ్యతను పూర్వవిద్యార్థులకు అప్పగిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు, ల్యాప్టాప్లు, ఐఫోన్ తదితరాలను సమర్పించుకుంటున్నాయి. విద్యార్థులకూ ఎంతో కొంత ముట్టజెబుతున్నాయి. ఇవేవీ మేనేజ్మెంట్ సీట్లు కావు మరి. స్నేహం చేస్తారు.. సలహా ఇస్తారు.. వెబ్ కౌన్సెలింగ్కు వెళ్లే విద్యార్థులను ట్రాప్ చేసేందుకు పూర్వవిద్యార్థులను దింపుతున్నాయి పలు కళాశాలలు. ఒక్కో పూర్వ విద్యార్థి కనీసం ఐదుగురిని చేర్చాలని టార్గెట్ విధించినట్లు తెలిసింది. వీరు విద్యార్థులతో మాటమాటా కలిపి.. పలానా కళాశాలో చేరితే భవిష్యత్ బాగుంటందని, తామూ అక్కడే చదివామని హైప్ పెంచుతున్నారు. ఇంకా కళాశాలలో చదువుతున్న వారే ఈ పనిచేస్తే.. వారికి ఇంటర్నల్స్లో అధిక మార్కులు వేస్తామంటూ ప్రోత్సహిస్తున్నాయి. సర్టిఫికె ట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారి నుంచి వన్టైం పాస్వర్డ్ను సైతం తస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. గుర్తింపు నిలుపుదలపై యాజమాన్యాలు సీరియస్ ఇటీవల తనిఖీల్లో జిల్లాలోని ఏడు ఇంజినీరింగ్ , ఆరు ఫార్మసీ కళాశాలకు గుర్తింపు నిలుపుదల చేయడంపై యాజమాన్యాలు సీరియస్గా ఉన్నాయి. ఇంజినీరింగ్ సీట్లు తగ్గిస్తే సరేకానీ ఇలా కళాశాలలను ప్రవేశాలకు అనుమతి నిరాకరించడం దారుణమంటున్నాయి. తనిఖీల తీరుపై కోర్టులో పిటిషన్ వే శామని, గుర్తింపు నిలుపుదలపై ఈ నెల 21న వివరణ ఇవ్వాలని అధికారులను జడ్జి ఆదేశించారని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాలలుగా పేరున్న వాటిని తొలగించడం విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. కాగా, కళాశాలల అనుమతుల నిలుపుదలలో రాజకీయాలు ఇమిడి ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులూ.. ఆందోళన వ ద్దు కళాశాలల గుర్తింపు అంశంపై విద్యార్థులు ఆందోళన చెందొద్దని కౌన్సెలింగ్ కేంద్రం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కె.ప్రేమ్కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెబ్ ఆప్షన్లు ఎన్నుకోవడానికి ఉన్న కేంద్రాల్లో ఆన్లైన్లో కనిపించే కళాశాలలకే గుర్తింపు ఉన్నట్లని స్పష్టం చేశారు. వన్టైమ్ పాస్వర్డ్ విషయంలో గోప్యత పాటించాలని కోరారు. గుర్తింపు ఉన్న కళాశాలలివే... జ్యోతిష్మతి-1, జ్యోతిష్మతి -2, జేఎన్టీయూ కొండగట్టు, జేఎన్టీయూ మంథని, హుజూరాబాద్ కి ట్స్ ఇంజినీరింగ్ కళాశాల, పెద్దపల్లి మధర్ థెరిస్సా, కరీంనగర్ నిగమ ఇంజినీరింగ్ కళాశాల, వాగేశ్వరి-1, వాగేశ్వరీ-2, వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఉంది. ఫార్మసీలో కరీంనగర్ శాతవాహన కళాశాలకు మాత్రమే అనుమతి ఉందని కౌన్సెలింగ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. ఇది సోమవారం వరకు ఉన్న సమాచారమని, సలహాలు, సూచనల కోసం 96666 70193 సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి కేయూ పీజీ సెట్
కేయూ క్యాంపస్(వరంగల్), న్యూస్లైన్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కేయూ పీజీ సెట్ శనివారం నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతుందని కేయూ ఇన్చార్జ్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ నర్సింహచారి తెలిపారు. పీజీ సెట్లో భాగంగా 37 కోర్సులకు 32,321 దరఖాస్తులు వచ్చాయని, ఈ మేరకు కోర్సుల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. కేయూ పీజీ సెట్ రాసే అభ్యర్థులకు హాల్టికెట్లను పోస్టు ద్వారా పంపించామని, అందని వారు ఆన్లైన్లో డౌన్లోన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పీజీ సెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. పీజీ సెట్ షెడ్యూల్ ఇదే.. కోర్సుల వారీగా పీజీ సెట్ నిర్వహించే తేదీల వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24న ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు ఎమ్మెస్సీ బాటనీ, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్డబ్ల్యూ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. 25వ తేదీన ఉదయం ఎంఈడీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ ఫిజిక్, ఫిజిక్స్(ఇంట్రుమేషన్), ఎంఏ సోషియాలజీ, పీజీ డిప్లోమా ఇన్ సెరికల్చర్, 26న ఉదయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటీఎం, మధ్యాహ్నం ఎంఏ ఇంగ్లిష్, 27న ఉదయం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పరీక్షలు జరుగుతాయి. 28న ఉదయం ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లెడ్ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 29న ఉదయం ఎంసీజే, మధ్యాహ్నం ఎమ్మెస్సీ సైకాలజీ, 31న ఉదయం ఎంహెచ్ఆర్ఎం, మధ్యాహ్నం ఎంఏ హిస్టరీ, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అలాగే, జూన్ 1వతేదీన ఉదయం ఎంకాం, ఎంకాం(ఫైనాన్సియల్ అకౌంటింగ్), ఎంకాం బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మధ్యాహ్నం ఎంఏ తెలుగు, ఎంఏ జెండర్ స్టడీస్, ఎమ్మెస్సీ నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు జరుగతాయి. -
కేయూ పీజీసెట్ షెడ్యూల్ విడుదల
కేయూ క్యాంపస్, న్యూస్లైన్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కేయూ పీజీ సెట్ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇన్చార్జ్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఎస్.నర్సింహాచారి గురువారం తెలిపారు. ప్రవేశ పరీక్షలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత విద్యార్థులు తమ హాల్టికెట్లను కేయూ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రవేశపరీక్షల షెడ్యూల్ ఇదే... 24న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎమ్మెస్సీ బోటనీ, ఎంఏ తెలుగు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్డబ్ల్యూ పరీక్షలు జరుగుతాయి. 25న ఉదయం ఎంఈడీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎంఏ సోషియాలజీ, 26న ఉదయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటీఎం, మధ్యాహ్నం ఎంఏ ఇంగ్లిష్, 27న ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, 28న ఉదయం ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లయిడ్ మ్యాథ్స్, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. 29న ఉదయం ఎంసీజే, మధ్యాహ్నం ఎమ్మెస్సీ సైకాలజీ, 31న ఉదయం ఎంహెచ్ఆర్ఎం, మధ్యాహ్నం ఎంఏ హిస్టరీ, ఎమ్మెస్సీ జియాలజీ, జూన్ 1న ఉదయం ఎం.కామ్, ఎం.కామ్ ( ఫైనాన్సియల్ అకౌంటింగ్), ఎం.కామ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎం.కామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), మధ్యాహ్నం ఎంఏ (జెండర్ స్టడీస్), ఎమ్మెస్సీ (నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ ) కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష ఉండదని నర్సింహాచారి తెలిపారు. డిగ్రీ స్థాయిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని నర్సింహాచారి పేర్కొన్నారు. -
పదే పదే తప్పులు
శాతవాహన యూనివర్సిటీ, న్యూస్లైన్ : పరీక్షల నిర్వహణలో పదేపదే తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు యత్నించడంలో శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం తనకు తానేసాటి. పరీక్షల్లో ప్రశ్నపత్రాలు మారడం, ఫలితాలు వెల్లడించడంలో జాప్యం, తప్పులతడకగా మెమోలు జారీచేయడం, ఒకే సమయంలో రెండు కోర్సుల పరీక్షలు నిర్వహించడం.. ఇలా అనేక తప్పిదాలతో అప్రతిష్టను మూటగట్టుకున్న పరీక్షల విభాగం ఇప్పటికే అదే ఒరవడిని కొనసాగిస్తోంది. తాజాగా గత నెల 20న జరిగిన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలో విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం ఇచ్చింది వారి జీవితానికే పరీక్ష పెట్టింది. ఈ విషయాన్ని పలు పీజీ కళాశాలలు పరీక్షల నియంత్రణ అధికారికి విన్నవించగా దానిని తొక్కిపెట్టే ప్రయత్నం చేసి భంగపడింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నాని పది రోజుల తర్వాత బయటపడింది. కరీంనగర్లోని ఎస్ఆర్ఎం, ఎస్సారార్ కాలేజీతోపాటు పలు కళాశాలల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు గతనెల 20న వివేకానంద, వాణీనికేతన్ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఫస్ట్ సెమిస్టర్ పరీక్షను నిర్వహించారు. 2012-2013 విద్యాసంవత్సరం నుంచి కెమిస్ట్రీ సెలబస్లో మార్పులు చేయడంతో విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రశ్నపత్రాలను ఇవ్వాల్సి ఉండగా, ఈ రెండు పరీక్ష కేంద్రాల్లో పాత సిలబస్ పరీక్ష పత్రాలు ఇచ్చారు. విద్యార్థులు పరీక్ష పత్రం ఇది కాదని చెప్పినా నిర్వాహకులు వినిపించుకోలేదు. పరీక్ష కేంద్రానికి ఒకే రకమైన పేపర్లు వచ్చాయని, వాటినే రాయాలని తేల్చిచెప్పడంతో విద్యార్థులు తమకు తోచింది రాసేసి బయటకొచ్చారు. నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసిన వారికి న్యూ సిలబస్ ప్రశ్నపత్రాలు ఇచ్చినట్లు సమాచారం రావడంతో ప్రశ్నపత్రాలను పోల్చిచూసుకుని విద్యార్థులు కంగుతిన్నారు. ఒక పేపర్కు బదులు మరో పేపర్ రాసిన తాము పరీక్షలో అనుకున్న స్థాయిలో రాణించలేమోనన్న భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా శాతవాహన వీసీ, ఎగ్జామినేషన్ బ్రాంచీలో దొర్లుతున్న తప్పుల విషయంలో చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో సైతం ఇలాంటి పొరపాట్లు జరిగాయని, ప్రస్తుతం జరుగుతున్నాయని, భవిష్యత్లో తప్పులు జరగకుండా తీసుకునే చర్యలను బహిర్గతం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. న్యాయం చేయండి - సిహెచ్.రాజు, మాధురి, శ్రుతి, నౌష్, వేణు వివిధ పీజీ కళాశాలల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులమైన మాకు న్యూసిలబస్ పేపర్కు బదులు, ఓల్డ్ సిలబస్ పేపర్ ఇచ్చారు. దీంతో పరీక్షలలో అనుకున్న స్థాయిలో పరీక్షలు రాయలేకపోయాం. వీసీ గారు స్పందించి మాకు న్యాయం చేయాలి. పొరపాటును విన్నవించాం.. - వాణి నికేతన్ కళాశాల తమ కళాశాల కేంద్రంలో పరీక్ష పత్రం మారిన విషయాన్ని వర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్కు ఇప్పటికే విన్నవించాం. కళాశాలలో ఏ.ప్రశాంత్, జి.రాజు, చిరంజీవి, కే.స్రవంతి, ఎల్.ప్రభాకర్, కె.వాణీ ఒక పేపర్కు బదులు మరో పేపర్ రాసిన వారిలో ఉన్నారని తెలియజేశాం. మా తప్పు కాదు - టి.భరత్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ పరీక్ష నిర్వహణ కోసం రెండు రకాల పరీక్ష పత్రాలను సంబంధిత కళాశాలలకు పంపాం. విద్యార్థులు వారికిచ్చిన ప్రశ్న పత్రాన్ని చూసుకుని రాయాలి కనీసం అది తెలియకుండా రాస్తే ఎలా? ఈ విషయంలో ఇప్పటికే వినతులను స్వీకరించాం. త్వరలో న్యాయం చేస్తాం.