School Bags
-
వీపు ‘మోత’ మోగుతోంది
దాదర్: విద్యార్ధులు మోస్తున్న బరువైన స్కూలు బ్యాగుల వల్ల వారికి భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదముందని ఆర్థోపెడిక్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో విద్యార్ధుల కంటే వారి సంచీ బరువే ఎక్కువగా ఉంటోందని ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ డాక్టర్ సమీర్ రూపరేల్ పేర్కొన్నారు. పది మంది విద్యార్ధుల్లో ఎనిమిది మంది భుజం, వెన్ను, నడుము నొప్పులతో బాధపడుతున్నారని, ప్రతీరోజు అన్ని సబ్జెక్టుల అచ్చు, నోటు పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలిందని, కాబట్టి సాధ్యమైనంత వరకు సంచీ బరువు తగ్గించే ప్రయత్నం చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... విద్యార్ధుల బ్యాగుల బరువు తగ్గించే విషయంపై అనేక సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. స్కూలు సంచీల బరువు మోయలేక విద్యార్ధుల వెన్ను వెనక్కు వాలిపోతోంది. వెన్ను నొప్పితో సతమతమవుతూ చికిత్స చేయాల్సిన పరిస్థితులు కూడా చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. బ్యాగు బరువు తగ్గించే విషయంపై అన్ని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాలని సూచించింది. టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని హోంవర్క్ మినహా ఇతర నోటు పుస్తకాలు తరగతి గదిలోనే భద్రపరచుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ అన్ని తరగతి గదుల్లో ర్యాక్లు నిరి్మంచడం లేదా అందుబాటులో ఉండేలా చూడాల్సిరావడం ఒకింత భారం కావడంతో అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అటకెక్కించాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్ధులు అన్ని నోటు, అచ్చు పుస్తకాలను మోసుకెళ్లడంవల్ల బ్యాగు బరువు ఎక్కువవుతోంది. దీనికి తోడు ఒక్కో సబ్జెక్టుకు ఒక అచ్చు పుస్తకం, రెండు నోటు పుస్తకాలు, ఒక వ్యాసం లేదా గ్రామర్ పుస్తకం, ఇలా కనీసం నాలుగైదు పుస్తకాలుంటున్నాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి సుమారు 20–25 పుస్తకాలను రోజూ మోయాల్సి రావడం వల్ల విద్యార్ధులు వెన్ను, నడుం భుజాల నొప్పితో బాధపడుతున్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువుకంటే 15 శాతం తక్కువగా ఉండాలి. ఒకటి, రెండో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు కేజీ, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు రెండున్నర నుంచి మూడు కేజీల మధ్య, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధుల బరువు మూడు నుంచి నాలుగు కేజీల మధ్య ఉండాలి. ఇక తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు ఐదు కేజీల కంటే ఎక్కువ ఉండరాదని సమీర్ రూపరేల్ తెలిపారు. కానీ అనేక కారణాల వల్ల పరిమితిని మించి విద్యార్థులు స్కూ లు బ్యాగుల బరువును మోస్తున్నారని దీనివల్ల వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విపరీతమైన బరువు కారణంగా విద్యార్ధులు పూర్తిగా ఎదగలేక పోతున్నారని ఈ కారణంగా వారు నిలుచునే భంగిమలో కూడా మార్పు వస్తోందని ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో వారికి మరింత ఇబ్బంది కలిగే ప్రమాదముందని రూపరేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
స్కూల్లో కలకలం.. పదేళ్ల బాలుడిపై నర్సరీ విద్యార్థి కాల్పులు
బీహార్: నర్సరీ చదువుతున్న ఓ ఐదేళ్ల విద్యార్థి చదివే స్కూల్కి రహస్యంగా గన్నుతో వచ్చాడు. అదే స్కూల్లో చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులు జరిపిన విద్యార్థి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.బీహార్లోని సుపాల్ జిల్లా లాల్పట్టి ప్రాంతానికి చెందిన సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్లో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. అయితే ఎప్పటిలాగే సదరు విద్యార్థి బుధవారం స్కూల్కు వచ్చాడు. వచ్చే సమయంలో రహస్యంగా తన స్కూల్ బ్యాగ్లో గన్ దాచాడు.ఇక వచ్చీ రావడంతోనే అదే స్కూల్లో మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు,స్కూల్ యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు బాధిత విద్యార్ధిని ప్రశ్నించారు. ఎందుకు కాల్పులు జరిగాయని ప్రశ్నించారు.‘నేను నా క్లాస్కి వెళ్తున్నాను. అదే సమయంలో నర్సరీ విద్యార్థి తన బ్యాగ్లో నుంచి గన్ తీసి నాపై కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థిని ఆపే ప్రయత్నం చేశా. ఆ ప్రయత్నంలో నర్సరీ విద్యార్థి నా చేతిపై కాల్పులు జరిపాడు’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడో తరగతి విద్యార్థి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. తనపై కాల్పులు జరిపిన బాలుడితో ఎలాంటి గొడవ జరుగలేదని ఆ విద్యార్థి చెప్పాడు.VIDEO | "In Triveniganj's St. Joan School, a student brought a pistol from home in a school bag and fired it during the school assembly. The bullet hit a 10-year-old boy in his arm. He was immediately provided medical treatment and now he is out of danger," says a police… pic.twitter.com/fdfkGQnnqZ— Press Trust of India (@PTI_News) July 31, 2024కాల్పుల ఘటనలో నిర్లక్ష్యం వహించిన సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కాల్పులు జరిపిన బాలుడు, అతడి తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు.మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాల్పులతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..!
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..! -
78 ఏళ్ల తాతకు నైన్త్లో అడ్మిషన్.. స్కూలుకు ఎలా వెళుతున్నాడంటే..
మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు. ఇదేమీ జోక్ కాదు.. ముమ్మాటికీ నిజం. నార్త్ ఈస్ట్ లైవ్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలోని హువాయికాన్ గ్రామానికి చెందిన లాల్రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తుంది. ప్రస్తుతం లాల్రింగథర హువాయికోన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1945లో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించిన లాల్రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు. ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు. లాల్రింగథర మీడియాతో మాట్లాడుతూ ‘నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను’ అని తెలిపాడు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్కిమా మాట్లాడుతూ ‘లాల్రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు’ అని అన్నారు. కాగా లాల్రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటాడు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్తో ప్రేమజంటకు రెక్కలు.. -
పర్మిషన్ లేని పాఠశాలలపై చర్యలు
పరిగి: ప్రైవేటు విద్యాలయాలపై మండల విద్యాధికారి కొరడా ఝుళిపించారు. అకాస్మాత్తుగా సోదాలు నిర్వహించి అనుమతి లేని, పుస్తకాలు, బ్యాగులు విక్రయించిన పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలను మండల విద్యాధికారి హరిశ్చందర్ తనిఖీ చేశారు. న్యూబ్రిలియంట్ టెక్నో స్కూల్లో పాఠ్యపుస్తకాలు ఉండటంతో గదిని సీజ్ చేశారు. లిటిల్ బడ్డీ స్కూల్కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వెంటనే మూసి వేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి వాణిజ్యపరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్మ్, స్కూల్ బ్యాగ్స్ ఏ వస్తువులు అమ్మినా పాఠశాల పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పారు. ఫీజులు ఎక్కువ వసూలు చేయరాదని, విద్యాహక్కు చట్టం ప్రకారం గతేడాది వసూలు చేసిన విధంగానే.. ఇప్పుడు తీసుకోవాలని సూచించారు. రాతపూర్వకంగా.. గతేడాది కంటే ఇప్పుడు ఎవరైనా అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే.. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అండర్ టేకింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలని, బడిలో ఎలాంటి పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు విక్రయించమని రాతపూర్వకంగా రెండు రోజుల్లో మండల విద్యావనరుల కేంద్రంలో ఇవ్వాలని హెచ్చరించారు. ఇప్పటికే రెండు పాఠశాలల్లో దుస్తులు, పాఠ్యపుస్తకాలు విక్రయించినట్లు తెలిసిందని, వాటిని సీజ్ చేశామని, త్వరలో మళ్లీ సోదాలు చేస్తామని చెప్పారు. -
స్కూల్ బ్యాగ్స్, బుక్స్ ను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
Fact Check: ‘కానుక’పైనా కక్ష సాధింపే.. ‘ఈనాడు’ విషప్రచారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండి అబద్ధం చెప్పినా ఈనాడు రామోజీకి అమృత వాక్యంలా వినబడుతుంది. ప్రజలను మోసం చేసినా సరే అదే సరైనది అవుతుంది.. బాబు తప్ప మరే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా అది నేరంగానే కనిపిస్తుంది.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జగనన్న విద్యా కానుక పేరుతో మూడేళ్లుగా నాణ్యమైన స్కూలు బ్యాగు లు, పుస్తకాలు, బూట్లు, యూనిఫారం వంటి వస్తువులను అందిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా ‘ఈనాడు’కు మాత్రం కడుపుమంటగా ఉంటోంది. అందుకే 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే విద్యా కానుకపై శనివారం విషం కక్కింది. వాస్తవాలను వక్రీకరించి ‘పిల్లలు తగ్గినా.. కానుక ఖర్చు పెరిగింది’ అంటూ అడ్డగోలుగా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. అదేంటంటే.. ♦ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో మరింత నాణ్యత ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గత మూడేళ్లలో జగనన్న విద్యాకానుకలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. అయితే, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణలో కాకుండా, అన్ని దశల్లోనూ.. అంటే ముడి సరుకు నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్కు చేరే వరకు అన్ని దశల్లోను పర్యవేక్షణ అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ విద్యా కానుకలోని వస్తువులను మూడు దశల్లో (ముడిసరుకు నుంచి స్టాక్ పాయింట్ వరకు) నాణ్యత పరీక్షలు చేసి మన్నికైన వస్తువులకు మాత్రమే అనుమతినిస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం డబ్బు వృథా చేసినట్లు కాదు. ♦ సరఫరా చేసిన బ్యాగుల్లో 6 లక్షల బ్యాగులు చినిగిపోతే ప్రభుత్వం తిరిగి మంచి స్టాకును తెప్పించింది. అదనంగా వచ్చిన ఈ బ్యాగులకు ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదు. ♦ గత ఏడాదికి ఈ ఏడాదికి మార్కెట్ రేటు 6.85 శాతం పెరిగింది. కొలతల్లో మార్పులు, గ్లాసీ ఫినిషింగ్, సాధారణ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని వస్తువు ధర నిర్ణయం జరుగుతుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ఇన్సెట్ పేపర్ ధర టన్నుకు రూ.91,492.24, కవర్ పేపరు ధర టన్ను రూ.99,866.40 ఉండేది. 2023–24 విద్యా సంవత్సరానికి పేపరు సేకరణ కోసం టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ ‘తమిళనాడు న్యూస్ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ (టీఎన్పీఎల్) సంస్థ సరఫరాకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఇన్సెట్ పేపర్ ధర టన్ను రూ.1,15,500, కవర్ పేపర్ ధర టన్ను రూ.1,21,000గా టెండర్ వేసింది. ఈ ధర గతేడాది ధరతో పోలిస్తే.. పేపర్ ధర టన్నుకు రూ.24,007 (26.23 శాతం), కవర్ పేపర్ ధర రూ.21,134 (21.16 శాతం) పెరిగింది. ఈ ధరను ప్రభుత్వం అంగీకరించి 15,711 మెట్రిక్ టన్నుల ఇన్సెట్ పేపర్, 1,400 మెట్రిక్ టన్నుల కవర్ పేపర్ను పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, పిక్టోరియల్ డిక్షనరీల ముద్రణకు కొనుగోలు చేసింది. పేపర్ ధర పెరగడంతో పుస్తకాల ధర కూడా స్వల్పంగా పెరిగింది. ♦ ఇక ఈ ఏడాది విద్యార్థులకిచ్చే యూనిఫారం మూడు జతల్లో క్లాత్ పరిమాణం 23 శాతం పెంచడంతో పాటు, ప్లెయిన్ యూనిఫారం నుంచి చెక్ యూనిఫాంకు డిజైన్ మారింది. బ్యాగుల పరిమాణం, నాణ్యత భారీగా పెంచారు. ♦43 లక్షల యూనిట్లకు టెండర్ పిలిచినప్పటికీ బడులు తెరిచే నాటికి వాస్తవ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే వస్తువులను కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటారు. దానికి తగ్గట్లుగానే చెల్లింపులు ఉంటాయి. జాతీయ స్థాయిలోను అన్ని వస్తువుల ధరలు 26.23 శాతం పెరిగాయి. ఏటా ధరల పెరుగుదల సహజ ఆర్థిక పరిణామమైనప్పటికీ దీన్ని ‘ఈనాడు’ వక్రీకరించడం దురదృష్టకరం. -
పిల్లలు... పరిమళించాలి
పిల్లలు ఎలా ఉండాలి? వికసించే పువ్వుల్లా ఉండాలి. సంతోషానికి చిరునామాలా ఉండాలి. ఆందోళన అంటే ఏమిటో తెలియకుండా పెరగాలి. స్కూల్ బ్యాగ్లో భవిష్యత్తును నింపుకెళ్లిన పిల్లలు... అదే స్కూల్ బ్యాగ్లో భయాన్ని పోగుచేసుకుని వస్తే... తల్లిదండ్రులు అప్పుడేం చేయాలి? పిల్లలను దగ్గరకు తీసుకోవాలి... చేతల్లో ధైర్యాన్నివ్వాలి. ఆనందాల రెక్కలను విరిచేసే దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలి. పువ్వుల్లా పరిమళించడానికి కావల్సినంత భరోసా కల్పించాలి. స్కూల్లో అందరు పిల్లలూ ఒకేలా చేరుతారు. స్నేహానికి చిరునామాల్లా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంటే, మరికొందరు మాత్రం వెనుకపడుతుంటారు. స్వతహాగా ఉండే ఐక్యూ లెవెల్స్ పరిమితులకు లోబడి చదువులో వెనుకబడడం కాదిది. ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా నిరుత్సాహంగా మారి అన్నింటిలోనూ వెనుకబడుతుంటారు. ఆ వెనుకబాటు వెనుక వాళ్లను వెనుకపడేటట్లు చేసిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారో, ఎందుకు తమను తాము ఒంటరిని చేసుకున్నారో బయటకు తెలియదు. ఆ పిల్లల ప్రవర్తనలో అనారోగ్యకరమైన మార్పు మొదలవుతుంది. అది క్రమంగా మొండితనానికి, ధిక్కారతకు దారి తీస్తుంటుంది. స్కూల్ డైరీలో ‘డిస్ ఒబీడియెంట్, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అనే పదాలతో పేరెంట్స్కి పిలుపు వస్తుంది. ఆ పరిస్థితి పేరెంట్స్కి ఊహించని శరాఘాతం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో, కొంత అపరాధ భావానికి లోనయ్యి, ఓవర్గా రియాక్ట్ అవుతూ పిల్లలను దోషులుగా నిలబెడుతుంటారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సరిదిద్దకపోతే పిల్లలు దిక్కారతను అలాగే కొనసాగిస్తారు. ఈ సిచ్యుయేషన్ని సున్నితంగా డీల్ చేయడానికి కొన్ని సూచనలు చేశారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. పిల్లలు అద్దం వంటి వాళ్లు ‘‘పిల్లల్లో చురుకుదనం తగ్గడం, ఎప్పుడూ డల్గా ఉండడం, నిద్రలో ఉలిక్కి పడడం వంటివి కనిపిస్తుంటాయి. పిల్లల మనసులో చెలరేగిన అనేక ఆందోళనలు, భయాలు, అవమానం, అపరాధ భావం వంటి అనేక సమస్యలను వ్యక్తం చేసే లక్షణాలివి. ఈ లక్షణాలను గమనించిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దగ్గర కూర్చుని పిల్లలను మాటల్లో పెట్టాలి. నేరుగా ‘ఎందుకిలా ఉన్నావని’ అడిగే సమాధానం రాదు. స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి కదిపితే వాళ్లే ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెడతారు. ఆ చెప్పిన కబుర్లలోనే కారణాలు ఉంటాయి. స్కూల్లో తోటి విద్యార్థులు బాడీ షేమింగ్, బుల్లీయింగ్, ఫిజికల్– ఎమోషనల్ అబ్యూజ్ చేస్తున్నట్లు, భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు అనిపిస్తే ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పిల్లలను ఒకటికి రెండుసార్లు గద్దించి అడగడం ఏ మాత్రం సరికాదు. పిల్లలు మరింతగా బిగుసుకుపోతారు, కాబట్టి వాళ్ల క్లాస్ టీచర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ మన పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్న పిల్లలను దోషులుగా, నేరస్థులుగా చూడవద్దు. వాళ్లూ పసిపిల్లలేనని మర్చిపోవద్దు. అయితే వాళ్లు ఆరోగ్యకరంగా పెరగడం లేదని అర్థం. ఎందుకంటే... పిల్లలు తాము దేనిని తీసుకుంటారో దానినే డెలివర్ చేస్తారు. అమ్మానాన్నలు మరెవరినో ఉద్దేశించి ‘వాళ్ల ఎత్తుపళ్ల గురించో, నడక తీరు మీదనో, దేహం లావు– సన్నం, పొడవు, పొట్టి వంటి విషయాల్లో కామెంట్స్ చేసి నవ్వుతూ ఉంటే’ పిల్లలకు అదే అలవాటవుతుంది. పిల్లలు వాళ్లు చూసిన దాన్ని స్కూల్లో తోటి పిల్లల మీద ప్రదర్శిస్తారు. నిజానికి ఎదుటి వాళ్లను అనుకరిస్తూ గేలి చేయడం, లోపాలను ఎత్తి చూపుతూ ఎగతాళి చేయడం అనేది అభద్రతలో ఉంటూ, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు చేసే పని. ఆ పని ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. బాల్యంలో ఇలాంటి బీజాలు పడితే ఇక అలాంటి వాళ్లు జీవితాంతం ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాలను బహిర్గతం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి రిలేషన్షిప్కీ విఘాతం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే సరిదిద్దాలి. బొమ్మల్లో వ్యక్తమవుతుంది పిల్లలు మూడీగా ఉంటున్నట్లు గమనిస్తే వాళ్లను డ్రాయింగ్, క్లేతో బొమ్మలు చేయడంలో ఎంగేజ్ చేయాలి. ఇది మంచి స్ట్రెస్ బస్టర్ మాత్రమే కాదు, చక్కటి పరిష్కారమార్గం కూడా. బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం ఒత్తిడికి అవుట్లెట్లా పని చేస్తుంది. మాటల్లో చెప్పలేని విషయాలు బొమ్మల్లో వ్యక్తమవుతాయి. ఆ బొమ్మల్లోని పాత్రలు... పిల్లల్లో దాగి ఉన్న కోపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భయాన్ని, బాధించే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంటాయి. పిల్లల మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. పిల్లల మనసు చదవడానికి ఆ బొమ్మలు ఉపయోగపడతాయి. బాధించే పిల్లలు, బాధితులయ్యే పిల్లలను అధ్యయనం చేయడానికి కూడా ఇదే సరైన మార్గం. బిహేవియరల్ ప్రాబ్లెమ్స్తో మా దగ్గరకు తీసుకువచ్చిన పిల్లలకు మేమిచ్చే మొదటి టాస్క్ కూడా అదే. తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే... పిల్లలు డల్గా ఉంటే ఉపేక్షించవద్దు, అలాగే మీ పిల్లల మీద టీచర్ నుంచి కంప్లయింట్ వస్తే ఆవేశపడవద్దు. టీచర్ ఒక సూచన చేశారంటే ఆ సూచన వెనుక బలమైన కారణం ఉండి తీరుతుందని గ్రహించాలి. టీచర్లు కూడా పిల్లల కాండక్ట్ మీద డిజ్ ఒబీడియెన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని రాసే ముందు వాళ్ల పేరెంట్స్కు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేది పేరెంట్స్– టీచర్స్ మధ్య సమన్వయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది’’ అని వివరించారు డాక్టర్ సుదర్శిని. పిల్లల మనసు సున్నితం. పువ్వులాంటి పిల్లలు పువ్వుల్లానే పెరగాలి. వారి భవిష్యత్తు సుమపరిమళాలతో వికసించాలి. బాధించే పిల్లల మీదా శ్రద్ధ పెట్టాలి! పిల్లల్లో స్వతహాగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం ఉంటుంది. అలాంటిది టీచర్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కొందరికి తెలియచేసి, వాళ్లకు కోపం ఉన్న పిల్లలకు సమాచారం చేరనివ్వరు, ఆ టాస్క్లో ఫెయిల్ అవ్వాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తారు. ఇది ఏ రకంగానూ పిల్లలను వెనకేసుకు రాదగిన విషయం కాదని పేరెంట్స్ గ్రహించాలి. బాధితులవుతున్న పిల్లల పేరెంట్స్ అయితే విషయం తెలియగానే స్పందించి తమ బిడ్డను కాపాడుకుంటారు. కానీ బాధించే పిల్లల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆ పిల్లలకు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. – డాక్టర్ సుదర్శిని రెడ్డి సబ్బెళ్ల, క్లినికల్ సైకాలజిస్ట్, జీజీహెచ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి -
మీ పిల్లలు బడికి వెళ్తున్నారా.. పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి!
కొన్నిసార్లు మనుషులు చేసే తప్పిదాలు.. తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. క్షణికావేశం, క్షణకాల నిర్లక్ష్యం కారణంగా ఎదుటివారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన జెఫ్ఫర్సన్ పబ్లిక్ స్కూల్ బస్సు నుండి ఓ చిన్నారి(6) కిందకు దిగుతోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్.. డోర్ ఓపెన్ చేసింది. కాగా, చిన్నారి పూర్తిగా స్టెప్స్ దిగకముందే.. డోర్ క్లోజ్ కావడంతో ఆమె బ్యాగ్.. డోర్ మధ్యలో చిక్కుకుపోతుంది. దీంతో, బాలిక.. కిందకు దిగకుండా అలాగే నిల్చుడిపోతుంది. అది గమనించని డ్రైవర్.. బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోతుంటాడు. HOLY SHIT. The little girl is miraculously fine, the bus driver has been fired. pic.twitter.com/uuijsrNn2U — Dean Blundell🇨🇦 (@ItsDeanBlundell) September 23, 2022 దీంతో, చిన్నారి బస్సు డోర్కు వేలాడుతూనే వస్తుంది. ఇలా దాదాపు 1000 అడుగుల దూరం వచ్చాక.. బస్సులో ఉన్న వారు చిన్నారిని చూసి కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేస్తుంది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడుతుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. ఇక, ఈ ఘటన అనంతరం డ్రైవర్ను విధుల నుంచి తొలిగిస్తారు. అలాగే, పాఠశాల యాజమాన్యం చిన్నారి పేరెంట్స్కు దాదాపు 5 మిలియన్ల డాలర్లను నష్టపరిహారంగా ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదం 2015లో జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
ఈ బరువును ఏం చేద్దాం?
స్కూల్లో టీచర్గానీ హెడ్మాస్టర్ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్బ్యాగ్ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం? నైట్ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్ బస్ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్ బ్యాగులను స్కూటర్ మీద పెట్టుకుని బస్ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్ ఆగిన చోటు నుంచి క్లాస్ రూమ్ వరకూ వారు ఆ బ్యాగ్ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం! వెన్ను వంచే బరువు స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్ బ్యాగ్ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి. ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. తాజా స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు స్కూల్ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా. ఇంత బరువు ఎందుకు? ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్కు టెక్స్›్టబుక్, నోట్ బుక్, వర్క్బుక్... ఇవిగాక స్పెషల్ నోట్బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్ బాటిల్ ఒక బరువు. లంచ్ లేని చోట లంచ్ బ్యాగ్. ఒక్కోసారి స్పోర్ట్స్ అని బ్యాట్లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. ఏం చేయాలి? స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్›్టబుక్ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి. అలాగే ప్రతి క్లాస్లో తాళాలు ఉన్న బుక్షెల్ఫ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్ వేయాలి. టైంటేబుల్లో లేని సబ్జెక్ట్ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి. ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్టేబుల్ చెక్ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్లు కొనివ్వాలి. -
జగనన్న విద్యాకానుక : బ్యాగ్లు, బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం జగన్ ఫోటోలు
-
బడిసంచి ఇక తేలిక
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులపై పెనుభారంగా మారిన స్కూలు బ్యాగు బరువు ఇక తగ్గనుంది. వారికి శారీరక సమస్యలతో పాటు ఒత్తిడికి, అలసటకు కారణమవుతున్న స్కూలు బ్యాగ్కు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుమేరకు కేంద్ర విద్యాశాఖ.. ఎన్సీఈఆర్టీ, కేవీఎస్, ఎన్వీఎస్, సీబీఎస్ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు ‘స్కూలు బ్యాగ్ పాలసీ–2020’ని వెలువరించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగే పద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్కూలు బ్యాగ్ బరువు తగ్గుతాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనం కన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్ బరువు పెరగటానికి కారణంగా తేలింది. బ్యాగ్ల బరువును తగ్గించడానికి పలు రాష్ట్రాలు సెమిస్టర్ పద్ధతి, పుస్తకాలను స్కూళ్లలోనే ఉంచేలా చేయడం వంటి విధానాలు అవలంభిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. విద్యార్థుల స్కూలు బ్యాగ్కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. స్కూలు బ్యాగ్ బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్రం స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రకటించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది. అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. పిల్లల శరీర బరువును అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 2009లో అమెరికన్ ఆక్యుపేషనల్ థెరపీ అసోసియేషన్ (ఏవోటీఏ), అమెరికన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ (ఏపీటీఏ)లు విద్యార్థుల శరీర బరువులో 15 శాతం మేర మాత్రమే స్కూలు బ్యాగ్ ఉండాలని సూచించాయి. ద అమెరికన్ చిరోప్రాక్టీస్ అసోసియేషన్ (ఏసీఏ) పిల్లల శరీర బరువులో 5 నుంచి 10 శాతానికి మించి ఉండరాదని పేర్కొంది. మన దేశంలో పరిస్థితి ఇలా.. స్కూల్ బ్యాగ్ బరువుకు సంబంధించి దేశంలోని పరిస్థితిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి పలు సమస్యలను గుర్తించాయి. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్లు 5 కిలోలకు మించిన బరువుతో ఉంటున్నాయి. 6వ తరగతి విద్యార్థులకు 6 కిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్లలోని వస్తువుల బరువు ఇలా ఉంటోంది. పాఠ్యపుస్తకాలు – 1 నుంచి 3.5 కిలోలు నోట్సులు – 1 నుంచి 2.5 కిలోలు లంచ్బాక్స్ – 250 గ్రా. నుంచి 1 కిలో వాటర్ బాటిల్ – 200 గ్రా. నుంచి 1 కిలో బ్యాగు బరువు – 150 గ్రా. నుంచి 1 కిలో ఇక పైతరగతులకు వెళ్లేకొద్దీ ఈ బ్యాగ్ బరువు ఇంకా పెరుగుతోంది. దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యే స్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఆ సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని స్కూళ్లు పిల్లలతో బడిలోనే హోంవర్కు చేయిస్తూ నోట్సులు, వర్కు పుస్తకాలను స్కూల్లోనే ఉంచుతున్నాయి. ఇంటి దగ్గర హోంవర్కు చేయాల్సి వస్తే ఒకే పుస్తకంలో అన్ని సబ్జెక్టులవి చేయిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు రోజు విడిచి రోజు స్కూలు బ్యాగ్ తెచ్చేలా ఏర్పాట్లు చేశాయి. సెకండరీ, హయ్యర్ సెకండరీ తరగతులకు వచ్చేసరికి వివిధ సబ్జెక్టులతో పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కు పుస్తకాలు పెరిగిపోతున్నాయి. కొత్త విధానంలో పలుసూచనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్కూలు బ్యాగ్ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది. – బ్యాగ్ను రెండు వైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి. – స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్బ్యాంక్ ఏర్పాటు చేయాలి. – నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ సూచనల ప్రకారం లైఫ్స్కిల్స్, కంప్యూటర్, మోరల్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలి. – స్కూలు బ్యాగ్ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్టేబుల్ను మార్చుకోవాలి. – ఒకే సబ్జెక్టు వరుసగా రెండు పీరియడ్లు ఉండేలా చూడడం వంటి విధానలు పాటించాలి. – పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుపుస్తకాల బరువును అనుసరించి నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే బ్యాగ్ బరువు ఉండేలా టైమ్టేబుల్ రూపొందించాలి. – 1, 2 తరగతులకు ఒకే నోట్ పుస్తకం అమలుచేయాలి. – 3, 4, 5 తరగతులకు రెండు నోట్ పుస్తకాలు పెట్టాలి. ఒకదాన్ని బ్యాగ్లో ఉంచి, రెండోది స్కూల్లోనే ఉండేలా చూడాలి. – 6, 7, 8 తరగతుల వారికి లూజ్ పేపర్లలో క్లాస్వర్క్ చేసేలా ఫైల్ను ఏర్పాటుచేయాలి. 6వ తరగతి నుంచే ఈ వర్కు పేపర్లను ఒక పద్ధతిలో రాసేలా చేయాలి. – పాఠ్యపుస్తకాలకు మించి ఇతర పుస్తకాలను స్కూలులో అనుమతించరాదు. – స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు ద్వారా విద్యార్థులు వాటిని ఇళ్లనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ బరువు తగ్గుతుంది. ఈ సూచనలు అమలైతే విద్యార్థులకు మేలు స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగ్ వారు మోసే శక్తికి మించి ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు విపరీతమైన శారీరక శ్రమ, అలసటకు గురవుతున్నారు. ఇది వారి చదువుపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు ఇవ్వడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. కేంద్రం ప్రకటించిన స్కూల్ బ్యాగ్ పాలసీ సమగ్రంగా అమలవ్వాలి. విద్యార్థి శక్తిని అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలి. వారి శరీర బరువును అనుసరించి ఈ బ్యాగ్ బరువు నిర్ణయించడం మంచి పద్ధతి. ఈ పాలసీలోని ఇతర సూచనలను కూడా అన్ని విద్యా సంస్థలు పాటించాలి. – ప్రొఫెసర్ జీ జానకిరామయ్య, ఎడ్యుకేషన్ విభాగాధిపతి, ఎస్వీ యూనివర్సిటీ ఈ పాలసీ మేరకు ముందుకెళ్లాం విద్యార్థులపై బ్యాగుల బరువు లేకుండా చేయాలన్న చర్చ చాలాకాలంగా ఉంది. పలు సంస్థలు, కమిటీలు అధ్యయనాలు జరిగి అనేక సిఫార్సులు ఇచ్చాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. నో బ్యాగ్డేను అమలు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాల బరువు తగ్గేందుకు సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తున్నాం. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లి తక్కిన వాటిని స్కూళ్లలోనే ఉంచుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం హోమ్ వర్కుతో పాటు ముఖ్యమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్రం ఇచ్చిన విధానపత్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తాం. – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి -
‘చిన్నారుల వీపులు బద్దలవుతున్నాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే బోర్డు ప్రతిపాదనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. చిన్నారులపై పుస్తకాల భారం మరింతగా మోపేందుకు సిద్దంగా లేమంటూ ఒక దేశం-ఒక బోర్డుపై దాఖలైన పిటిషన్ను ప్రోత్సహించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ‘మన చిన్నారులు ఇప్పటికే భారీ బ్యాగులు మోస్తున్నారు..ఈ బరువుతో వారి వీపులు బద్దలవుతున్నాయి..వారిపై మీరు మరింత భారం మోపాలని ఎందుకు అనుకుంటున్నార’ని న్యాయవాది, పిటిషనర్ అశ్వని ఉపాధ్యాయ్ను జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. చిన్నారులపై సానుభూతితో వ్యవహరించాలని వారి స్కూల్ బ్యాగ్ బరువును పెంచడం తగదని కోర్టు పిటిషనర్కు సూచించింది. దేశమంతటికీ ఒకటే విద్యా బోర్డు, ఉమ్మడి సిలబస్ ఉండాలని పిటిషన్లో పేర్కొన్న డిమాండ్లు విధాన నిర్ణయాలకు సంబంధించినవని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన సంబంధ అంశాలను మీరు ప్రస్తావిస్తున్నారని, అన్ని బోర్డులను కలపాలని తాము ఎలా చెప్పగలమని కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. వివిధ రాష్ట్రాల బోర్డులు భిన్న సిలబస్లను అనుసరిస్తన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాను లేవనెత్తిన అంశాలు కీలకమైనవని పిటిషనర్ పేర్కొనగా, అవి ముఖ్యమైనవే అయినా న్యాయార్హమైనవి కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. పిటిషనర్ తను ముందుకు తెచ్చిన అంశాలపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. చదవండి: దూబే ఎన్కౌంటర్పై విచారణ కమిటీ -
‘నో స్కూల్ బ్యాగ్ డే’ అందరూ పాటించాల్సిందే
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో చిన్నారులు ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకోవడానికి, ఒకటి, రెండు రోజులైనా వారిపై పుస్తకాల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక విద్యా శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలోనే ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల ఒకటి, మూడో శనివారాల్లో పిల్లలు స్కూళ్లకు పుస్తకాల బ్యాగ్లు లేకుండా వస్తారు. కేవలం ఆటపాటలతో కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకొనేందుకు ‘సృజన–శనివారం సందడి’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. అన్ని స్కూళ్లూ దీన్ని పూర్తి స్థాయిలో పాటించాల్సి ఉంది. కానీ కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదని విద్యా శాఖ దృష్టికి వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా దీన్ని తూతూ మంత్రంగా చేపడుతున్నట్లు గమనించింది. ఈ నేపథ్యంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లోనూ నిర్ణీత పద్ధతిలో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు. డిప్యూటీ డీఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ బాధ్యులైన హెచ్ఎంలు ప్రతి నెల ఒకటి, మూడో శనివారాల్లో తప్పనిసరిగా ఆయా పాఠశాలలను సందర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2 ప్రయివేటు, 1 ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, తమ విజిటింగ్ రిపోర్టును సంబంధిత వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమంపై తీసిన వీడియోకు జాతీయ స్థాయిలో ఇటీవల అవార్డు లభించింది. కార్యక్రమం ఇలా చేయాలి.. 1, 2 తరగతులు.. పాడుకుందాం: పిల్లలతో అభినయ గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు పాడించాలి. పద్యాలు, శ్లోకాలు చెప్పించాలి. మాట్లాడుకుందాం : కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదా ఆటలు ఆడటం (అన్నీ పిల్లలతోనే చేయించాలి). నటిద్దాం : నాటికలు, స్క్రిప్టులు, మైములు, ఏకపాత్రాభినయం, నృత్యం, అభినయం. సృజన : బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టితో బొమ్మలు, నమూనాలు, మాస్కులు చేయడం, అలంకార వస్తువుల తయారీ. 3, 4, 5 తరగతులు.. సృజన : బొమ్మలుగీయడం, రంగులు వేయడం, బంకమట్టి వినియోగించి నమూనాలు రూపొందించడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, నాటికలు, స్క్రిప్టులు, మైములు, ఏకపాత్రాభినయం, నృత్యం, అభినయం వంటివి చేయించాలి. తోటకు పోదాం, పరిశుభ్రం చేద్దాం : బడితోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం, పరిసరాల పరిశుభ్రతను నేర్పడం. చదువుకుందాం : పాఠశాల గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవడం, చర్చించడం, కథలు చదవడం, రాయడం. విందాం.. విందాం.. : ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ అధికారి, కుంటుంబ సంక్షేమ అధికారి, పోస్టాఫీసు సిబ్బంది, వ్యవసాయదారుడు, వ్యాపారి, స్థానిక ప్రజా ప్రతినిధి, తదితరులను బడికి ఆహ్వానించి వారితో మాట్లాడించడం. -
బాబు యూకేజీ.. బ్యాగు ఫైవ్ కేజీ
బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి మాధ్య రెండో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్ బ్యాగు బరువు ఎంతో తెలుసా? 10 కిలోలు. దీంతో ఆమె మేనత్త రోజూ ఆ స్కూల్ బ్యాగును మోసుకొస్తోంది. అలాగే 6వ తరగతి చదువుతున్న పూజ స్కూల్ బ్యాగు బరువు 8.8 కిలోలు. ఇంత బరువు మోయలేక ఆ బాలిక వెన్నుభాగంలో నొప్పి పుడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి చదువుతున్న నాని స్కూల్ బ్యాగు బరువు 8 కిలోలు ఉంది. ప్రతిరోజూ అతడి తల్లి రేఖ కొడుకును వెంటబెట్టుకొని స్కూల్ బ్యాగు మోసుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. వీరే కాకుండా ఎల్కేజీ చదివే చిన్నారుల బ్యాగులు సైతం 4 నుంచి 5 కేజీల బరువు ఉంటున్నాయి. ఇలా వయసుకు మించిన పుస్తకాల బరువుతో బాల్యం కుంగిపోతోంది. నిండా పదేళ్లు లేని పిల్లలు 10 కిలోలకుపైగా బరువు ఉన్న పుస్తకాల బ్యాగును మోయాల్సి వస్తోంది. ఖాళీ స్కూల్ బ్యాగు బరువే కిలో వరకు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పిల్లలపై పుస్తకాల భారం తగ్గించేందుకు స్కూళ్లలో, తరగతి గదుల్లోనే లాకర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన పుస్తకాలు, నోట్ బుక్స్ మాత్రమే పిల్లలు తమ వెంట తీసుకెళ్లేలా శ్రద్ధ తీసుకోవాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. బరువైన బ్యాగులకు బదులు స్కూల్ పిల్లల కోసం తేలికైనవి అందజేసేందుకు అవకాశం ఉన్నా చాలా పాఠశాలల్లో ఏ ఒక్క నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. శనివారం నగరంలో వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లను ‘సాక్షి’ విజిట్ చేసిన సందర్భంగా విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగు చూశాయి. – సాక్షి, సిటీబ్యూరో/ నెట్వర్క్ సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి మాధ్య రెండో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్ బ్యాగు బరువు ఎంతో తెలుసా? 10 కిలోలు. దీంతో ఆమె మేనత్త రోజూ ఆ స్కూల్ బ్యాగును మోసుకొస్తోంది. అలాగే 6వ తరగతి చదువుతున్న పూజ స్కూల్ బ్యాగు బరువు 8.8 కిలోలు. ఇంత బరువు మోయలేక ఆ బాలిక వెన్నుభాగంలో నొప్పి పుడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి చదువుతున్న నాని స్కూల్ బ్యాగు బరువు 8 కిలోలు ఉంది. ప్రతిరోజూ అతడి తల్లి రేఖ కొడుకును వెంటబెట్టుకొని స్కూల్ బ్యాగు మోసుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. వీరే కాకుండా ఎల్కేజీ చదివే చిన్నారుల బ్యాగులు సైతం 4 నుంచి 5 కేజీల బరువు ఉంటున్నాయి. ఇలా వయసుకు మించిన పుస్తకాల బరువుతో బాల్యం కుంగిపోతోంది. నిండా పదేళ్లు లేని పిల్లలు 10 కిలోలకుపైగా బరువు ఉన్న పుస్తకాల బ్యాగును మోయాల్సి వస్తోంది. బరువుల బాధలివిగో ⇒ బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 12లోని మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న నాని స్కూల్ బ్యాగు బరువు 8 కిలోలు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తల్లి రేఖ ఆ బ్యాగును మోసుకెళ్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని స్కూళ్లలోనూ పుస్తకాల బరువు భారీగానే ఉంది. ⇒ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 9వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 9.5 కిలోలు ఉంది. 10వ తరగతి పిల్లల బ్యాగులు 10 కిలోల నుంచి 12 కిలోల వరకు ఉన్నాయి. ఎక్కువ పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్బుక్లు ఉంటేనే పిల్లలు బాగా చదువుతున్నట్లు భావించే తల్లిదండ్రుల ధోరణితోనూ స్కూల్ యాజమాన్యాలు బ్యాగుల బరువు పెంచేస్తున్నాయి. ⇒ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న లిఖిత్ సాయి, 5వ తరగతి చదువుతున్న దినేశ్ల బ్యాగుల బరువు 6 కిలోలపైనే. లిఖిత్సాయి 6.8 కిలోల బరువు మోస్తుండగా, దినేశ్ బ్యాగ్ బరువు 7.5 కిలోలు ఉంది. ఈ చిన్నారులు వయసుకు మించిన భారాన్ని మోయకతప్పడంలేదు. ⇒ లాలాపేట ఇందిరానగర్కు చెందిన శివకుమార్ నాలుగో తరగతి. పుస్తకాల బ్యాగు బరువు సుమారు 8 కిలోలు. చిలకలగూడకు చెందిన హసినీ 6వ తరగతి. ఆమె బ్యాగు బరువు 12 కిలోలు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ఆరు టెస్ట్బుక్కులు, ఆరు క్లాస్ బుక్కులు, ఆరు వర్క్ బుక్కులు, డైరీ, రఫ్ నోట్బుక్, హోంవర్క్ బుక్కులతో కలిపి సుమారు 20 నుంచి 25 పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్తున్నారు. వీటితోపాటు టిఫిన్ బాక్స్, వాటర్బ్యాటిల్ బరువుతో కలిపి సుమారు 10 నుంచి 12 కిలోలపైనే ఉంటుంది. వెల్లడైన వాస్తవాలు.. ఎల్కేజీ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లల పుస్తకాల బ్యాగులను పరిశీలించగా.. సగటున 4 నుంచి 10 కిలోల వరకు ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో 10వ తరగతి పిల్లల బ్యాగులు 10కిలోలపైనే ఉన్నాయి. ‘ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ఉంటుందో తెలియదు. తరచూ టైం టేబుల్ మారుతూ ఉంటుంది. అందుకోసం అన్ని పుస్తకాలు తెచ్చుకోవలసి వస్తుంద’ని పలువురు విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘స్కూల్ మేనేజ్మెంట్లు సూచించిన ప్రకారంగానే పిల్లల బ్యాగుల్లో పుస్తకాలను, నోట్బుక్స్ను పెడుతున్నా’మని తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో చాలామంది పిల్లలు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కార మార్గాలివీ.. స్కూల్ పిల్లలు మోస్తున్న పుస్తకాల బ్యాగుల బరువును తగ్గించాలనే ప్రధానమైన లక్ష్యంతో పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్న నాగ్పూర్నకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రాజేంద్ర ఇటీవల హైదరాబాద్లోనూ పర్యటించారు. ‘నగరంలోని చాలా స్కూళ్లలో పరిశీలించాను. ప్రతి బ్యాగు 7 కిలోలపైనే ఉంది. ఖాళీ బ్యాగే కిలో వరకు ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీన్ని మార్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. స్కూళ్ల యాజమాన్యాలలోనూ మార్పు అవసరం’ అన్నారు ప్రొఫెసర్ రాజేంద్ర. స్కూల్ బ్యాగు బరువును తగ్గించే పరిష్కార మార్గాలను సైతం ఆయన సూచించారు. అవి ఇలా ఉన్నాయి.. ⇒ పాఠ్య పుస్తకాలను చిన్న చిన్న బుక్లెట్లుగా ముద్రించాలి. 16 పాఠాలు ఉన్న పుస్తకాన్ని 4 పాఠాలకు ఒక బుక్లెట్ చొప్పున ముద్రించవచ్చు. దీంతో అవసరమైన బుక్లెట్ మాత్రమే తీసుకెళ్లవచ్చు. ⇒ 200 పేజీల నోట్ పుస్తకాలకు బదులు 100 పేజీల నోట్ పుస్తకాలను ముద్రించాలి. ⇒ పాఠ్యాంశాల బోధనలో ఉపాధ్యాయులు సరైన అవగాహనతో ఉంటే ఎక్కువ పుస్తకాలు తెచ్చుకోవలసిన అవసరం పిల్లలకు ఉండదు. ⇒ కచ్చితమైన టైమ్టేబుల్ను పాటించాలి. ⇒ ప్రతి పాఠ్య పుస్తంపై దాని బరువును సైతం విధిగా ముద్రించాలి. ⇒ పాఠ్య పుస్తకాలకు, మ్యాప్లకు మధ్య సమతుల్యం లేకపోవడంతోనూ పేజీల సంఖ్య పెరిగిపోతోంది. దీనిని నివారించాలి. ⇒ లాకర్లు ఏ మేరకు ప్రత్యామ్నాయం కాగలవనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ⇒ ఈ– లెర్నింగ్ సదుపాయాలను పెంచాలి. చర్యలు తీసుకోవాలి.. పుస్తకాల బ్యాగు బరువును తగ్గించాలి. ఏ రోజు ఏ సబ్జెక్ట్ బోధిస్తారో దానికి సంబంధించిన పుస్తకాలను మాత్రమే విద్యార్థులు పాఠశాలకు తీసుకువచ్చేలా ఉపాధ్యాయులు సూచించాలి. దీంతో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గుతుంది. – విద్యారాణి, జిల్లెలగూడ వెన్నుపూస నొప్పి పుస్తకాల బరువుతో విద్యార్థులు వెన్నుపూస నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకిచ్చే హోంట్యూషన్ పాఠశాలల్లోనే చేయిస్తే పుస్తకాల భారం తగ్గుతుంది. విద్యాశాఖ అధికారులు స్పందించాల్సిన అవసరముంది. – లక్ష్మణ్, పేరెంట్, జిల్లెలగూడ మోత తప్పడం లేదు.. రోజూ పుస్తకాలు, నోటు పుస్తకాల బరువు మోయాల్సిందే. ఇంకా కొన్నింటిని స్కూల్లోనే పెట్టివస్తాం. ఇంటి నుంచి బడి వరకు అక్కడి నుంచి ఇంటి వరకు మోయాల్సి వస్తోంది. ఇంటికెళ్లి హోంవర్క్ కూడా చేయాలనిపించడం లేదు. కానీ తప్పదు. – నీరజ్, 9వ తరగతి, మదీనాగూడ పిల్లలు అలసిపోతున్నారు.. తరగతి పెరుగుతున్న కొద్దీ పుస్తకాల బరువు రెండింతలు పెరుగుతోంది. పుస్తకాల బ్యాగును మోయడంతో విద్యార్థులు శారీరకంగా అలసిపోతున్నారు. వెన్నుపూస వంగిపోతోంది. పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థుల పుస్తకాల బ్యాగుల భారం తగ్గించాల్సిన అవసరం ఉంది. – మల్లికార్జున్, పేరెంట్, చిలకలగూడ బ్యాగుల బరువు తగ్గించాలి. స్కూల్ బ్యాగుల బరువు తగ్గించాలి. ఇంటి నుంచి నిత్యం కిలోలకొద్ది బ్యాగ్ మోసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోంది. మొదటి తరగతి నుంచి ఇదే విధంగా బరువైన బ్యాగ్లను మోయించారు. అన్ని రకాల నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను తీసుకెళ్లాల్సి వస్తుండడంతో వెన్నెముఖ భాగంలో నొప్పి పుడుతోంది. – ఆర్.దీపక్, 8వ తరగతి -
చదువులమ్మ గుడిలో కిలకిల రావాలు
సాక్షి, పశ్చిమ గోదావరి : విద్యార్థులు కిలకిల నవ్వులతో సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఏ పాఠశాలలో చూసిన విద్యార్థులు ఆట పాటలతో నవ్వుతూ... తుళ్లుతూ సంతోషంగా గడిపారు. పాఠశాలల్లో ప్రతి నెలా మొదటి, మూడో శనివారం నో స్కూల్ బ్యాగ్ డేగా పాటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ రెండు రోజులు విద్యార్థులు ఆట పాటలతో సంతోషంగా గడపాలని, వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచనలిచ్చారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ శనివారం విద్యార్థులు పుస్తకాల బ్యాగులు తీసుకురాకుండా వచ్చారు. కుమారప్రియంలోని సానా వెంకట్రావు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.గోపాలకృష్ణాచార్యులు మాట్లాడుతూ ఆనందం వేదిక కార్యక్రమంలో తమ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారని చెప్పారు. విద్యార్థులలో ఒత్తిడిని దూరం చేసి వారిలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఎస్ఈఆర్టీ రూపొందించిన ఆనందవేదికలో మొదటి శనివారం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా గడిపారని చెప్పారు. ఉదయం విద్యార్థులతో ధ్యానం చేయించారు. విద్యార్థులు పాఠశాలలోని గ్రంథాలయంలో తమకు నచ్చిన పుస్తకాలు చదువుకున్నారు. అనంతరం పలు చిత్రాలు గీశారు. మధ్యాహ్నం విద్యార్థులు సభ నిర్వహించారు. పలువురు విద్యార్థులు చక్కని నీతి కథలు చెప్పారు. పాటలు పాడారు. పొడుపు కథలు, సామెతలు చెప్పారు. తరువాత తోటపని చేసి ప్రకృతి పట్ల తమకు ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. చివరి పిరియడ్లో ఇన్డోర్, అవుట్డోర్ ఆటలు ఆడుకున్నారు. ఉపాధ్యాయుడు వి.సత్యనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ రెడ్డి శివ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజుపాలెం పాఠశాలలో ఉపాధ్యాయుడు పి.సత్యనారాయణ విద్యార్థులకు కథలు చెప్పారు. ఆటలు ఆడించారు. బాగా ఎంజాయ్ చేశాం... రంగంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాలు పక్కనపెట్టి అభినయ గేయాలు, నీతి కథలు, వివిధ ఇండోర్ గేమ్స్తో సరదాగా గడిపారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఇప్పటికే నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ రోజు పాఠశాలలో చాలా ఆనందంగా గడిపామని, ఆటలు, పాటలు, కథలతో బాగా ఎంజాయ్ చేశామని విద్యార్థులు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రతి శనివారం కూడా పుస్తకాలతో తరగతి గదిలోనే గడిపేవారమని, జగన్ సార్ ముఖ్యమంత్రి అయ్యాకా శనివారం నో బ్యాగ్ డేగా ప్రటించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
సేవ చేయడం అదృష్టం
సాక్షి, విజయనగరం టౌన్ : రైల్వే హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్ ఆవరణలో ఆదివారం స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ఇతరత్రా వస్తువులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్టౌన్ ఎస్ఐ కిల్లారి కిరణ్ కుమార్ నాయుడు హాజరై మాట్లాడారు. సమాజానికి సేవ చేసే అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టమని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని, ఉద్యోగంతో పాటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సభ్యులను అభినందించారు. రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సత్యనారాయణ, సంస్థ సభ్యులు వైశాఖ్, ఎం.కనకరాజు, నాగేశ్వరరావు, మురళీ, జైశంకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లోకి తేలికపాటి స్కూల్ బ్యాగులు
సాక్షి,సిటీబ్యూరో: పిల్లలకు ప్రస్తుతం పరీక్షలు అయిపోయి స్కూళ్లకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మే నెల అంతా సెలవులే అయినా.. మళ్లీ స్కూళ్లు తెరిచేనాటికి వారికి పుస్తకాలు.. యూనిఫాంతో పాటు స్కూలు బ్యాగులు వంటివి సమకూర్చాలి. గతంలో బ్యాగ్ అంటే బియ్యం బస్తా అంత బరువుండేది. కానీ ప్రభుత్వం స్కూలు బ్యాగు విషయంలో కఠినమైన నిబంధనలు విధించడంతో ప్రస్తుతం మార్కెట్లో తేలికపాటి మెటీరియల్తో తయారు చేసిన బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి. పిల్లల తరగతులకు అనుగుణంగా వీటిని రూపొందించారు. ప్రస్తుతం నగరంలో దేశీ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ బ్రాండెడ్ స్కూల్ బ్యాగ్లు అందుబాటులోకి వచ్చాయి. పిల్లల క్లాస్ స్థాయిని బట్టి వివిధ డిజైన్లతో పాటు తక్కువ బరువు గల స్కూల్ బ్యాగ్లను వివిధ కంపెనీల బ్యాగ్లు మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఇవి కేజీ స్థాయి నుంచి కాలేజీ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అందుకు అనుగుణంగా నగరంలోని ప్రాచీనమైన బ్యాగ్ విక్రయ కేంద్రం మదీనా సర్కిల్, టోలిచౌకీ, మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్లో అతి తక్కువ బరువులతో బ్రాండెడ్ స్కూల్ బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఈ నెల రోజులూ ‘బ్యాగ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్’ కూడా ఏర్పాటు చేశారు. క్లాస్ ప్రకారం బ్యాగ్ బరువు కిండర్గార్టన్ (కేజీ) పిల్లలకు 100 గ్రాముల నుంచి మొదలు బ్యాగు బరువు ప్రారంభమవుతుంది. మూడో తరగతి, ఐదో తరగగతి, 8వ తరగతి, 10వ తరగతి, కాలేజీ విద్యార్థులకు కూడా తక్కువ బరువు గల బ్రాండెడ్ కంపెనీల బ్యాగ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 150 గ్రాములు మొదలు 500 గ్రాముల లోపే ఉండడం విశేషం. పైగా వీటిని అత్యంత నాణ్యమైన, వర్షంలో తడవని (వాటర్ రెసిస్టెంట్) మెటీరియల్తో రూపొందించారు. అంతేకాదు.. ఎండను కూడా తట్టుకోవడం ఈ క్లాత్ ప్రత్యేకత. ఏడాది గ్యారంటీ.. గతంలో బరువుతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా బ్యాగులు చేశారు. గతేడాది ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తక్కువ బరువుతో స్కూల్ బ్యాగ్లను విద్యార్థుల సౌకర్యార్థం తయారు చేయిస్తున్నాం. దీంతో పాటు విదేశీ బ్రాండ్ కంపెనీల బ్యాగ్లను కూడా దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బ్రాండెడ్ కంపెనీల లైట్ వెయిట్ స్కూల్ బ్యాగ్లు కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. బ్రాండెడ్ స్కూల్ బ్యాగ్లు ధరలు కూడా రూ.250 నుంచి రూ.1000 వరకు ధరల్లో ఉన్నాయి. బ్యాగ్లకు ఏడాది పాటు గ్యారెంటీ కూడా ఇస్తున్నాం.– ఇల్యాస్ బుకారీ, మహ్మద్ క్యాప్ మార్ట్ ఫారిన్ బ్యాగ్లపైనే క్రేజ్ విదేశాల్లో తయారయ్యే వివిధ రకాల స్కూల్ బ్యాగ్లు నగర మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.అమెరికన్ టూరిస్టర్, స్కైబ్యాగ్, ఎఫ్ గెయిర్, నైకీ, ప్యూమాతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా లైట్ వెయిట్ బ్యాగ్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ బ్యాగ్లు తక్కువ బరువుతో పాటు స్టయిల్గా, బుక్స్తో పాటు ఇతర వస్తువులు పెట్టుకోడానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇలాంటి బ్యాగ్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. -
బాబులు..బాలలనూ వదల్లేదు
పాలక పార్టీ పెద్దల ప్రచార దాహం శ్రుతి మించుతోంది. ప్రధాన రహదారుల్లో హోర్డింగులు ఏర్పాటు చేసి, ఆర్టీసీ బస్సులపై పథకాలను వివరిస్తూ ప్రచారం పొందడం సరిపోదనుకుని బడి పిల్లలనూ వాడుకుంటున్నారు. వారి పుస్తకాల బ్యాగుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నక్కా ఆనంద్బాబుల ఫొటోలు ముద్రించి ప్రచారం చేసుకోవడం చూసిన గుంటూరు జనం ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.– ఫొటో: రామ్గోపాల్ -
థ్యాంక్యూ ఎమ్మెల్యే అంకుల్
చిత్తూరు, తిరుపతి రూరల్: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విద్య పట్ల తన అంకితభావాన్ని చూపుతూనే ఉన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని ఆయన చెబుతూ ఉంటారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో చదువుతున్న 43 వేలమంది విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులు.. క్లాస్మేట్ నోట్ పుస్తకాలను ఆయన అందించారు. స్కూళ్ల వారీగా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి వాటిని విద్యార్థులకు అందించారు. బ్యాగ్, నోట్ పుస్తకాలు అందుకున్న చిన్నారులు ‘థ్యాంక్యూ ఎమ్మెల్యే అంకుల్...’ అం టూ కృతజ్ఞతలు తెలిపారు. పేదరికం అడ్డు కాకూడదు... చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే నియోజకవర్గంలో చదువుకునే ప్రతి విద్యార్థికి సొంత నిధులతో స్కూల్ బ్యాగ్, నోట్ పుస్తకాలను అం దిస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. శుక్రవారం తుమ్మలగుంటలోని ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులకు బ్యాగ్లు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలను అ«ధిరోహించè వచ్చన్నారు. విద్య ఉన్నచోట పేదరికం ఉండదన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి, వైఎస్సార్ విద్యార్థి విభాగం చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డి, దామినేటి కేశవులు, దొడ్ల కరుణాకర్రెడ్డి,విడుదల మాధవరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, వీరనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బడి బ్యాగుల భారం ఇక తేలిక!
వెన్నెముక విరిగేలా పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న బడి పిల్లలకు శుభవార్త! ఇక నుంచి అన్ని పుస్తకాలు, అంత బరువు మోయాల్సిన పనిలేదని, బరువును వెంటనే తగ్గించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. స్కూలు పిల్లల తరగతుల వారీగా ఎంతెంత బరువుండాలో మార్గదర్శకాలు రూపొందించింది. సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: బడి పిల్లలకు పుస్తకాల బ్యాగుల బరువు భారం తగ్గనుంది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూల్స్లో నిర్ధారించిన బరువు కన్నా ఎక్కువ బరువు గల బ్యాగులను అనుమతించరాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధలు బేఖాతరు నిబంధనల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఆ విద్యార్థి శరీర బరువులో పదో వంతు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తున్న పాఠశాలలు తక్కువ. ఫలితంగా వయసుకు మించిన పుస్తకాల భారాన్ని మోస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు నీరసించి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర, జిల్లా పాఠశాల విద్యా శాఖ తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. 2006 చట్టం ఏం చెబుతోంది? పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 2006లోనే చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ఎలాంటి బరువులతో కూడిన పుస్తకాల సంచులను మోయకూడదు పై తరగతులకు చెందిన విద్యార్థులు తమ శరీర బరువులో పుస్తకాల సంచి బరువు పది శాతానికి మించకూడాదు రోజూ పాఠశాలకు తీసుకెళ్లాల్సిన పుస్తకాలపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు అవగాహనతో ముందుకెళ్లాలి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను భద్రపరచడానికి ఏర్పాట్లు చేపట్టాలి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేకంగా పుస్తకాలు ఉంచడానికి అరలు ఉండాలి. ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయని ప్రైవేటు పాఠశాలలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రూ.3 లక్షలు అపరాధ రుసుము విధించవచ్చు. ఆదేశాలు పాటించకుంటే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయవచ్చు. బరువు సంచితో నష్టాలు పుస్తకాల సంచి భారంతో వంగి నడుస్తూ తరచూ తలెత్తి చూడడం వల్ల మెడనరాలపై భారం పడి నొప్పి వస్తుంది అధిక బరువు వల్ల సంచి భుజాలపై నుంచి కిందకి లాగేటట్లు వేలాడుతోంది. దీని వల్ల భుజాల నొప్పి వస్తుంది వంగి నడవడం వల్ల నడుము, దానికి కింది భాగం, వెన్నెముక దెబ్బతింటుంది మోకాలి నొప్పుల వల్ల రాత్రి వేళ సరిగా నిద్రపట్టదు. నరాలు లాగేసినట్లు అనిపిస్తుంది. తిమ్మిరి వచ్చి పట్టు కోల్పోతారు. బరువు సంచి మోయడం వల్ల పిల్లలు తొందరగా అలిసి పోతారు. దీని వల్ల చదువు పై ఏకాగ్రత పెట్టలేరు. ఆదేశాలివీ.. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి. విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని చెప్పకూడదు. ఎన్సీఈఆర్టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి. కేంద్రం ఆదేశాల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఇలా ఉండాలి.. తరగతి బరువు(కిలోలు) 1-2 1.5 3-5 2.3 6 -7 4 8-9 4.5 10 5 -
బ్యాగుల మోతకు చెక్
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థుల బ్యాగుల మోతకు చెక్ పడనుంది. తరగతిని బట్టి పుస్తకాల బరువుండాలని, ఒకట్రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదని మానవ వనరుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థికి ఉపశమనం ప్రస్తుతం విద్యారంగంలో నెలకొన్న పోటీతత్వంతో ర్యాంకులే ప్రామాణికంగా భావించే పాఠశాలల యాజమాన్యాలు పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. ప్రతిదానికో పుస్తకమంటూ విద్యార్థులపై బండెడు మోత వేశారు. ఫలితంగా ఎల్కేజీ, యూకేజీ నుంచి బ్యాగు నిండా పుస్తకాలు ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకటోతరగతి చిన్నారి పది కేజీల బ్యాగు మోస్తున్నాడు. ఎక్కువ స్కూళ్లు బహుళ అంతస్తుల బిల్డింగుల్లో ఉండడంతో నాలుగైదు అంతస్తులు ఎక్కలేక చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న నిర్ణయంతో పసిపిల్లలు మోస్తున్న బరువుకు ఉపశమనం కలుగుతుంది. ఒకట్రెండు తరగతుల పిల్లల స్కూల్ బ్యాగు బరువు కేజిన్నరకు మించకూడదు. 3–5 తరగతులకు 2–3 కేజీలు, 6,7 తరగతులకు నాలుగు కేజీలు, 8,9 తరగతులకు 4.5 కేజీలు, 10వ తరగతికి ఐదు కేజీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించరాదని స్పష్టం చేశారు. సబ్జెక్టుల బోధన ఇలా.. 1–2 తరగతులకు స్థానిక లాంగ్వేజ్పాటు గణితం రెండు సబ్జెక్టులు మాత్రమే బోధించాలి. ఈ ప్రకారం ఇంగ్లిష్, ఈవీఎస్ ఉండదు. 3–5 తరగతులకు లాంగ్వేజ్తో పాటు గణితం, ఈవీఎస్ సబ్జెక్టులు బోధించాలి. అదికూడా ఎన్సీఈఆర్టీ సూచించిన మేరకే పుస్తకాలుండాలి. ఒకట్రెండు తరగతులకు హోం వర్క్ ఇవ్వకూడదు. పాఠశాలల్లో ఇతరత్రా ఎలాంటి పుస్తకాలు, మెటీరియల్ ఇవ్వకూడదు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని మానవవనరుల శాఖ స్పష్టం చేసింది. అమలవుతుందా..? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంటులో చేసిన విద్యాహక్కు చట్టానికే దిక్కూమొక్కు లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఏటా 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలి. ఫీజులు ఇష్టానుసారం వసూలు చేయకూడదు. క్వాలిఫైడ్ టీచర్లే స్కూళ్లలో బోధించాలి. దాదాపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఇవేవీ అమలు కాలేదు. తాజాగా మానవ వనరుల శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఏ మేరకు అమలవుతాయనే భిన్నాభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
మోత, రాత లేదిక!
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో ఒకటి, రెండో తరగతి చిన్నారులకు బండెడు పుస్తకాల మోత, పేజీలకొద్దీ హోంవర్క్ రాత నుంచి ఊరట లభించింది. వారు ఇక వీపులు ఒంగిపోయేలా బ్యాగుల భారం మోయాల్సిన పనిలేదు. చిట్టిచిట్టి చేతులు నొప్పిపుట్టేలా హోంవర్క్ రాయాల్సిన అవసరంలేదు. ఇకపై వారు స్కూల్ టైమ్ ముగిసిన వెంటనే ఇంటికొచ్చి ఎంచక్కా ఆటపాటలతో గడిపేయొచ్చు. ఎందుకంటే... సీబీఎస్ఈ యాజమాన్యం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నో స్కూల్ బ్యాగ్, నో హోంవర్క్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్ఈ పరిధిలోకి వచ్చే స్కూళ్లన్నీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఆర్మీ స్కూళ్లతోపాటు సీబీఎస్ఈ గుర్తింపు ఉన్న ప్రతి స్కూల్లో నో స్కూల్ బ్యాగ్, నో హోంవర్క్ విధానం అమల్లోకి రానుంది. కోర్టు తీర్పుతో కదలిక... నో స్కూల్ బ్యాగ్, నో హోంవర్క్ విధానంపై సీబీఎస్ఈ గతంలోనే స్పష్టత ఇచ్చింది. చిన్న పిల్లలకు బరువైన పుస్తకాల బ్యాగు వద్దని, వీలైనంత వరకు తగ్గించాలని సూచించినప్పటికీ క్షేత్రస్థాయిలో విద్యా సంస్థలు ఈ నిబంధనలను పాటించలేదు. ఈ క్రమంలో కొందరు విద్యావేత్తలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో స్పందించిన సీబీఎస్ఈ యాజమాన్యం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండో తరగతి వరకు నిబంధనలు పరిమితం చేసినప్పటికీ మిగతా తరగతులకు సంబంధించి స్పష్టత ఇవ్వలేదు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు పరిమితికి మించి ఉన్నట్లు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పదో తరగతి వరకు బ్యాగుల బరువు ఎంత ఉండాలనే అంశంపై స్పష్టత ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. -
మళ్లీ అదే కథ!
వేళకు పాఠశాలకు ఉపాధ్యాయులు రాకుంటే... బయోమెట్రిక్ ఆధారంగా వేతనాల్లో కోత విధిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తే ముఖ్యమైన పోటీ పరీక్షలు, ఎంసెట్ వంటివాటికి అభ్యర్థులను అనుమతించడం లేదు. కానీ ఎన్నో ఏళ్లుగా పాఠశాలలు తెరిచే సమయానికి శతశాతం పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తారేమోనని ఎదురు చూస్తున్నా... ఆ ఆశ తీరడంలేదు. ఈ సమస్యకు ఎప్పటికి పరిష్కారం దొరుకుతుందన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నలా మారిపోతోంది. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కానీ పుస్తకాలు ఈ సారీ పూర్తిస్థాయిలో రాలేదు. అంటే మళ్లీ వీటికోసం తిప్పలు తప్పవేమో... విజయనగరం అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే అనధికారికంగా ప్రారంభించి తరగతులు మొదలెట్టేశాయి. వారి పరిధిలోని విద్యార్థులతో పుస్తకాలను కూడా కొనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ తంతు ఇప్పటికీ ప్రారం భం కాలేదు. ఈ వ్యవహారంపై శ్రద్ధచూపేంత తీరిక పాఠశాల విద్యాశాఖకు లేనట్టు కనిపిస్తోంది. గతేడాది విద్యాసంవత్సరం చివరి రోజునాటికి విద్యార్థుల ప్రమోషన్ జాబితాను విడుదల చేసి ఆ మేరకు పాఠ్యపుస్తకాలను అందజేయాలన్న లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయులు కూడా ఆ విధంగానే జాబితాలు అందించారు. కానీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ మాత్రం చేపట్టలేదు. సమయ పాలనపై పదే పదే హెచ్చరికలు జారీ చేసే ప్రభుత్వం నిర్దేశించిన రోజుకు పుస్తకాల పంపిణీ ఎందుకు చేయలేకపోతోందన్నది అందరిలోనూ నెలకొన్న సందేహం. మొదలుకాని పుస్తకాల పంపిణీ ప్రక్రియ సాధారణంగా ఈ పాటికే కనీసం 70 శాతం పుస్తకాల పంపిణీ పూర్తికావాల్సి ఉన్నా... ఆ మేరకు పంపిణీకి శ్రీకారం చుట్టలేదు. ఈ ఏడాది కూడా పుస్తకాల పంపిణీలో జాప్యం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకటి నుంచి పదోతరగతి వర కూ ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది 2 లక్షల 10 వేల మంది వరకూ పుస్తకాల కోసం జిల్లా విద్యాశాఖ 14.55 లక్షల పుస్తకాలకు ప్రతిపాదనలు చేసింది. ఇది గతేడాది కంటే సుమారు లక్ష పుస్తకాలు అదనం. జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనల డిమాండ్కు ఎప్పుడూ పాఠశాల విద్యాశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తున్నప్పటికీ సకాలంలో పుస్తకాలను జిల్లాకు పంపిణీ చేసిన దాఖ లాలు మాత్రం కానరావడంలేదు. సమస్య పునరావృతమే... గతేడాది డిమాండ్ పుస్తకాలు ఆలస్యంగా జిల్లాకు రావడం వల్ల సుమా రు రెండు లక్షల వరకూ పంపిణీ ఏడాది చివరి నెలలో జరిగింది. ఈ ఏడాది అలాంటి సమస్య రాకూడదని పుస్తకాల కోసం జిల్లా విద్యాశాఖ ఎదురుచూస్తోంది. ఇంతవరకూ తొలి విడతగా కేవలం 2 లక్షల 60 వేల పుస్తకాలు మాత్రమే జిల్లాకు వచ్చా యి. వీటితోపాటు గత ఏడాది మిగిలిన 1.79 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నాయి. ఇంకా 12.81 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఇక జిల్లాలో ఉన్నవాటిపైనా వెంటనే పంపిణీ చేయాలనే ఆలోచన జిల్లా విద్యాశాఖకు తట్టలేదు. జిల్లాకు వచ్చి మూడురోజులైనా మండలాలకు పంపించే ఏర్పాట్లు పూర్తవ్వలేదు. వచ్చినవి వచ్చినట్లు పంపేస్తున్నాం ఇప్పటికే పాఠ్యపుస్తకాల పం పిణీ పూర్తి చేయాల్సి ఉంది, జిల్లాకు సకాలంలో రాకపోవడం వల్ల అది కుదరలేదు. జిల్లాకు వచ్చిన పుస్తకాలను ఎప్పటికప్పుడు మండలాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం.గతేడాది మిగిలి న 1.79 లక్షల పాఠ్య పుస్తకాలు, తాజాగా వచ్చిన 2.60 లక్షల పాఠ్య పుస్తకాలను ప్రస్తుతం పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. నిల్వలకు అనుగుణంగా అన్ని మండలాలకు సమంగా పంచుతాం. కేటాయించిన పుస్తకాలను ముం దుగానే తేదీలను ప్రకటించి ఆయా మండలాలకు పంపిణీ చేస్తాం. ఏ మం డలాలకూ ఆలస్యం కాకుండా పంపిణీ చేస్తాం. – జి.నాగమణి, జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం -
భారం తగ్గించే బ్యాగ్
సాక్షి, సిటీబ్యూరో : జూన్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బ్యాగ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. విద్యార్థులపై అధిక భారం పడకుండా, బరువును తగ్గించాలని గతేడాది ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పుడు మార్కెట్లోకి లైట్ వెయిట్ బ్యాగ్లు వచ్చాయి. మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్లో అతి తక్కువ బరువున్న బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. 100 గ్రాముల నుంచి 500గ్రా ముల వరకు ఇవి అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ‘ప్రభుత్వ ఉత్తర్వులకు అ నుగుణంగా తక్కువ బరు వుతో బ్యాగులు తయారు చేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు బ్రాండెడ్ కంపెనీల లైట్ వెయిట్ బ్యాగ్లు కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ధరలు రూ.250 నుంచి రూ.1,000 వరకు ఉన్నాయి. ఏడాది గ్యారంటీ కూడా ఇస్తున్నామ’ని చెప్పారు. మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకులు ఇల్యాస్ బుకారీ. -
పుస్తకాల బ్యాగుల్లో గంజాయి పొట్లాలు
పిఠాపురం:ఏజెన్సీ ప్రాంతాల నుంచి సాగే గంజాయి రవాణా రూటు మారింది. అంతగా పోలీసు నిఘా లేని తీర ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని గంజాయిని రవాణా చేస్తున్న గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొత్తపల్లి మండలం యండపల్లి కేంద్రంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా నిఘా పెంచారు. రెండు రోజుల క్రితం ఒక ఆటోలో గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ పోలీసులు ఉప్పాడ పిఠాపురం రోడ్డులో తనిఖీలు నిర్వహించగా మూడు బ్యాగ్లలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ వ్యక్తి నుంచి సుమారు రూ.రెండు లక్షల విలువైన 38 కేజీల గంజాయిని, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆవ్యక్తిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు తెలిసింది. కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన ఓ వ్యక్తి ఏజన్సీ ప్రాంతాలకు చెందిన మరి కొందరి వ్యక్తుల ద్వారా గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి తాగే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో కొందరు గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎటువంటి అనుమానం రాకుండా విద్యార్థులు తీసుకువెళ్లే స్కూలు బ్యాగ్లలో ప్రత్యేకంగా చేసిన గంజాయి పొట్లాలను తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్కూలు బ్యాగ్లతో పాటు మామూలుగా ప్రయాణాల్లో వాడే బ్యాగ్లలో గంజాయి పొట్లాలు ఉంచి వాటిపై బట్టలు ఇతర వస్తువులను పేర్చి ప్రయాణికుల మాదిరిగా ఆటోలలో గంజాయిని తరలిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి రెండు స్కూలు బ్యాగ్లలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు అసలు వ్యాపారులు ఎవరన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పటుట్బడిన గంజాయి ఏవిలీన మండలాల ఏజన్సీ ప్రాంతం నుంచి స్కూలు బ్యాగ్లలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గంజాయి రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న యండపల్లికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందం ఇంకా ఎవరెవరు ఈ వ్యాపారంలో ఉన్నారు. ఏయే ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక వ్యక్తి పట్టుబడితే అసలు విషయాలు బయటపడతాయని పోలీసు వర్గాలు చెబుతున్నారు. రైల్వే స్టేషన్లలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. పిఠాపురం, ఉప్పాడ, గొల్లప్రోలు మండలాల్లో కొన్ని గ్రామాల్లో కొందరు వ్యక్తులు గంజాయి రవాణాతో పాటు విక్రయాలు సాగిస్తున్నట్టు సమాచారం. తీర ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న గంజాయి రవాణా మూలాలను తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
బ్యాగు ‘బరువు’ తగ్గేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: స్కూల్ బ్యాగు బరువు ఇంకా తగ్గలేదు. అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఫైళ్లకే పరిమితం అయ్యాయి. జూలైలోనే విద్యాశాఖ బ్యాగు బరువు తగ్గింపు కోసం ఉత్తర్వులు జారీ చేసినా, వాటిని అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రకటించకపోవడంతో విద్యార్థులు అధిక బరువు మోస్తూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పడం లేదు. బ్యాగు బరువు తగ్గింపునకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని, అధికారులు తనిఖీలు చేసి పరిశీలించాలని విద్యాశాఖ చెప్పిందే తప్ప, అమలు చేయని యాజమాన్యాలపై ఏ చర్యలు ఉంటాయో, పక్కాగా అమలుకు అధికారులు ఏం చేయాలో స్పష్టమైన విధానం ప్రకటించలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో బ్యాగు బరువే తగ్గలేదని, టీచర్లకు కనీస అవగాహనా లేదని విద్యాశాఖ ఇటీవల చేసిన సర్వేలో తేలింది. బరువు ఎలా ఉండాలంటే.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాలల్లో 12 నుంచి 17 కిలోల బరువున్న బ్యాగులను విద్యార్థులు ప్రతిరోజు మోసుకెళ్లడం, కొన్ని పాఠశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం వల్ల అంత బరువైన బ్యాగులను మోసుకెళ్లడం వల్ల పిల్లలు వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు విద్యాశాఖ తేల్చింది. ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించింది. అందుకే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోలు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలే ఉండాలని, 6, 7 తరగతులకు 4 కిలోలకు మించకూడదని, 8, 9, 10 తరగతులకు 4.5 కిలోల నుంచి 5 కిలోల లోపే ఉండాలని పేర్కొంది. మార్గదర్శకాల అమలుకు దిక్కులేదు.. ఏ రోజు ఏ పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలను తీసుకురావాలో విద్యార్థులకు ముందుగానే యాజమాన్యాలు చెప్పాలని విద్యాశాఖ పేర్కొన్నా ఎక్కడా అమలు కావడం లేదు. టైంటేబుల్ ప్రకారమే పుస్తకాలు మోసేలా పాఠశాల జాగ్రత్త వహించాలని, పాఠశాలల్లో ర్యాక్లను ఏర్పాటు చేయాలని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. ఎస్సీఈఆర్టీ నిర్ధేశిత పుస్తకాలు కాకుండా ఇతర, అదనపు, బరువైన, ఖరీదైన బోధన కోసమంటూ పనికిరాని పుస్తకాలను సూచించవద్దని పేర్కొన్నా పాత పద్ధతినే అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి.. - విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై ఉత్తర్వులు పాఠశాలల స్థాయికి చేరాయి. అయినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. - బ్యాగు బరువు తగ్గింపు అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండదు. ప్రైవేటు పాఠశాలల్లోనే చర్యలు చేపట్టాలి. అయితే ఈ ఉత్తర్వులను ప్రైవేటు స్కూళ్లకు స్వయంగా అందజేయలేదు. మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు ఆ ఉత్తర్వుల కాపీని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు వాట్సాప్లో పెట్టి వదిలేశారు. - ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు బ్యాగు బరువు తగ్గింపుపై ఉత్తర్వులు వచ్చాయని తెలుసుకానీ, దాని కోసం ఏం చేయాలో తెలియదు. - కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పిల్లల బ్యాగు బరువు 5–10 కిలోల వరకు ఉంది. స్కూల్ బ్యాగులో అవసరానికి మించిన నోటు బుక్కులు ఉన్నాయి. ఒక సబ్జెక్టుకు 4 కంటే ఎక్కువ నోటు బుక్కులున్నాయి. - ఉన్నత పాఠశాలల్లో బ్యాగు బరువు 6 నుంచి 10 కిలోల వరకు ఉంది. వీటిలో పాఠ్య పుస్తకాలు, ఒక్కో సబ్జెక్టుకు 3 కంటే ఎక్కువ నోటు బుక్కులు ఉన్నాయి. జిల్లాల్లో పిల్లల బ్యాగుల్లో గైడ్లు కూడా ఉన్నాయి. - ప్రాథమిక పాఠశాలల్లో 3–6 కిలోల వరకు బ్యాగు బరువు ఉంది. - మేడ్చెల్ జిల్లాలో కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన డిక్షనరీలు, జనరల్ నాలెడ్జి పుస్తకాలు, వొకాబ్లరీ, నోటు బుక్కులు, నీళ్ల బాటిల్, టిఫిన్ బాక్సులు, రైటింగ్ ప్యాడ్ కంపాస్ బాక్సులు మొదలగునవి ఉన్నాయి. - కొన్ని జిల్లాల్లో విద్యార్థులు తమకు అవసరం లేకపోయినా పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, అయిపోయిన నోటు బుక్స్, ఇతర పుస్తకాలు అన్నీ తెచ్చుకుంటున్నారు. - మేడ్చెల్, యాదాద్రి, నల్లగొండ వంటి జిల్లాల్లో పైతరగతుల విద్యార్థులు తమ తమ్ముళ్లు, చెల్లెళ్ల పుస్తకాలనూ తమ బ్యాగుల్లోనే మోసుకొస్తున్నారు. -
చరిత్రను తిరగరాయటం అవసరమా?
సాక్షి : భారత దేశ చరిత్రలో మొగలులు సాధించింది ఏం లేదు. దేశాన్ని పూర్తిగా కొల్లగొట్టడం తప్ప.. ఈ వ్యాఖ్యలు చేస్తుంది ఎవరో కాదు ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ. అందుకే చరిత్ర పుసక్తాలను తిరగరాయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దినేశ్ మాత్రమేకాదు .. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ అంశంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. నిజానికి ఈ వ్యవహారం దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తోంది. ఇస్లాం పాలకులైన మొగలుల జీవిత కథలను పాఠ్యాంశాల నుంచి తొలగించాలంటూ హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 1977 లో జనతా ప్రభుత్వ హయాంలో జన సంఘ్ నేతలు కొందరు చరిత్ర పుస్తకాలను మార్చేందుకు తీవ్రంగా యత్నించారు. రొమిల థాపర్, బిపిన్ చంద్ర, హరబన్స్ ముఖియా కొందరు జనసంఘ్ నేతలు పుస్తకాలు రాశారు కూడా. అయితే జాతీయ విద్యా పరిశోధక మండలి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటం ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితులు.. రాజకీయ ప్రభావాలు మెల్లి మెల్లిగా ఇస్లాం పాలకులైన మొగలుల చరిత్రను క్రమక్రమంగా కనుమరుగు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే హిందుత్వ సంస్థ అయిన ఆరెస్సెస్ తమ ఆలోచనలకు తగ్గట్లుగా చరిత్ర పుస్తకాలను ప్రచురించింది. మరికొన్ని చోట్ల కూడా ఇప్పటికే ప్రచురించిన పుస్తకాలతోనే పాఠాలు బోధించటం మొదలుపెట్టేశారు. గుజరాత్లో శిక్షా బచావో ఆందోళన్ సమితి కన్వీనర్, ఆరెస్సెస్ భావజాలకుడు దీనానాథ్ బత్రా రాసిన పుసక్తాలకు 2014 నుంచే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన రాసిన పుస్తకాలనే ప్రవేశపెట్టబోతుంది. ఇక రాజస్థాన్ ప్రభుత్వం పదో తరగతి పుస్తకాల్లోని ఏకంగా గాంధీ, నెహ్రూలకు సంబంధించిన పాఠ్యాంశాలపై కోత విధించి.. హిందుత్వ వాది వీర సావర్కర్ కథాంశాన్ని హైలెట్ చేసింది. మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాలైతే ఏకంగా మొగలులకు సంబంధించిన కథలను తగ్గించేసి హిస్టరీ అండ్ సివిక్స్ పేరటి పుస్తకాలకు నామకరణం చేసి పైగా అందులో మరాఠా వీరుడు శివాజీ పాలనకు సంబంధించిన విషయాలను.. మధ్యయుగం, మరాఠా సామ్రాజ్య విస్తరణ వంటి అంశాల గురించి ప్రస్తావించాయి. అయితే మొగలులు బ్రిటీషర్ల మాదిరిగా ఏనాడూ దేశంపై పడి దోచుకునే ప్రయత్నం చేయలేదని హర్బన్స్ ముకియా అనే చరిత్ర ప్రొఫెసర్ చెబుతున్నారు. పైగా అక్బర్, బాబర్ లాంటి చక్రవర్తులు మన మతాలు, సాంప్రదాయాలకు మంచి గౌరవం ఇచ్చి మనలో ఒకరిగా కలిసిపోయారని, పైగా కళా సంపదను మనకు అందించారని అంటున్నారు. కొందరు వామపక్ష భావ జాలాలున్న రచయితలు స్వేచ్ఛ తీసుకుని చరిత్రపై రాయటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ముకియా అంటున్నారు. ఏది ఏమైనా ఈ అంశంలో మతపరమైన వాదనలు కాకుండా, సుదీర్ఘ అధ్యయనం అవసరమన్న భావనను చరిత్రకారులు బలంగా వినిపిస్తున్నారు. -
స్కూల్ బ్యాగ్లో పాము
విద్యార్థిని కాటేసిన రక్త పింజర దొన్కల్ గ్రామంలో ఘటన ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్) : స్కూల్ బ్యాగ్లోకి చొరబడిన పాము విద్యార్థిని కాటేసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన వివేక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఉంచిన స్కూల్ బ్యాగులోకి పాము చొరబడింది. ఇది గమనించిన వివేక్ సోమవారం ఉదయం ఆ బ్యాగ్ను తీసుకొని స్కూల్కు వెళ్లాడు. క్లాస్రూంలో పుస్తకాల కోసమని బ్యాగులో చేతు పెట్టగా, అందులో ఉన్న రక్త పింజర కాటు వేసింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వివేక్ను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, యాంటీ వీనమ్ ఇంజక్షన్లు చేయించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పాము కాటు వల్ల విద్యార్థి చేయి వాచిందని, పెద్దగా ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెప్పినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. -
బ్యాగు బరువుపై అవగాహన కార్యక్రమాలు
పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ కిషన్ తెలిపారు. బ్యాగు బరువు తగ్గించే విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులకు బాధ్యత ఉందని, అందుకే అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం డైరెక్టరేట్లో టెట్ ఫలితాల వెల్లడి అనంతరం విలేకరులతో మాట్లాడారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర స్థాయిలోనూ త్వరలోనే చేపడతామన్నారు. -
స్కూల్ బ్యాగ్లో రక్తపింజర!
కేసముద్రం: ఓ విద్యార్థిని తెచ్చుకున్న పుస్తకాల సంచిలో రక్తపింజర పాము దాగివున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని అజ్మీరా అఖిల కోమటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. బ్యాగ్లో నుంచి పుస్తకం తీయడానికి చేయిపెట్టింది. చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్ను పూర్తిగా తెరిచేసరికి లోపల పాము కనిపించింది. ఆమె ఒక్కసారిగా అరుస్తూ క్లాస్ టీచర్ క్రిష్ణయ్య వద్దకు పరుగెత్తింది. ఆ క్లాస్టీచర్, హెచ్ఎం సోమిరెడ్డి కలసి క్లాసులో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించారు. వెంటనే దాన్ని కర్రతో కొట్టి చంపేయడంతో ప్రమాదం తప్పింది. -
స్కూల్ బ్యాగ్లో బుస్ బుస్
మహబూబాబాద్: ఓ విద్యార్థి పుస్తకాల సంచిలో రక్తపింజర దాగి ఉన్న సంఘటన, కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన అజ్మీరా అఖిల అనే ఐదవ తరగతి విద్యార్థిని కోమటిపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో చదువుతోంది. నిత్యం ఆటోలో తండా నుంచి తోటివిద్యార్దులతో కలిసి వచ్చే ఆమె రోజుమాదిరిగానే తన బ్యాగ్ను ఆటోకి తగిలించి పాఠశాలకు చేరుకుంది. తరగతి గదిలో బ్యాగ్ పెట్టి, ప్రార్ధనకు వెళ్లింది. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి తన బ్యాగ్లో నుంచి పుస్తకం తీయడానికి చేయిపెట్టింది. చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్ను పూర్తిగా తెరిచి చూడగా లోపల పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా అరిచి ఏడ్చుకుంటూ క్లాస్ టీచర్ క్రిష్ణయ్య వద్దకు వెళ్లి చెప్పింది. దీంతో క్లాస్టీచర్, హెచ్ఎం సోమిరెడ్డిలు గదిలో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించి, బ్యాగ్ను దులిపించడంతో రక్తపింజర బయటపడింది. వెంటనే కర్రతో కొట్టి చంపేశారు. బ్యాగ్లో ఉన్న ఆహర పదార్థాలు, పల్లికాయ ఉండటం వల్లనో, ఎలుక, కప్పలను మింగి బ్యాగ్లోకి దూరినట్లుందని, చేయి పెట్టినప్పుడు పాము కరవక పోవడం వల్ల విద్యార్థినికి ప్రమాదం తప్పినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. -
మోదీ రాష్ట్రంలో ఆయన బ్యాగుల కలకలం!
అహ్మదాబాద్: గుజరాత్కు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించిన నరేంద్రమోదీ ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో అఖిలేశ్ యాదవ్ బొమ్మలతో కూడిన బ్యాగులు కలకలం రేపుతున్నాయి. అసలు సంగతి ఏమిటంటే.. గుజరాత్లోని ఛోటా ఉడేపూర్లో స్థానిక యంత్రాంగం ఇటీవల పాఠశాల విద్యార్థులకు 12వేల బ్యాగులను పంచింది. ఆ బ్యాగులపై గ్రామపంచాయతీ లోగులో ఉన్నాయి. ఆటపాటల్లో పిల్లలు ఆ లోగులను పీకేయడంతో అసలు సంగతి బయటపడింది. ఆ లోగుల కింద ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బొమ్మలు ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న అఖిలేశ్ యాదవ్ సర్కారు పాఠశాల పిల్లలకు పంచేందుకు పెద్ద ఎత్తున స్కూలు బ్యాగులు తయారుచేయించింది. ఆ బ్యాగులపై అఖిలేశ్ యాదవ్ బొమ్మలు ఉన్నాయి. అయితే, ఈ బ్యాగులు పంచేలోపే ఎన్నికల కోడ్ రావడంతో వీటి పంపిణీకి బ్రేక్ పడింది. అనంతరం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ సర్కారు రావడంతో వీటిని పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ బ్యాగులు అనూహ్యంగా గుజరాత్లోకి ఎలా వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది. ఛోటా ఉడేపూర్ అనే మారుమూల పట్టణంలో ఇవి దర్శనమివ్వడం అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఈ బ్యాగుల పంపిణీపై విద్యాశాఖ అధికారులు వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. -
శనివారం స్కూల్ బ్యాగ్లకు ‘సెలవు’
లక్నో : పాలనలో దూసుకెళుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బండెడు పుస్తకాలు వీపుకు తగిలించుకుని బడికి వెళ్లే విద్యార్థులకు యూపీ సర్కార్ తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది తీపి కబురే. ప్రతి శనివారం ఇక స్కూల్ బ్యాగ్లకు విద్యార్థులు ’టాటా’ చెప్పనున్నారు. ప్రయిమరీ, సెకండరీ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి శనివారం ’నో బ్యాగ్ డే’ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు చదువును పక్కనపెట్టి.. విద్యార్థులకు కేవలం సంతోషకరమైన కార్యక్రమాలను మాత్రమే పాఠశాలల్లో నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అవగాహనతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దినేశ్ శర్మ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అలాగే ఈ విధానాన్ని కో ఎడ్యుకేషన్ స్కూళ్లలోనూ అమలు చేయనున్నారు. కాగా ఇకనుంచి జనాభా లెక్కలు, ఎన్నికల విధుల నిర్వహణకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
‘రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగ్స్ వద్దు’
న్యూఢిల్లీ: చదువుకునే చిన్నారులకు రెండో తరగతి వరకు పుస్తకాల సంచులు మోసే భారం లేకుండా చూడాలని సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) దాని అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కూష్వాహ సోమవారం లోక్సభలో చెప్పారు. చిన్నారుల పుస్తకాల బరువును తగ్గించేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), సీబీఎస్ఈలు చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్య కోసం ఎన్సీఈఆర్టీ ఏ విధమైన పాఠ్యపుస్తకాలనూ సిఫార్సు చేయలేదని ఆయన చెప్పారు. ఒకటవ, రెండో తరగతులకు రెండు పుస్తకాలను, మూడు నుంచి ఐదు తరగతులకు మూడు పుస్తకాలను మాత్రమే సిఫార్సు చేసిందని ఉపేంద్ర వివరించారు. అన్ని పాఠ్యపుస్తకాలు ఎన్సీఈఆర్టీ వెబ్సైట్లో డిజిటల్ వర్షన్లో లభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
బ్యాగు భారం
పుస్తకాల బరువు మోయలేక చిన్నారుల తంటాలు విద్యార్థి బరువులో 10 శాతానికి మించి పుస్తకాల బరువు ఉండొద్దంటున్న చట్టాలు.. పట్టించుకోని విద్యాశాఖ అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ‘మోయలేని భారం’ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మోతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు పుస్తకాల మోతతో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు అంతస్తుల్లోని పాఠశాలల తరగతి గదుల్లోకి వెళ్లే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. పుస్తకాల భారం తగ్గించాలని 2006లోనే చట్టం చేసినా దాని అమలుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్కూళ్లలో పుస్తకాల బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీబీఎస్ఈ తాజాగా ఆదేశించినా.. మన రాష్ట్రంలో ఆ దిశగా అధికారులు దృష్టిసారించడం లేదు. మళ్లీ బడి మొదలు కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులకు పుస్తక కష్టాలు మొదలు కానున్నాయి. విద్యార్థి శరీర బరువులో పుస్తకాల భారం 10% మించకూడదని చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్-2006 చెబుతున్నా.. 25% నుంచి 35% పైగా బరువుతో విద్యార్థుల నడ్డివిరిచే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కండరాల సమస్యలు, వెన్నుపూస ఒంగిపోవడం, వెన్నునొప్పి వంటి అనా రోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు, నిఫుణులు చెబుతున్నారు. పుస్తకాల బరువు.. భారంగా చదువు రాష్ట్రంలోని 14 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అత్యధికంగా నగరాల్లో చదువుతున్న వారే. ఇలాంటి వాటిల్లో బహుళ అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలే ఎక్కువ. బ్యాగు బరువుతో ఇబ్బంది పడే విద్యార్థులు పై అంతస్తుల్లోని తరగతులకు వెళ్లడానికి తంటాలు పడుతున్నారు. రెగ్యులర్ సిలబస్ పుస్తకాలతోపాటు డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్, అసైన్మెంట్, డైరీ, రిజిస్టర్ వంటి పుస్తకాలతోపాటు క్లాస్ వర్క్, హోంవర్క్, తెలుగు, హిందీ, ఇంగ్లిషు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇలా ఒక్కో సబ్జెక్ట్కు 2 నుంచి 3 చొప్పున నోట్బుక్స్, అట్లాస్, డిక్షనరీ, స్పోర్ట్స్ డ్రెస్ వంటి వాటితో స్కూల్ బ్యాగు మోయలేని భారం అవుతోంది. యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే.. బ్యాగు బరువే 3.5 కిలోలకు పైనే ఉంటోందని విద్యాశాఖ అంచనా. మూడో తరగతి విద్యార్థి బరువు 22 కిలోలు ఉంటే అతని పుస్తకాల బరువు 8 కిలోలకు పైనే. 35 కిలోల బరువుండే ఏడో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 10 కిలోలకుపైనే. స్కూల్ బ్యాగ్ బరువు అధికంగా ఉంటే శరీర ఎదుగుదల దెబ్బతింటుంది. ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పైభాగం, వెన్నుపూస కింది భాగం దెబ్బతింటాయి. దీంతో వెన్నునొప్పి వస్తుంది. వెన్నెముక, భుజాలు వంగిపోతాయి. ఈ ప్రభావం బాలికలపై తీవ్రంగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ అలసటకు గురవుతారు. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. చట్టం ప్రకారం ప్రభుత్వం, పాఠశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాడ్ తరహాలో బ్యాగు వెనుక భాగంలో స్పాంజ్ కలిగిన బ్యాగులను తీసుకోవాలి. దానివల్ల బరువంతా నేరుగా భుజాలు, వెన్నుపూసపై పడదు. - డాక్టర్ శివనారాయణరెడ్డి, పిల్లల వైద్య నిపుణుడు చట్టం ఏం చెబుతోందంటే.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్ పుస్తకాలు మోయకూడదు. ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరువుకంటే స్కూల్ బ్యాగు బరువు 10 శాతం మించి ఉండకూడదు. స్కూల్ బ్యాగు బరువు, రోజూ తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాతో పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకాలు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను స్కూల్లోనే దాచుకునేందుకు లాకర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను స్కూల్లో పెట్టుకునేందుకు ప్రతి విద్యార్థికి లాకర్లు, డెస్క్లను ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయకపోయినా, ఈ నిబంధనలను పాటించకపోయినా ఆయా స్కూళ్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. రూ. 3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా విధించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే పాఠశాలల గుర్తింపును రద్దు చేయవచ్చు. -
విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించేందుకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు మోస్తున్న పుస్తకాల బరువు 10 నుంచి 12 కిలోలు. అదే హైస్కూల్ విద్యార్థులైతే 15 నుంచి 18 కేజీల బరువైన పుస్తకాలను మోస్తున్నారు. వాస్తవానికి స్కూల్ బ్యాగుల బరువు 4 నుంచి 6 కిలోల మధ్యే ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. దీంతో విద్యార్థులు అదనంగా మోస్తున్న ఆ 10 కేజీల బరువును తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యార్ధులకు అతి భారంగా మారిన పుస్తకాల బరువును తగ్గించేలా అవసరమైన చర్యలకోసం సిఫార్సులు చేసేందుకు సలహా కమిటీని నియమించినట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎం.వి.వి.ఎస్.మూర్తి, రాము సూర్యారావుతో పాటు డాక్టర్ ఎస్.ఆర్.పరిమి (వికాస విద్యావనం, విజయవాడ), శ్రీరామ పద్మనాభం (రిషి వ్యాలీ, మదనపల్లె), డాక్టర్ ఎన్.మంగాదేవి (శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, గుంటూరు), డాక్టర్ డి.సరస్వతి (లెబన్ స్కెల్ఫ్, విశాఖపట్నం), డాక్టర్ పి.డి.కామేశ్వరరావు (శోధన, చీపురుపల్లి), సి.వి.కృష్ణయ్య (జనవిఙానవేదిక), డాక్టర్ యూ.సుబ్బరాజు (టింబక్తు), టీవీఎస్ రమేష్ (ఎస్సీఈఆర్టీ) తదితరులు సభ్యులుగా ఉంటారని వివరించారు. సోమవారం తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కమిటీ చేసే సూచనలను కూలంకషంగా పరిశీలించాక విద్యార్ధులపై పుస్తకాల బరువు తగ్గేలా చర్యలు చేపడతామన్నారు. టెన్త్ పరీక్షల్లో పేపర్లీక్ అవాస్తవం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకైనట్లు వచ్చిన వార్తల్ల వాస్తవం లేదని మంత్రి గంటా వివరించారు. పేపర్లీక్ ఎక్కడా కాలేదని, ఈమేరకు అన్ని జిల్లాలనుంచి తమకు నివేదికలు అందాయని చెప్పారు. మీడియా ఇలాంటి విషయాల్లో నిజనిర్ధారణ చేసుకొని ప్రసారాలు చేస్తే మంచిదని లేనిపక్షంలో వదంతులు వ్యాపించి విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలో పడతారని పేర్కొన్నారు. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి లేకుండా అన్ని చోట్లా సరిపడా ఫర్నీచర్ను సమకూర్చామని మంత్రి చెప్పారు. ఇద్దరు హెడ్మాస్టర్ల సస్పెన్షన్ పరీక్షలకు ఒకరోజు ముందు స్కూల్ను ఓ ఫంక్షన్కు ఇచ్చిన నెల్లూరులోని పొదలకూరు రోడ్డులోని జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ను, అదే రోడ్డులోని బాలికల హైస్కూల్ హెడ్మాస్టర్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి గంటా ప్రకటించారు. అధికారులు, టీచర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మంగళవారం అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
పాఠ్యాంశంగా గౌతు లచ్చన్న జీవితం?
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ.. పీడిత జన పక్షపాతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని పాఠశాలల పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కోర్టు సమీపంలో బీసీ యువజన సంఘం నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో మంత్రి గంటా మాట్లాడారు. లచ్చన్న లాంటి మహోన్నత వ్యక్తిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకవి వంగపండు ప్రసాదరావు విప్లవ గీతాలను ఆలపించారు. -
హవ్వ.. ఆసారాం మహాత్ముడట!
జోధ్పూర్: 'పిల్లలూ ఈ రోజు పాఠంలో మనదేశంలో మహనీయులుగా వెలుగొందిన మహాత్ముల పేర్లు చెప్పుకుందాం. శంకరాచార్య, మదర్ థెరిసా, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గురునానక్, సంత్ కబీర్.. ఆసారం బాపు.. రామ్ దేవ్ బాబా..' అప్పటి వరకూ టీచర్ చెబుతున్న పేర్లను వల్లెవేస్తూ వచ్చిన పిల్లలందరూ చివరి రెండు పేర్ల దగ్గర మాత్రం ఠక్కున ఆగిపోయారు! తమ లాంటి ఓ చిన్నారిని చిదిమేసే ప్రయత్నంచేసి, ప్రస్తుతం జైలులో ఉన్న ఆసారాం మహాత్ముడు ఎలా అవుతాడో ఆ చిన్ని బుర్రలు ఆలోచించడం మొదలుపెట్టాయి. కానీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు.. వాటిని ముద్రించిన పబ్లిషర్లకు మాత్రం ఆ సందేహం ఇసుమంతైనా కలగలేదు. ప్రస్తుతం రాజస్థాన్ లోకి కొన్ని జిల్లాల పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితి ఇది! 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన ఆసారం బాబును మహాత్ముడిగా అభివర్ణిస్తూ.. ఆయన చిత్రపటాన్ని గుర్తించాల్సిందిగా మూడో తరగతి జీకే పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహోన్నతుల సరసన అత్యాచారం కేసులో నిందితుడ్ని ఎలా చేర్చుతారంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి పాఠ్యాంశం ఒకటుందని తమకు ఇంకా తెలియరాలేదని విద్యాశాఖ అధికారు చెబుతున్నారు. ఇటు పబ్లిషర్ వివరణ మరోలా ఉంది. 'ఆసారంను పాఠ్యాంశంలో చేర్చేనాటికి ఆయనపై ఎలాంటి కేసులు లేవు. పుస్తకం ప్రింట్ అయి.. విద్యార్థులకు చేరిన తర్వాతే ఆయన అరెస్టయ్యాయి. వెంటనే ఆ పుస్తకాలన్నింటినీ వెనక్కి తెప్పించి.. కొత్త వాటిని ముద్రించేపనిలో ఉన్నాం' అని చెప్పాడు పబ్లిషర్. భావిభారత పౌరులకు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో ఇలాంటివి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో వేచిచూడాలి. -
నోట్ బుక్పై శిల్పాశెట్టి ఫోటో
పూణే: పూణేలోని ఓ ప్రముఖ స్కూల్లో ఓ విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి ఆ స్కూల్ వాళ్లు ఇచ్చిన పుస్తకాలపై శిల్పాశెట్టి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్ని ఈ అంశంపై కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే.. పిల్లలు టీవీల్లోనే ఆమెను చూస్తున్నారు కదా?.. పుస్తకంమీద చూస్తే తప్పేంటి అని సమాధానమిచ్చారు.. ఈ సంఘటన ప్రముఖ నటి ,నిర్మాత, దర్శకురాలు రేణుదేశాయ్కి తన మేనల్లుడు విషయంలో ఎదురైన అనుభవం. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరికొందరి పుస్తకాలపై సన్నీలియోన్, బిపాసాబసుల ఫొటోలు కూడా ఉన్నాయట. విద్యార్థుల పుస్తకాలపై ఇలాంటి ఫొటోలు ముద్రించడం చూస్తే విద్యకన్నా..వినోదానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. This is a notebook given frm a reputed school of my nephew for 9th std! &we r wondering why this generation is weird😣 pic.twitter.com/ICtzHqn4FO — R (@renuudesai) June 7, 2015 @trulymaheshh some more with Bipasha Basu &Sunny Leone too!!!when questioned d principal replied that kids are watching them already on tv!! — R (@renuudesai) June 7, 2015 -
నేర్పండి... నేర్చుకుంటారు!
ఒకప్పుడు స్కూళ్లు పది గంటలకు మొదలయ్యేవి. కానీ ఇప్పుడు ఏడున్నర, ఎనిమిది గంటలకే మొదలైపోతున్నాయి. ఆ సమయానికల్లా పిల్లల్ని తయారుచేసి పంపడం తల్లులకు కత్తిమీద సాముతో సమానం. అయితే మొదట్నుంచీ వాళ్లకి కొన్ని పద్ధతులు నేర్పిస్తే, ఈ సమస్య ఉండదు. స్కూల్లో వేయడానికి కొన్ని రోజుల ముందు నుంచే పిల్లలను పొద్దున్నే లేపేయండి. ఆ సమయానికల్లా వారికి అలవాటైపోతుంది. స్కూల్ బ్యాగుని రాత్రి హోమ్వర్క్ పూర్తవగానే సర్దిపెట్టుకోమనండి. పొద్దున్న లేచి చేయాల్సిన పనుల గురించి పేపర్ మీద రాయండి. బాత్రూమ్కి వెళ్లాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, టిఫిన్ తినాలి ఇలా. ఆ చీటీని పిల్లల మంచం దగ్గర అతికించి, దాని ఫాలో అవమనండి. కొన్నాళ్లకు అలవాటైపోతుంది. ప్రతిదానికీ ఇంత టైమ్ అని కేటాయించి, ఆ సమయంలో ఆ పనిని పూర్తి చేసి తీరాలని చెప్పండి. మొదట్లో మీరే రెడీ చేసినా, మెల్లగా వారినే అవ్వమనండి. యూనిఫామ్, షూ, టై, బెల్ట్ అన్నీ ఒకే చోట పెడితే వాళ్లు కన్ఫ్యూజ్ అవకుండా ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... పొద్దున్న లేవగానే పిల్లలకు నచ్చిన ఏదైనా పనిని చేయించాలి. డ్యాన్స్ ప్రాక్టీస్, నచ్చిన కార్టూన్స్ చూడటం, గార్డెన్ వర్క్, సైకిల్ తొక్కడం... ఏదో ఒకటి. ఎందుకంటే లేవగానే నచ్చిన పని చేయడం వల్ల వాళ్లు రోజంతా యాక్టివ్గా ఉంటారని పరిశోధనలో తేలింది. -
స్కూల్ పుస్తకాల పై రక్తపు మరకలు
-
స్కూల్ బ్యాగ్ బరువెంత?
-
సచిన్ టెండూల్కర్ పై పాఠ్యపుస్తకాల్లో అధ్యాయం
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితచరిత్ర తెలుసుకునే అవకాశం విద్యార్థులకు త్వరలో లభించనుంది. రాష్ట్ర విద్యాబోర్డు పాఠ్యపుస్తకాల్లో సచిన్పై ఓ అధ్యాయం అధ్యాయం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి రాజేంద్రదర్డా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సచిన్ భారత క్రికెట్ను ప్రపంచ క్రీడాపటంలో నిలిపారన్నారు. దేశంతోపాటు రాష్ర్టం కూడా గర్వించేవిధంగా చేశాడంటూ కొనియాడారు. ఈ నేపథ్యంలో సచిన్ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో విద్యార్థులుకూడా ఆయన గురించి తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాఠ్యాంశంలో అతను సాధించిన విజయాలు, గొప్ప జీవితచరిత్ర తదితర అంశాలను వివరించనున్నారు. అయితే దీనిని ఏ తరగతిలో ఉంచాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నారు. త్వరలో జరగనున్న సమావేశంలో కొత్త పాఠ్యాంశాన్ని ఏ తరగతిలో ప్రారంభించాలి? ఏౌ విషయాలను పొందుపర్చాలనే అంశంపై చర్చిస్తామన్నారు. కాగా మహారాష్ట్ర నవనిర్మాణ్ విద్యార్థి సేన, మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ అసోసియేషన్లతోపాటు అనేక సంస్థలు సచిన్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా లేఖలు కూడా రాశాయన్నారు. సచిన్ టెండూల్కర్, ‘, క్రీడాభిమానులు, Sachin Tendulkar, ‘భారతరత్న’, Riket sports fans -
పాఠ్యపుస్తకాల్లోనూ మార్పులు!
తెలంగాణ రాష్ట్రం నేపథ్యంలో మారనున్న ముఖచిత్రం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యయంలో పాఠశాల విద్యాశాఖలో పరిస్థితిపై చర్చలు ఊపందుకున్నాయి. విద్యాశాఖ, దాని కార్యకలాపాలు ఎలా ఉండనున్నాయన్న విషయంలో వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే పాఠశాల విద్యా శాఖ ముఖచిత్రమే మారిపోతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో అనేక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేవి పాఠ్య పుస్తకాలే. కాబట్టి ముఖ్యంగా తెలుగు, సాంఘిక శాస్త్రం వంటి పుస్తకాల్లోని పాఠ్యాంశాల్లో ఎక్కువ మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. పాలకుల అభీష్టం మేరకు కొత్త రాష్ట్రంలో అనుసరించాల్సిన విద్యా విధానాలు, విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై అధ్యయనం చేసి, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాల్సి వస్తుందని చెబుతున్నారు. మారనున్న రాష్ట్ర గేయం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యాశాఖ పరంగా ముందుగా రెండు వేర్వేరు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఉమ్మడి రాజధానిలో ప్రత్యేక డెరైక్టరేట్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అవి ముందుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ కొత్తగా ఏర్పాటయ్యే ఆయా సంస్థలు ఆయా రాష్ట్రాల్లోని స్థానిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసుకుంటారు. మరోవైపు తెలుగు ప్రజలంతా ప్రస్తుతం ఆలపిస్తున్న రాష్ట్ర గేయం ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ..’ గేయాన్నే రెండు రాష్ట్రాల్లో ఆలపిస్తారా? లేదా మార్చుకుంటారా? అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. తెలంగాణ ఉద్యోగులు మాత్రం రాష్ట్ర గేయాన్ని మార్చక తప్పదని అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందే తెలంగాణ ఉద్యోగులు ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయ కేతనం...’ గేయాన్ని రూపొందించుకున్నారు. దీంతోపాటు మరో రెండు గేయాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. సాంఘిక, తెలుగు పుస్తకాల్లోనే చాలా మార్పులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రధాన సబ్జెక్టులైన సామాన్యశాస్త్రం, గణిత శాస్త్రం పుస్తకాల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఇంగ్లిష్ విదేశీ భాష, హిందీ జాతీయ భాష కావడంతో ఆ పుస్తకాల్లోనూ పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాదు. అయితే భాషా, సంస్కృతీ సంప్రదాయాలు, కళలు, కళాకారులు, సాంఘిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక పరిస్థితులకు పెద ్దపీట వేసి తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో మార్పులు చేయాల్సి వస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకున్న పుస్తకాల్లో స్థాయిని బట్టి మార్పులు ఉండొచ్చు. వీటిల్లోనూ జాతీయ, అంతర్జాతీయ పాఠ్యాం శాల్లో పెద్దగా మార్పులు ఉండవు. రాష్ట్ర విభజనతో సరిహద్దులు మారుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల సరిహద్దులు, భౌగోళిక అంశాలు, సహజ వనరులు వంటి అంశాలతో ప్రత్యేకంగా పాఠ్యాంశాలు ఉంటాయి. సాంఘిక శాస్త్రంలో ఆయా రాష్ట్రాల కొత్త చిత్రాలు ముద్రించాల్సిందే. అలాగే ప్రత్యేక రాష్ట్ర విభజనపైన పాఠ్యాంశాలు చేర్చే అవకాశముంది.