Shekar Kammula
-
నాని - సాయిపల్లవి కాంబినేషన్ రిపీట్.. డైరెక్టర్ ఎవరు అంటే?
-
విజయ్ దొవరకొండపై శేఖర్ కమ్ముల సంచలన కామెంట్స్
-
వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర..
-
మూడు భాషలను టార్గెట్ చేసిన ధనుష్
బహుభాషా నటుడు ధనుష్ వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ హీరో కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 2024 సంక్రాంతి బరిలోకి దిగనుంది. పిరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈయన తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇది ఈయన దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం గమనార్హం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రంతో పాటు ధనుష్ తన 51వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్న నాయకిగా నటించనున్నారు. ఈమె ధనుష్ సరసన నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా ఈ చిత్రం మొదట తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నట్టు వార్త ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హిందీలోనూ ఏకకాలంలో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కోలీవుడ్లో స్టార్ నటుడైన ధనుష్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్లోనూ ఇప్పటికే రెండు చిత్రాలు చేశారు. దీంతో ఈయన 51వ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని నిర్మాతలు ముందుగానే భావించినట్లు సమాచారం. ఇది రాజకీయ మాఫియా నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్ర షూటింగ్ జనవరిలో ముంబైలో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. -
సాయి పల్లవిని హీరోయిన్ గా వద్దు అనుకున్న..కానీ..!
-
వేరే వాళ్ళ లాగా దేశాలు తిరిగి కథలు రాయను
-
నాగ చైతన్య గొప్పతనం గురించి చెప్పిన శేఖర్ కమ్ముల
-
ఈ సినిమా చూసి ఆవిడ కాల్ చేసి థాంక్స్ చెప్పింది
-
సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్ ఈ కారణంతో పోయింది: హరితేజ
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్, శ్రీవిష్ణు, అశోక్ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు 'గుంటూరు కారం') ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. -
'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్
'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్’. అదితీ శంకర్ హీరోయిన్. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్తో పని చేయాలని ఉంది' అన్నారు. 'రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్ అశ్విన్. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్ విశ్వ. -
శేఖర్ కమ్ములతో సినిమా ఎప్పుడు?
-
ఆనంద్ మూవీ చైల్డ్ అర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకం చెప్పన్కర్లేదు. సినిమాలను తెరకెక్కించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన సినిమాలంటే ఎలాంటి యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. రియలస్టిక్కు దగ్గర ఉండే ఫీల్ గుడ్ లవ్స్టోరీస్ తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. పాత్రలతో ప్రయోగాలు చేస్తారు. సెన్సిబుల్ పాయింట్తో ధైర్యం చేస్తారు. అలా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాల్లో ఆనంద్ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ఉప శీర్షిక. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గుడుస్తున్న ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. చదవండి: బాలయ్య ఫ్యాన్స్ చంపేస్తారేమోనని భయపడ్డా!: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు వెండితెరపై రియల్ లైఫ్ పాత్రలను చూస్తున్నంత అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కుటుంబ నేపథ్యంలో ఫీల్గుడ్ లవ్స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనిపించుకుంది. ఇక ఇందులో ప్రతి పాత్రకు ఆయా నటులు జీవం పోశారని చెప్పవచ్చు. అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఆనంద్ ఆనంద్ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ హీరో రాజా చూట్టు తిరిగే చిన్నారి రోల్ కూడా ఒకటి. హీరో లిటిల్ ఫ్రెండ్గా సమత రోల్ పోషించింది ఆ చిన్నారి. చెప్పాలంటే ఇందులో ప్రధాన పాత్రల్లో ఆ చిన్నారి రోల్ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆనంద్ తర్వాత ఆ చిన్నారి తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ చిన్నారి 18 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఆమె అసలు పేరు భకిత. ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భకిత మిగతా చైల్డ్ ఆర్టిస్టుల మాదిరిగా తిరిగి సినిమాల్లోకి రాలేదు. తన రూటే సపరేటు అంటూ భవిష్యత్తును కాస్తా భిన్నంగా ప్లాన్ చేసుకుంది. చదువుకుంటూనే సమాజ సేవలో పాల్గొంటుంది. చదవండి: విజయ్ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో తన 17 ఏళ్ల వయసు నుంచి మహిళల హక్కుల కోసం, ఆడవాళ్ల హక్కులు గురించి పోరాడుతుంది. అంతేకాదు పిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యచారాలు, అఘాత్యాయిలను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ఉద్యమం చేస్తుందట. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్గా ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న భకిత ఇప్పుడు సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. -
డీఏవీ స్కూల్ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల
హైదరాబాద్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. సదరు స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదన్నారు. చదవండి: మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్ ‘డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరమైన సంఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నా. ఎంతో ధైర్యంతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు జోహర్లు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకూడదు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించినవారమవుతాం’ అన్నారు. #DAVPublicSchool pic.twitter.com/JLpFVpRLLp — Sekhar Kammula (@sekharkammula) October 21, 2022 -
రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధన్యవాదాలు
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల భారత స్వతంత్ర్య వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) ఉదయం ఆటను శేఖర్ కమ్ముల విద్యార్థులతో కలిసి దేవి థియేటర్లో చూశారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ.. వందల మంది విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా.. ‘ఈ రోజు ఉదయం దేశి థియేటర్లో గాంధీ సినిమాను వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదోక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రాహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తుంటే గర్వంగా అనిపించింది. లాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి’ అని పిలుపునిచ్చారు. అలాగే భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు -
ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి
ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూమార్తె జాన్వి వివాహ వేడుక గురువారం రాత్రి హైదబాద్లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధమిత్రుల సమక్షంలో ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేసింది. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్తో పాటు నిర్మాతలు సురేశ్ బాబు, సి. కల్యాణ్, నాగవంశీ, మిర్యాల రవీందర్రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: 10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్ అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీల్ నారంగ్కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల ఈ బ్యానర్లో వచ్చిన లవ్స్టోరీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో పలు ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల-ధనుశ్ కాంబినేషన్లోని ఓ చిత్రం కాగా.. అనుదీప్-శివ కార్తికేయ కాంబోలో రూపొందుతున్న ప్రిన్స్ మూవీ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇల్లు కాలిపోయి కుటుంబంతో సహా రోడ్డున పడ్డ ఓ రైతుకు అండగ నిలిచి ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా నేలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే రైతు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతడు నివాసం ఉంటున్న గుడిసే పూర్తిగా దగ్ధం అవ్వగా.. భూమి అమ్మగా వచ్చిన డబ్బు సైతం కాలిపోయింది. దీంతో దిక్కుతోచన స్థితిలో ఉన్న ఆ రైతుకు శేఖర్ కమ్ముల లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. చదవండి: ముంబైలో పూరీని చూసి ఎమోషనల్ అయిన ఫ్యాన్.. వీడియో వైరల్ లక్ష్మయ్య బ్యాంక్ అకౌంట్కే ఆ డబ్బును నేరుగా ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. సూర్యాపేటకు చెందిన కప్పల లక్ష్మయ్య తన సోదరులతో కలిసి ఇటీవల తమకు ఉన్న వ్యవసాయ భూమిని అమ్మారు. అందులో లక్ష్యయ్య వాటాగా రూ.10 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం అతడు గుడిసెలో ఉంటున్నాడు. ఆ డబ్బుతో ఇల్లు నిర్మించుకుందామని భావించాడు. 10 లక్షల రూపాయల్లో రూ. 6 లక్షలను ఇంట్లోని బీరువాలో పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇటివల తన ఇంట్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో అతడి గుడిసెతో పాటు డబ్బులు కూడా కాలిపోవడంతో లక్ష్మయ్య రోడ్డున పడ్డాడు. చదవండి: Megastar Chiranjeevi: చిరు వాయిస్తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ -
శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్లుక్
‘కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్గోల్డ్ ఫిష్’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్రాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి హీరోయిన్గా సందడి చేయనుంది. తేజస్వీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్లుక్ ఇంప్రెసివ్గా ఉంది అన్నారు. చిత్రం కూడా ప్రేక్షకులు అలరించేలా ఉంటుందని అనుకుంటున్నా. ఈ మూవీ విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకురావాలని ఆశిస్తున్నా’ అన్నారు శేఖర్ కమ్ముల. అలాగే దర్శక నిర్మాత సందీప్ గోపిశె ట్టి మాట్లాడుతూ ‘ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో మా చిత్రం ఫస్ట్లుక్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. ఆడియన్స్ సర్ఫ్రైజ్గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ను విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్, భీమనేని శ్రీనివాస్, దేవి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా. శేషసాయి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
‘లవ్స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
Anchor Suma Comments Husband Rajeev Kanakala Over Love Story Movie: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ చూసిన అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ తన భర్త రాజీవ్ కనకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక ‘లవ్స్టోరీ’ మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సుమ ట్వీట్ చేస్తూ.. ‘కొందరూ నటులు పాత్రలో లీనమై నటిస్తారు. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందా! అన్నట్లు నటిస్తారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కూడా అలాంటి అద్భుతమైన నటులలో ఒకరు. అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన రాజీవ్కు శుభాకాంక్షలు. ఈ రోల్ చేయడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. కానీ ఈ పాత్ర ద్వారా నువ్వు ఎంతో మంది జీవితాలను ఇంపాక్ట్ చేశావు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే అలాగే ‘లవ్స్టోరీ చిత్రంలో ఇలాంటి సెన్సిబుల్ లైన్ తీసుకుని సెన్సీటీవ్గా చూపించిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవిలు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తూ నా కళ్లు తిప్పుకోలేక పోయాను, రెప్పలు కొట్టకుండా అలానే చూస్తుండిపోయాను. దీంతో నా కళ్లు అలసిపోయాయి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించింది. అలాగే మూవీ టీం మొత్తానికి సుమ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. కాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల తన సొంత అన్న కూతురిని చిన్నప్పుడు లైంగికంగా వేధించిన పాత్రలో నటించాడు. సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను నమ్మి ఆయన ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్స్టోరీ సక్సెస్ మీట్లో రాజీవ్ క్యారెక్టర్పై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ ఒప్పుకున్నాడంటే ముందు ఆయన భార్య సుమ కనకాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మా మూవీకి ఇంతటి ఆదరణ లభించిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. There are a very few actors who can make us so deeply involved with their performance and my dearest hubby Rajeev Kanakala @RajeevCo is one among them. Congratulations to you for such a wonderful role, I know you felt bad doing the character but you have impacted many lives (1/3) pic.twitter.com/ucL5mI3t90 — Suma Kanakala (@ItsSumaKanakala) September 30, 2021 -
శేఖర్ కమ్ములతో గరం సత్తి ముచ్చట్లు
-
ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించారు: నాగ చైతన్య
Naga Chaitanya Love Story Movie: అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్స్టోరీ’ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 24న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారత్లోనే కాకుండా అమెరికా థియేటర్లలో కూడా ‘లవ్స్టోరీ’ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో మూవీ టీం లవ్స్టోరీ సక్సెస్ మీట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు మిగతా సినిమా క్రూడ్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ‘లవ్స్టోరీ’ టీంకు కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: ‘లవ్స్టోరీ’: ముద్దు సీన్పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు కాగా ఈ సినిమాలో నాగ చైతన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన దళిత యువకుడి పాత్రలో కనిపించాడు. తన స్వయం శక్తితో ఎదిగి జుంబా మాస్టర్గా చై నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అగ్ర వర్గానికి చెందిన యువతిగా సాయి పల్లవి నటించింది. ఇందులో ఆమె ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న అమ్మాయిగా కనిపించింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబులు సైతం ఫిదా అయి సాయి పల్లవిని ప్రశంసించారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య Team #lovestory !! Thank you so much .. you guys have given me memories for a lifetime .. pic.twitter.com/oMbfgwJk0M — chaitanya akkineni (@chay_akkineni) September 30, 2021 -
కన్నీళ్లు వచ్చాయి, చైతూతో కొత్త జర్నీ స్టార్ట్ చేయించాడు: నాగార్జున
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లవ్స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలై పాజటివ్ టాక్తో దూసుకెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోందీ. దీంతో మూవీ యూనిట్ మంగళవారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన అక్కినేని నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘ లవ్ స్టోరీ అనే సినిమా తెలుగు సినిమాకే కాదు ఆల్ ఓవర్ సినిమా ఇండస్ట్రీకి ఓ ముందడుగు లాంటిది. ఒక మంచి సినిమా ఇవ్వండి.. మేము థియేటర్కి వస్తాము అని అంతా వచ్చారు. తెలుగు ప్రజలకు కోటి నమస్కారాలు. మా అందరికీ ఓ దైర్యం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్తో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఆనంద పడ్డారు. శేఖర్ ఓ సెన్సిటివ్ డైరెక్టర్. సెన్సిటివ్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి ఎంతో చక్కగా ఈ సినిమా రూపొందించారు. ఫుల్ లవ్ స్టోరీ చూపించడానికి పెద్ద పెద్ద సెట్స్ అవసరం లేదు. ఒక టెర్రస్ చాలు అని నిరూపించావు శేఖర్. ఫన్ లవ్ స్టోరీ నుంచి సీరియస్ టాపిక్కి తీసుకెళ్ళావు. ఇలాంటి సబ్జెక్టు నాకు ఇష్టం ఉండదు.. కానీ నేను నువ్వు చూపించిన విధానానికి కనెక్ట్ అయ్యా. ఆ సన్నివేశాలు చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. మూడు,నాలుగు రోజులవరకు నేను అదే ఫీల్లో ఉన్నా. ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా ఛీ అని ఫీలయ్యా. కొన్ని వేలమంది కళ్లు తెరిపించాడు శేఖర్. పవన్ ఎంతో చక్కని మ్యూజిక్ అందించారు. అశోక్ తేజ మీరు మాకు ఇంకా మరిన్ని పాటలు రాయాలి. మా జనరేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సాహిత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ వంద సాయి పల్లవులు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదో క్లాసిక్ మూవీ. చైతన్యను చూస్తుంటేనే నాకు జనరల్గానే కడుపు నిండి పోతుంది. ఈ సినిమా చూశాక మొత్తం కడుపు నిండిపోయింది. చైతన్యను ఓ స్టార్ యాక్టర్గా రెడీ చేసి కొత్త జర్నీ మొదలు పెట్టించావు. థాంక్యూ శేఖర్. చైతూ చాలా బాగా నటించాడు. ప్రేమ్ నగర్ విడుదలైన 50 ఏళ్ల తర్వాత అదే తేదికి లవ్ స్టోరీ విడుదలైంది. తుఫాన్, సైక్లోన్, కోవిడ్తో పోరాడి లవ్స్టోర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది’ అని నాగ్ అన్నారు. అలాగే కరోనాపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలో ఎంతో చక్కగా పోరాడాయని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్లు సరైన సమయంలో కరోనాపై సరైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 208 రోజుల తర్వాత తెలంగాణలో ఒక్క కరోనా మరణం లేదని, దీనికి మనమంతా సంబురాలు జరుపుకోవాలన్నారు. సినీ పరిశ్రమను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎల్లప్పుడూ చల్లగానే చూశాయని, ఇకపై కూడా మమల్ని చల్లగా ఆశీర్వదించాలని కోరారు. నారాయణ్దాస్ నారంగ్ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్కి థ్యాంక్స్. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్ వచ్చింది’’ అన్నారు. శేఖర్ కమ్ముల, నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్ వస్తారా? రారా? అనే టైమ్లో వారు థియేటర్స్కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్గారి కంటెంట్ పవర్ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది. సినిమా స్టార్ట్ చేశాక శేఖర్గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) «థ్యాంక్స్. ‘లవ్స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్కి వెళ్లా. వారి రియాక్షన్ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్ బాబు, సుద్దాల అశోక్తేజ, భాస్కర భట్ల, పవన్ సీహెచ్, మంగ్లీ, రోల్ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. -
మహేశ్ కామెంట్స్పై స్పందించిన సాయి పల్లవి
Sai Pallavi Respond On Mahesh Babu Tweet: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్స్టోరీ’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన ఈ మూవీ ఇండియాలోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు విశేష స్పందన వస్తోంది. దీంతో టాలీవుడ్లో ఎక్కడ చూసినా లవ్స్టోరీ మూవీ గురించే చర్చించుకుంటారు. అంతేగాక లవ్స్టోరీపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీపై తన రివ్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘లవ్స్టోరీ’ రికార్డు కలెక్షన్స్ ఈ సందర్భంగా ఆయన సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు. తన ట్వీట్లో సాయి పల్లవి గురించి బెబుతూ.. ‘ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆమెకు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం ఇంతవరకు చూడలేదు’ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన సాయి పల్లవి, మహేశ్ కామెంట్స్పై స్పందించింది. మహేశ్ ట్వీట్కు సమాధానం ఇస్తూ.. ‘మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివించింది సార్’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరు కూడా ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి: A R Rahman: 'అవును మహేశ్.. మేమందరం గర్వపడుతున్నాం' Woah🙈 It’s going to take me a while to come back to my senses!!! I’m humbled by your generous words ☺️ Thank you so much Sir 🙈 P.S. The fan girl in me has already read your tweet a million times 🙈 — Sai Pallavi (@Sai_Pallavi92) September 26, 2021 లవ్స్టోరీ సినిమా చూసిన మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్స్టోరీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఆయన ట్వీట్కు ఎఆర్ రెహమాన్ కూడా స్పందిస్తూ ధన్యవాదలు తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: 'లవ్స్టోరీ' సినిమాపై మహేశ్బాబు రివ్యూ -
‘లవ్ స్టోరీ’ మూవీ ట్విటర్ రివ్యూ
టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు లవ్ స్టోరీ మూవీ టాపిక్కే వినిపిస్తోంది. ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ సినిమా చేశాడు. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. (చదవండి: Love story Review: చైతూ, సాయిపల్లవిల ‘లవ్స్టోరీ’ హిట్టా? ఫట్టా?) ఇలా భారీ అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్తో హైదరాబాద్లోని థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 900పైగా థియేటర్లలలో ఈ మూవీ విడుదలైంది. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలను ఈ మూవీలో బాగా చూపించారని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ పంచి, సెకండాఫ్ వచ్చేసరికి సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవిల నటన అయితే అదిరిపోయిందట. సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్ టాక్ వినిపిస్తోంది. అయితే రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారని, సినిమాలో చెప్పుకోదగిన కొత్త సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #LoveStory movie getting avg reviews..saying that ending is abrupt.They all have watched movie with high expectations.Lets reduce the expectations and prepare our mind for abrupt climax..Then surely will enjoy it😍😍 — Sreeram (@sreeram0106) September 24, 2021 #LoveStory seriou emotional Lead pair @chay_akkineni and @Sai_Pallavi92 are the soul.Chaitu’s acting 👌bgm and songs 😍 sensitive topics raise chesaru but abruptly ended. One time watch! — akhil_maheshfan2 🔔 (@Maheshfan_1) September 24, 2021 #LoveStory Overall an Average Emotional Love Story! NC and Sai Pallavi were great on the screen together! The life of the film is the Music and BGM. Movie had some good moments that were vintage SK but some repetitive scenes that were boring as well. Rating: 2.75/5 — Venky Reviews (@venkyreviews) September 23, 2021 Review & Ratting : #LoveStory Music., LEAD pairs ., 👍 LoveStory is predictable drama .., offers nothing new expect few sequences & fresh music keeps us HOOK !! Have to wait & see how family audience receives . (2.5/5) https://t.co/rxPYriHs7k — Inside talkZ (@Inside_talkZ) September 24, 2021 Too many emotions . . Lead pair done their best . Kammula sir inkoncham gattiga work cheyalsindi. . — Super⭐️ Fan 🦁 (@Ravianenenu) September 24, 2021 Burning issue in the society is being dealt sensibly by Kammula. — TrackTollywood (@TrackTwood) September 23, 2021 #LoveStory Blockbuster 💥💥 Super 1St half ❤ Excellent Second Half 🔥🔥 Class Movie Tho #NagaChaitanya Mass Chupisthadu pakka 💥💥💥💥 Families Tho theatre's Housefulls avuthayi pakka 👍💥 — Balaji (@BaluPKfan) September 24, 2021 #LoveStoryreview : Amazing script. Fantastic acting from Chay and Sai Pallavi. Entire love track was very fresh as you’d expect from Sekhar Kammula. A little dragged second half but a solid message. 3/5 #LoveStory Worth watching in theatres. 👍🏼👍🏼 — Chaitanya Somavajhala (@ChaitanSrk) September 24, 2021 #LoveStory Review... Slow Start But Great End 👏 👉 @chay_akkineni & @Sai_Pallavi92 Nailed The Show 😍 & Dance Moves Are Top Notch💥 👉 @sekharkammula Dealed With sensitive In his way 👌 👉 Music & Bgm Are Soul Of The Movie 🕶#LoveStoryreview #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/iFqGphRlpP — NEW UPDATES (@OTTGURUJINITHIN) September 24, 2021 Movie BoxOffice ResultDepends On How Audience Accepts Last 30Mins👍#LoveStory #LoveStoryReview #NagaChaitanya #SaiPallavi #SekharKammula #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/PFoVjcCE6o — cinee worldd (@Cinee_Worldd) September 24, 2021 BLOCKBUSTER 💥💥💥#loveStory #LoveStoryReview — Akhileeyyy (@iamkrzzy__45) September 24, 2021 #LoveStoryReview 1st Half Report: #LoveStory 1st Half as a whole did not seem to be in the range that the fans were expecting. Some high moments, BGM and songs are entertaining here and there. https://t.co/qrMfDrwxYw#LoveStoryOnSep24th #NagaChaitanya #saipallavi https://t.co/AdikWVGlf5 — Daily Culture (@DailyCultureYT) September 23, 2021 #LoveStory Decent 1st Half 👌 B G M 👍@chay_akkineni & @Sai_Pallavi92 👍 https://t.co/s4B7M9dX3N — koti ! 🎬🎥 (@koti7711) September 24, 2021 Just finished watching #LoveStory @chay_akkineni @Sai_Pallavi92 Wow 🤩! Just brilliant. #Sekhar Kammula Best at storytelling! @chay_akkineni well done 👍🏻 broh! — HK (@khs3737) September 24, 2021 -
Love Story:‘‘ఫిదా’కు వద్దన్నారు..‘లవ్స్టోరీ’ పిలిచి మరీ ఇచ్చారు’
‘‘ఫిదా’ సినిమా కోసం శేఖర్ కమ్ములగారికి నేను పంపిన పాటలు నచ్చాయి. అయితే ‘ఫిదా’ నాకు చాలా ముఖ్యం.. ఈ సమయంలో కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారాయన. ‘లవ్స్టోరీ’ సినిమాకు మాత్రం పిలిచి అవకాశం ఇచ్చారు’’ అని సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘లవ్స్టోరీ’. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారు, నాన్నగారు విజయ్ సినిమాటోగ్రాఫర్స్గా చేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. చదువు పూర్తయ్యాక సంగీతం నేర్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో ఏఆర్ రెహమాన్గారికి నా కంపోజిషన్ నచ్చి, సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆయనతో ‘శివాజీ, రోబో, సర్కార్’ వంటి చిత్రాలు చేశాను. ‘లవ్స్టోరీ’ విషయానికొస్తే... ‘పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి.. అంతకంటే ఇంకేం వద్దు’ అన్నారు శేఖర్గారు. కంపోజిషన్లో ఆయన ఇచ్చిన సలహాలు అద్భుతం. ఆయనకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ‘సారంగ దరియా..’ను బాగా చేయాలని చెప్పి చేయించారు. ‘లవ్స్టోరీ’ పాటలు మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా తృప్తిగా ఉంది. ఈ చిత్రంలోని పాటలు రెహమాన్గారికి పంపాలంటే భయమేసింది. కానీ నా మిత్రులు కొందరు నా పాటలు బాగున్నాయని ఆయనతో చెప్పారట. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’’ అన్నారు. -
Love Story: రేవంత్, మౌనికల ప్రేమకథకు ముహూర్తం ఫిక్స్
రేవంత్, మౌనికల ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రావడానికి తేదీ కుదిరింది. నిజానికి వీరి ప్రేమకథ ఎప్పుడో తెరకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా ‘లవ్ స్టోరీ’ని వాయిదా వేస్తూ వచ్చాం. సినిమాని చూపించడానికి మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఆ టైమ్ వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు. -
మరోసారి వాయిదా పడిన ‘లవ్స్టోరీ’, మూవీ టీం వివరణ
ప్రస్తుతం టాలీవుడ్లో విడుదల కాబోయే పెద్ద సినిమాల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’ ఒకటి. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా నిర్ణయించుకుని ఇంతకాలం వెయిట్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోవడంతో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా ఆ తేదీ రానే వచ్చింది. కానీ లవ్స్టోరీ మాత్రం థియేటర్లోకి రాలేదు. దీంతో ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ ఈ నేపథ్యంలో మరోసారి ‘లవ్స్టోరీ’ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ను షేర్ చేస్తూ.. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడూ లవ్స్టోరీ మీకు అందించాలా అని మేము కూడా ఆసక్తిగా ఉన్నాం. ఈ మేరకు సెప్టెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా మూవీని విడుదల చేయబోతున్నాం’ అంటూ మేకర్స్ స్పష్టం చేశారు. కాగా కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ దేవయాని కీలక పాత్ర పోషించగా.. రావు రమేశ్ .. పోసాని కృష్ణ మురళి ముఖ్యమైన ప్రధాన పాత్రలు పోషించారు. #LoveStory from 24th September, 2021 in theatres near you. Good Luck @chay_akkineni 👍#NagaChaitanya pic.twitter.com/rCH90xMavQ — Subba Raju (@SubbarajuSiva) September 10, 2021 -
‘లవ్స్టోరీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్స్టోరీ’ ఒకటి. ఫిదా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడం .. చిన్న సినిమాలు ధైర్యంగా ముందుకు వస్తుండటం మొదలైపోయింది. దాంతో 'లవ్ స్టోరీ' ఎప్పుడు విడుదల కానుందనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా మేకర్స్ 'వినాయకచవితి' పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. -
పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ స్టార్స్, అదే అందరి టార్గెట్
భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాపై దృష్టి పెట్టారు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచ మార్కెట్ మీదనే కన్నేశారు. గతంలో మాదిరి ఒక భాషకి పరిమితం కాకుండా... రెండు మూడు భాషలు లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్గా ఎదగాలనేదే అందరి టార్గెట్. అందుకే పాన్ ఇండియా లెవెల్లో కొత్త కాంబినేషన్స్కు ట్రెండ్ ఊపందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా దలపతి విజయ్ హీరో గా తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరో 6 నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు దర్శక, నిర్మాతలు. ఇక మరో తమిళ స్టార్ ధనుష్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయునున్నాట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా నెక్ట్ జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది అని టాక్. అంతే కాకుండా ధనుష్ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ చరణ్ 15 వ సినిమాగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు . సుమారు 500 కోట్ల తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమా ద్వారా ఇండియన్ పొలిటికల్ సిప్టమ్ మీద స్ట్రాంగ్ సెటైర్స్ వేయనున్నారట శంకర్. అంతే కాకుండా ఈ పాన్ ఇండియా మూవీలో అమితా బచ్చన్ ఓ కీలకపాత్ర పోషించనున్నారు . కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మెదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండు షెడ్యూల్ లోకి కూడా అడుగుపెట్టారు చిత్ర యూనిట్. సుమారు 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి . దీంతో పాటు ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్తో ఓ సినిమా చేయబోతున్నాడట ప్రభాస్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ లో ఈ సినిమా తెరకెక్కనుంది అని టాక్. రామ్తో తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ మధ్యనే సినిమా స్టార్ట్ చేసారు.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది . ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా మురగాదాస్ దర్శకత్వంలో గజనీ 2 సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు నిర్మాత అల్లు అరవింద్. సూర్య కోసం బోయపాటి శ్రీను ఓ భారీ యాక్షన్ ధ్రిల్లర్ను రెడీ చేసాడట. శివకార్తికేయన్ కోసం 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కథలు సిద్ధం చేశారు అని తెలుస్తుంది . 'రాక్షసుడు-2' చిత్రం కోసం విజయ్ సేతుపతి రంగంలోకి దిగే అవకాశాలున్నాయనీ కూడా ప్రచారం సాగుతోంది. -
వెంకీ.. శేఖర్... ఓ సినిమా!
వెంకటేష్ స్పీడ్ మాములుగా లేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల (‘నారప్ప’, ‘ఎఫ్ 3’, ‘దృశ్యం2’)ను విడుదలకు సిద్ధం చేస్తున్న వెంకటేష్ తాజాగా మరో సినిమాకు పచ్చజెండా ఉపారని సమాచారం. ఇటీవల శేఖర్ కమ్ముల చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారట వెంకీ. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్స్టోరీ’ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు శేఖర్ కమ్ముల. ‘లవ్స్టోరీ’ వచ్చే నెల 16న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత వెంకీకి చెప్పిన స్క్రిప్ట్పై మరింత దృష్టి పెడతారట శేఖర్. ఇక వెంకీ నటిస్తున్న ‘నారప్ప’ మే 14న, ‘దృశ్యం 2’ జూలైలో, ‘ఎఫ్ 3’ ఆగస్టు 27న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. -
లవర్బాయ్గా చైతన్య అదుర్స్ : ఫిదా చేస్తున్న పల్లవి
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంట నటిస్తున్న ‘లవ్స్టోరీ’ చిత్రానికి సంబంధించి మరో సాంగ్ గురువారం విడులైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ చిత్రం లోని ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘ఏవో ఏవో కలలే’ పాటను ప్రిన్స్ మహేష్బాబు లాంచ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ టీజర్కు సూపర్ రెస్పాన్స్ రాగా, పాటలు కూడా దుమ్ము రేపుతున్నాయి.. తాజాగా రెయిన్ సాంగ్తో దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన స్టైల్ను చూపించాడు. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యానికి, పవన్ సిహెచ్ స్వరాలు కూర్చగా జోనితా గాంధీ, నకుల్ అభ్యాంకర్ ఆలపించిన ఈ గీతం టాక్ ఆఫ్ది లవర్స్గా నిలుస్తోంది. దీనికి తోడు నా ఫ్యావరేట్ సాంగ్ వచ్చేసిందోచ్ అంటూ సమంతా అక్కినేని ట్వీట్ చేయడం విశేషం. తాజా పాటలో మలయాళ బ్యూటీ సాయి పల్లవి తన డ్యాన్స్ మ్యాజిక్తో ఆకట్టుకోవడం ఖాయం. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సాయిపల్లవి వర్షంలో లుక్స్కి ఫ్యాన్స్ను ఫిదా అవుతున్నారు. అటు మహేష్ చేతులమీదుగా నాగచైతన్య లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ కావడం అభిమానుల్లో మరింత జోష్ ను నింపింది. దీనికి తోడుఇటీవల విడుదలైన సెన్సేషనల్ ‘సారంగ దరియా’ సాంగ్ సృష్టించిన సంచలనంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.. ఏప్రిల్ 16న థియేటర్లను పలకరించేందుకు రడీ అవుతోంది. Yayyyyyyy ❤️❤️❤️.. My favourite song is out 💃💃💃 #EvoEvoKalale #LoveStory @chay_akkineni https://t.co/EsaXxbkxsG@pawanch19 @bhaskarabhatla@NakulAbhyankar @jonitamusic @sekharkammula @SVCLLP @sai_pallavi92 #AmigosCreations @adityamusic @niharikagajula — Samantha Akkineni (@Samanthaprabhu2) March 25, 2021 -
నటుడిగా రానా బాగా ఎదిగాడు: వెంకటేష్
‘‘ప్రకృతితో మనందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనమందరం బాధ్యతగా ఉండాలి. ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ‘అరణ్య’ సినిమా చూశాను. అందరం గర్వపడేలా ఉంది’’ అన్నారు వెంకటేష్. రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘లీడర్’, ‘ఘాజీ’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసిన రానా యాక్టర్గా నేర్చుకుంటున్నాడని అనుకున్నాను. కానీ ‘అరణ్య’ సినిమాలోని పాత్రలో తను ఒదిగిపోయిన తీరు చూస్తుంటే.. నటుడిగా బాగా ఎదిగాడనిపించింది. ఇండియన్ స్క్రీన్ పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. జంతువుల హావభావాలను కెమెరాలో షూట్ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్ అండ్ టీమ్ బాగా తీశారు’’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘రానా ఎప్పుడూ విభిన్నమైన సినిమాలే చేస్తాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్ సూపర్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘సాధారణంగా నువ్వు ఎవరు? అని తెలుసుకోవాలని అంటారు. కానీ ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో ఈ సినిమా నాకు నేర్పించింది. ప్రభు సాల్మన్ బాగా డైరెక్ట్ చేశాడు. ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళతారు’’ అని రానా అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగుకి పరిచయమవుతున్నందుకు హ్యాపీ. నేను హైదరాబాద్ అల్లుణ్ణి కానున్నాను. త్వరలో గుత్తా జ్వాల (బ్యాడ్మింటన్ ప్లేయర్), నేను పెళ్లి చేసుకోబోతున్నాం’’ అన్నారు విష్ణు విశాల్. ‘‘మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని వీడియో సందేశం పంపారు ప్రభు.‘‘ప్రాణం, మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేందుకు ‘అరణ్య’ ఓ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. ‘‘నేను హైదరాబాదీ అమ్మాయిని. నా ఫస్ట్ తెలుగు మూవీ ‘అరణ్య’. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు జోయా. -
ఇప్పుడు నాకే అభ్యంతరం లేదు : గాయని కోమలి
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరి’. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన తొలి తెలుగు పాటగా నిలిచింది. మరోవైపు దీనిపై వివాదం కూడా అదే స్థాయిలో నెలకొంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ గాయని కోమలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ పాటను తనతోనే పాడిస్తానని మాటిచ్చి, మోసం చేశారని తన బాధను చెప్పుకుంది. తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు గాయని కోమలి..శేఖర్కమ్ములను కలిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..'సారంగ దరియా పాట విషయంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలోనూ స్టేజీ మీద సారంగ దరియా పాటను నాతోనే పాడిస్తానన్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు డైరెక్టర్ శేఖర్కమ్ముల సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. భవిష్యత్లో తన సినిమాలో జానపద పాట పాడించే అవకాశం వస్తే తప్పకుండా కోమలికి అవకాశం ఇస్తానని తెలిపారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి : ('సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు') (సాయి పల్లవి దెబ్బకు ‘బుట్ట బొమ్మ’ ఔట్!) -
సాయి పల్లవి దెబ్బకు ‘బుట్ట బొమ్మ’ ఔట్!
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరి’. ఈ మూవీ విడుదలకు ముందే మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ విడుదలైన ‘సారంగ దరియా’ అనే పాట యూట్యూబ్ సెన్సెషనల్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట కొత్త రికార్డును సొంతంగా చేసుకుంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ రాబట్టుకుని తొలి తెలుగు పాటగా నిలిచింది. సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ మార్క్ను చేరుకుంది. ఇక ఇటీవల యూట్యూబ్లో వరుసగా రికార్డుల కొల్లగొడుతున్న ‘అలా వైకుంఠపురంలో’ మూవీలోని సూపర్ హిట్ ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు ‘సారంగ దరియా’ తరవాత ఉన్నాయి. ‘బుట్ట బొమ్మ’ పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, ‘రాములో రాములా’ పాటకు 27 రోజులు పట్టింది. అయితే గతంలో ధనుష్తో కలిసి సాయి పల్లవి చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ మాత్రం 8 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్కు రీచ్ అయి ‘సారంగ దరియా’ కంటే ముందుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించిన ‘సారంగ దరియా’ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు పవన్ సీహెచ్ సంగీతం అందించడంతో సారంగ దరియా అద్భుతమైన తెలంగాణ జానపదం గీతంగా కుదిరింది. కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావులు నిర్మాలుగా వ్యవహిరిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఏప్రీల్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సారంగదరియా.. ఇప్పట్లో ఆగేట్లు లేదయా.. లోదుస్తుల్లో బిగ్బాస్ భామ.. అక్కడ చేతులు వేసిన కుర్రాడు ఆసక్తికర విషయాలు వెల్లడించిన పవన్ స్టైలిష్ట్ -
సమ్మర్లో బ్యూటిఫుల్ ‘లవ్స్టోరీ’
నాగచైతన్య తన కొత్త ‘లవ్స్టోరీ’ని ఏప్రిల్లో థియేటర్స్లో చూపించడానికి రెడీ అవుతున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్స్టోరీ’. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావ్ నిర్మించారు. మధ్యతరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రమిది. ఇందులో చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పడం విశేషం. ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. -
దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం నెలకొంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్యంతో కొంత కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో డీఐజీగా పని చేసిన శేషయ్య పదవీ విరమణ అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. శేషయ్యకు నలుగురు సంతానం. వారిలో సినీదర్శకుడు శేఖర్ కమ్ముల చివరివాడు. శేషయ్య అంత్యక్రియలు హైదరాబాద్లోని బన్సీలాల్పేటలో శనివారం సాయంత్రం జరిగాయి. -
నాగశౌర్య లుక్ అదుర్స్
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ప్రీ లుక్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ది గేమ్ విల్ నెవర్ బీ ది సేమ్’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్తో దీనిని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగశౌర్య మునుపెన్నడు చూడని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు . లవర్ బాయ్లా కనిపించే నాగ శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు. బాడీ షేప్ బాగుందంటూ కితాబిస్తున్నారు. చదవండి: ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు! This can't be any better. My dear bro @IamNagaShaurya you are unmatchable.. Wishing the entire team of #NS20 all the best ! https://t.co/5CrjOtWeQ8 — Rohith Nara (@IamRohithNara) July 27, 2020 ఇక అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా నాగశౌర్య కొత్త సినిమా ప్రీ లుక్పై స్పందిస్తున్నారు. నారా లోహిత్ ‘లుక్ డిఫరెంట్, ఇంకా నువ్వు బెటర్ అవ్వాల్సింది ఏం లేదు. నీతో ఎవరు మ్యాచ్ అవలేరు. టీం అందరికి ఆల్ ద బెస్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ‘ఇది చూస్తుంటే అప్పుడే గెలిచినట్టు అనిపిస్తోంది. ఈ ఫోటోలో అద్భుతంగా కనిపిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు దర్శకుడు శేఖర్ కమ్ముల ‘నారాయణదాస్ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. On Narayan Das Ji’s Birthday, delighted to launch the Superb FIRST LOOK of @IamNagashaurya’s next #NS20. Wishing the entire team a grand success!#NarayanDas #RamMohan @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 #KetikaSharma @kaalabhairava7 #NS20FirstLook pic.twitter.com/F245JJZ6b1 — Sekhar Kammula (@sekharkammula) July 27, 2020 -
‘థాంక్యూ శేఖర్ కమ్ముల’
గాంధీఆస్పత్రి: ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్కమ్ముల చూపించిన ఔదార్యానికి జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది విభిన్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో బుధవారం ‘థాంక్యూ శేఖర్ కమ్ముల గారు’అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి నెల రోజుల పాటు ప్రతిరోజు బాదంమిల్క్, బటర్ మిల్క్ అందిస్తానని పద్మారావునగర్కు చెందిన శేఖర్కమ్ముల ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని గత నెల 27న మంత్రి తలసాని సమక్షంలో ప్రారంభించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన శేఖర్ కమ్ముల సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మీకు ఏమి ఇచ్చినా తక్కువేనని స్పష్టం చేశారు. -
‘లవ్స్టోరీ’ సినిమా స్టిల్స్
-
పండగ బ్రేక్
‘లవ్స్టోరీ’కి పండగ బ్రేక్ ఇచ్చారు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్స్టోరీ’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహ¯Œ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ముగిసింది. ఈ సంక్రాంతికి బ్రేక్ ఇచ్చి, ఆ వెంటనే తర్వాతి షెడ్యూల్ను మొదలుపెట్టాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇదే చివరి షెడ్యూల్ అని, పాటలతో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ సంక్రాంతికి అక్కినేని ఫ్యాన్స్కి చిత్రబృందం ఓ సర్ప్రైజ్ ఇవ్వనుందట. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. -
లవ్స్టోరీకి డేట్ లాక్
నాగచైతన్యకు టీచర్గా మారారు శేఖర్ కమ్ముల. ఏం పాఠాలు నేర్పించారంటే తెలంగాణ యాస మాట్లాడేందుకు శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘లవ్స్టోరీ’ సినిమాలో నాగచైతన్య పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. మలి షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్లో మొదలైంది. ఈ ‘లవ్స్టోరీ’ విడుదలకు డేట్ లాక్ చేశారని సమాచారం. ఏప్రిల్ 2న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చే యువకుడిగా నాగచైతన్య, కలను నిజం చేసుకోవాలనుకునే తపనతో తన ఊరి నుంచి హైదరాబాద్ చేరుకునే యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎలా ప్రేమ చిగురించింది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. -
దర్శకులుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
డాక్టర్ను కాబోయి యాక్టర్నయ్యానని చాలా మంది నటులు చెబుతుంటారు. అయితే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లం కాబోయి డైరెక్టర్లమయ్యామంటున్నారు నేటితరం దర్శకులు. దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల మొదలుకుని నిన్నటి క్షీరసాగర మథనం దర్శకుడు అనిల్ పంగులూరి వరకు పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఐటీ రంగం నుంచి ఎందరో ప్రతిభాశాలురు దర్శకులుగా పరిచయమవుతున్నారు. శేఖర్ కమ్ముల స్ఫూర్తిగా చాలా మంది యువ దర్శకులు సాఫ్ట్వేర్ కొలువులను పక్కనబెట్టి దర్శకత్వంలో రాణిస్తున్నారు. హిట్ సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఇప్పుడంతా ఐటీ రంగం నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల హవా కొనసాగుతోంది. – బంజారాహిల్స్ సాక్షి, హైదరాబాద్ : ప్రస్థానం చిత్ర దర్శకుడు దేవా కట్టా, గౌతం (జెర్సీ), తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు) వెన్నెల కిశోర్ (జఫ్పా), ప్రవీణ్ సత్తారు (గరుడవేగ), శ్రీహర్ష మందా (రామచక్కని సీత), సందీప్ (అర్జున్రెడ్డి), మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), నీలకంఠ (మిస్సమ్మ).. ఇలా చెబుతూపోతే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ దర్శకత్వ ప్రతిభతో చిత్రసీమను ఏలుతున్నారనే చెప్పాలి. చక్కని కథనాలతో వీళ్లు తెరకెక్కిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐబీఎంలో పనిచేసిన ప్రవీణ్ సత్తారు సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి హిట్లు కొట్టారు. అర్జున్రెడ్డి సినిమాతో మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సందీప్ చూపిన ప్రతిభ అందరికీ తెలిసిందే. వెన్నెల కిశోర్ సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మొదట్లో దర్శకత్వంపై దృష్టి సారించారు. ప్రస్తుతం హాస్య నటుడిగా అలరిస్తున్నారు. చాలామంది యువ దర్శకులు తాము చదువుకునే రోజుల్లోనే చక్కని కథలు, పాటలు రాసుకునేవారు. సరైన దారి లేకపోవడంతో వీరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. తీసిన మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచిన వీరికి ఇప్పుడు చిత్ర పరిశ్రమ జేజేలు పలుకుతోంది. సీన్ వివరిస్తున్న శేఖర్ కమ్ముల సాఫ్ట్వేర్ కొలువు చేస్తూనే.. మాది ఒంగోలు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మనవణ్ని. హైటెక్ సిటీలో 14 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. చదువుకునే సమయంలోనే కథల మీద బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడిప్పుడే మంచి వేదిక దొరకడంతో క్షీరసాగర మథనం సినిమాకు దర్శకత్వం వహించా. గుండెల్ని మెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. భావోద్వేగాలతో మనసుల్ని రంజింపజేసి మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామన్న నమ్మకం నాకు ఉంది. దాదాపు అందరూ కొత్తవాళ్లతోనే ఈ సినిమా రూపొందించాను. – అనిల్ పంగులూరి, ‘క్షీరసాగర మథనం’ దర్శకుడు దర్శకుడు సందీప్, అనిల్ పంగులూరి సినిమాలపై మోజుతో.. మాది విజయవాడ. ఎంటెక్ చదివా. కాలేజీ రోజుల్లోనే సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. కథలు బాగా రాసుకునేవాణ్ని. ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చాను. ఫిలింనగర్లో ఎన్ని చోట్లకు తిరిగానో నాకే గుర్తు లేదు. ఈ క్రమంలో ఒక మంచి కథతో నేను వెళ్లగానే నిర్మాత అంగీకరించారు. అదే రామచక్కని సీత సినిమా. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. – శ్రీహర్ష మందా, ‘రామచక్కని సీత’ దర్శకుడు -
లవ్ స్టోరీ
ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులకు నచ్చేలా తనదైన శైలిలో తెరకెక్కించగలరు దర్శకులు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్, గోదావరి, ఫిదా’ చిత్రాలే అందుకు నిదర్శనం. తాజాగా ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. ఆల్రెడీ అందుకు తగ్గ శిక్షణ కూడా తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘లవ్స్టోరీ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. -
నాన్స్టాప్ ఎక్స్ప్రెస్
బ్రేక్ లేకుండా నెల పాటు షూటింగ్ చేయనున్నారట నాగచైతన్య. సాయిపల్లవితో కలిసి హైదరాబాద్ పరిసరాలను చుట్టేయనున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ సినిమా రూపొందనుంది. ప్రేమకథగా తెర కెక్కనున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 14నుంచి ప్రారంభం కానుంది. వరుసగా 30 రోజులపైనే ఓ షెడ్యూల్ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్లోనే జరగనుందని తెలిసింది. మధ్యతరగతి ప్రేమకథగా ఈ చిత్ర కథాంశం ఉంటుందని సమాచారం. -
మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!
హైబ్రిడ్ పిల్లగా.. భానుమతి పాత్రలో సాయి పల్లవి చేసిన అల్లరి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రను తాను మాత్రమే పోషించేలా నటించింది సాయి పల్లవి. ఆ పాత్రను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ను ప్రారంభించారు. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలంగాణ కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. ఇదొక మ్యూజికల్ హిట్గా నిలుస్తుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ మూవీలో సాయి పల్లవి పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుందని తెలిపారు. ఏఆర్ రెహ్మాన్ శిష్యుడు అయిన పవన్ ఈ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు. -
‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ట్వీట్ చేశారు. #savenallamala pic.twitter.com/ytsPoP2kuL — Sekhar Kammula (@sekharkammula) August 27, 2019 -
ప్లాన్ మారింది
ఆగస్ట్ చివరి వారంలో నాగచైతన్యను, సాయి పల్లవిని డ్యాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకువెళ్లాలనుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు ప్లాన్లో చిన్న మార్పు. అనుకున్న ప్లాన్ను వారం రోజులు షిఫ్ట్ చేశారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది డ్యాన్స్ బ్యాక్డ్రాప్లో నడిచే ప్రేమకథ అని తెలిసింది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరూ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడనున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 26న స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు సెప్టెంబర్ 5న హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. డిసెంబర్కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. -
ప్రేమకథ మొదలు
ప్రేమకథల్లో శేఖర్ కమ్ముల ప్రేమకథలు డిఫరెంట్. సున్నితంగా, ఆహ్లాదంగా సాగిపోతాయి. ఇప్పుడు మరో రొమాంటిక్ ప్రేమకథను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖర్లో మొదలవుతుందని తెలిసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నారు. సునీల్ నారంగా నిర్మిస్తారు. డ్యాన్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ తిరగనుందట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్లో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ పాల్గొంటారని సమాచారం. డిసెంబర్లోపు ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలనుకుంటున్నారు. -
స్పెషల్ క్లాస్
స్కూల్లో, కాలేజీలో చదువుకునేటప్పుడు స్పెషల్ క్లాసులకి వెళుతుంటాం. ఇప్పుడు నాగచైతన్య కూడా వెళుతున్నారు. అయితే ఇది సినిమా స్పెషల్క్లాస్ అని ఊహించే ఉంటారు. ఈ క్లాస్ ఎందుకంటే.. తెలంగాణలో మాట్లాడటం కోసం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులోనే నాగచైతన్య తెలంగాణ భాష మాట్లాడబోతున్నారు. అమిగోస్ ఫిలింస్ సమర్పణలో ఏషియన్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్రావులు నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతుందట. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్హిట్ చిత్రం ‘ఫిదా’లో మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవితో తెలంగాణ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడిన తీరు అందరికీ నచ్చింది. సాయి పల్లవి అంత పర్ఫెక్ట్గా మాట్లాడటానికి శేఖర్ కమ్ముల కొంతకాలం తర్ఫీదునిచ్చారాయన. ఇప్పుడు నాగచైతన్యకు సెపరేట్ క్లాసులు తీసుకొంటున్నారట. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్ కెమెరా: విజయ్కుమార్. -
మరో అందమైన ప్రేమకథ
‘మజిలీ’వంటి బ్యూటీఫుల్ అండ్ ఎమోషనల్ లవ్స్టోరీతో సూపర్ సక్సెస్ కొట్టి మంచి జోరు మీద ఉన్నారు నాగచైతన్య. ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన జోష్లో ఉన్నారు దర్శకులు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా షురూ అయింది. డిస్ట్రిబ్యూటర్స్గా ఇప్పటివరకు వందలాది సినిమాలను విడుదల చేసిన ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నారాయణదాస్ నారంగ్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహనరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నారు. ‘‘ఇండస్ట్రీలో నేను కెరీర్ను స్టార్ట్ చేసినప్పటి నుంచి శేఖర్ కమ్ములగారితో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నిజమైన, అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాం’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. ‘‘సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేస్తున్నాం. 60–70 రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’తో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్ మరో హీరో. -
చైతును ‘ఫిదా’ చేస్తారా?
‘ఫిదా’ చిత్రంతో శేఖర్ కమ్ముల మళ్లీ సక్సెస్ట్రాక్లోకి రాగా, హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవికి టాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ చిత్రంతో సాయి పల్లవి టాలీవుడ్లో మోస్ట్వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సాయి పల్లవికి ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్గా సాయి పల్లవి, రానా కాంబినేషన్లో రాబోతోన్న విరాటపర్వం సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సాయి పల్లవి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో చిత్రం ఓకే చెప్పినట్లు, ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీలో సాయి పల్లవి నాగచైతన్యను ఎలా ఆటపట్టిస్తుందో చూడాలి. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగ చైతన్య ప్రస్తుతం విక్టరీ వెంకటేష్తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నాడు. -
శేఖర్ కమ్ముల దాచేస్తున్నాడట!
సినిమాలోని హీరోహీరోయిన్లను దాచేయడం కొత్తేం కాదు. కానీ ఇది చివరికి మేలు చేస్తుందా? నష్టం చేస్తుందా అన్నదే ముఖ్యం. అప్పట్లో గుణశేఖర్ వరుడు సినిమాలో ఈ ప్రయత్నమే చేశారు. హీరోయిన్ను రివీల్ చేయకుండా దాగుడుమూతలు ఆడారు. అంత ఆసక్తిని పెంచడంతో.. నేరుగా సినిమాలో హీరోయిన్ను చూసే సరికి పెదవి విరిశారు. అందుకే మరీ అంత ఆసిక్తిని పెంచి గోప్యంగా ఉంచడం కూడా మంచిది కాదు. అయితే ‘ఫిదా’ అంటూ పలకరించి.. మళ్లీ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు శేఖర్ కమ్ముల. ఈ కూల్ డైరెక్టర్ ప్రస్తుతం కొత్త హీరోహీరోయిన్లతో ఓ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నూతన నటీనటుల్ని మాత్రం ఇప్పట్లో మీడియాకు పరిచయం చేయరని సమాచారం. మరి శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ చర్య.. సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ శేఖర్ కమ్ముల
-
ఓ ప్రేమకథ
విరాజ్ జె.అశ్విన్ హీరోగా, రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా టి.ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. కె. సతీష్ కుమార్ సమర్పణలో ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.ఎన్.రాజు నిర్మించిన ఈ సినిమా టైటిల్ సాంగ్ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ సాంగ్ సాహిత్యం, సంగీతం చాలా బాగున్నాయి. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్గారితో నేను చాలా సినిమాలు చేశా. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న ఆయన మేనల్లుడు విరాజ్ అశ్విన్ మంచి కథానాయకుడు అవుతాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు కె.ఎల్.ఎన్.రాజు. -
సినీరంగంలోకి రమ్మని నేనెవరికీ సలహా ఇవ్వను..
రాయదుర్గం: సినీరంగంలోకి రమ్మని, చేరమని తాను ఎవరికీ సలహా ఇవ్వనని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. హెచ్సీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సరోజినినాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో శుక్రవారం డాక్టర్ సి.వి.ఎస్.శర్మ మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ‘దక్షిణాది చిత్రాల పోకడ– వస్తున్న మార్పులు’ అనే అంశంపై ప్రసంగించారు. ఆ వివరాలు శేఖర్ మాటల్లోనే... ‘సినీ రంగంలో సక్సెస్ రేటు కేవలం మూడు శాతం మాత్రమే ఉంటుంది. అందుకే భవిష్యత్తును ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దృఢ నమ్మకం, విజయం సాధిస్తామనే భావన ఉం టేనే ఇటువైపు రావాలి. నా జీవితంలో అదనంగా ప్రమోషన్ వర్క్స్కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు’ అనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం, విజయవాడ నుంచి విద్యార్థులు, శేఖర్ కమ్ముల అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి చిత్రపరిశ్రమలో పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
ఓయూలో శేఖర్ కమ్ముల సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో సినీ దర్శకులు శేఖర్ కమ్ముల సందడి చేశారు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గత మూడు వారాలుగా నిర్వహిస్తున్న ఇండక్షన్ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్ కమ్ముల విద్యార్థులతో అనేక విషయాలు పంచుకున్నారు. సమయం వృథా చేసుకోకుండా, చదవుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సమీరఫాతిమా, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణయ్య, పీజీఈసెట్ కో–కన్వీనర్ ప్రొ.రమేష్బాబు, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఉమామహేశ్వర్, కోఆర్డినేటర్ ప్రొ.శివరామకృష్ణ, డాక్టర్ మేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దాసరి సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్గా లయన్ ఎ. విజయ్కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు. -
తనపై కామెంట్ చేసిన నటిపై శేఖర్ ఫైర్
-
‘ఆ’ పోస్ట్.. శేఖర్ కమ్ముల సీరియస్
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కోపం వచ్చింది. తనను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ గురించి తీవ్రంగా స్పందించారు. అందులో ఉన్నవి అవాస్తవాలని.. తక్షణమే అది పోస్ట్ చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్... ‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ పోస్ట్పై జోరుగా చర్చసాగుతోంది. -
లవ్వా? పాలిటిక్సా?
అవును.. లవ్వా..! పాలిటిక్సా...! దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో రానాతో లవ్స్టోరీ తీస్తారా? లేక మళ్లీ రాజకీయాల్లోకి లాగుతారా? అని ఫిల్మ్నగర్ కుర్రాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్లో తర్వలో ఓ మూవీ రూపొందనుందని ఫిల్మ్నగర్ సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లీడర్’ ద్వారా రానా హీరోగా పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ సినిమా రానా కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే వాటిలో ఒకటవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ‘లీడర్–2’ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త వినిపిస్తూ వచ్చింది. త్వరలో ఈ సీక్వెల్ షురూ కానుందని సమాచారం. ఫస్ట్ పార్ట్లో సీయం అర్జున్ప్రసాద్గా అద్భుతంగా నటించిన రానా రీసెంట్గా తేజ డైరెక్షన్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలోనూ పొలిటీషియన్ జోగేంద్ర పాత్రలో రెచ్చిపోయారు. సో.. శేఖర్ కమ్ముల ‘లీడర్ 2’ని పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తీస్తారా? లేకపోతే లీడర్ ప్రేమకహానీతో తీస్తారా? అనేది చూడాలి. లేటేస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఫిదా’తో శేఖర్ కమ్ముల సూపర్ ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఆయన మళ్లీ లవ్స్టోరీనే ఎంచుకుంటారని కొందరి ఊహ. అయితే, ‘లీడర్’లో ఆల్రెడీ రానాను పొలిటీషియన్గా చూపించారు కాబట్టి, సీక్వెల్ బ్యాక్డ్రాప్ కూడా పాలిటిక్సే అని ఇంకొందరి ఊహ. మరి.. శేఖర్ ఊహల్లో ఏ కథ ఉందో? -
వరుణ్ తేజ్ సినిమాలో మరో హీరో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ నటి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. శేఖర్ మార్క్ క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఫిదాలో వరుణ్ తేజ్తో పాటు మరో యంగ్ హీరో నటించనున్నాడు. శేఖర్ కమ్ముల గత చిత్రం అనామికలో లీడ్ రోల్లో నటించిన యంగ్ హీరో హర్షవర్ధన్ రానే ఫిదాలో కీలకమైన అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హర్ష, శేఖర్ కమ్ముల మీద ఉన్న గౌరవంతో వెంటనే తన బాలీవుడ్ సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మరీ శేఖర్ కమ్ములకు టైం ఇచ్చాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హర్షవర్ణ్ రానే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. -
'ప్రేమ ఇష్క్ కాదల్' పాటలకు శేఖర్ కమ్ముల ప్రశంస