southampton
-
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
హార్దిక్ ఆల్రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. బౌలింగ్, బ్యాటింగ్లో మెరిసిన హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 వికెట్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్), దీపక్ హుడా(17 బంతుల్లో 33 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 39 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అంతకముందు రోహిత్ శర్మ 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఇన్ఫామ్ బ్యాట్స్మన్.. కొత్త కెప్టెన్ జాస్ బట్లర్ భువనేశ్వర్ బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హారీ బ్రూక్ 28, మొయిన్ అలీ 36 పరుగులు చేసినప్పటికి ఇంగ్లండ్ను ఓటమి నుంచి కాపాడలేకపోయారు. హార్దిక్ పాండ్యా సహా అర్షదీప్(2 వికెట్లు), చహల్(2 వికెట్లు) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ను ముప్పతిప్పలు పెట్టారు. చివర్లో జోర్డాన్ 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 శనివారం(జూలై 9న) జరగనుంది. For his brilliant show with the bat and ball, @hardikpandya7 is adjudged Player of the Match as #TeamIndia win the first T20I by 50 runs. Take a 1-0 lead in the series. Scorecard - https://t.co/Xq3B0KTRD1 #ENGvIND pic.twitter.com/oEavD7COnZ — BCCI (@BCCI) July 7, 2022 Vintage Mo. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/AQ8cK5sTph — England Cricket (@englandcricket) July 7, 2022 Brilliance from Sam! India have set us 199 for victory in the first @vitality_uk IT20. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/ZfwdPi6VGf — England Cricket (@englandcricket) July 7, 2022 -
WTC Final: మూడేళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ పైనల్లో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడు కూడా అర్థసెంచరీ మార్క్ను చేరుకోలేకపోయాడు. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది. ఇంతకముందు 2018లో ఇంగ్లండ్ గడ్డపైనే లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో టీమిండియా నుంచి ఒక్క అర్థ సెంచరీ నమోదు కాలేదు. ఇక టీమిండియా ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్లో భాగంగా టీమిండియా ఓవర్నైట్ స్కోరు 64/2 తో ఆరో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే పుజారా, కోహ్లిల రూపంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడినుంచి ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేయని టీమిండియా 170 పరుగులకే చాప చుట్టేసింది. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రోహిత్ 30 పరుగులు చేశాడు. మొత్తంగా 138 పరుగుల లీడ్ సాధించిన టీమిండియా కివీస్ ముందు 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కాగా కివీస్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవన్ కాన్వే(19), టామ్ లాథమ్(9) పరుగులు చేసి ఔటవ్వగా.. కేన్ విలియమ్సన్(8), రాస్ టేలర్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: గ్రౌండ్లోనే టవల్ చుట్టుకున్న షమీ.. కారణం ఏంటంటే WTC Final: కివీస్ ఈ పాటికే గెలవాల్సింది.. -
రాస్ టేలర్పై జాత్యహంకార వ్యాఖ్యలు
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాడ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ రోజున న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్కి చేదు అనుభవం ఎదురైంది. రాస్ టేలర్పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా! -
WTC ఫైనల్: నాలుగో రోజు వర్షార్పణం
సౌతాంఫ్టన్: ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ పైనల్కు వరుణుడు అడ్డంగా మారాడు. ఇక నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభమవుతుందని ఆశించిన ప్రేక్షకుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ మెగా ఫైనల్కు వేదికైన సౌతాంప్టన్లో ఉదయం నుంచి వర్షం కురవడంతో పిచ్పై కప్పిన కవర్లపై నీరు నిలిచిపోయింది. దీంతో పాటు ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఈ క్రమంలోనే నాల్గో రోజు మ్యాచ్ జరిగే సూచనలు లేవని ఫీల్డ్ ఎంపైర్లు తెలపడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా నాలుగో రోజు ఆట వర్షార్పణం అయ్యింది. చదవండి: WTC ఫైనల్: విరాట్ కోహ్లి డ్యాన్స్ అదిరిందిగా! -
WTC ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్పై సందేహాలు
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు అడుగడుగునా వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ ఆరంభమైంది మొదలు ఇప్పటివరకూ ఇక్కడ ఏదొక సమయంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్లో ఫలితం వచ్చే అవకాశాలు కనబడుటం లేదు. నాలుగో రోజు ఆటకు సైతం వర్షం అడ్డంకిగా మారింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా వర్షం అంతరాయం కల్గించింది. అక్కడ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇక వర్షానికి తోడు సరిపడనంత వెలుతురు లేకపోవడం ఆట కొనసాగింపుకు సమస్యగా మారుతోంది. నాలుగో రోజు మ్యాచ్ నిర్వహించాలా వద్దా అన్నదానిపై అంపైర్ల సమీక్షిస్తున్నారు. ఈరోజు మొత్తం ఆడపా దడపా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఆట రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక్కడ చదవండి: న్యూజిలాండ్దే పైచేయి -
తొలి పరుగు కోసం 36 బంతులు.. పుజారాపై మీమ్స్ వర్షం
సౌతాంప్టన్: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఆటతీరు ఈ మధ్య భారత అభిమానులకు మింగుడు పడటం లేదు. అతను అసలైన టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. కొన్ని సార్లు పరగులు చేయడానికి మరీ ఎక్కువ బంతులు తీసుకోవడం.. జట్టు ప్రయోజనాలకు తగ్గట్టుగా ఆడకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లోనూ పుజారా మరోసారి ప్రత్యర్థి బౌలర్లతోపాటు అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ (34), శుభ్మన్ గిల్ (28) శుభరంభం ఇచ్చారు. ఓపెనర్లు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పుజారా తొలి పరుగు చేయడానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టిన అతడు చివరికి 54 బంతుల్లో 8 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా, పుజారా ఇన్నింగ్స్పై ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. ఫన్నీ మీమ్స్తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. Pujara reminds me of this inning, and Non- striker is Virat 😭 pic.twitter.com/GCmXWJ01Fr — Liv 💫 (@Virat_Mamta) June 19, 2021 Pujara in first sessionpic.twitter.com/0BIZheNSfv — వేటగాడు (@rao_4005) June 19, 2021 New Zealand players' strategy to get Pujara out in the #WTCFinal2021pic.twitter.com/AsvJMXMeb8 — BufferedStart (@BufferedStart) June 17, 2021 చదవండి: WTC Final: 250కి పైగా పరుగులు చేస్తే టీమిండియాదే పై చేయి.. -
WTC Final Day 3: ముగిసిన మూడో రోజు ఆట
సౌతాంప్టన్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. అయితే, వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్ కుదర్లేదు. ఇక మూడో రోజైన ఆదివారం ఆట పూర్తిగా కొనసాగించే పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఎందుకంటే సౌతాంప్టన్ కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల నుంచి అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఈ కారణంగా మూడో రోజు సైతం మ్యాచ్ రోజంతా సజావుగా జరగడం కష్టమేనని బ్రిటీష్ వాతావరణ శాఖ తెలిపిన నివేదికలు చెప్తున్నాయి. అవుట్ ఫీల్డ్ తడిగా కాస్త ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. అప్డేట్స్: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ► ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజ్లో కేన్ విలియమ్సన్ (12), రాస్ టేలర్ (0) ఉన్నారు. ► కివీస్ తొలి ఇన్నింగ్స్లో 70 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు లాథం (30) పరుగుల చేసి అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు: 90/ 1 ( 42 ఓవర్లు).. కాగా క్రీజులో కేన్ విలియమ్సన్ ( 11 ), కాన్వే ( 46 ) ఉన్నారు. కివీస్ ఓపనర్లు నిలకడగా.. ►ప్రతిషాత్మక మ్యాచ్లో భారత్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడమే కాకుండా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఓపనర్లు నిలకడగా ఆడుతున్నారు. లాథమ్ ( 17) , కాన్వే ( 18 ) రాణించడంతో.. టీ బ్రేక్ సమయానికి 21 ఓవర్లలో కివీస్ జట్టు స్కోరు 36/ 0 గా ఉంది. తొలి ఇన్నింగ్స్: టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ ► న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ క్రమంలో 217 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్ను ముగించేసింది. ► భారత బ్యాట్స్మెన్లు.. రహానె (49), కోహ్లీ (44), రోహిత్ (34), గిల్ (28) స్కోరు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్లో.. జేమిసన్కు 5, బౌల్ట్, వాగ్నర్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ► ఇషాంత్ ( 4) , బుమ్రా, షమీ క్రీజులోకి రాగానే వికేట్ సమర్పించుకున్నారు. కాగా జడేజా 15 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ►ప్రస్తుతం టీమిండియా స్కోరు - 211/ 7 (89 ఓవర్లు). ► క్రీజులోకి వచ్చిన అశ్విన్ ( 27 బంతులల్లో 22, 3*4 ) బ్యాట్తో పరుగులు రాబట్టినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. దీంతో 205 పరుగుల వద్ద ఏడో వికెట్గా అశ్విన్ వెనుదిరిగాడు. ► క్రీజులో జడేజా ( 10 ), అశ్విన్ ఉన్నారు. టీమిండియా స్కోరు-182 /6 ( 82 ఓవర్లు ) ► క్రీజులోకి వచ్చిన జడేజా రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ పై ఆశలు రేపిన, రహానే రూపంలో ఆరో వికెట్ కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కాగా రహానే ( 117బంతుల్లో 49, 5*4 ) అర్థ సెంచరీని ఒక్క పరుగు తేడాతో చేజార్చుకున్నాడు. ► క్రీజులో రవీంద్ర జడేజా ( 6), రహానే ( 42 ) ఉన్నారు. టీమిండియా స్కోరు -171/5 ( 77.2 ఓవర్లలో) నాలుగు పరుగులు.. ఐదో వికెట్గా పంత్ పెవిలియన్కు చేరాడు ►క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ కేవలం నాలుగు పరుగులకే ఐదో వికెట్గా పెవిలియన్ చేరాడు. పంత్ ( 22 బంతుల్లో 4, 1*4 ) చేసి జెమీసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారీ స్కోరుకు బ్రేక్.. విరాట్ వికెట్ డౌన్ ►మూడో రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైన కాసేపటికే నాలుగో వికెట్ రూపంలో కెప్టెన్ విరాట్ కోహ్లి (132 బంతుల్లో 44, 1x4) పెవిలియన్ చేరాడు. దీంతో విరాట్ కోల్పోవడంతో భారత్కు పెద్ద దెబ్బే తగిలింది. ప్రస్తుతం రిషభ్ పంత్, రహానే (32) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 68 ఓవర్లలో 149/4. మ్యాచ్పై పట్టు కోసం.. భారీ భాగస్వామ్యం కావాల్సిందే ► రెండో రోజు ఆట ముగిసే సమయానకి టీమిండియా స్కోరు.. 64.4 ఓవర్లలో 146/3. కోహ్లి (44 పరుగులు), రహానే (29) క్రీజులో ఉన్నారు. తొలి వికెట్గా రోహిత్ శర్మ (34; 68 బంతుల్లో 6×4), రెండో వికెట్గా శుభ్మన్ గిల్ (28; 64 బంతుల్లో 3×4), మూడో వికెట్గా చతేశ్వర్ పుజారా (8) వెనుదిరిగారు. చదవండి: WTC Final: కివీస్కు ఫీల్డ్ అంపైర్ సాయం.. ఫ్యాన్స్ ఆగ్రహం -
WTC Final Day 2: వెలుతురు లేమి, ఆట కొనసాగేనా?
సౌతాంప్టన్: టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను వాతావరణం ప్రభావితం చేస్తోంది. వర్షం కారణంగా టాస్ పడకుండానే తొలి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణుడు కరుణించడంతో రెండో రోజున ఆట ఆరంభమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ(34), శుభ్మన్ గిల్(28) ఫర్వాలేదనిపించారు. ఇక నయావాల్ ఛతేశ్వర్ పుజారా(8) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో పెవిలియన్ చేరగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానే క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. వెలుతురు లేని కారణంగా ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. కాసేపు తర్వాత ఆటను అనుకూలంగా ఉండడంతో మళ్లీ ప్రారంభించిన కొద్ది సేపటికే వెలుతురు సరిగా లేకపోవడంతో నిలిపివేశారు. అప్డేట్స్: ►వెలుతురు లేని కారణంగా ఆటను ఆపేయగా, ప్రస్తుత టీమిండియా స్కోరు:146/3(64.4 ఓవర్లలో) ►ప్రస్తుతం కోహ్లి(44 పరుగులు), రహానే(29) క్రీజులో ఉన్నారు. ►వెలుతురు లేని కారణంగా ఆటను ఆపేయగా, ప్రస్తుతం ఆటకు అనుకూలంగా ఉండడంతో తిరిగి ప్రారంభించారు. ► కోహ్లి(40 పరుగులు), రహానే(22) క్రీజులో ఉన్నారు. ఆట నిలిచే సమయానికి టీమిండియా స్కోరు: 134/3(58.4 ఓవర్లలో) ►వెలుతురు తక్కువగా ఉన్నందును ఆట కొనసాగించాలా వద్దా అన్న అంశంపై అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో చర్చలు కొనసాగిస్తున్నారు. ►రెండో రోజు ఆటలో భాగంగా కోహ్లి సేన మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ పదునైన ఇన్స్వింగర్ను అంచనావేయడంలో పొరబడ్డ నయావాల్ ఛతేశ్వర్ పుజారా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 54 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు(రెండు ఫోర్లు) చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కాగా పుజారా అవుట్ అయిన విధానంపై సందేహం వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి డీఆర్ఎస్కు వెళ్లగా నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. ►టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. వాగ్నర్ బౌలింగ్లో వాట్లింగ్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ 28 పరుగుల(3 బౌండరీలు) వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పుజారా, కోహ్లి క్రీజులో ఉన్నారు. ►లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 69-2(28 ఓవర్లలో) ►భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 21వ ఓవర్లో జెమీషన్ బౌలింగ్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 34 పరుగులు చేశాడు. ఇందులో 6 బౌండరీలు ఉన్నాయి. ప్రస్తుతం శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు: 62-1. ►20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 62-0 ►10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 37-0 -ఓపెనర్లు రోహిత్ శర్మ(21), శుభ్మన్ గిల్(15) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ జెమీషన్ బౌలింగ్ అటాక్ కొనసాగిస్తున్నాడు. ►భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ మరణం పట్ల భారత జట్టు నివాళులు అర్పించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలో అడుగుపెట్టారు. ►ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రెండో రోజున ఆట ఆరంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ను ఎంచుకున్నాడు. కోహ్లి సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. ఇక వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్నీ నికోలస్, బీజే వాట్లింగ్(వికెట్ కీపర్), కోలిన్ డీ గ్రాండ్హోమ్, కైలీ జెమీషన్, నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్. #TeamIndia is wearing black armbands in remembrance of Milkha Singhji, who passed away due to COVID-19. 🙏#WTC21 — BCCI (@BCCI) June 19, 2021 చదవండి: టీమిండియా బతికిపోయిందిగా; మీరైతే కళ్లప్పగించి చూడండి! -
WTC Final: కేదార్ చెప్పినట్లు మీలో ఎవరైనా చెప్పండి బ్రో!
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు వరుణుడు ఆటంకం కలిగించడంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురయ్యారు. ‘‘వరుణుడా కాస్త కరుణించు.. మా ఫేవరెట్ మ్యాచ్ చూసేందుకు వీలు కలిగించు’’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది ఔత్సాహిక నెటిజన్లు మాత్రం తమ సృజనాత్మకతకు పదునుపెడుతూ ఫన్నీ మీమ్స్, ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘‘వరల్డ్ కప్-2019 సమయంలో కేదార్ యాదవ్ చెప్పినట్లుగా ఇప్పుడు కూడా ఎవరైనా ఒక టీమిండియా ప్లేయర్.. వర్షాన్ని వెళ్లిపొమ్మని చెప్పవచ్చుగా బ్రో’’ అంటూ ఓ ట్విటర్ యూజర్ పాత వీడియోను పంచుకున్నారు. మరొకరేమో.. ‘‘టీమిండియా కాదు.. న్యూజిలాండ్ కాదు.. వర్షం టాస్ గెలిచింది. ఇరుజట్లపైన పైచేయి సాధించింది. ఇప్పుడు రెండు జట్ల ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా’’ అంటూ ఇద్దరు పిల్లలు బిక్క ముఖాలు వేసుకుని కన్నీరు కారుస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇంకొంత మందేమో.. ‘‘ఇదిగో ఇప్పుడు క్రికెట్ ఆడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది’’ అని గల్లీ క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి జారిపోయిన దృశ్యాలు షేర్ చేసి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి మరి. కాగా వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మధ్యాహ్నం 3 గంటల(భారత కాలమానం ప్రకారం)కు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ తొలి సెషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: WTC Final: వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు Need someone from team India to tell rain to move somewhere else like Kedar Jadhav did in 2019 World Cup. pic.twitter.com/zrFZDwyHTk — Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2021 #WTCFinal2021 Live from South Hampton😃#WorldTestChampionship #WTCFinal2021 @BCCI pic.twitter.com/2ksfvjLUjs — HEMANT SEN🇮🇳 (@RSunnny) June 18, 2021 Scenes in Southampton considering 🌧️. Rain #INDvsNZ #WTCFinal2021 #Southampton #WTCFinal #WTC21 #FridayThoughts #fridaymorning pic.twitter.com/GGAaHXcmLe — वि शा ल (@_iamvish) June 18, 2021 India and New Zealand fans watching rain delays together. 😂#INDvNZ #WTCFinal #WTCFinal2021 pic.twitter.com/LcO1TSAKlf — CricBlog ✍ (@cric_blog) June 18, 2021 It has been raining since the last few days in Southampton ! Day 1 of WTC Final expected to he washout! #INDvsNZ #WorldTestChampionship #WTCFinal2021 #June18#ICCWTCFinal #WTCFinal Mean While Rain : pic.twitter.com/0lUsav1CGl — Aryan (@aryn_vrm) June 18, 2021 Rain Rain go away Come again after 22 India wants to play Rain Rain go away 🥺#WTC21 #WTCFinal pic.twitter.com/N8P3S2DTpX — Ayush (@Ayush18virat) June 18, 2021 -
శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్
సౌతాంప్టన్: ఇంగ్లండ్ పిచ్లకి టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తొందరగానే అలవాటుపడినట్లు కనిపిస్తోంది. ఈ నెల 3న సౌతాంప్టన్కి చేరుకున్న భారత క్రికెటర్లు.. గత మూడు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లో బిజీగా గడుపున్నారు. ఈ క్రమంలో నిన్న భారత బృందం రెండు జట్లుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత శతకంతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధశతకంతో (135 బంతుల్లో 85 పరుగులు) రాణించాడు. వీరిద్దరి ధాటికి సహచర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, ఇషాంత్ శర్మ(3/36) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ స్కోర్కు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంత స్కోరు చేశారన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, 2018లో మొదటిసారి ఇంగ్లండ్లో పర్యటించిన రిషబ్ పంత్.. సూపర్ సెంచరీతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్లోనూ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ పిచ్లపై అతని రికార్డు మరింత మెరుగుపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో.. పంత్ ఫామ్లోకి రావడం భారత జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. కాగా, డబ్యూటిసీ ఫైనల్ తర్వాత భారత్.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది. చదవండి: India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ -
ముంబై టు లండన్.. అలా సాగిపోయింది
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు రూట్ సేనను 5 టెస్ట్ల సిరీస్లో ఢీకొనేందుకు టీమిండియా లండన్లో ల్యాండ్ అయ్యింది. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం సౌతాంప్టన్లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు సాధన చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆటగాళ్లు ఒకరిని ఒకరు కలుసుకునే వీలు ఉండదు. కాగా, భారత బృందం ముంబై నుంచి బయల్దేరి, సౌతాంప్టన్ చేరుకునే వరకు జరిగిన మొత్తం సన్నివేశాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. జూన్ 2న భారత్ పురుషుల, మహిళా క్రికెటర్ల బృందం.. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో లండన్కు బయల్దేరింది. 🇮🇳 ✈️ 🏴 Excitement is building up as #TeamIndia arrive in England 🙌 👌 pic.twitter.com/FIOA2hoNuJ — BCCI (@BCCI) June 4, 2021 ఇంత భారీ ఎత్తున భారత క్రికెట్ బృందం విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లడం చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ఈ జర్నీని క్రికెటర్లు ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేందుకు బీసీసీఐ ప్రతి ఒక్క సన్నివేశాన్ని రికార్డు చేసి, ట్విటర్లో షేర్ చేసింది. విమానంలో పురుష, మహిళా క్రికెటర్లు ఒకరితో ఒకరు ఆడుతూ పాడుతూ, ఇంటర్యూలు చేసుకుంటు సరదాగా గడిపిన సన్నివేశాలు అభిమానులకు అలరించాయి. కాగా, జూన్ 18న టీమిండియా.. న్యూజిలాండ్తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, జూన్ 16న భారత మహిళా జట్టు ఇంగ్లండ్తో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ వేదిక కానుంది. చదవండి: పాక్ జట్టులోకి భారీ హిట్టర్.. -
‘డ్రా’ అయితే సంయుక్త విజేతలే
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్ (డబ్ల్యూటీసీ) విజేతను తేల్చే క్రమంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావించింది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలనేమీ లేదని, సాధారణ టెస్టుల తరహాలో మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ఇరు జట్లను ప్రకటించడమే సరైందని తేల్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 సౌతాంప్టన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు సంబంధించి నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ప్రైజ్మనీ ఎంతనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ టెస్టు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన విశేషాలు చూస్తే... మ్యాచ్ తేదీలు: జూన్ 18 నుంచి 22 వరకు వేదిక: సౌతాంప్టన్లోని ఏజియస్ బౌల్ మైదానం ఉపయోగించే బంతి: భారత్లో సాధారణంగా టెస్టు మ్యాచ్లను ఎస్జీ బంతులతో, న్యూజిలాండ్లో కూకాబుర్రా బంతులతో ఆడతారు. వేదిక మాత్రమే కాకుండా బంతులు ఉపయోగించడంలో కూడా ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం ఉండరాదని ఐసీసీ భావించింది. అందుకే ఫైనల్ కోసం డ్యూక్స్ బంతులను ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వాడే డ్యూక్స్ బంతులు సీమ్ ఎక్కువగా ఉండి బౌలింగ్కు అనుకూలిస్తాయి. మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు: మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’గా ముగిస్తే భారత్, న్యూజిలాండ్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడు ఈ నిబంధన ఉన్నా, ఇప్పుడు ఫైనల్కు ముందు ఐసీసీ దీనిని మళ్లీ పేర్కొంది. రిజర్వ్ డే ఉందా: ఉంది, జూన్ 23ను రిజర్వ్ డే ఉంచారు. అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం అని ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే మ్యాచ్ను ఆరో రోజుకు పొడిగిస్తారా: ఈ విషయంలోనే ఐసీసీ ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చింది. ‘రిజర్వ్ డే’ అనేది ప్రత్యామ్నాయ ఏర్పాటు మాత్రమే. అన్ని టెస్టుల్లాగే ఈ మ్యాచ్ కూడా ఐదు రోజులు పూర్తిగా జరిగి ఎవరో ఒకరు గెలవని పక్షంలో ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు తప్ప ఆరో రోజుకు పొడిగించి ఫలితం కోసం ప్రయత్నించరు. కేవలం వర్షం తదితర వాతావరణ సమస్యల కారణంగా ఐదు రోజుల్లో సమయం వృథా అయితే మాత్రమే దానిని పూడ్చేందుకు రిజర్వ్ డేలో సమయాన్ని వాడుకుంటారు. రిజర్వ్ డే ఎలా ఉంటుంది: ఆరో రోజు అవసరం పడితే గరిష్టంగా ఐదున్నర గంటల (330 నిమిషాలు) లేదా 83 ఓవర్లు ఆడిస్తారు. దీనికి చివరి గంట అదనం. వర్షం కారణంగా కొంతసేపు అంతరాయం కలిగినా... అదే రోజు ఆటను పొడిగించి దానిని సరిచేస్తూ వస్తే ‘రిజర్వ్ డే’ను వాడరు. దాదాపు రోజంతా నష్టపోతే మాత్రమే ఆరో రోజు ఆడించే అంశంపై రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఐదో రోజు చివరి గంటలో మాత్రం ఆరో రోజు ఆడించడం గురించి ప్రకటిస్తారు. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఇరు జట్లనూ రిఫరీ సమాచారం అందిస్తూ ఉంటారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఆడిస్తారా: ఇటీవల ఐసీసీ కొన్ని కొత్త నిబంధనలను టెస్టుల్లోకి తెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్లో కూడా వాటిని వాడారు. దీని ప్రకారం షార్ట్ రన్లను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అప్పీల్కు వెళ్లే ముందు బ్యాట్స్మన్ షాట్కు ప్రయత్నించాడా అనే అంపైర్ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్బీల కోసం రివ్యూలో ఉపయోగించే ‘వికెట్ జోన్’ ఎత్తును కూడా పెంచారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగేది ఎక్కడో తెలుసా?
ముంబై: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదిక మారనుంది. తొలుత ఈ మ్యాచ్ను ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నిర్వహించాలని ఐసీసీ భావించినప్పటికీ.. వివిధ కారణాల చేత వేదికను సౌథాంప్టన్కు మార్చాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అయితే ఈ అంశంపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వేదిక మార్పు అంశం ఐసీసీ పరిధిలో ఉంటుంది. కానీ బీసీసీఐ అధ్యక్షుడు ఐసీసీతో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండా ఏకపక్ష నిర్ణయాన్ని వెల్లడించడం పలు సందేహాలకు తావిస్తుంది. ప్రపంచ క్రికెట్కు పెద్దన్నలా వ్యవహరిస్తున్న బీసీసీఐ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే లండన్లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగానే వేదికను లార్డ్స్ నుంచి సౌథాంప్టన్కు తరలించారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్, న్యూజిలాండ్ల మధ్య సౌథాంప్టన్లో జరగబోయే ఫైనల్ మ్యాచ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నామని, అందులో భాగంగానే వేదికను మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా డబ్ల్యూటీసీ మ్యాచ్లు క్లిష్ట పరిస్థితుల్లో సాగాయన్నాడు. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
షేమ్ షేమ్.. షాహిన్ ఆఫ్రిది
సౌతాంప్టన్ : టెస్టు క్రికెట్లో రనౌట్ అనే పదమే చాలా తక్కువగా వినిపిస్తుంది. కానీ అనిశ్చితికి మారుపేరుగా ఉండే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు.. జట్టులోని ఆటగాళ్లు కూడా అంతే.. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్లో షాహిన్ ఆఫ్రిది రనౌటైన తీరు చూస్తే జాలేస్తుంది. షాహిన్ తనంతట తానే రనౌట్ కావడం హాస్యాప్పదంగా ఉందంటూ ట్విటర్లో అభిమానులు పేర్కొంటున్నారు. (సచిన్ మొదటి సెంచరీకి 30 ఏళ్లు) సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న పాక్ జట్టు 75 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది ఉన్నారు. క్రిస్ వోక్స్ వేసిన బంతి రిజ్వాన్ లెగ్ను తాకుతూ బయటికి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ కోసం అంపైర్ను అడుగుతున్నారు. అయితే స్ట్రైకింగ్లో ఉన్న రిజ్వాన్ కాల్ వినిపించుకోకుండానే షాహిన్ పరుగు కోసం సగం క్రీజు వదిలి వచ్చాడు. ఇంతలో బంతిని అందుకున్న డొమినిక్ సిబ్లే కళ్లు చెదిరే వేగంతో వేసిన డైరెక్ట్ త్రో నేరుగా వికెట్లను గిరాటేసింది. అసలు ఇలా ఉదారంగా వికెట్ వస్తుందని ఇంగ్లండ్ కూడా ఊహించి ఉండదు. Another piece of brilliance in the field from @DomSibley! 🎯 Scorecard/Clips: https://t.co/yjhVDqBbVN#ENGvPAK pic.twitter.com/FuEAifdP5p — England Cricket (@englandcricket) August 14, 2020 అనవసరంగా ఒక డాట్ బాల్కు అవుటయ్యాననే ఫీలింగ్ కలిగిందేమో.. షాహిన్ ముఖానికి చేతిని అడ్డుపెట్టుకొని డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం షాహిన్ రనౌట్ వీడియో వైరల్గా మారింది. ఈ విషయాన్ని ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. డొమినిక్ సిబ్లే అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాన్ని చూడండి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మూడు టెస్టుల సిరీస్లో ఇప్పటికే మొదటి టెస్టు మ్యాచ్ను ఆతిధ్య ఇంగ్లండ్కు సమర్పించుకున్న పాక్ రెండో టెస్టును నిరాశజనంకగానే ప్రారంభించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 60*, నసీమ్ షా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, స్టువర్ట్ బ్రాడ్ 3, సామ్ కరన్, వోక్స్ తలా ఒక వికెట్ తీశారు.(ఎక్కడైనా ధోనియే నెంబర్ వన్) -
మరో ‘హోరాహోరీ’కి రంగం సిద్ధం
సౌతాంప్టన్ : విజయం ఖాయమనుకున్న మ్యాచ్ను చేతులారా ప్రత్యర్థికి అప్పగించిన జట్టు ఒక వైపు... ఓటమి వైపు సాగుతున్న దశనుంచి గెలుపును అంది పుచ్చుకున్న జట్టు మరో వైపు... ఈ సారి జరగబోయే సమరంలో ఎవరిది పైచేయి కానుంది. గత మ్యాచ్లాగే పోరు హోరాహోరీగా సాగుతుందా లేదా ఏకపక్షమా... వీటన్నింటికి రోజ్బౌల్ మైదానంలో సమాధానం లభించనుంది. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్లో భాగంగా నేటినుంచి ఇక్కడ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టులో నెగ్గిన ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా...ఈ మ్యాచ్ కూడా గెలిస్తే వరుసగా రెండో సిరీస్ ఆ జట్టు ఖాతాలో చేరుతుంది. మరో వైపు గత అనుభవంతో ఈ సారైనా మెరుగ్గా ఆడి సిరీస్ సమం చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. స్టోక్స్ లేకుండానే... ఒక మార్పు మినహా తొలి టెస్టులో విజయం సాధించిన తుది జట్టునే ఇంగ్లండ్ కొనసాగించే అవకాశం ఉంది. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వ్యక్తిగత కారణాలతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో బ్యాట్స్మన్ జాక్ క్రాలీ జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో మూడో స్థానంలో ఆడేందుకు క్రాలీకి అవకాశం లభిస్తే రూట్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. స్టోక్స్ ఎలాగూ తొలి టెస్టులో పూర్తి స్థాయి బ్యాట్స్మన్గానే ఆడాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రమే అతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు. వుడ్ గాయంనుంచి కోలుకోలేదు కాబట్టి అండర్సన్, ఆర్చర్, బ్రాడ్ కొనసాగడం ఖాయమైంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఇంగ్లండ్ ప్రధానంగా తమ బ్యాటింగ్పై దృష్టి పెట్టాల్సి ఉంది. అదృష్టవశాత్తూ గత టెస్టు నెగ్గినా జట్టు బ్యాటింగ్ పేలవంగా ఉంది. రెండు ఇన్నింగ్స్లలోనూ ప్రధాన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. స్టోక్స్ లేని లోటు కచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇతర బ్యాట్స్మెన్పై బాధ్యత పెరిగింది. వోక్స్, బట్లర్ తమ విలువను గత మ్యాచ్లో చూపించారు. అయితే అన్నింటికి మించి అండర్సన్ ఫామ్పై జట్టు ఆందోళనతో ఉంది. తొలి టెస్టులో అతను 97 పరుగులిచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు. అంతకు ముందు విండీస్తో కూడా అతను విఫలమయ్యాడు. అండర్సన్ చెలరేగితే ఇంగ్లండ్కు తిరుగుండదు. ఆదుకునేవారేరీ... గత కొన్నేళ్లలో పాకిస్తాన్ జట్టు గెలిచిన కొన్ని మ్యాచ్లు కూడా బౌలింగ్ బలగంతో వచ్చినవే. తొలి టెస్టులో కూడా జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. కుర్ర పేసర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్బాస్లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ వల్ల కాలేదు. ఇప్పుడు కూడా వారు అదే జోరు ప్రదర్శించగలరని టీమ్ మేనేజ్మెంట్ నమ్ముతోంది. పిచ్ కూడా పేస్కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ విభాగంలో పాక్కు తిరుగు లేదు. ప్రధాన స్పిన్నర్గా యాసిర్ షాకు చోటు ఖాయం కాగా... రెండో స్పిన్నర్గా ఆడిన షాదాబ్ ఖాన్ స్థానంలో అదనపు బ్యాట్స్మన్ను ఆడించాలని టీమ్ భావిస్తోంది. అదే జరిగితే ఫవాద్ ఆలమ్ లేదా సొహైల్ ఖాన్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఎవరు వచ్చినా పాక్ బ్యాటింగ్ ఎప్పుడూ బలహీనంగానే కనిపిస్తోంది. అదే ప్రత్యర్థికి వరంగా మారుతోంది. ఒక్క బ్యాట్స్మన్ కూడా నిలకడగా ఆడి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. షాన్ మసూద్ తొలి ఇన్నింగ్స్లో బాగా ఆడినా రెండో ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. టాప్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్నుంచి అతని స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. టెస్టు స్పెషలిస్ట్లు అజహర్ అలీ, అసద్ షఫీఖ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. నిజానికి మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో మంచి అవకాశం ముందున్న దశలో పాక్ బ్యాట్స్మెన్ కొంతైనా సంయమనంతో ఆడి కనీసం 250 పరుగులు చేసినా మ్యాచ్ కచ్చితంగా గెలిచి ఉండేవారు. కానీ జట్టు 169 పరుగులకే కుప్పకూలి ఇంగ్లండ్కు అవకాశం ఇచ్చింది. చివరగా... అజహర్ అలీ కెప్టెన్సీకి ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. గత మ్యాచ్లో విఫల వ్యూహాలతో విమర్శలు ఎదుర్కొన్న అజహర్... ఇక సిరీస్ కోల్పోతే కెప్టెన్సీని కూడా చేజార్చుకునే అవకాశం ఉంది. -
అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే
సౌతాంప్టన్ : కరోనా విరామం తర్వాత ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్తో క్రికెట్ సందడి షురూ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో భౌతిక దూరం పాటిస్తూనే సహచర ఆటగాళ్లతో కేవలం భూజాలతోనే విషెస్ చెప్పడం చూశాం. అండర్సన్ చేసిన పని క్రికెట్ అభిమానులకు తెగ నచ్చేసింది. అలాగే ఇతర క్రికెటర్లు కూడా ఈ విధంగా పాటిస్తే బాగుంటుందని ఐసీసీ పేర్కొంది.(అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి) అలా అందరిచేత మెప్పించబడ్డ అండర్సన్ తాజాగా సౌతాంప్టన్లో వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ 3వరోజు ఆటలో భాగంగా ఐసీసీ నిబంధనలను గాలికొదిలేశాడు. రోస్టన్ చేజ్ వికెట్ తీసిన ఆనందంలో కనీస భౌతిక దూరం పాటించకుండా సహచరుల వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నాడు. అండర్సన్ వేసిన బంతి చేజ్ మొకాళ్లకు తాకుతూ వెళ్లింది. దాంతో అండర్సన్ ఎల్బీ అప్పీల్కు వెళ్లగా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్కు వెళ్లాడు. డీఆర్ఎస్ రివ్యూ ఇంగ్లండ్కు అనుకూలంగా రావడంతో ఆ సంతోషంలో అండర్సన్ తన సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లి ఆనందంతో హత్తుకున్నాడు.('నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు') Jimmy makes the breakthrough! 👏 Scorecard & Videos: https://t.co/ldtEXLDT8V#ENGvWI pic.twitter.com/rtzmfzV8WS — England Cricket (@englandcricket) July 10, 2020 'అండర్సన్.. మొన్ననే కదా నిన్ను మెచ్చుకుంది.. ఇంతలోనే ఐసీసీ నిబంధనలు గాలికొదిలేస్తావా' అంటూ ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ స్పందించాడు. 'వికెట్ తీశానన్న ఆనందంలో అలా చేసి ఉంటాడు. ఎంతైనా పాత పద్దతులు అంత తొందరగా జీర్ణం కావుగా' అంటూ తెలిపాడు. కాగా తొలి టెస్టులో ఇప్పటివరకైతే విండీస్దే పైచేయిగా నిలిచింది. మూడోరోజూ ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లపై బ్యాట్స్మెన్ కూడా రాణించడంతో విండీస్ ఆధిక్యం దక్కింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్ కీపర్ డౌరిచ్ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి గండికొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది. -
వరుణుడే ఆడుకున్నాడు
వెస్టిండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ రౌండ్ ద వికెట్గా వచ్చి తొలి బంతిని వేయగా ఇంగ్లండ్ ఎడంచేతి వాటం ఓపెనర్ రోరీ బర్న్స్ దానిని సమర్థంగా డిఫెన్స్ ఆడాడు... దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఇలా మళ్లీ మొదలైంది. ప్రేక్షకుల చప్పట్లు, ఉత్సాహపు హోరు ఏమీ కనిపించకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తమ ఆటను మొదలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన క్రికెట్ను వరుణుడు మాత్రం కరుణించలేదు. భయపడినట్లుగానే తొలి రోజు ఆటలో చాలా భాగం వర్షం బారిన పడింది. తొలి రోజు సంఘీభావం, సంతాపం మినహా రోజ్ బౌల్లో ఎలాంటి విశేషాలు లేకుండానే క్రికెట్ సాగింది. సౌతాంప్టన్: సీజన్కు తగినట్లుగానే ఇంగ్లండ్లో వాన తన ప్రతాపం చూపించడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది. రెండో ఓవర్లోనే... సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్ షెనాన్ గాబ్రియెల్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. అతను వేసిన నాలుగో బంతిని ఆడకుండా చేతులెత్తేసిన సిబ్లీ (0) క్లీన్బౌల్డయ్యాడు. ఆ తర్వాత పదే పదే వచ్చిన అంతరాయాల మధ్య బర్న్స్, డెన్లీ జట్టు ఇన్నింగ్స్ను కొనసాగించారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత ఆగిన ఆట మళ్లీ మొదలు కాలేదు. మళ్లీ మళ్లీ... తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు. బ్రాడ్ అవుట్... ఇంగ్లండ్ తుది జట్టులో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మోకాళ్లపై కూర్చోని... అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు. రూట్కు రెండో అబ్బాయి... ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్కు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా రూట్ అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ‘ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్ లక్. మేం మ్యాచ్ చూస్తూ మీకు మద్దతునిస్తాం’ అంటూ కొత్తగా పుట్టిన అబ్బాయి, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్ విలియమ్తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్ చేశాడు. విరామం అనంతరం రూట్ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్లో జట్టుతో కలుస్తాడు. రూట్ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున 81వ కెప్టెన్గా స్టోక్స్ నిలిచాడు. -
డబ్బులు వద్దు... భారత్తో టెస్టును చూస్తాం!
సౌతాంప్టన్: ఏడాది తర్వాత జరిగే భారత్– ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్పై అభిమానుల్లో ఆసక్తి ఎలా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పాత షెడ్యూల్ ప్రకారం ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య గురువారంనుంచి తొలి టెస్టు జరగాల్సి ఉంది. తొలి నాలుగు రోజుల టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. అయితే ఇప్పు డు ఈ మ్యాచ్ వేదికను సౌతాంప్టన్కు మార్చారు. దాంతో టికెట్ డబ్బులు వంద శాతం వాపస్ ఇవ్వాలా...లేక వచ్చే ఏడాది ఇక్కడ జరి గే భారత్–ఇంగ్లండ్ టెస్టు కోసం వాటిని అలాగే అట్టిపెట్టాలా అని ఫ్యాన్స్ను కోరింది. వీరిలో 85 శాతం మంది తమకు డబ్బులు వద్దు, సంవత్సరం తర్వాతైనా సరే మ్యాచ్ చూసేందుకు వస్తాం అంటూ అంగీకారాన్ని తెలియజేయడం విశేషం. ఇంగ్లండ్లో టెస్టు క్రికెట్కు ఉండే ఆదరణ ఎలాంటిదో ఇది చూపిస్తోంది. (అందుకే సోషల్ మీడియాకు ధోని దూరంగా!) -
కోహ్లి నీ కెప్టెన్సీ సూపరో సూపర్!
సౌతాంప్టన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తాడు. ప్రపంచకప్లో భాగంగా శనివారం అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తీవ్ర ఒత్తిడిలోనూ కోహ్లి కెప్టెన్సీ బాగా చేశాడని ప్రశంసలతో ముంచెత్తాడు. కీలక సమయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో డాట్బాల్స్ వేయించి ఫలితం రాబట్టాడని తెలిపాడు. ఫీల్డింగ్ కూడా బాగా పెట్టాడని ప్రశంసించాడు. అటు బ్యాట్తోనూ కీలకమైన 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లి బాడీ లాంగ్వేజ్, ఫుట్వర్క్ ఆకట్టుకుందన్నాడు. అలాగే ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో ధోని-కేదార్ జాదవ్లు నెమ్మదైన భాగస్వామ్యంతో విసుగెత్తించారని విమర్శించాడు. శనివారం జరిగిన మ్యాచ్ చూస్తే తనకు 2003 ప్రపంచకప్లో హాలండ్తో జరిగిన మ్యాచ్ గుర్తుకు వచ్చిందని తెలిపాడు. అప్పుడు ఇలాగే తక్కువ పరుగులే చేశామని, కానీ బౌలర్ల చొరవతోనే విజయం సాధించగలిగామని గుర్తుకు తెచ్చుకున్నాడు. నెమ్మదైన పిచ్పై అఫ్గాన్ క్రికెటర్లు అటు మొదట బౌలింగ్లోనూ, తర్వాత బ్యాట్తోనూ అదరగొట్టి భారత్కు ముచ్చెమటలు పట్టించారని సచిన్ చెప్పుకొచ్చాడు. షమీకి ముందే చెప్పా.. టీమిండియా పేసర్, హ్యాట్రిక్ హీరో మహ్మద్ షమీకి త్వరలోనే మంచి టైం వస్తుందని ముందే చెప్పానని సచిన్ తెలిపాడు. ఈ మ్యాచ్లో షమీ హ్యాట్రిక్తో ఔరా అనిపించిన విషయం తెలిసిందే. ఈ మెగాఈవెంట్లో ఈ ఘనతనందుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచిన షమీ.. ఓవరాల్గా 10వ బౌలర్గా గుర్తింపుపొందాడు. షమీ అద్భుత ప్రదర్శనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ.. ‘త్వరలోనే నీదైనా టైం వస్తుంది. తుది జట్టులో అవకాశం లభిస్తుందని షమీకి చెప్పాను. అంటే భువనేశ్వర్కు గాయం కావాలనేది నా ఉద్దేశం కాదు. సంసిద్ధంగా ఉండని మాత్రం షమీకి చెప్పాను. దురదృష్టవశాత్తు భువీ గాయంతో వైదొలగడం.. షమీకి అవకాశం రావడం అలా జరిగిపోయింది. షమీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు గంటకు 140 కిలోమీటర్ల వేగం తగ్గకుండా వేసాడు’ అని కొనియాడాడు. షమీ అద్భుత ప్రదర్శనను యావత్ క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తొలి నాలుగు మ్యాచ్లకు తుది జట్టులో చోటు దక్కని షమీకి.. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ గాయపడటంతో అప్గాన్ మ్యాచ్కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. -
అఫ్గానిస్తాన్ లక్ష్యం 225
-
టీమిండియా తడ‘బ్యాటు’.. అఫ్గాన్ లక్ష్యం 225
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లి(67), కేదార్ జాదవ్(52)లు హాఫ్ సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్(30), విజయ్ శంకర్(29), ఎంఎస్ ధోని(28)లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ(1) నిరాశపరచడంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ను నష్టపోయింది. ఆ తరుణంలో రాహుల్కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ అనవసరపు షాట్కు యత్నించి రెండో వికెట్గా ఔటయ్యాడు. అప్పుడు కోహ్లి-విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్ది యత్నం చేసింది. ఈ జోడి 58 పరుగుల జత చేసిన తర్వాత విజయ్ శంకర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఫలితంగా 122 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో కోహ్లి సైతం ఔట్ అయ్యాడు. కాగా, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్లు కాస్త ప్రతిఘటించడంతో భారత్ తేరుకుంది. ఈ జోడి 57 పరుగులు జత చేసిన తర్వాత ధోని ఐదో వికెట్గా ఔటయ్యాడు. కాసేపటికి హార్దిక్ పాండ్యా(7) కూడా పెవిలియన్ చేరగా, షమీ(1) కూడా వెంటనే ఔటయ్యాడు. ఇక కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని చివరి ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. దాంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో భారత ఆటగాళ్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్లు తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, రహ్మత్ షా, ముజీబ్ ఉర్ రహ్మాన్, అఫ్తాబ్ అలామ్లకు వికెట్ చొప్పున లభించింది. -
రెచ్చిపోతారనుకుంటే.. తడబడుతున్నారు!
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా రెచ్చిపోవడం ఖాయమని సగటు క్రీడాభిమాని ఊహించుకుని ఉంటాడు. అయితే మ్యాచ్ ఆరంభమైన తర్వాత మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. భారత జట్టు కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని కుదురుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. 135 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి బ్యాటింగ్లో తడబాటుకు గురైంది. భారత్ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లలో రోహిత్ శర్మ(1), కేఎల్ రాహుల్(30), విజయ్ శంకర్(29), విరాట్ కోహ్లి(67)లు ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ను నష్టపోయింది. ఆ తరుణంలో రాహుల్కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ అనవసరపు షాట్కు యత్నించి రెండో వికెట్గా ఔటయ్యాడు. అప్పుడు కోహ్లి-విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్ది యత్నం చేసింది. ఈ జోడి 58 పరుగుల జత చేసిన తర్వాత విజయ్ శంకర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఫలితంగా 122 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో కోహ్లి సైతం ఔట్ కావడంతో భారత్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఇక మిగతా వారు సాధ్యమైనంత వరకూ క్రీజ్లో ఉండి స్టైక్ రోటేట్ చేస్తేనే భారత్ పోరాడే లక్ష్యాన్ని అఫ్గాన్ ముందు ఉంచకల్గుతుంది. 36 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. -
రోహిత్ శర్మ విఫలం
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. కేవలం పరుగు మాత్రమే చేసిన రోహిత్ పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ను నష్టపోయింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్ను రోహిత్, కేఎల్ రాహుల్లు ఆరంభించారు. కాగా, అఫ్గానిస్తాన్ తొలి ఓవర్ను స్పిన్తో ప్రారంభించింది. స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్తో అఫ్గాన్ మొదటి ఓవర్ను వేయించింది. అయితే ముజీబ్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఆడిన రోహిత్ పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్తో జరిగిన గత మ్యాచ్లో భారీ సెంచరీ సాధించిన రోహిత్.. అఫ్గాన్తో మ్యాచ్లో విఫలం కావడం భారత అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. -
షమీ వచ్చేశాడు..
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా ఓవైపు.. ఆడిన ఐదింటిలోనూ ఓడిన అఫ్గానిస్తాన్ మరోవైపు.. కోహ్లిసేనతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ అఫ్గాన్ది వెనుకడుగే.. దీంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోందో చెప్పాల్సిన పనిలేదు. అయినా మెరుపు ఆటను ప్రదర్శిస్తూ తమ రన్రేట్ను మెరుగుపరుచుకునేందుకు కోహ్లి సేన ఈ మ్యాచ్ను వాడుకోవాలనుకుంటోంది. టోర్నీ సాగుతున్న కొద్దీ భారత్కు గాయాల బెడద తీవ్రమవుతున్నా తమ అమ్ముల పొదిలో మిగిలిన అస్త్రాలు కూడా పదునుగానే ఉండడం జట్టుకు సానుకూలాంశం. అటు ఇయాన్ మోర్గాన్ ఊచకోత నుంచి అఫ్గాన్ ఇంకా కోలుకోలేదు. అలాగే తురుపు ముక్క రషీద్ ఖాన్ పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును మరింత దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఏమేరకు పోటీనివ్వగలదో వేచి చూడాలి. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య రెండు వన్డేల జరగ్గా, వీటిలో భారత్ ఒక మ్యాచ్ నెగగ్గా... మరోటి టై అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఊహించినట్లుగానే ఈ మ్యాచ్లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. తొడకండరాల నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు. ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా వేసిన యార్కర్కు గాయపడ్డ విజయ్ శంకర్ కోలుకోవడంతో అతన్నే తుది జట్టులో కొనసాగించాలని టీమిండియా యాజమాన్యం నిర్ణయించింది. దాంతో అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో రిషభ్ పంత్కు ఆడే అవకాశం దక్కలేదు. తుది జట్లు భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, చహల్, బుమ్రా అఫ్గానిస్తాన్ గుల్బదిన్ నైబ్(కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్కర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీ ఖిల్, నజిబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, అఫ్తాబ్ అలామ్, ముజీబ్ ఉర్ రహ్మాన్ -
సఫారీలకు ఆదిలోనే షాక్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6), ఫస్ట్ డౌన్ ఆటగాడు మర్కరమ్(5) వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను ఆమ్లా, డీకాక్లు ఆరంభించారు. కాగా, కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఐదో బంతికి ఆమ్లా స్లిప్లో గేల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్లోకి వచ్చిన మర్కరమ్ కీపర్ షాయ్ హోప్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాట్రెల్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి మర్కరమ్ బంతిని లెగ్ సైడ్కు ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో మర్కరమ్ భారంగా పెవిలియన్ వీడాడు. దాంతో సఫారీలు 28 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయారు. ఇప్పటికే వరుస మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు విండీస్ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే వారు సెమీస్ రేసులో నిలుస్తారు. మరొకవైపు ఒక మ్యాచ్లో గెలిచి, మరొక మ్యాచ్లో విండీస్కు ఇది మూడో లీగ్ మ్యాచ్. ఆస్ట్రేలియాతో జరిగిన గత మ్యాచ్లో వెస్టిండీస్ ఓటమి పాలైంది. దాంతో తాజా మ్యాచ్ ద్వారా విజయాల పట్టాలని కరీబియన్లు భావిస్తున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు వరుణుడు అంతరాయం కల్గించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా 7.3 ఓవర్ల వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. -
ఆండ్రీ రసెల్ ఔట్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా ఇప్పటిదాకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే వెస్టిండీస్పై గెలవడం సఫారీలకు తప్పనిసరి. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి.. మరో మ్యాచ్లో ఓడిన విండీస్.. దక్షిణాఫ్రికాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్.. సఫారీలను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్కు విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ దూరమయ్యాడు. గాయం కారణంగా రసెల్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇక ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లు 61 వన్డేలు ఆడగా, ఇందులో సఫారీ జట్టు 44 గెలిచి, విండీస్ 15 మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. మరో మ్యాచ్ రద్దయ్యింది. గత మూడు కప్లలోనూ వారిపై విజయం సాధించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. సెమీస్ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సి ఉండగా, కరీబియన్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఇరు జట్లు ఇప్పటివరకు ప్రపంచ కప్లో ఆరు మ్యాచ్ల్లో తలపడితే... నాలుగింటిలో సఫారీలు, రెండింటిలో వెస్టిండీస్ గెలిచింది. దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీకాక్, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వోయో, క్రిస్ మోరిస్, కగిసో రబడా, ఇమ్రాన్ తాహీర్, హెండ్రిక్స్ వెస్టిండీస్ జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, షాయ్ హోప్, డారెన్ బ్రేవో, నికోలస్ పూరన్, హెట్ మెయిర్, బ్రాత్వైట్, ఆశ్లే నర్స్, కీమర్ రోచ్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నే థామస్ -
భారత్ లక్ష్యం 228
సౌతాంప్టన్: వరల్డ్కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా 228 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(42) రాణించగా, డుప్లెసిస్(38), ఫెహ్లుక్వోయో(34), డేవిడ్ మిల్లర్(31), డస్సెన్(22)లు మోస్తరుగా ఆడారు. రబడా(31 నాటౌట్) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో యజ్వేంద్ర చహల్ నాలుగు వికెట్లతో రాణించగా, బుమ్రా, భువనేశ్వర్లు తలో రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్కు వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఆమ్లా(6), డీకాక్(10)లు ఆరంభంలోనే పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆమ్లా,డీకాక్లను బుమ్రా అద్భుతమైన బంతులతో పెవిలియన్కు చేర్చాడు. ఆ తరుణంలో డుప్లెసిస్-డస్సెన్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 54 పరుగులు జత చేసిన తర్వా డస్సెన్ మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. మరో రెండు పరుగుల వ్యవధిలో డుప్లెసిస్ కూడా ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా 80 పరుగుల వద్ద నాల్గో వికెట్ను కోల్పోయింది. ఒకే ఓవర్లో డస్సెన్, డుప్లెసిస్లను చహల్ ఔట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. మరో తొమ్మిది పరుగుల వ్యవధిలో డుమిని ఔటయ్యాడు. కుల్దీప్ బౌలింగ్లో డుమిని వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ సమయంలో డేవిడ్ మిల్లర్-ఫెహ్లుక్వోయో జోడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టింది. ఈ జోడి 46 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా కాస్త తేరుకుంది. అయితే డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వోయోలను స్వల్ప వ్యవధిలో చహల్ పెవిలియన్కు పంపాడు. దాంతో దక్షిణాఫ్రికా 158 పరుగులకు ఏడు వికెట్లను నష్టపోయింది. అటు తర్వాత మోరిస్-రబడాల జోడి భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో దక్షిణాఫ్రికా మళ్లీ పుంజుకుంది. వీరు ఎనిమిదో వికెట్కు 66 పరుగులు జత చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. -
భారత బౌలర్ల విజృంభణ
సౌతాంప్టాన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్ల విజృంభణ కొనసాగుతోంది. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు తమదైన శైలిలో చెలరేగిపోతూ సఫారీలను కష్టాల్లోకి నెట్టారు. 89 పరుగులకే ఐదు సఫారీ వికెట్లను నేలకూల్చారు. సఫారీ ఓపెనర్లు హషీమ్ ఆమ్లా-డీకాక్లను బుమ్రా ఔట్ చేయగా, వాన్ డెర్ డస్సెన్-డుప్లెసిస్లను చహల్ పెవిలియన్కు పంపాడు. ఆపై జేపీ డుమినీని కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా నాల్గో ఓవర్ రెండో బంతిని బుమ్రా ఆఫ్ స్టంప్పై గుడ్ లెంగ్త్లో సంధించాడు. దానికి తడబడిన ఆమ్లా.. రోహిత్కు స్లిప్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ను సెకండ్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో ఆమ్లా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఆపై డీకాక్ను సైతం బుమ్రా ఔట్ చేశాడు. ఆరో ఓవర్ ఐదో బంతికి డీకాక్ స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్యాచ్ను థర్డ్ స్లిప్లో ఉన్న విరాట్ కోహ్లి అందుకున్నాడు. ఇక 20 ఓవర్ మొదటి బంతికి డస్సెన్ను చహల్ బౌల్డ్ చేయగా, అదే ఓవర్ ఆఖరి బంతికి డుప్లెసిస్ను సైతం క్లీన్ బౌల్డ్ చేశాడు. అటు తర్వాత 23 ఓవర్ చివరి బంతికి జేపీ డుమినీని కుల్దీప్ యాదవ్ వికెట్లు ముందు బోల్తా కొట్టించాడు. కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన డుమినీ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. -
బుమ్రా..వాట్ ఏ స్పెల్
సౌతాంప్టాన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనమార్కు బౌలింగ్ను రుచి చూపించాడు. సఫారీ ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(6), డీకాక్(10)లను పెవిలియన్కు చేర్చి ఆ జట్టకు ఆదిలోనే షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో నాల్గో ఓవర్ రెండో బంతికి ఆమ్లాను ఔట్ చేసిన బుమ్రా..ఆరో ఓవర్ ఐదో బంతికి డీకాక్ను పెవిలియన్కు పంపాడు. రోహిత్ శర్మ స్లిప్ క్యాచ్ అందుకోవడంతో ఆమ్లా ఇన్నింగ్స్ ముగియగా, కోహ్లి స్లిప్ క్యాచ్ పట్టడంతో డీకాక్ ఔటయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్విట్టర్లో స్పందించాడు. ‘ వాట్ ఏ స్పెల్ బుమ్రా’ అంటూ కొనియాడాడు. (ఇక్కడ చదవండి: బుమ్రా ‘బోణీ’ చేశాడు..!) అదే సమయంలో ఈసారి డీకాక్పై బుమ్రా ఎటువంటి దయ చూపించలేదని ట్వీట్ చేశాడు. ‘23 రోజులు రోజుల క్రితం(ఐపీఎల్లో బుమ్రా, డీకాక్లు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కావడంతో) డీకాక్పై బుమ్రాకు ఎంతో కొంత జాలి ఉండటంతో పాటు వారిద్దరి మధ్య సంబంధం బాగుండేది. కానీ ఈ రోజు డీకాక్పై ఎటువంటి జాలి చూపించలేదు. వాట్ ఏ స్పెల్ బుమ్రా’ అంటూ ట్వీట్లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. తొలి స్సెల్లో బుమ్రా ఐదు ఓవర్లు వేసి రెండు వికెట్లు సాధించడమే కాకుండా 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. -
బుమ్రా ‘బోణీ’ చేశాడు..!
సౌతాంప్టాన్: తొలి ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బోణీ కొట్టాడు. వరల్డ్కప్లో మొదటి వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్లో బుమ్రా శుభారంభం అందించాడు. సఫారీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా వికెట్ను సాధించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా నాల్గో ఓవర్ రెండో బంతిని బుమ్రా ఆఫ్ స్టంప్పై గుడ్ లెంగ్త్లో సంధించాడు. దానికి తడబడిన ఆమ్లా.. రోహిత్కు స్లిప్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ను సెకండ్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో ఆమ్లా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఆపై డీకాక్(10)ను సైతం బుమ్రా ఔట్ చేశాడు. ఆరో ఓవర్ ఐదో బంతికి డీకాక్ స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్యాచ్ను థర్డ్ స్లిప్లో ఉన్న విరాట్ కోహ్లి అందుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికా 24 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ప్రస్తుత వరల్డ్కప్లో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్ సాధించిన తొలి రెండు వికెట్లు బుమ్రా ఖాతాలో పడటం మరో విశేషం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. -
టీమిండియా శుభారంభం చేసేనా?
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తమ తొలి మ్యాచ్లో టీమిండియా శుభారంభం చేయాలని భావిస్తోంది. బుధవారం సౌతాంప్టాన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా 46 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచ కప్లో నాలుగు సార్లు ఎదురుపడగా భారత్ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది. అయితే తాజా వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సఫారీలకు నిరాశే ఎదురైంది. వారికిది మూడో మ్యాచ్. ఇందులోనూ ఓడితే ఇకపై ప్రతి మ్యాచ్ నెగ్గితేనే కానీ కప్లో ముందుకెళ్లలేరు. గత మ్యాచ్ ప్రారంభంలోనే ఎన్గిడి సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్ స్టెయిన్ సైతం దూరమయ్యాడు. లెక్క ప్రకారం చూస్తే ఆ జట్టుకు ఇప్పుడు నలుగురే స్పెషలిస్ట్ బౌలర్లున్నారు. బ్యాటింగ్ విభాగంలో డీకాక్, డుప్లెసిస్, హషీమ్ ఆమ్లాలు వారికి ప్రధాన బలం. మరోవైపు తగినంత విశ్రాంతితో, తీరైన సన్నాహంతో, మంచి ప్రాక్టీస్తో భారత్ బల ప్రదర్శనకు దిగుతోంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్తో పాటు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లతో జట్టు బ్యాటింగ్ బలంగా కనబడుతోంది. ఇక పేస్, స్పిన్ విభాగాల్లో భారత సమతూకంగా ఉంది. ఈ పిచ్ స్వింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో తుది జట్టులో భువనేశ్వర్ కుమార్కు చోటు దక్కింది. స్పిన్ విషయానికొస్తే కుల్దీప్ యాదవ్, చహల్లకు అవకాశం కల్పించారు. తుది జట్లు దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), డీకాక్, హషీమ్ ఆమ్లా, వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీ, ఫెహ్లుక్వోయా, క్రిస్ మోరిస్, కగిసో రబడా, ఇమ్రాన్ తాహీర్, తాబ్రాయిజ్ షంసీ భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా -
భారత క్రికెటర్లు.. హాయిహాయిగా
సౌతాంప్టన్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉంటాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటితో పాటు టీమిండియాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుటికప్పుడూ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజా ప్రపంచకప్లో భాగంగా భారత క్రికెటర్లు ఇంగ్లండ్లో పర్యటిస్తున్నారు. టోర్నీ ప్రారంభమైన వారం రోజుల తర్వాత టీమిండియాకు మ్యాచ్ ఉండటంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాలలో విహరిస్తున్నారు. తాజాగా సౌతాంప్టన్లో టీమిండియా ఆటగాళ్లు పెయింట్ బాలింగ్ గేమ్ ఆడటానికి వెళ్లారు. కోహ్లితో పాటు ఈ గేమ్ ఆడటానికి వెళ్లిన వారిలో ధోని, చహల్, రాహుల్, ధావన్, దీపక్ చాహర్, బుమ్రా, కుల్దీప్, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మలు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కోహ్లి షేర్ చేస్తూ ‘ఫన్ టైమ్ విత్ బాయ్స్’అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక రెండు వార్మప్ మ్యాచ్ల్లో ఆటగాళ్లు చేసిన పొరపాట్లపై, అదేవిధంగా ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఫీల్డింగ్ డ్రిల్ను నిర్వహించింది. ఇక విరాట్ కోహ్లి నెట్స్లో బౌలింగ్ చేయడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇక ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భాగంగా టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో సఫారీ జట్టు ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. -
భయంతో కాఫీ తాగడం మానేస్తున్నారు
లండన్: పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే చాలు అన్నీ మటుమాయం. కానీ చాలామంది కాఫీలో కెఫిన్ వంటి ఆల్కాలాయిడ్ ఉండటంతో ప్రమాదకరమనే భయంతో కాఫీ తాగడం మానేస్తున్నారు. అయితే ప్రతిరోజూ మూడు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల ముప్పు లేదని, పైగా జీవితకాలం పెరుగుతుందని బ్రిటన్కు చెందిన సౌత్ ఆంప్టన్ వర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. అంతేకాకుండా గుండెపోటుతో పాటు క్యాన్సర్, మధుమేహం, కాలేయ సంబంధిత ప్రమాదకర వ్యాధులను నివారిస్తుందని పరిశోధకులు తెలిపారు. దీనికి కారణం కాఫీ చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండటమేనని వారు తెలిపారు. అయితే గర్భిణులు కాఫీ తాగడం ప్రమాదకరమట. అయితే కేవలం 201 పరిశోధక పత్రాలను మాత్రమే తాము పరిశీలించామని, కాఫీ వల్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందా.. లేక అనారోగ్యాన్ని కొనితెస్తుందా... అనే విషయంపై పూర్తి స్పష్టత ఇవ్వలేకపోయారు. -
నేరుగా ప్రధానే మీ ఇంటి తలుపు తడితే..
లండన్: సాక్షాత్తు ప్రధాన మంత్రే మీ ఇంటి తలుపుకొడితే తీయకుండా ఉండగలరా.. అసలు ఆ ఆలోచన వస్తేనే మనసు సంతోషంలో తేలిపోకుండా ఉండటం సాధ్యమేనా.. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా లైట్గా తీసుకున్నాడు. ప్రధాని వచ్చి డోర్ కొట్టడమే కాదు.. లోపల ఎవరైనా ఉన్నారా అని పిలిచినా, ప్రధానే పిలిచేదని తెలిసినా అతడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆ ప్రధాని వెనుదిరిగారు. అయితే, ఆ ప్రధాని నరేంద్రమోదీ కాదు.. బ్రిటన్ దేశ ప్రధాని థెరిసా మే. ఇది జరిగింది సౌతాంప్టన్లో. అవును త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాని థెరిసా మే స్వయంగా ప్రతి ఇంటికెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డేవిడ్ బ్రియాన్ అనే వ్యక్తి ఇంటికెళ్లి తలుపుతట్టారు. లోపల ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇదంతా కూడా ఇంటి లోపల ఉన్న డేవిడ్ తన సీసీటీవీ కెమెరా ద్వారా ఇంట్లో టీవీలో చూస్తునే ఉన్నాడు. అయితే, ప్రధాని వచ్చారు కదా అనే ఉత్సాహంతో కాకుండా అలాగే టీవీలో చూస్తుండి పోయాడు. కనీసం అడుగు కూడా వేయలేదు. అసలు బిజీషెడ్యూల్తో ఉన్న ఆమె మరో ఇంటికి వెళ్లిపోతుండగా అప్పుడు కదిలి కిటికీలో నుంచి ఆసక్తిగా గమనించాడు. దీనికి సంబంధించిన వీడియోను బ్రియాన్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అదిప్పుడు హల్ చేస్తోంది. -
సెలక్షన్ పరేషాన్!
విజయాల బాటలో ఉన్నప్పుడు తుది జట్టును మార్చకూడదనేది క్రికెట్లో సహజ సూత్రం. భారత కెప్టెన్ ధోని కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉంటాడు. ఒక ఆటగాడు పదే పదే విఫలమైనా జట్టు గెలుస్తోంది కాబట్టి మార్పులు అనవసరం అనేది అతని నిశ్చితాభిప్రాయం. మరి టీమ్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు... జట్టు సభ్యులలో ఎక్కువ మంది పేలవ ఫామ్లో ఉన్నారు. చేసిన మార్పులేమో కలిసి రావడం లేదు. ఇలాంటి స్థితిలో తుది జట్టు కూర్పు కుదిరేదెలా? ఎవరిని ఎంపిక చేయాలి... ఎవరిని పక్కన పెట్టాలి..! ఓవల్ టెస్టుకు ముందు తుది జట్టు ఎంపికే ఇప్పుడు టీమిండియాకు కొత్త సమస్యగా మారింది. ‘స్థానం కోసం సొంత జట్టులోనే గట్టి పోటీ ఉంది. ఇది మంచి పరిణామం’... భారత్ జోరు మీదున్నప్పుడు జట్టు గురించి ఈ మాట తరచుగా వినిపించేది. మన ‘బెంచ్ బలం’ బాగుందని, అందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు కాబట్టి తుది జట్టు ఎంపిక కష్టంగా మారిం దని అనేవారు. అయితే ఇప్పుడు ఈ ‘పోటీ’ అవాంఛనీయ మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకరు విఫలమైతే ఆ స్థానంలో రావాల్సిన ఆటగాడిపై కూడా జట్టు మేనేజ్మెంట్కు నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో చివరి టెస్టు తుది జట్టు ఎంపికలో జరిగే పొరపాట్లు సుదీర్ఘ కాలం కెప్టెన్ను వెంటాడవచ్చు. సరిగ్గా చెప్పాలంటే ఓవల్ టెస్టులో విఫలమైతే ప్రస్తుత జట్టులో చాలా మం దికి భవిష్యత్తులో మరో టెస్టు ఆడే అవకాశం కూడా దక్కకపోవచ్చు. ఫలితం ఇవ్వని మార్పులు లార్డ్స్ టెస్టులో ఘన విజయం తర్వాత సౌతాంప్టన్లో ధోని రెండు మార్పులతో బరిలోకి దిగాడు. ఇషాంత్ గాయంతో తప్పుకోగా బిన్నీని పక్కన పెట్టారు. వీరి స్థానాల్లో పంకజ్ సింగ్, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. పంకజ్ ఒక్క వికెట్ తీయకపోగా...రోహిత్ 28, 6 పరుగులు చేశాడు. ఆ తర్వాత మాంచెస్టర్లో భారత్ మూడు మార్పులు చేసింది. ధావన్, రోహిత్, షమీ స్థానాల్లో గంభీర్, అశ్విన్, ఆరోన్ వచ్చారు. వీరిలో ఆరోన్ ఆకట్టుకున్నాడు. అశ్విన్ బ్యాటింగ్లో నిలబడినా...తన అసలు బాధ్యత బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇక చాలా కాలం తర్వాత టెస్టు ఆడిన గంభీర్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చివరి టెస్టు కోసం తుది జట్టును ఎంపిక చేసే ముందు ధోని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఎవరి స్థానంలో ఎవరు? జడేజా, అశ్విన్లలో ఎవరిని తీసుకోవాలనేదే ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ప్రధాన సమస్య. ఓవల్లో పేస్కు అనుకూలమైన వికెట్ ఉండవచ్చని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కడం ఖాయం. బౌలింగ్లో ఇద్దరూ అంతంత మాత్రంగానే రాణించారు. గత టెస్టులోనైతే అశ్విన్కు ఒక్క వికెట్టూ దక్కలేదు. ఇక లార్డ్స్లో జడేజా కీలక ఇన్నింగ్స్ భారత్ విజయానికి బాటలు వేసినా ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. నాలుగో టెస్టులో అశ్విన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కాబట్టి ఎవరి స్థానమూ ఖాయం కాదు. ఐదుగురు బౌలర్లతో ఆడాలనుకుంటేనే ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఈ ఇద్దరిదే సమస్య! రెండు చెత్త ప్రదర్శనల్లో మెరుగైంది ఎంచుకోమంటే ఏది ఎంచుకుంటాం! ఇప్పుడు జట్టు ఓపెనర్ స్థానం కూడా సరిగ్గా అలాగే ఉంది. ధావన్ వరుసగా విఫలమైన చోట గంభీర్కు అవకాశం ఇస్తే అతనూ అలాగే ఆడాడు. కాబట్టి వీరిలో ఎవరికి చాన్స్ అనేది తేల్చుకోవాల్సి ఉంది. విఫలమవుతున్నా... యువ ఆటగాడు కాబట్టి ధావన్ వైపే కొంత మొగ్గు ఉంది. ఇదే జరిగితే గంభీర్ కెరీర్ ముగిసినట్లే! అయితే వన్డే ఓపెనర్గా రోహిత్తో మరో ప్రయోగం చేయడమా...ఒకప్పుడు ఓపెనింగ్ చేసిన రహానేను ముందు పంపడమా...ఇలా వేర్వేరు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొత్తానికి మ్యాచ్లో వ్యూహ ప్రతివ్యూహాలకు ముందే జట్టును ఎంపిక చేసేందుకు ధోని తీవ్ర కసరత్తు చేయాలి. - సాక్షి క్రీడా విభాగం ఓవల్లో ఒక విజయం... ఐదో టెస్టు జరిగే లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత రికార్డు చెత్తగా ఏమీ లేదు. ఇక్కడ 11 టెస్టులు ఆడిన ఇండియా ఒక మ్యాచ్లో గెలిచి 3 ఓడింది. మరో 7 మ్యాచ్లు ‘డ్రా’ చేసుకోగలిగింది. 1971 సిరీస్లో భాగంగా అజిత్ వాడేకర్ నాయకత్వంలోని టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి మూడు టెస్టుల సిరీస్ను 1-0తో సొంతం చేసుకుంది. 2011 పర్యటనలో ధోని సేన ఇదే గ్రౌండ్లో ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో చిత్తయింది. ఇషాంత్ ఫిట్గా ఉన్నాడా? లార్డ్స్ టెస్టు హీరో ఇషాంత్ శర్మ గత రెండు మ్యాచుల్లోనూ ఆడకపోవడం భారత్ను దెబ్బ తీసింది. అతను ఈ మ్యాచ్ బరిలోకి దిగడంపై ఇంకా స్పష్టత రాలేదు. బుధవారం అతను ప్రాక్టీస్లో మాత్రం చురుగ్గా కనిపించాడు. ఇషాంత్ జట్టులోకి వస్తే మరో సందేహం లేకుండా నేరుగా పంకజ్పై వేటు పడుతుంది. ఒక వేళ ఇషాంత్ లేడంటే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఎందుకంటే పంకజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మళ్లీ షమీనే నమ్ముకోవచ్చు. ఈ టూర్లో ఇప్పటి వరకు మ్యాచ్ ఆడని ఆటగాడు ఈశ్వర్ పాండే మాత్రమే. పోయేదేముంది... ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంటే తన చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడిని ధోని ఎంపిక చేసే అవకాశం ఉంది. -
భువనేశ్వర్ గాయంపై ఆందోళన
సౌతాంప్టన్: మూడో టెస్టులో దారుణంగా దెబ్బతిన్న భారత జట్టుకు తమ పేసర్ల గాయాలు మరింతగా కుంగదీస్తున్నాయి. ఈనెల 7 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే నాలుగో టెస్టుకు కూడా ఇషాంత్ శర్మ గాయం కారణంగా దూరమవగా తాజాగా సిరీస్లో నిలకడగా రాణిస్తున్న పేసర్ భువనేశ్వర్ ఫిట్నెస్ టీమ్ మేనేజిమెంట్ను ఆందోళనకు గురి చేస్తోంది. అతడు కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. మ్యాచ్కు ఇంకా ఐదు రోజుల సమయం ఉండడంతో ఈ యూపీ బౌలర్ తిరిగి ఫిట్నెస్ అందుకుంటాడనే నమ్మకాన్ని కెప్టెన్ ధోని వ్యక్తం చేస్తున్నాడు. సిరీస్లో ఇప్పటిదాకా తను 124.5 ఓవర్లు బౌలింగ్ చేశాడని, ఇది కూడా అలసి పోవడానికి కారణం కావచ్చని కెప్టెన్ చెప్పాడు. అయితే ఇషాంత్ మాత్రం ఐదో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపాడు. -
మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం
-
అండర్సన్పై నిషేధం తప్పదు!
బీసీసీఐ దగ్గర బలమైన సాక్ష్యం సౌతాంప్టన్: తొలి టెస్టులో భారత ఆల్రౌండర్ జడేజాను తోసివేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్పై నిషేధం తప్పేలా లేదు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలు తమ దగ్గర ఉన్నాయని బీసీసీఐ చెబుతోంది. వీటిని ఐసీసీ జ్యుడీషియల్ కమిషనర్ గోర్డల్ లూయిస్కు సమర్పించనుంది. ఈ వివాదానికి సంబంధించి నేడు విచారణ జరుగుతుంది. అండర్సన్ దోషిగా తేలితే నాలుగు మ్యాచ్ల నిషేధం పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనలో జడేజాకు జరిమానాపై బీసీసీఐ చేసిన అప్పీలుపై కూడా శుక్రవారం విచారణ జరుగుతుంది. సాహా స్థానంలో నమన్ ఓజా ఇంగ్లండ్ పర్యటనలో భారత రిజర్వ్ వికెట్ కీపర్ సాహా గాయం కారణంగా స్వదేశానికి వెళుతున్నాడు. దీంతో అతడి స్థానంలో నమన్ ఓజాను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఓజా ఆస్ట్రేలియాలో భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్నాడు. -
బలమే బలహీనతగా మారిన వేళ...
మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం 266 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం స్పిన్నర్ మొయిన్ అలీకి ఆరు వికెట్లు 1-1తో సిరీస్ సమం నాలుగో టెస్టు గురువారం నుంచి ఈ ఓటమికి బ్యాట్స్మెన్ కారణం. నలుగురు బౌలర్ల వ్యూహంపై పునరాలోచించాలి. ధావన్, విజయ్, రోహిత్లతో ఐదో బౌలర్ స్థానాన్ని భర్తీ చేయొచ్చని అనుకున్నాం. కానీ మేం అనుకున్నట్లు జరగలేదు. ఈ ఓటమిని సమీక్షించుకుని తర్వాతి మ్యాచ్కు సిద్ధమవుతాం’ - ధోని వికెట్ స్పిన్కు అనుకూలిస్తుందంటే... భారత్ ప్రత్యర్థి ఎవరైనా వణికిపోవాల్సిందే..! కానీ ఇక్కడ సీన్ మారింది. మొయిన్ అలీ లాంటి సాధారణ స్పిన్నర్ చేతిలో భారత్ ఓడిపోయింది.వికెట్ను అంచనా వేయలేక అశ్విన్ను వదిలేసిన భారత్... సిరీస్పై పట్టు సాధించే అపూర్వ అవకాశాన్ని చేజార్చుకుంది. తొలి రోజు నుంచే ఆత్మరక్షణ ధోరణిలో ఆడిన ధోనిసేన... ఇంగ్లండ్కు విజయాన్ని పువ్వుల్లో పెట్టి అందించింది. ఏడాది నుంచి గెలుపు లేక, అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కోలేక అల్లాడిపోతున్న ఇంగ్లండ్కు... భారత యువ జట్టు కొత్త ఊపిరి పోసింది. లార్డ్స్లో సంచలన విజయంతో ఊరించిన ధోనిసేన... వారంలోనే ఉస్సూరుమనిపించింది. సౌతాంప్టన్: అద్భుతాలేమీ జరగలేదు. మూడో టెస్టులో నాలుగో రోజు ముగిసేసరికే భారత్ ఓటమి ఖాయమైనా... కనీసం ధోనిసేన పోరాడుతుందేమో అని ఆశించినా.... నిరాశే మిగిలింది. ఆఖరి రోజు గురువారం ఉదయం సెషన్లో రెండు గంటలలోపే మిగిలిన ఆరు వికెట్లు పడిపోయాయి. 24.4 ఓవర్లలో 66 పరుగులు జోడించి... మొత్తం 178 పరుగులకు భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆలౌటయింది. దీంతో ఇంగ్లండ్ 266 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ (6/67) ధాటికి భారత బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. రహానే (121 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు) ఒక్కడే అజేయ అర్ధసెంచరీతో పోరాడాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. నాలుగో టెస్టు గురువారం నుంచి జరుగుతుంది. ఇంగ్లండ్ 10 టెస్టుల తర్వాత ఓ మ్యాచ్ గెలిచి పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. అండర్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండు గంటల్లోపే... చివరి రోజు ఆట మొదలుపెట్టిన భారత్ కాసేపటికే రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. అండర్సన్ బౌలింగ్లో రోహిత్ (6) నిర్లక్ష్యంగా ఆడి వికెట్ను సమర్పించుకున్నాడు. ఒక ఫోర్ కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన ధోని (6) అండర్సన్ బౌలింగ్లోనే బట్లర్కు క్యాచిచ్చి వెనుదిరిగాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేశారు. రహానే, జడేజా వీరి జోరును కాసేపు అడ్డుకున్నారు. అయితే ఏడో వికెట్కు 32 పరుగులు జోడించాక.. జడేజా (15) అలీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అప్పటి నుంచి అలీ జోరు కొనసాగింది. భువనేశ్వర్ను డకౌట్గా వెనక్కి పంపిన అలీ.. షమీ (0)ని కూడా అవుట్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. తనదైన శైలిలో ఆడిన అజింక్యా రహానే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక పంకజ్ సింగ్ రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించినా.. అలీ బౌలింగ్లోనే చివరి బ్యాట్స్మెన్గా పెవిలియన్ చేరాడు. చివరి రోజు 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి భారత వెన్ను విరిచిన అలీ మొత్తం మీద రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం అతనికిదే ఇదే తొలిసారి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 569/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: 330 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 205/4 డిక్లేర్డ్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 12; ధావన్ (సి) జోర్డాన్ (బి) రూట్ 37; పుజారా (సి) జోర్డాన్ (బి) అలీ 2; కోహ్లి (సి) బట్లర్ (బి) అలీ 28; రహానే నాటౌట్ 52; రోహిత్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 6; ధోని (సి) బట్లర్ (బి) అండర్సన్ 6; జడేజా (బి) అలీ 15; భువనేశ్వర్ (సి) అండర్సన్ (బి) అలీ 0; షమీ (బి) అలీ 0; పంకజ్ (బి) అలీ 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం (66.4 ఓవర్లలో ఆలౌట్): 178. వికెట్ల పతనం: 1-26; 2-29; 3-80; 4-89; 5-112; 6-120; 7-152; 8-152; 9-154; 10-178. బౌలింగ్: అండర్సన్ 14-5-24-2; బ్రాడ్ 13-6-22-0; వోక్స్ 11-3-23-0; అలీ 24.4-4-67-6; జోర్డాన్ 5-0-22-0; రూట్ 2-0-5-1; బ్యాలెన్స్ 1-0-5-0. -
మూడో టెస్టులో ఓటమి దిశగా భారత్
-
ఇక అద్భుతం జరిగితేనే..!
- మూడో టెస్టులో ఓటమి దిశగా భారత్ - లక్ష్యం 445.. ప్రస్తుతం 112/4 లార్డ్స్లో విజయం తాలూకు ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే... ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ గెలవాలనే ఆశకు పూర్తిగా రెక్కలు తొడగకముందే... భారత యువ జట్టు చేతులెత్తేసింది. మూడో టెస్టులో రక్షణాత్మక ధోరణిలో ఆడి మూల్యం చెల్లించుకున్నారు. ఇక చివరి రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్ విజయాన్ని ఆపటం కష్టమే. చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ధోనిసేన ఎంతసేపు పోరాడుతుందనేదే ఆసక్తికరం. సౌతాంప్టన్: అద్భుతమేదైనా జరిగితే తప్ప మూడో టెస్టులో భారత్ ఓటమి దాదాపు ఖాయమైనట్టే. నాలుగోరోజు భారత్ తొలి ఇన్నింగ్స్కు నాలుగు ఓవర్లలోనే ముగింపు పలికిన ఇంగ్లండ్.. ఆపై రెండో ఇన్నింగ్స్లో చకచకా పరుగులు చేసి ధోనిసేన ముందు 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం టాప్ ఆర్డర్ మరోసారి తడబడగా... బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. రహానే (18 బ్యాటింగ్), రోహిత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 330 పరుగులకు ఆలౌట్ కాగా... ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగు ఓవర్లలోనే...: ఓవర్నైట్ స్కోరు 323/8తో ప్రారంభమైన భారత్ తొలిఇన్నింగ్స్ 4 ఓవర్లలోనే ముగిసింది. వ్యక్తిగత స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే కెప్టెన్ ధోని (113 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆ వెంటనే షమీ (5)ని కూడా ఔట్ చేసిన అండర్సన్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 239 పరుగుల ఆధిక్యం లభించినా... భారత్ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగింది. ఇంగ్లండ్ దూకుడు: వీలైనంత వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో రాబ్సన్ (16), బ్యాలెన్స్ (38) అవుటయ్యారు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. బెల్ (23), రూట్ (56) కూడా వేగంగా ఆడారు. కుక్ (114 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ విరామానికి ముందు రూట్ అవుటయ్యాడు. 40.4 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మళ్లీ అదే తీరు..: మ్యాచ్ను కాపాడుకోవాలంటే నాలుగు సెషన్లపాటు ఆడాల్సివుండగా విజయ్ (12) రనౌట్ రూపంలో భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పుజార (2) విఫలమయ్యాడు. ఈ దశలో ధావన్ (85 బంతుల్లో 37; 6 ఫోర్లు), కోహ్లి (56 బంతుల్లో 28; 3 ఫోర్లు) పోరాటపటిమ కనబరిచారు. కానీ, వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతో రహానే, రోహిత్లపై భారం పడింది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 569/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: 330 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 13; కుక్ నాటౌట్ 70; బ్యాలెన్స్ (సి) పుజారా (బి) జడేజా 38; బెల్ (బి) జడేజా 23; రూట్ (బి) జడేజా 56; ఎక్స్ట్రాలు 5, మొత్తం (40.4 ఓవర్లలో 4 వికెట్లకు): 205 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-22, 2-80, 3-106, 4-205. బౌలింగ్: భువనేశ్వర్ 10-0-59-1; పంకజ్ 10-4-33-0; షమీ 4-0-24-0; రోహిత్ 5-0-32-0; జడేజా 10.4-1-52-3; విజయ్ 1-0-1-0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 12; ధావన్ (సి) జోర్డాన్ (బి) రూట్ 37; పుజారా (సి) జోర్డాన్ (బి) అలీ 2; కోహ్లి (సి) బట్లర్ (బి) అలీ 28; రహానే బ్యాటింగ్ 18; రోహిత్ బ్యాటింగ్ 6; ఎక్స్ట్రాలు 9, మొత్తం(42 ఓవర్లలో 4 వికెట్లకు): 112. వికెట్ల పతనం: 1-26, 2-29, 3-80, 4-89. బౌలింగ్: అండర్సన్ 8-3-13-0; బ్రాడ్ 9-4-18-0; వోక్స్ 5-2-7-0; అలీ 12-2-33-2; జోర్డాన్ 5-0-22-0; రూట్ 2-0-5-1; బ్యాలెన్స్ 1-0-5-0. మరో వివాదంలో అండర్సన్ ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ మరోమారు వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. బుధవారం ఆట ముగిశాక మైదానం నుంచి బయటకు వెళ్తున్న భారత బ్యాట్స్మన్ రహానేకు వేలు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్ వైపు దారి చూపించాడు. ఈలోగా అంపైర్ టక్కర్ కలగజేసుకుని సర్దిచెప్పారు. -
లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3
సాతాంప్టన్: పటౌడీ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో భారత్ తో జరుగుతున్న రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. లంచ్ సమయానికి ఇయాన్ బెల్ 68, రూట్ 2 పరుగులతో నాటౌట్ క్రీజులో ఉన్నారు. కుక్ 95, రాబ్సన్ 26, బాలెన్స్ 156 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో షమీ, శర్మ, జడేజాలకు చెరో వికెట్ లభించింది. -
'అప్పుడే అతడి మొహంలో నవ్వు చూశా'
సౌంఫ్టన్: పరుగులు చేయడానికి ఇటీవల కాలంలో ఇబ్బందులు పడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. టెస్టులో మెరుగైన రికార్డు ఉన్న కుక్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. భారత్ తో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అతడు 95 పరుగులు చేశాడు. 5 పరుగులతో తేడాతో టెస్టుల్లో 26వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫామ్ కోల్పోయిన తంటాలు పడుతున్న ఈ ఇంగ్లీషు కెప్టెన్ ఈ ఇన్నింగ్స్ గొప్ప ఊరటనిచ్చింది. ఐదు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోవడం బాధనిపించిందని కుక్ పేర్కొన్నాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తానిచ్చిన క్యాచ్ వదిలేసిన భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కుక్ పరోక్షంగా థాంక్స్ చెప్పాడు. అదృష్టవశాత్తు అలా జరిగిందన్నాడు. చివరికి జడేజా బౌలింగ్ లో తాను అవుటైన తర్వాతే అతడి మొహంలో నవ్వు చూశానని కుక్ వివరించాడు. -
‘బ్యాలెన్స్’ తప్పారు!
తేలిపోయిన భారత బౌలర్లు తొలి రోజు ఇంగ్లండ్ 247/2 ఆకట్టుకున్న బ్యాట్స్మెన్ బ్యాలెన్స్ సెంచరీ, శతకం కోల్పోయిన కుక్ గాయం కారణంగా చివరి నిమిషంలో ఇషాంత్ దూరం కావడం... భువనేశ్వర్ గతి తప్పడం... షమీకి బంతిపై పట్టు చిక్కకపోవడం... పంకజ్ సింగ్కు అనుభవం లేకపోవడం... వెరసి సౌతాంప్టన్ టెస్టులో తొలి రోజు ఆదివారం భారత బౌలర్లు ‘బ్యాలెన్స్’ తప్పారు. ఏ దశలోనూ మనవాళ్లు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. ఒక్క స్పెల్లో కూడా ప్రత్యర్థిని భయపెట్టలేకపోయారు. మరోవైపు వరుసగా పది టెస్టుల్లో గెలుపు లేదు... బ్యాట్స్మన్గా ఘోర వైఫల్యం... కెప్టెన్సీకి పనికి రాడంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు... ఈసారి విఫలమైతే ఇంటికే అన్నట్లుగా మెడపై కత్తి వేలాడుతోంది. ఇలాంటి స్థితిలో అలిస్టర్ కుక్ నిలబడ్డాడు. జీవన్మరణ సమస్యలా పోరాడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యువ ఆటగాడు బ్యాలెన్స్ కెప్టెన్కు అండగా నిలిచాడు. వరుసగా రెండో టెస్టులోనూ శతకం సాధించి సత్తా చాటాడు. సౌతాంప్టన్: లార్డ్స్ టెస్టు పరాభవం నుంచి ఇంగ్లండ్ జట్టు కోలుకుంది. ఆదివారం భారత్తో ఇక్కడి రోజ్బౌల్ మైదానంలో ప్రారంభమైన మూడో టెస్టులో ఆ జట్టు స్ఫూర్తిదాయక ఆటతీరుతో శుభారంభం చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ (204 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా... వరుస వైఫల్యాల నుంచి కోలుకున్న కెప్టెన్ అలిస్టర్ కుక్ (231 బంతుల్లో 95; 9 ఫోర్లు) సెంచరీ కోల్పోయాడు. ప్రస్తుతం బ్యాలెన్స్తో పాటు బెల్ (16 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. భారత బౌలర్లలో షమీ, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆ క్యాచ్ పట్టుంటే... ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన భారత బౌలర్ పంకజ్ సింగ్ తొలి వికెట్ సాధించే అవకాశాన్ని జడేజా వమ్ము చేశాడు. పంకజ్ వేసిన మూడో ఓవర్ తొలి బంతి ఆఫ్ స్టంప్పై పడింది. దానిని ఆడలేక కుక్ స్లిప్స్ వైపు ఎడ్జ్ ఇచ్చాడు. అయితే మూడో స్లిప్లో ఉన్న జడేజా ఈ సునాయాస క్యాచ్ను విడిచిపెట్టాడు. బంతి చేతుల్లోకి వచ్చినా దానిని వదిలేశాడు. ఆ సమయంలో కుక్ స్కోరు 15 పరుగులు. ఆ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ తన స్కోరుకు మరో 80 పరుగులు జోడించాడు. కుక్ క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో! తొలి సెషన్: కెప్టెన్ గట్టెక్కాడు భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతి ఆఫ్స్టంప్పై అద్భుతంగా స్వింగ్ అయింది. కుక్ బ్యాట్కు తగిలినా... స్లిప్ ఫీల్డర్కు కాస్త ముందు పడింది. అంతే... ఆ తర్వాత తొలి రోజు భారత్ బంతిపై పట్టు కోల్పోయింది. పంకజ్ బౌలింగ్లో జడేజా క్యాచ్ వదిలేయడం మినహా ఎలాంటి డ్రామా చోటు చేసుకోలేదు. లైఫ్ దక్కించుకున్న కుక్, రాబ్సన్తో కలిసి మెల్లగా ఇన్నింగ్స్ను నడిపించాడు. భారత పేసర్ల బౌలింగ్లో పెద్దగా పదును లేకపోవడంతో బ్యాట్స్మెన్ సునాయాసంగా పరుగులు సాధించారు. అయితే షమీ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి రాబ్సన్ అవుట్ కావడంతో 55 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఓవర్లు: 29, పరుగులు: 78, వికెట్లు: 1 రెండో సెషన్: నిలకడ లంచ్ తర్వాత కుక్ మరింత ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు బ్యాలెన్స్ కూడా ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ జోరు పెంచింది. ఈ క్రమంలో 98 బంతుల్లో కుక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 ఇన్నింగ్స్ల తర్వాత కుక్కు ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. భారత్ ఫీల్డింగ్ లోపాలు కూడా ఇంగ్లండ్కు కలిసొచ్చాయి. 68 పరుగుల వద్ద కుక్ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా... షమీ వృథా చేశాడు. అనంతరం 107 బంతుల్లో బ్యాలెన్స్ అర్ధ సెంచరీ పూర్తయింది. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో చూస్తుండగానే ఈ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఓవర్లు: 34, పరుగులు: 108, వికెట్లు: 0 మూడో సెషన్: అదే జోరు టీ తర్వాత చక చకా ఆడి సెంచరీ దిశగా దూసుకుపోతున్న కుక్కు జడేజా బ్రేక్ వేశాడు. లెగ్సైడ్లో పడిన బంతిని కుక్ షాట్ ఆడబోయాడు. అయితే ఇన్సైడ్ ఎడ్జ్ అయిన బంతి ధోని చేతుల్లో పడింది. సెంచరీకి ఐదు పరుగుల ముందు ఇంగ్లండ్ కెప్టెన్ నిరాశగా వెనుదిరిగాడు. కుక్, బ్యాలెన్స్ రెండో వికెట్కు 158 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత కొద్ది సేపటికే షమీ బౌలింగ్లో థర్డ్మ్యాన్ దిశగా ఆడి 189 బంతుల్లో బ్యాలెన్స్ కెరీర్లో మూడో సెంచరీని అందుకున్నాడు. కొత్త బంతి కూడా భారత్కు కలిసి రాలేదు. బ్యాలెన్స్, బెల్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా రోజును ముగించారు. ఓవర్లు: 27, పరుగులు: 61, వికెట్లు: 1 స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) ధోని (బి) జడేజా 95; రాబ్సన్ (సి) జడేజా (బి) షమీ 26; బ్యాలెన్స్ (బ్యాటింగ్) 104; బెల్ (బ్యాటింగ్) 16; ఎక్స్ట్రాలు 6; మొత్తం (90 ఓవర్లలో 2 వికెట్లకు) 247 వికెట్ల పతనం: 1-55; 2-213 బౌలింగ్: భువనేశ్వర్ 22-7-58-0; షమీ 18-3-62-1; పంకజ్ 20-3-62-0; రోహిత్ 6-0-21-0; జడేజా 22-6-34-1; ధావన్ 2-0-4-0. -
ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం
యాషెస్ సిరీస్లో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియాకు ఊరట కలిగించే విజయం. ఇంగ్లండ్తో ఐదు వన్డేల సిరీస్ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. చివరి, ఐదో వన్డేలో షేన్ వాట్సన్ (143) సెంచరీతో చెలరేగడంతో 49 పరుగులతో ఇంగ్లండ్ను ఓడించింది. సోమవారం జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్లో 299 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లీష్ మెన్ను కంగారూలు 48 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్ చేశారు. ఫాల్కనర్ మూడు, మిచెల్ జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రవి బొపార (62), బట్లర్ (42) విజయంపై ఆశలు రేకెత్తించినా ఈ జోడీ వెంటవెంటనే అవుటవడంతో ఓటమి తప్పలేదు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.1 ఓవర్లలో 298 పరుగులు చేసింది. వాట్సన్ సెంచరీకి తోడు కెప్టెన్ మైకేల్ క్లార్క్ (75) అర్ధశతకంతో రాణించాడు. స్టోక్స్ ఐదు, అరంగేట్ర బౌలర్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వాట్సన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', క్లార్క్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కాయి. ఈ సిరీస్లో వర్షం కారణంగా రెండు వన్డేలు రద్దయ్యాయి. గత మేలో ఇంగ్లండ్ వెళ్లిన ఆసీస్ తాజా మ్యాచ్తో పర్యటన ముగించింది.