Submarine
-
నౌకాదళానికి అసలైన సంక్రాంతి
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం ఈ సంక్రాంతిని సువర్ణాక్షరాలతో లిఖించనుంది. స్వదేశీ పరిజ్ఞానం వినియోగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూనే, నౌకాదళ సంపత్తి పెంపుతో ప్రపంచ దేశాలకు సవాల్ విసరనుంది. అత్యాధునికంగా రూపొందించిన రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి (సబ్మెరైన్)ని ఈ నెల 15న కేంద్ర రక్షణ మంత్రి జాతికి అంకితం చేయనున్నారు. విశాఖపట్నం క్లాస్లో చివరిదైన ఐఎన్ఎస్ సూరత్తో పాటు ఫ్రిగేట్ వార్ షిప్ ఐఎన్ఎస్ నీల్గిరి, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ వాగ్షీర్ సబ్మెరైన్ భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరబోతున్నాయి. ఈ మూడూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నౌకలే. వీటి ద్వారా నౌకా నిర్మాణంలో చైనాకు భారత్ దీటుగా నిలిచింది. అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన ఆయుధ వ్యవస్థలు, కార్యాచరణతో నౌకాదళం కొత్త బెంచ్మార్క్ చేరుకోనుంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, శత్రు దేశాల కవి్వంపు చర్యల్ని సమర్ధంగా తిప్పికొట్టేందుకు నీలగిరి, సూరత్, వాగ్షీర్లు సిద్ధంగా ఉంటాయి. చైనాకు దీటుగా నౌకా నిర్మాణం నౌకా నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానానికి స్వస్తి పలుకుతూ ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో విభిన్న యుద్ధ నౌకలు, సబ్మెరైన్లను భారత నౌకాదళం అందుబాటులోకి తెస్తోంది. హిందూస్థాన్ షిప్యార్డ్, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ఎండీఎల్), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ), కొచ్చిన్ షిప్యార్డ్లో ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో అధునాతన నౌకల్ని నిర్మిస్తోంది. ప్రపంచ నౌకా నిర్మాణంలో ఉన్న చైనా ఏటా సగటున 19 నౌకలు తయారు చేస్తుంటే.., దాన్ని తలదన్నేలా ఇప్పుడు భారత్ ఏటా సగటున 20 యుద్ధ నౌకలు నిర్మిస్తోంది. చైనాలో ఎక్కువగా వాణిజ్య నౌకా నిర్మాణం జరుగుతోంది. భారత్ యుద్ధ నౌకల నిర్మాణంలో ముందంజ వేస్తోంది. మొత్తంగా తక్కువ వ్యవధిలో ప్రపంచ స్థాయి యుద్ధ నౌకలను తయారు చేయగలమనే సంకేతాల్ని భారత్ పంపించింది.ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్. ముంబైలోని మజ్గావ్లో తయారైన వాగ్షీర్.. కల్వరి శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది. ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన సాంకేతికతని దీని తయారీకి ఉపయోగించారు. 11 నెలల పాటు సముద్రంలో ప్రయోగాలు చేసిన తర్వాత జాతికి అంకితం చేస్తున్నారు. సామర్థ్యమిదీ.. బరువు – 1,780 టన్నులు పొడవు – 221 అడుగులు వెడల్పు – 20 అడుగులు ఎత్తు – 40 అడుగులు, డ్రాఫ్ట్ – 19 అడుగులు వేగం – ఉపరితలంపై గంటకు 20 కిమీ, సాగర గర్భంలో 37 కిమీ » సామర్థ్యం – ఉపరితలంపై ఏకధాటిగా 12 వేల కిమీ, సాగరగర్భంలో 1020 కిమీ ప్రయాణించగలదు. సముద్రంలో1,150 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. 50 రోజులు సాగర గర్భంలో దాక్కోగలదు. » సిబ్బంది – 8 మంది అధికారులు, 35 మంది సెయిలర్స్ » ఆయుధ సంపత్తి– 21 టార్పెడోలు, 18 ఎస్యూటీ టార్పెడోలు, ఎస్ఎం.39 యాంటీ షిప్ మిసైల్, 30 మైన్స్.ఐఎన్ఎస్ నీలగిరి నీలగిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ వార్షిప్లకు ప్రధాన నౌక ఇది. 2019 సెప్టెంబర్లో నిర్మాణ పనుల్ని మజ్గావ్ షిప్యార్డ్ డాక్ లిమిటెడ్లో ప్రారంభించారు. 2024 ఆగస్టులో ట్రయల్ రన్ ప్రారంభించి.. అదే ఏడాది డిసెంబర్లో నేవీకి అప్పగించారు. నీలగిరి యుద్ధ నౌక సామర్థ్యమిదీ.. బరువు – 6,670 టన్నులు పొడవు – 488 అడుగులు వెడల్పు – 58 అడుగులు డ్రాఫ్ట్ – 17 అడుగులు లోతు – 32 అడుగులు వేగం – గంటకు 59 కిలోమీటర్లు రేంజ్ – ఏకధాటిగా 4,600 కిలోమీటర్లు ప్రయాణించగలదుసిబ్బంది– 35 మంది అధికారులతో కలిపి మొత్తం 226 మంది క్రాఫ్ట్ క్యారియర్– 2 ఆర్హెచ్ఐబీ బోట్లు » సెన్సార్లు, రాడార్లు – ఇంద్ర రాడార్, ఎల్ బ్యాండ్ ఎయిర్ సర్వైలెన్స్ రాడార్, బీఈఎల్ హంసా సోనార్ వ్యవస్థ, అత్యాధునిక కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ »ఎలక్ట్రానిక్ వార్ఫేర్ – డీఆర్డీవో శక్తి ఈడబ్ల్యూ సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్, 4 కవచ్ డెకాయ్ లాంచర్స్, 2 ఎన్ఎస్టీఎల్ టార్పెడో సిస్టమ్స్ » ఆయుధ సంపత్తి – వీఎల్ఎస్ 8 సెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ 32 » బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైల్– 2, వరుణాస్త్ర ట్రిపుల్ ట్యూబ్ టార్పెడో లాంచర్లు – 2, యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్లు –2, 76 ఎంఎం ఓటీవో నేవల్ గన్ – 1, ఏకే 630 ఎం గన్–1 » ఎయిర్క్రాఫ్ట్ – హెచ్ఎఎల్ ధ్రృవ్ లేదా సీ కింగ్ హెలికాప్టర్ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక.. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్ట్ – 15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారుచేస్తోంది. వీటికి దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టారు. ఈ క్లాస్లో చివరిది ఐఎన్ఎస్ సూరత్. ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్)లో తయారు చేశారు. శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్ని దేన్నైనా, ఎక్కడ ఉన్నా ఛేదించగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ సూరత్.. శత్రువుల పాలిట సింహస్వప్నమే.యుద్ధ నౌక విశేషాలు..బరువు – 7,400 టన్నులు పొడవు – 535 అడుగులు బీమ్ – 57 అడుగులు డ్రాఫ్ట్ – 21 అడుగులు వేగం – గంటకు 56 కిమీ పరిధి – ఏకధాటిగా 15 వేల కి.మీ ప్రయాణం చేయగలదు గ్యాస్ టర్బైన్లు– 4 సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది» సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్, సర్ఫేస్ సెర్చ్ రాడార్లు » ఆయుధాలు – 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు » విమానాలు – రెండు వెస్ట్ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు -
గోవా తీరంలో జలాంతర్గామిని ఢీకొట్టిన పడవ
న్యూఢిల్లీ: గోవా తీరం నుంచి సముద్రంలో 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఢీకొట్టినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఈ పడవ పేరు మార్తోమా. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో 11 మందిని అధికారులు రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆరు నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు నావికా దళం అధికార ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)తో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంంది సేవలు కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జలాంతర్గామిని పడవ ఢీకొన్న ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నావికా దళం ఆదేశాలు జారీ చేసింది. -
చేప కాదు కానీ.. నీటిలో దిగితే తక్కువా కాదు
వాహన ప్రపంచంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హోవర్క్రాఫ్ట్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది భూమి మీద మాత్రమే కాకుండా నీటిలో, గాలిలో కూడా పయనించగలదు. అయితే ఇప్పుడు 'నార్త్రోప్ గ్రుమ్మన్' (Northrop Grumman) అంతర్గత జలాలలో (నీటి లోపల) ప్రయాణించే ఓ సరికొత్త 'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్' గురించి వెల్లడించింది.'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్'కు సంబంధించిన వీడియోలో గమనించినట్లయితే.. ఇది వేగంగా నీటిలోపల వెళ్లడం చూడవచ్చు. చూడటానికి ఓ చేప ఆకారంలో ఉండే ఈ వెహికల్ రెండు కన్నుల వంటి నిర్మాణం, రెక్కలు వంటి వాటిని కూడా పొందుతుంది. నీటిలో సులభంగా ముందుకు వెళ్ళడానికి చేపవంటి నిర్మాణంలో దీన్ని తయారు చేసినట్లు భావిస్తున్నాము.నార్త్రోప్ గ్రుమ్మన్.. తన మాంటా రే ప్రోటోటైప్ను ఈ ఏడాది పరీక్షించింది. లాంగ్ రేంజ్, లాంగ్ డ్యూరేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన వాహనాన్ని నిమించడానికి ఏకంగా నాలుగు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ వాహనాన్ని 'ఎక్స్ట్రా లార్జ్ అన్క్రూడ్ అండర్ వాటర్ వెహికల్' అని పిలుస్తారు. దీనిని DARPA అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని తయారు చేశారు.తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. అంతే కాకుండా ఎక్కువ బరువును తీసుకెళ్లే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇది పైకి, కిందికి గ్లైడింగ్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ టెక్నాలజీ ఈ వాహనాన్ని మరింత వేగంగా ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఇది సముద్రం అడుగు భాగంలో కూడా ప్రయాణించగలదు. -
సముద్రగర్భంలో ద్వారక దర్శనం
-
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సబ్మెరైన్ ప్రమాదం.. 55 మంది చైనా నావికులు మృతి
ఎల్లో సముద్రంలో చైనా న్యూక్లియర్ సబ్మెరైన్కు జరిగిన ప్రమాదంలో 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. విదేశీ నావల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్మెరైన్ చిక్కుకున్నట్లు యూకే ఇంటెలిజెన్స్ విభాగాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతిన్న కారణంగా సబ్మెరైన్ విషపూరితంగా మారి నావికులు చనిపోయినట్లు వెల్లడించాయి. చైనా నావికాదళానికి చెందిన 093417 సబ్మెరైన్ ఆగష్టు 21న ఉదయం 8:12 సమయంలో ఎల్లో సముద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ నౌకల కోసం ఆర్మీ ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్మెరైన్ చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతింది. ఉపరితలానికి రావడానికి కనీసం ఆరు గంటలు పాడుతుంది. కానీ అప్పటికే సబ్మెరైన్ విషపూరితంగా మారి 55 మంది నావికులు మరణించారు. ఇందులో 22 మంది అధికారులు ఉన్నారు. ఈ ఘటనపై చైనా స్పందించలేదు. ప్రమాద సమాచారాన్ని చైనా ఖండించింది. తప్పుడు సమాచారంగా ప్రకటించింది. తైవాన్ కూడా ఈ ఘటనను ఖండించింది. సబ్మెరైన్ జాడ కనిపెట్టడానికి కూడా అంతర్జాతీయ సహకారాన్ని చైనా ఖండించింది. గత 15 ఏళ్లుగా సబ్మెరైన్ సేవల్లో ఉన్నట్లు యూకే అంటెలిజెన్స్ విభాగాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్షంలో చెత్త వదిలినందుకు రూ.1.24 కోట్ల జరిమానా -
స్వదేశీ జలాంతర్గామిని తయారుచేసిన తైవాన్
కవోసియంగ్(తైవాన్): తరచూ నావికాదళాలతో తమ వైపు దూసుకొస్తూ కవి్వంపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్ తొలిసారిగా జలాంతర్గామిని తయారుచేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్ అమ్ములపొదిలో చేరితే ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇనుమడించనుంది. ‘గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈరోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ల ముందు ఉంది’ అని నౌకాతయారీకేంద్రంలో నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్–వెన్ వ్యాఖ్యానించారు. ‘ దేశ పరిరక్షణకు ప్రతినబూనిన మా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఈ సబ్మెరైన్. వ్యూహాలు, యుద్ధతంత్రాల్లో నావికాదళం సన్నద్థతలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని ఆమె అన్నారు. కొత్త జలాంతర్గామికి హైకున్ అని పేరుపెట్టారు. చైనా ప్రాచీనగాథల్లో హైకు అంటే అది్వతీయమైన శక్తులు గలది అని అర్ధం. హార్బర్, సముద్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక నావికాదళానికి అప్పగిస్తారు. 2027 ఏడాదికల్లా రెండు సబ్మెరైన్లను నిర్మించి దళాలకు ఇవ్వాలని తైవాన్ యోచిస్తోంది. తైవాన్ సమీప సముద్ర జలాల్లో తరచూ నేవీ, ఎయిర్ఫోర్స్ యుద్ధవిన్యాసాలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్న చైనాకు ఈ పరిణామం మింగుడుపడనిదే. -
ఒడ్డుకు చేరిన టైటాన్ శకలాలు
-
టైటాన్ సబ్ మెరైన్ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం
-
టైటాన్ మినీ సబ్మెరైన్...పైలట్ సహా ఐదుగురు పర్యాటకులు జలసమాధి
-
వామ్మో టైటానిక్ దగ్గరకా? నాకు అలాంటి అనుభవమే: జేమ్స్ కామెరూన్
టైటానిక్ షిప్ శకలాలని చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే జలాంతర్గామి కథ విషాదాంతమైంది. నీటి అడుగున పీడన తీవ్రత పెరగడం వల్ల ఈ టైటాన్ పేలిపోయి, అందులోని ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలని గుర్తించారు. ఇప్పుడు ఈ విషయమై టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్పందించాడు. (ఇదీ చదవండి: టైటాన్ ఆశలు జల సమాధి) 'ఈ విషయం(సబ్ మెరైన్ పేలిపోవడం) జీర్ణించుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందే సదరు ఓషియన్ గేట్ కంపెనీకి చాలామంది ఇంజినీర్లు లెటర్స్ రాశారు. మీరు చేస్తున్నది చాలా విపరీతమైన ప్రయోగం అని ఆయా లేఖల్లో పేర్కొన్నారు' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చారు. 'టైటాన్ సబ్ మెరైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లొచ్చాను. అక్కడ 13వేల అడుగుల లోతు ఉంటుంది. సబ్ మెరైన్ పై చాలా ఒత్తిడి పడుతుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఆచూకీ దొరకడం అసాధ్యం. ఇది సాహసంతో కూడిన ప్రయాణం. టైటానికి షిప్ దగ్గర్లో ఏదో తెలియని శక్తి ఉంది. అక్కడ మిస్ అయితే దొరకడం కష్టమని నేను ముందే ఊహించాను. ఎందుకంటే నాక్కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చాడు. James Cameron believes OceanGate Titan imploded before reaching Titanic. #OceanGate #OceansGate #Titan #Titans📷 #submarino #Submarine #Submersible #implosion #imploded #Titanic #TitanicRescue #titanicsubmarine #sousmarin pic.twitter.com/wGtWvXR0V7 — Ak Cheema (@AkCheema777) June 23, 2023 (ఇదీ చదవండి: సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు) -
టైటాన్ షిప్ పక్కనే శకలాలను గుర్తించిన అమెరికా కోస్ట్ గార్డ్
-
టైటాన్ విషాదం.. అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!
-
టైటాన్ ఆశలు జల సమాధి
దుబాయ్/బోస్టన్: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉదంతం.. విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ శకలాలను తిలకించడానికి టైటాన్ మినీజలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!. టైటాన్ శకలాలను టైటానిక్ సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ఉత్కంఠగా అన్వేషణ కొనసాగుతున్న తరుణంలో.. ప్రాణవాయువు(ఆక్సిజన్) ముగిసిపోయే అంచనా గడువు దగ్గరపడుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడంది. తాము నీటి అడుగుకు పంపించిన రిమోటెడ్ ఆపరేటెడ్ వెహికిల్.. శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్వేనని భావిస్తున్నట్లు తెలిపింది. ‘తమ సంస్థ చీఫ్ పైలట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ప్రయాణికులైన షహ్జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్ దావూద్, హామిష్ హార్డింగ్, పౌల్–హెన్రీ నర్గియెలెట్ మృతి చెందారు’అని ఓషన్ గేట్ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆదివారం ఉదయం బయలుదేరిన సమయంలో టైటాన్లో దాదాపు 96 గంటలపాటు మాత్రమే శ్వాసించేందుకు అవసరమైన ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కూడా ముగిసిపోయింది. గురువారం ఉదయానికల్లా జలాంతర్గామిలో ఆక్సిజన్ ఇక పూర్తిగా నిండుకున్నట్లే. అయితే, టైటాన్ గల్లంతైన రోజే వారు మరణించారా? అంటే..ఆ పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టైటాన్ ఆదివారం ఉదయం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. టైటాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అమెరికా కోస్ట్గార్డ్ సిబ్బంది సముద్రంలో టైటాన్ కోసం తీవ్ర అన్వేషణ కొనసాగించింది. సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని నౌకలు, విమానాలను, ఇతర పరికరాలను రంగంలోకి దించారు. ఫ్రెంచ్ పరిశోధక సంస్థ కెమెరాలు, లైట్లతో కూడిన డీప్–డైవింగ్ రోబోట్ను సముద్రంలోకి పంపించింది. A debris field was discovered within the search area by an ROV near the Titanic. Experts within the unified command are evaluating the information. 1/2 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 Coast Guard holds press briefing about discovery of debris belonging to the 21-ft submersible, Titan. #Titanic https://t.co/aPSeEaBuG8 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 -
సస్పెన్స్ థ్రిల్లర్లా టైటాన్ రెస్క్యూ ఆపరేషన్
-
గల్లంతైన టైటాన్లో బ్రిటిష్ బిలియనీర్.. ఏవరీ హమీష్ హార్డింగ్?
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి వెళ్లిన పర్యాటక జలంతర్గామి (Submarine)ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో అందులో ముగ్గురు టూరిస్ట్లతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. సబ్ మెర్సిబుల్ గల్లంతై మూడు రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అంట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన జలాంతర్గామిని గుర్తించేందుకు అమెరికా, కెనాడా కోస్ట్గార్డ్ దళాలు ముమ్మరంగా జల్లెడపడుతున్నాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న జలగర్భాల్లో ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను, పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలో దించారు. కాగా మిస్సైన జలంతర్గామి ‘టైటానిక్ సబ్మెర్సిబుల్’లో పాకిస్థాన్కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ సంపన్నుడు, వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. చదవండి: టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్కు బిగ్ ఫెయిల్యూర్..? బ్రిటిష్ బిలియనీర్ అయితేబ్రిటన్కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాక్ సంపన్నులు బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. ఈ మేరకు వారి కుటుంబం ధృవీకరించింది. షాజాదా.. పాక్లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. చదవండి: Titanic Sub: ఆక్సిజన్ అయిపోతోంది.. టైటాన్ జాడేది? కాగా ఓషియన్ గేట్ అనే సంస్థ టైటానిక్ శకలాల సందర్శన యాత్రను నిర్వహిస్తోంది. ఇందుకు ‘టైటాన్’ పేరుతో 21 అడుగుల పొడవైన మినీ జలంతర్గామిని వాడుతోంది. ఈ ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఈ సాహసయాత్ర ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే జలంతార్గామితో పోలార్ ప్రిన్స్కు సంబంధాలు ఎతగిపోయాయి. దీంతో టైటాన్ ఆచూకీ కనుగునేందుకు కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్లో కోస్ట్గార్డ్లు గాలిస్తున్నారు. ఇక విలాసవంతమైన టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. అక్కడి శిథిలాలను చూసేందుకు వెళ్తున్నప్పడే జలాంతర్గామి అదృశ్యమైంది. ఇక జలాంతర్గామిలో కొద్ది గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండటంతో సమయం గడుస్తున్నా కొద్దీ వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. -
Titanic Sub: ఆక్సిజన్ అయిపోతోంది.. టైటాన్ జాడేది?
దాదాపు రెండు రోజులు గడిచాయి. సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రాణవాయివు కొద్దిగంటలకే సరిపడా ఉండడంతో.. అదృశ్యమైన మినీ జలంతర్గామిలోని వాళ్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన నెలకొంది. దీంతో అట్లాంటిక్ లోతుల్లో వెతుకులాటను వేగవంతం చేశారు. కానీ, రెండు మైళ్ల కంటే ఎక్కువ లోతులో.. 20వేల చదరపుకిలోమీర్ల విస్తీర్ణం ఉన్న ఆ ప్రాంతంలో అదంతా సులువు అయ్యే పనేనా?. చిమ్మచీకట్లు.. గడ్డకట్టుకుపోయే చలి.. పైగా సముద్రపు బురద.. ఆ అగాథంలో ఎదురుగా ఏమున్నదనేది ఎంత వెలుగుతో వెళ్లినా కనిపించని స్థితి.. మొత్తంగా అంతరిక్షంలోకి వెళ్లినట్లే ఉంటుందట అక్కడి పరిస్థితి. అట్లాంటిక్ మహా సముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఉంది. ఆ మినీ సబ్మెరైన్లో కొద్దిగంటలపాటు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో గంట గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. జలాంతర్గామిని కనుగొనేందుకు అమెరికా, కెనడా రక్షణ బృందాలు రంగంలోకి దిగినా.. కష్టతరంగా మారింది రెస్క్యూ ఆపరేషన్. బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షాజాదా దావూద్.. ఆయన కొడుకు సులేమాన్, మరో ఇద్దరు ఉన్నారు. ఏం జరిగింది.. ఓషన్గేట్ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్ శకలాల సందర్శన ఓ భాగం. ఇందుకోసం 22 అడుగుల పొడవైన మినీ జలాంతర్గామిని వాడారు. దాని పేరు టైటాన్. ఒక్కో టికెట్ ధర 2 లక్షల యాభై వేల డాలర్లు. ఐదుగురు సభ్యులతో కూడిన టైటాన్.. న్యూఫౌండ్లాండ్ నుంచి మొదలైంది. 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్ల్యాండ్లోని సెయింట్ జాన్స్కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్.. మహా సాగరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. రెండు గంటల్లోపే.. టైటాన్ భాగం.. కార్బన్ ఫైబర్తో రూపొందింది. సాధారణ జలాంతర్గాములు సొంతంగా రేవు నుంచి బయల్దేరి వెళ్లి, తిరిగి అక్కడికి చేరుకోగలవు. సబ్మెర్సిబుల్గా పేర్కొనే ఈ మినీ జలాంతర్గామిని మాత్రం సాగరంలోకి పంపడానికి, వెలికి తీయడానికి ఒక నౌక అవసరం. ఇందుకోసం కెనడాకు చెందిన పోలార్ ప్రిన్స్ అనే షిప్ సేవలను ఓషన్గేట్ సంస్థ ఉపయోగించుకుంది. అయితే.. గంటా 45 నిమిషాల్లోనే ఆ జలాంతర్గామితో పోలార్ ప్రిన్స్కు సంబంధాలు తెగిపోయాయి. టైటానిక్ చూసేందుకు.. 1912లో మంచుకొండను ఢీకొట్టి టైటానిక్ నౌక అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 2,200 మంది ప్రయాణికులు, 700 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ శకలాలను తొలిసారి 1985లో గుర్తించారు. వాటిని చూసేందుకు 2021లో కొందరు పర్యాటకులు లక్ష నుంచి లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్రగర్భంలోకి వెళ్లారు. ఇప్పటి యాత్రలో మాత్రం ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల డాలర్ల వరకూ ఓషన్గేట్ సంస్థ వసూలు చేసినట్లు తెలుస్తోంది. టైటాన్ ఇదివరకూ ఇలాంటి యాత్రలు చేపట్టినా.. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని కంపెనీ చెబుతోంది. Surface search underway for the OceanGate Titan Submersible. The five people stuck inside the Titanic submarine: Paul-Henry Nargeolet, 73 Stockton Rush, 61 Hamish Harding, 58 Shahzada Dawood, 48 Sulaiman Dawood, 19 pic.twitter.com/hzwBbQf9jY — quinn (@outtaminds) June 20, 2023 NEW. ⚠️Crews searching for the #Titan submersible heard banging sounds every 30 minutes Tuesday and four hours later, after additional sonar devices were deployed, banging was still heard, according to an internal government memo update on the search. (1/4) #titanic #Submersible pic.twitter.com/b6iItRINqB — Josh Benson (@WFLAJosh) June 21, 2023 టైటాన్ సబ్మెరీన్ కోసం వెతికే ప్రయత్నంలో సెర్చ్ టీంకు లోపల ఏదో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయట. మంగళవారం ప్రతీ అరగంటకొకసారి.. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆ సౌండ్లు వినిపించాయట. యూఎస్ కోస్ట్గార్డ్ దీనిని ధృవీకరించింది కూడా. ఇంకోవైపు ఓషన్గేట్ సంస్థ నిర్వాహణ తీరుపై తీవ్ర విమర్శలతో పాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. Oceangate Expeditions remote control 2.0 for the Titan #Titanic pic.twitter.com/pYCucKq2Ba — Jewel Runner (@tosnoflA) June 21, 2023 The passengers on #Titan rn. #Titanic #titanicsubmarine #titanicsubmersible pic.twitter.com/z98uvzEQdx — kaleb (@medikaii) June 21, 2023 Coming soon..#OceanGate #Titanic #titanicsubmarine pic.twitter.com/uHq9BpzVNW — Maximus (@incognito_joe2) June 21, 2023 -
ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల ‘ఆకస్’ కూటమి మరో అడుగు ముందుకేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛా, సంరక్షణ కోసం అణు జలాంతర్గాముల ప్రాజెక్ట్పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఈ మూడు దేశాలు ప్రకటించాయి. ఇందుకు సోమవారం అమెరికాలోని శాన్ డీగోలో జరిగిన ఒక కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ పాల్గొన్నారు. ఆకస్ ఒప్పందంలో అంతర్భాగమైన అణు జలాంతర్గామి ప్రాజెక్టులో భాగంగా ఆ్రస్టేలియాకు అమెరికా 2030దశకం తొలినాళ్లలో దశలవారీగా మూడు అణుఇంథనంతో పనిచేసే జలాంతర్గాములను అందించనుంది. ‘వచ్చే ఐదేళ్లలో అమెరికా జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యం పెంపు, వర్జీనియా శ్రేణి సబ్మెరైన్ల నిర్వహణ కోసం మొత్తంగా 460 కోట్ల డాలర్లు వినియోగిస్తాం. ‘వర్జీనియా’ జలాంతర్గాములతో దశాబ్దకాలం ముందుగానే ఆస్ట్రేలియా జలాంతర సామర్థ్యం ద్విగుణీకృతం అవుతోంది’ అని సునాక్, అల్బనీస్ల సమక్షంలో బైడెన్ ప్రకటించారు. బ్రిటన్ జలాంతర్గామి టెక్నాలజీ, అమెరికా సాంకేతికతల మేలిమి కలయికగా అణుఇంధనంతో నడిచే సంప్రదాయక ఆయుధాలు అమర్చిన జలాంతర్గామి తయారుకాబోతోంది’ అని బైడెన్ చెప్పారు. మూడు దేశాల మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలు ఉన్న ఇండో–పసిఫిక్ ప్రాంతం భౌగోళికంగా, అంతర్జాతీయ జలరవాణాకు కీలకమైన ప్రాంతం. దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులు తనకే చెందుతాయని చైనా వాదిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. -
నేవీ అమ్ములపొదిలోకి వాగీర్.. జలాంతర్గామి విశేషాలివే..
ముంబై: అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఉన్న నూతన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగీర్ లాంఛనంగా భారత నావికాదళంలో చేరింది. సోమవారం ముంబైలోని నావల్ డాక్యార్డ్ ఇందుకు వేదికైంది. కల్వరీ శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది, ఐదవది అయిన వాగీర్ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ లాంఛనంగా భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. ‘వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువుల బారి నుంచి దేశ ప్రయోజనాలను మరింతగా సంరక్షించవచ్చు. ఇంటెలిజెన్స్, నిఘా, మొహరింపు విభాగాల్లో నేవీ సామర్థ్యాన్ని వగర్ పరిపుష్టంచేస్తుంది’ అని ఈ సందర్భంగా భారత నేవీ ప్రకటించింది. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్ చేప(వాగీర్) పేరును దీనికి పెట్టారు. 24 నెలల వ్యవధిలో నేవీ చేరిన మూడో సబ్మరైన్ ఇది. మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ సంస్థ దీనిని తయారుచేసింది. ఫ్రాన్స్ నుంచి బదిలీచేసిన సాంకేతికతను ఇందులో వినియోగించారు. 11 నెలలపాటు సముద్రంలో పలు రకాల ప్రయోగ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక సోమవారం నేవీలోకి తీసుకున్నారు. జలాంతర్గామి విశేషాలు ► ప్రపంచంలోనే అత్యత్తుమ సెన్సార్లను దీనిలో అమర్చారు. ► వైర్ ఆధారిత టోర్పెడోలున్నాయి. ► దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుంచి క్షిపణులను సముద్రజలాల మీది లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు ► స్పెషల్ ఆపరేషన్స్లో మెరైన్ కమెండోలను శత్రు స్థావరాలలోకి చడీచప్పుడుకాకుండా తరలించగలదు. ► శక్తివంత డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ► శత్రు టోర్పెడోలను ఏమార్చే నూతన స్వీయ రక్షణ వ్యవస్థతో దీనిని బలోపేతం చేశారు -
సాగరతీరంలో ‘యుద్ధం’!
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): ప్రశాంతమైన విశాఖ సాగరతీరంలో మంగళవారం ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. పెద్దసంఖ్యలో యుద్ధనౌకలు, సబ్మెరైన్, స్పీడ్బోట్లు, చాతక్లు మోహరించాయి. తీరం వైపు దూసుకొస్తున్న స్పీడ్బోట్లపై యుద్ధనౌకలు బాంబుల వర్షం కురిపించాయి. ఒక్కసారిగా మారిన పరిస్థితులతో సందర్శకులకు ఏం జరుగుతుందో అర్థంగాలేదు. తీరంవైపునకు దూసుకువస్తున్న స్పీడ్ బోట్లు తరువాత ఇవి.. డిసెంబర్ 4వ తేదీన జరగనున్న నేవీ డే కోసం రిహార్సల్స్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. నేవీ డే సందర్భంగా తూర్పునౌకదళం విశాఖ ఆర్కే బీచ్లో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రారంభించింది. మంగళవారం విన్యాసాల రిహార్సల్స్ చేశారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. -
ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత...
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తిగా ధ్వసంమై సముద్ర గర్భంలో పడి ఉన్న వందేళ్ల నాటి జలాంతర్గామిని శిథిలాల పరిశోధకుడు డైవర్ ఎరిక్ పెట్కోవిక్ కనుగొన్నాడు. ధ్వంసమై సముద్రంలో పడి ఉన్న బోట్లపై డైవర్ ఎరిక్ పెట్కోవిక్ పరిశోధనలు చేస్తుంటాడు. ఈ జలాంతర్గామిని వర్జీనియా తీరంలోని కేవలం 400 అడుగుల లోతుల్లో గుర్తించాడు. వాస్తవానికి ఈ జలాంతర్గామి మొదటి ప్రపంచ యుద్ధంలో 1922లో అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో సుమారు 1600 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబందించి ఐదు జలాంతర్గాములు, రెండవ ప్రపంచ యద్ధానికి సంబంధించి ఎనిమిది జలంతర్గాములను కనుగొన్నారు. అయితే ఈ యూ-111 జలంతర్గామి కూడా వర్జినియాలోనే మునిగిపోయినట్లు పరిశోదకులు గుర్తించలేకపోవడమే కాకుండా కనుగొన లేకపోయారు కూడా. అదీగాక సముద్రంలో ఉండే ఉప్పు కారణంగా మునిగిపోయిన ఓడలు, జలాంతర్గాములు వేగంగా క్షీణిస్తాయి. సముద్రంలో ఉండే కొన్ని రకాల పురుగులు కలపను తినేస్తాయి. అయినప్పటికీ ఈ జలంతర్గామి శిధిలాలు సజీవంగా కనుగొనడం విశేషమే. 1985లో తొలిసారిగా రాబర్ట్ బల్లార్డ్ అనే పరిశోధకుడు టైటానిక్ ఓడల శిధిలాలను కనుగొన్నాడు. అతని తర్వాత డైవర్ ఎరిక్ పెట్ కోవిక్ ఈ ధ్యంసమైన నౌకలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పరిశోధకుడు తన మిత్రుడు రస్వీ సాయంతో ఎక్స్ప్లోరర్ డైవింగ్ నౌకను ఉపయోగించి ఈ జలాంతర్గామి శిథిలాలను వెలికితీశాడు. (చదవండి: Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక) -
టూరిజం డెస్టినీ.. పీఎన్ఎస్ ఘాజీ
విశాఖ మహా నగరాన్ని ఎన్నిసార్లు సందర్శించినా.. టూరిస్టులు మరోసారి వచ్చేందుకు మొగ్గు చూపుతుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త పర్యాటక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా విభిన్న టూరిస్ట్ స్పాట్లు కనువిందు చేస్తున్నాయి. సువిశాల సాగరతీరం.. సబ్మెరైన్ మ్యూజియం, ఎదురుగా టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం.. కొత్తగా సిద్ధమవుతున్న సీ హారియర్.. ఇలా ఎన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఇప్పుడు కాస్త శ్రమిస్తే అదే జాబితాలో మరో బెస్ట్ స్పాట్ సిద్ధంగా ఉంది. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో తూర్పు నావికాదళ ప్రధాన స్థావరమైన విశాఖను దెబ్బతీసేందుకు ప్రయత్నించి జలసమాధి అయిన పాకిస్తాన్ సబ్మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ.. భిన్నమైన అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం అసలేం జరిగిందంటే.. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసి.. భారత్ పాకిస్తాన్ మధ్య తక్కువ రోజుల్లో జరిగిన అతిపెద్ద యుద్ధమిది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్) నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) విడిపోయి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. తూర్పు పాక్కు భారత్ మద్దతు ప్రకటించడంతో పాకిస్తాన్.. మన దేశంపై దాడులకు పాల్పడింది. భారత్, పాక్ బలగాలు తూర్పు, పశ్చిమ దిక్కుల్లో తలపడ్డాయి. పశ్చిమ ప్రాంతం వైపు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆపరేషన్ ట్రై డెంట్ పేరుతో భారత నావికా దళం కరాచీ ఓడరేవుపై చేసిన దాడిలో డిస్ట్రాయర్ పీఎన్ఎస్ ఖైబర్, పీఎన్ఎస్ మహాఫిజ్ మునిగిపోగా, పీఎన్ఎస్ షాజహాన్ పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు.. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ను విశాఖలో రంగంలోకి దించారు. పాకిస్తాన్ అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీని పంపింది. విషయం తెలుసుకున్న భారత్ నావల్ కమాండ్.. ఐఎన్ఎస్ రాజ్పుత్ జలాంతర్గామిని రంగంలోకి దించింది. రాజ్పుత్ రాకను పసిగట్టిన ఘాజీ కుయుక్తులతో రాజ్పుత్ను మట్టికరిపించేందుకు దాడికి పాల్పడ్డారు. అయితే, దాడిలో పాక్షికంగా దెబ్బతిన్న రాజ్పుత్లోని నావికాదళం ఘాజీపై సర్వశక్తులూ ఒడ్డి ఘాజీని విశాఖ తీరంలోని సాగరగర్భంలో కుప్పకూల్చారు. బంగాళాఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే. ఘాజీని సందర్శించేందుకు ఇలా తీసుకెళ్తారు.. సాగర గర్భంలోనే ఘాజీ.. విశాఖ తీరంలో ఐఎన్ఎస్ రాజ్పుత్ ధాటికి సైనికులతో సహా పీఎన్ఎస్ ఘాజీ జలసమాధి అయ్యింది. ఆ సమయంలో ఘాజీ నుంచి లభ్యమైన కొన్ని శకలాల్ని మాత్రమే విజయానికి గుర్తుగా తూర్పు నావికాదళం తీసుకొచ్చి భద్రపరచుకుంది. తర్వాత ఘాజీని అలాగే సాగర గర్భంలోనే విడిచిపెట్టేశారు. అనంతరం దాని గురించి పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఘాజీని పర్యాటక ప్రాంతంగా వినియోగించుకునేందుకు నేవీ, టూరిజం శాఖ సమాలోచనలు చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం టీయూ–142 యుద్ధ విమానాన్ని నేవీ అధికారులు ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో మరికొన్ని ప్రాజెక్టుల గురించి చర్చించినప్పుడు ఘాజీ ప్రతిపాదన వచ్చింది. తర్వాత దీనిపై కదలిక లేదు. ఇటీవల మరోసారి ఘాజీ అంశం తెరపైకి వచ్చింది. పర్యాటకానికి కొత్త చిరునామా ఆర్కే బీచ్ నుంచి డాల్ఫిన్ నోస్ మధ్య ప్రాంతంలో 1.8 నాటికల్ మైళ్ల దూరంలో సముద్ర తీరంలో ఘాజీ జల సమాధి అయ్యింది. దాదాపు 30 మీటర్ల లోతులో ఘాజీ ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. దీని వద్దకు వెళ్లి ఘాజీని నేరుగా చూసే అవకాశం పర్యాటకులకు కల్పించనున్నారు. ఘాజీ ఎక్కడ ఉందో అన్వేషించేందుకు గతంలో టూరిజం శాఖ నేవీని సంప్రదించింది. దీనిపై స్పందించిన నావికా దళం ఇందుకోసం ఓ కెప్టెన్ సహా ఇద్దరు నేవీ అధికారులు, మరో ఇద్దరు టూరిజం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖలో పలు అడ్వెంచర్, బీచ్ టూరిజానికి సంబంధించిన ప్రాజెక్టులను టేకప్ చేసిన నగరానికి చెందిన ఓ సంస్థను ఈ కన్సల్టెన్సీ కోసం పర్యాటక శాఖని సంప్రదించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని టూరిజం వర్గాల సమాచారం. స్పెషల్ సర్టిఫికెట్ ఉండేలా.. పీఎన్ఎస్ ఘాజీని ఓపెన్ టూరిస్ట్ స్పాట్గా చేయబోతున్న తరుణంలో దీన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే, తీరం నుంచి కొంత దూరం వెళ్లాక అక్కడి నుంచి 30 మీటర్ల లోతుకి వెళ్లాలంటే సాహసంతో పాటు ధైర్యం ఉండాలి. ముందుగా దీన్ని చూసేందుకు సర్టిఫైడ్ సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ (పాడీ) సంస్థ అం దించే అడ్వాన్స్డ్ ఓపెన్ ఆర్డర్ డైవర్ సర్టిఫి కెట్ పొందే వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వా లని భావిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ కు ఈ అంశంపై మరోసారి లేఖ రాసినట్లు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్తే.. విశాఖ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది. -
సముద్రంలోపల పార్టీ? ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటల ప్రయాణం.. ఇది ఒక సంచలనం!
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్మెరైన్లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్కు చెందిన యూ–బోట్వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్మెరైన్లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్డెక్ను, దాని చుట్టూ రెయిలింగ్ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్మెరైన్ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. అమెరికా స్పందన ఇదే!
సియోల్: జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా శనివారం నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు రేవు నగరం సిన్పో సమీపంలో సముద్ర జలాల్లో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. అయితే, ఏ జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేపట్టారన్న సమాచారాన్ని బహిర్గతం చేయలేదు. షార్ట్–రేంజ్ మిస్సైల్ను ప్రయోగించిందన్నారు. ఇది 600 కిలోమీటర్లు(373 మైళ్లు) ప్రయాణించిందని చెప్పారు. ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్షతో తమకు గానీ, మిత్ర దేశాలకు గానీ తక్షణమే ముప్పు ఉన్నట్లు భావించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి తమ ప్రత్యేక ఆర్థిక జోన్ సమీపంలో సమద్రంలో కూలిపోయిందని, దానివల్ల తమ నౌకలకు, విమానాలకు నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని జపాన్ తెలిపింది. చదవండి: Bali: పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగింది.. సారీ చెప్పించుకుని మరీ వెళ్లగొట్టారు -
బలం పెరగాలి బ్రదర్!
దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకొనే ప్రయత్నంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. కరోనా దెబ్బతో నిర్మాణం ఆలస్యమైన దేశీయ జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ వాగ్షీర్’ బుధవారం ముంబయ్లోని మజగావ్ డాక్స్లో జలప్రవేశం చేసింది. ‘మేకిన్ ఇండియా’ మాటలకు మచ్చుతునకగా నిలిచింది. హిందూ మహాసముద్రంలోని విలక్షణ మత్స్యజాతి పేరు పెట్టుకొన్న ఈ మెరైన్ అనేక కఠిన పరీక్షలు, ప్రయోగాల తర్వాత వచ్చే ఏడాది చివరలో భారత నౌకాదళంలో భాగం కానుంది. పెరుగుతున్న సరిహద్దు పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సముద్ర తీర భద్రతలో ఎక్కడ ఉన్నామో పునరాలోచించుకొనేందుకు ఇది సరైన సమయం. అందుకోవాల్సిన లక్ష్యాలను పునశ్చరణ చేసుకొనేందుకు చక్కని సందర్భం. విదేశీ సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని, దేశీయంగా మెరైన్ల నిర్మాణానికి మన దేశం ఎప్పుడో ప్రణాళిక వేసుకుంది. 1999లో ఆమోదం పొందిన ఆ ప్రణాళికలో భాగంగా ‘పి–75’, ‘పి–75ఐ’ అనే రెండు వేర్వేరు శ్రేణుల మెరైన్లను సిద్ధం చేస్తూ వస్తున్నాం. ‘పి–75’ ప్రాజెక్ట్ కింద మన దేశం సమకూర్చుకుంటూ వచ్చిన ఫ్రెంచ్ స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాములలో ఆరవదీ, ఆఖరుదీ – ఈ కొత్త ‘ఐఎన్ఎస్ వాగ్షీర్’. 2005 అక్టోబర్లో కుదుర్చుకున్న 375 కోట్ల డాలర్ల ఒప్పందంలో భాగంగా నేవల్ గ్రూప్ నుంచి మనకు సాంకేతిక పరిజ్ఞాన బదలీ జరిగింది. ఆ పరిజ్ఞానంతో మన దగ్గరే మజగావ్ డాక్స్లో రూపొందిన ‘ఐఎన్ఎస్ కల్వరి’– 2017 డిసెంబర్లో, ‘ఖండేరీ’– 2019 సెప్టెంబర్లో, ‘వాగిర్’– 2020 నవంబర్లో, ‘కరంజ్’– గత ఏడాది మార్చిలో, ‘వేలా’– నవంబర్లో కమిషనింగ్ జరుపుకొన్నాయి. చివరిగా ఇప్పుడు ‘వాగ్షీర్’వచ్చింది. ఈ డీజిల్ యుద్ధ జలాంతర్గామి ప్రత్యర్థి మెరైన్లపై పోరుకూ, నిఘా సమాచార సేకరణకూ, మందుపాతరలు పెట్టడానికీ, ప్రాంతీయ నిఘాకూ తోడ్పడుతుంది. అయితే, ‘వాగ్షీర్’ చేతికి అంది రావడానికి మరో ఏణ్ణర్ధం పడుతుంది. ఏణ్ణర్ధం క్రితం జలప్రవేశం చేసిన ‘వాగిర్’ సైతం ఇంకా ట్రయల్స్లోనే ఉంది. వెరసి, మన సామర్థ్యం ఇనుమడించిందని అలసత్వం వహించడానికి వీల్లేదు. నిజం చెప్పాలంటే, మన దేశ జలాంతర్గాముల దళం కొంత వెనుకబడిందని గత ఏడాది చివరలో సైతం వార్తలు వచ్చాయి. నౌకాదళంలో, మరీ ముఖ్యంగా జలాంతర్గాముల సామర్థ్యంలో మన కన్నా చైనా ఎంతో ముందుకు దూసుకు పోయింది. జలాంతర్గాముల ఆధునికీకరణలో మనం కనీసం ఓ దశాబ్ద కాలం వెనుకబడ్డామని నిపుణుల కథనం. ఈ పరిస్థితుల్లో మన సముద్రతీర భద్రత రీత్యా మరిన్ని సబ్మెరైన్లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా మరిన్ని నౌకలు, సబ్మెరైన్లను మోహరించనున్న నేపథ్యంలో అది మరింత అవసరం. అలాగే, మన ప్రత్యర్థి పాకిస్తాన్కు 8 సబ్మెరైన్లు, 4 యుద్ధ విధ్వంసక నౌకలను చైనా కట్టబెడుతోంది. వాటన్నిటినీ చైనాకు బినామీగా పాక్ వాడే ప్రమాదం ఉంది. పాతవాటి స్థానంలో కొత్తవి చేర్చుకుంటూ ఏ క్షణంలోనైనా కనీసం 65 నుంచి 70 సబ్మెరైన్లు అందుబాటులో ఉండేలా చైనీస్ నౌకాదళం చూసుకుంటోందని అమెరికన్ నిఘా సంస్థ నివేదిక. పైగా, గడచిన 15 ఏళ్ళలో చైనా 12 అణు జలాంతర్గాముల్ని నిర్మించుకోవడం గమనార్హం. సాంప్రదా యిక సబ్మెరైన్ల కన్నా నీటిలో చాలా వేగంగా వెళ్ళగల ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లు ఆకాశంలో ఫైటర్ జెట్ల లాంటివి. ఇవి బ్యాటరీలతో నడవవు కాబట్టి, సిబ్బందికి కావాల్సిన సరుకుల కోసమే తప్ప, ఛార్జింగ్ చేసుకోవడానికని నీటి నుంచి పైకి రావాల్సిన పని ఉండదు. ఎంతకాలమైనా నీటిలోనే ఉండగలవు. ఎస్ఎస్ఎన్లుగా పేర్కొనే ఈ మెరైన్లున్న 6 దేశాల్లో భారత్ కూడా ఒకటి. మిగతావి – అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. 1987లోనే రష్యా నుంచి తొలి ఎస్ఎస్ఎన్ను తెచ్చుకున్న మనం దేశ రక్షణ అవసరాల రీత్యా మరిన్ని అణు జలాంతర్గాముల్ని సమకూర్చుకోవాల్సి ఉంది. దేశీయంగా రూపొందిస్తున్న 12 మెరైన్లలో సగం ఎస్ఎస్ఎన్లనే చేయాలని ప్రభుత్వం ఆ మధ్య మంచి నిర్ణయమే తీసుకుంది. అంతా అనుకున్న విధంగా జరిగి, ప్రాజెక్ట్ వేగంగా సాగినప్పటికీ, 2035 –40కి కానీ మన తొలి దేశవాళీ ఎస్ఎస్ఎన్ బరిలోకి దిగదని అంచనా. ఈలోగా రష్యా నుంచి 2 ఎస్ఎస్ఎన్లను మనం లీజు మీద తీసుకుంటున్నాం. కానీ, అందులో మొదటిది కూడా 2025 నాటికి కానీ మన చేతికి రాదు. ఉక్రెయిన్ యుద్ధవేళ అది మరింత ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితులన్నిటి రీత్యా దేశీయంగా రక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం కీలకం. మన నేవీ సైతం ‘కల్వరి’ మొదలు ఈ స్కార్పీన్ శ్రేణి మెరైన్లన్నిటినీ రీఫిట్ చేసేటప్పుడు ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్’ (ఏఐపి) మాడ్యూల్ను పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నదీ అందుకే! దేశీయంగా ఏఐపి మాడ్యూల్ను అభివృద్ధి చేసేందుకు మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చేస్తున్న కృషి ఇప్పుడు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. ఈ మార్చి నాటి ప్రాథమిక వ్యయ నివేదిక ప్రకారం దేశ రక్షణ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో సైన్యానికి కేటా యించిన బడ్జెట్లో 99.5 శాతాన్ని వినియోగించడం గమనార్హం. కానీ, ఇప్పటికీ ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం మనదే. అతి పెద్ద ఆయుధ దిగుమతి దేశమైన మనం ఆ కథను తిరగ రాయాల్సి ఉంది. ‘మేకిన్ ఇండియా’ అంటూ ఇటీవల రూ. 47 వేల కోట్ల విలువైన 9 విదేశీ ఆయుధ ఒప్పందాలను పక్కనపెట్టిన మనం త్వరితగతిన ఆ కలను సాకారం చేసుకోవడం అవసరం. -
శత్రువులకు సింహస్వప్నం.. సైలెంట్ కిల్లర్ 'వాగ్షీర్'.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే జలాంతర్గామి. దాని పేరు ఐఎన్ఎస్ వాగ్షీర్. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా.. అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్ కిల్లర్. ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్మెరైన్ వాగ్షీర్ ఈ నెల 20న జలప్రవేశం చేయనుంది. మన దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు ముంబైలోని మజ్గావ్ డాక్యార్డులో పీ–75 స్కార్పెన్ ప్రాజెక్ట్ కింద నిర్మితమైన అల్ట్రామోడ్రన్ సబ్మెరైన్ (ఆరో జలాంతర్గామి)గా.. చిట్టచివరిదిగా ‘వాగ్షీర్’ రూపొందింది. ప్రాజెక్ట్–75లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా.. ఐఎన్ఎస్ వగీర్ సీట్రయల్స్ పూర్తి చేసుకుంది. కాగా, వాగ్షీర్ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్టచివరిది కావడం విశేషం. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సముద్రంలో మందుపాతర పేల్చగలదు ఇప్పటివరకూ ఉన్న సబ్మెరైన్లలో వాగ్షీర్ని అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్మెరైన్లో అమర్చారు. ఇందులో 533 మి.మీ. వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్లు ఉన్నాయి. ఏదైనా భారీ ఆపరేషన్ సమయంలో ఈ సైలెంట్ కిల్లర్ 18 టార్పెడోలు లేదా ఎస్ఎం39 యాంటీ–షిప్ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం. శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు. సైలెంట్ కిల్లర్ వాగ్షీర్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్మెరైన్లు రాడార్ సాయంతో కూడా వాగ్షీర్ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో రెండు అధునాతన పెరిస్కోప్లను అమర్చారు. ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్ సిస్టమ్లతో కూడిన ఈ సబ్మెరైన్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు. -
20న ‘వాగ్షీర్’ జలప్రవేశం
ముంబై: మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) నిర్మించిన వాగ్షీర్ జలాంతర్గామి ఈ నెల 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని అధికారులు శుక్రవారం తెలిపారు. పీ75 స్కార్పిన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరో సబ్మెరైన్ను నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రూ.46,000 కోట్ల విలువైన ఆర్డర్ దక్కిందని, ఇందులో 6 సబ్మెరైన్ ప్రాజెక్టులు, 15 బ్రేవో డిస్ట్రాయర్స్, 17 అల్ఫా స్టీల్త్ ఫ్రిగేట్స్ ఉన్నాయని ఎండీఎల్ చైర్మన్, ఎండీ నారాయణ్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 4 జలాంతర్గాములు, ఒక డిస్ట్రాయర్స్ సరఫరా చేశామని వివరించారు. పీ75 స్కార్పిన్ ప్రాజెక్టులో వాగ్షీర్ ఆఖరి జలాంతర్గామి. ఐదో జలాంతర్గామి అయిన ‘వగీర్’ సీ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ ఖాందేరి, ఐఎన్ఎస్ కరాంజ్, ఐఎన్ఎస్ వేలా సబ్మెరైన్లు ఇప్పటికే విధుల్లో చేరాయి. -
Russia-Ukraine war: మాస్క్వా మునిగింది
కీవ్: గురువారం భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్వా చివరకు సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు రష్యా ప్రకటించింది. బ్లాక్సీ ఫ్లీట్కే తలమానికమైన నౌక మునిగిపోవడం రష్యాకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఇకపై ఉక్రెయిన్ రాజధానిపై మరిన్ని మిసైల్ దాడులు జరుపుతామని ప్రకటించింది. రష్యా సరిహద్దు భూభాగంపై ఉక్రెయిన్ జరుపుతున్న మిలటరీ దాడులకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్ ప్రత్యేకతలు ► రష్యా నేవీలో ఉన్న మూడు అట్లాంటా క్లాస్ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లలో ఇది ఒకటి ► సిబ్బంది సంఖ్య: 680 ► పొడవు: 186 మీటర్లు ► గరిష్ట వేగం: 32 నాటికల్ మైళ్లు(59 కి.మీ.) ఆయుధ సంపత్తి ► 16 యాంటీ షిప్ వుల్కన్ క్రూయిజ్ మిస్సైళ్లు ► ఎస్–300 లాంగ్ రేంజ్ మెరైన్ వెర్షన్ మిస్సైళ్లు ► షార్ట్ రేంజ్ ఒస్సా మిస్సైళ్లు ► రాకెట్ లాంచర్స్, గన్స్, టార్పెడోస్ తూర్పు ఉక్రెయిన్ వైపు రష్యా బలగాలు మరలడంతో కీవ్లో జనజీవనం సాధారణస్థాయికి చేరుకుంటోంది. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో తిరిగి బంకర్లలో తలదాచుకోవాల్సివస్తుందని నగర పౌరులు భయపడుతున్నారు. మాస్క్వా మునకకు అగ్ని ప్రమాదమే కారణమని రష్యా పేర్కొంది. అయితే తమ మిసైల్ దాడి వల్లనే నౌక మునిగిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. వీరి వాదన నిజమైతే ఇటీవల కాలంలో ఒక యుద్ధంలో మునిగిన అతిపెద్ద నౌక మాస్క్వా కానుంది. ఇది రష్యాకు ఒకరకమైన ఓటమిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 5 కాదు 50 రోజులు ఉక్రెయిన్ ఆక్రమణకు గట్టిగా ఐదు రోజులు పడుతుందని రష్యా భావించిందని, కానీ 50 రోజులైనా రష్యా దాడులను తట్టుకొని నిలిచామని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సమావేశంలో చెప్పారు. మాస్క్వా మునక గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పోరాడాలని ఉక్రేనియన్లు నిర్ణయించుకొని 50 రోజులైందన్నారు. యుద్ధారంభంలో చాలామంది ప్రపంచ నేతలు తనకు దేశం విడిచి వెళ్లమని సలహా ఇచ్చారని, కానీ ఉక్రేనియన్లను వారు తక్కువగా అంచనా వేశారని చెప్పారు. 50 రోజులు ఎదురునిలిచి పోరాడుతున్నందుకు దేశప్రజలు గర్వించాలన్నారు. అయితే మరోవైపు మారియూపోల్పై రష్యా పట్టుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరాన్ని రష్యా సేనలు దాదాపు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయని, అక్కడ ప్రజలు ఆహారం, నీరు దొరక్క అలమటిస్తున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. నగరంలో రష్యా సైనికుల అకృత్యాలకు త్వరలో ఆధారాలు లభిస్తాయని, చాలా శవాలను రష్యన్లు రహస్యంగా ఖననం చేశారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా సేనలు బొరోవయా ప్రాంతంలో పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి 7గురిని పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. వీటిని రష్యా ఖండించింది. మాస్క్వాకు అణు వార్హెడ్స్? గురువారం నల్ల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్వాపై రెండు అణు వార్ హెడ్స్ అమర్చిఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మునిగిన ప్రాంతంలో పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై వెంటనే విచారణ జరపాలన్న డిమాండ్ చేశారు. బ్రోక్ యారో ఘటన ( ఒక ప్రమాదంలో అణ్వాయుధాలుండడం)ను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. సిబ్బందిలో చాలామంది మరణించే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిలో 58 మంది మాత్రమే బతికారని, 452 మంది మునిగిపోయారని రష్యా బహిష్కృత నేత పొనొమరేవ్ ఆరోపించారు. మాస్క్వా మునకపై అడ్మిరల్ ఐగొర్ ఓసిపోవ్ను అరెస్టు చేశారని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. 20 వేల రష్యా సైనికులు మృతి? ఇప్పటిదాకా ఏకంగా 20 వేల మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. 160కి పైగా యుద్ధ విమానాలు, 200 హెలికాప్టర్లు, 800 ట్యాంకులు, 1,500కు పైగా సాయుధ వాహనాలు, 10 నౌకను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 2,000కు పైగా ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను తాము నాశనం చేశామని రష్యా తెలిపింది. నాటోలో చేరితే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఫిన్లాండ్, స్వీడన్లను తీవ్రంగా హెచ్చరించింది. స్వదేశానికి 10 లక్షల మంది ఉక్రేనియన్లు యుద్ధం ముగియనప్పటికీ ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిన వారిలో దాదాపుగా 10 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పుడప్పుడే రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా రోజుకు 30 వేల మంది దాకా తిరిగొస్తున్నట్టు సమాచారం. పోలండ్, రుమేనియా తదితర దేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్లోకి రావడానికి ప్రజలు భారీగా క్యూ కట్టారు. కీవ్ చుట్టుపక్కల 900 మందికిపైగా మృతి కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం చుట్టూ మోహరించిన రష్యన్ సేనలు వెనక్కుమరలడంతో అక్కడ వారు చేసిన ఘోరాలు బయటపడుతున్నాయి. కీవ్ పరిసర ప్రాంతాల్లో 900 మందికి పైగా పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు స్థానిక పోలీసు అధికారి అండ్రీ చెప్పారు. చాలాచోట్ల మృతదేహాలు రోడ్లపై పడిపోయి ఉన్నాయని, కొన్ని చోట్ల అరకొర పూడ్చివేతలున్నాయని చెప్పారు. వీరిలో 95 శాతం మంది తుపాకీ గాయాలతో మరణించినట్లు తెలుస్తోందన్నారు. ఈ దేహాలను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. ఎక్కువగా కీవ్కు సమీపంలోని బుచాలో 350 మృతదేహాలు దొరికినట్లు వివరించారు. -
సబ్మెరైన్ పేలినా.. సెకన్లలో అదుపులోకి..
2013 ఆగస్ట్ 13.. నౌకాదళ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన సంభవించింది. ముంబై కొలాబా డాక్యార్డులో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో అర్ధరాత్రి వరస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న సబ్మెరైన్ సముద్రంలో సగం వరకు మునిగిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో సబ్మెరైన్లో టార్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. సబ్మెరైన్లో అర్ధరాత్రి చోటుచేసుకున్న పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి. యుద్ధ నౌకలో గానీ.. సబ్మెరైన్లో గానీ.. చిన్నపాటి ప్రమాదం సంభవిస్తే.. అది భారీ విపత్తుగా మారుతుంది. అగ్నిమాపక వ్యవస్థ ఉన్నప్పటికీ.. క్షణాల్లో వ్యాపించే ప్రమాదాన్ని మాత్రం నియంత్రించలేకపోతుంది. సింధు రక్షక్లో ప్రమాదం తర్వాత.. ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన భారత నౌకాదళం.. రష్యా, అమెరికా వంటి దేశాల వ్యవస్థను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడా పరిస్థితిని అధిగమించి..అగ్రరాజ్యాల సరసన నిలిచేలా అత్యాధునిక మ్యాగజైన్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్(ఎంఎఫ్ఎఫ్ఎస్)ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అత్యంత కీలకమైన నౌకా దళాల్లో అగ్రభాగాన ఉన్న దేశాల సరసన ఉన్న భారత్లో రోజు రోజుకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికనుగుణంగా వ్యవస్థలోనూ అత్యాధునిక మార్పులు తీసుకొచ్చేందుకు రక్షణ వ్యవస్థ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రక్షణ సేవల రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న క్రౌన్ గ్రూప్(డిఫెన్స్ ఇంజినీరింగ్ డివిజన్) ఇప్పుడు ఎంఎఫ్ఎఫ్ఎస్ను భారత నౌకాదళంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. మ్యాగజైన్ ఇక సురక్షితం ప్రతి యుద్ధ నౌక, సబ్మెరైన్లో మ్యాగజైన్ అనే కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో పేలుడు పదార్థాలు, యుద్ధ సామగ్రిని సురక్షితంగా నిల్వ చేస్తారు. ఈ కంపార్ట్మెంట్ను అత్యంత సురక్షితంగా డిజైన్ చేస్తారు. ఆయా యుద్ధ సామగ్రికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, రేడియేషన్లో మార్పులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా.. మొత్తం యుద్ధనౌకతో పాటు పొరపాటున డాక్లో యాంకరేజ్ అయి ఉంటే.. పక్కన ఉన్న నౌకలు కూడా ప్రమాదం బారిన పడతాయి. అందుకే వీటిలో ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యే అగ్నిమాపక వ్యవస్థలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో క్రౌన్ గ్రూప్ ఎంఎఫ్ఎఫ్ఎస్ ఏర్పాటుకు రక్షణ వ్యవస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటైతే.. సింధు రక్షక్ సబ్మెరైన్లో మాదిరిగా పేలుడు సంభవిస్తే.. సెకన్ల వ్యవధిలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలరు. విశాఖలో షిప్ బిల్డింగ్కు సన్నాహాలు డిఫెన్స్ సర్వీస్ సెక్టార్లో ప్రధాన పాత్రధారిగా ఉన్న క్రౌన్ గ్రూప్ విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా షిప్ బిల్డింగ్ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే నగరంలో వర్క్షాప్ కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్ సంస్థ.. తూర్పు నౌకాదళ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, రీఫిట్, ఆపరేషనల్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. విశాఖ తీరంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే హిందూస్థాన్ షిప్యార్డు విశాఖలో ఉంది. ఇప్పుడు మరో షిప్యార్డు వస్తే.. యుద్ధ నౌకల తయారీలో విశాఖ నగరం కీలకంగా మారనుంది. యుద్ధ నౌకలు.. సబ్మెరైన్లో... ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్(ఓఈఎం) సహకారంతో నౌకాదళంలోని యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో ఎంఎఫ్ఎఫ్ఎస్ ఏర్పాటుకు అవసరమైన సామర్థ్యాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత నౌకాదళంలో మొత్తం 150 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లుండగా.. రానున్న ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య 180 వరకు చేరుకోనుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా 30 వరకూ యుద్ధ నౌకలు ఆయా షిప్యార్డుల్లో తయారవుతున్నాయి. వీటన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. షిప్లో మ్యాగజైన్ కంపార్ట్మెంట్ రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తాం విశాఖ తీరం ఎంతో అభివృద్ధి చెందడానికి కీలకంగా ఉంది. అందుకే ఇక్కడ షిప్ బిల్డింగ్ సంస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ తీరంలో వ్యూహాత్మక షిప్యార్డ్లను కొనుగోలు చేయడం లేదా.. భాగస్వామిగా జతకట్టాలని భావిస్తున్నాం. తూర్పు తీర ప్రధాన కేంద్రంగా ఉన్న వైజాగ్కు దక్షిణ భాగంలో షిప్యార్డ్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఐఎన్ఎస్ జలాశ్వ, విమాన వాహక నౌక విక్రమాదిత్యకు మరమ్మతులు, సర్వీసింగ్, మెయింటెనెన్స్ వంటి సవాళ్లతో కూడిన పనిని విజయవంతంగా పూర్తి చేసి.. పీఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు సిద్ధం చేశాం. భవిష్యత్లో అన్ని యుద్ధనౌకలకు ఎంఎఫ్ఎఫ్ఎస్ అత్యవసరం కాబట్టి ఈ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – కమాండర్ రాకేష్ ఆనంద్, క్రౌన్ మెరైన్ డివిజన్ హెడ్ -
చైనాతో ఢీ అంటే ఢీ అంటున్న తైవాన్.. అసలేం జరుగుతోంది!
చైనా ఆధిపత్యాన్ని తైవాన్ సవాల్ చేయాలనుకుంటోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సబ్ మెరైన్ ప్రాజెక్టును చేపట్టింది. 2023 నాటికి ఈ సబ్మైరైన్ను సముద్ర జలాల్లో పరీక్షించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. చైనా వైఖరితో సహనం నశించిన తైవాన్ 2015లోనే అమెరికా, జపాన్ దేశాల్లో కీలకమైన సబ్మెరైన్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. గతేడాది సబ్మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించింది. కాగా సబ్మెరైన్లో కీలక భాగాల తయారీ, పరీక్షలు విజయవంతమైనందునే కీల్ లేయింగ్ ఉత్సవాన్ని గత నెల నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది సబ్మెరైన్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావికదళ బలాన్ని పెంచుకుంటోంది. దీంతో పట్టుదలగా ప్రయత్నించి తైవాన్ సొంతంగా సబ్మెరైన్ల తయారీని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుకు బ్రిటన్, అమెరికా, కెనడాల్లోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనం. కాగా తైవాన్ వద్ద పురాతన సబ్ మెరైన్లు ఉన్నాయి. కానీ చైనాతో యుద్దం జరిగితే కనుక అవి నిలువలేవు. దీంతో వాటిని తమ నేవీ శిక్షణ కోసం వినియోగిస్తోంది. ఇందుకు అమెరికా సైన్యం సహకరిస్తూ తమ కమాండోలతో శిక్షణ ఇస్తోంది. దీనికి తోడు సబ్మెరైన్ల తయారీకి అమెరికా, మిత్రదేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్ను ఉకిరి బిక్కిరి చేస్తోంది. చదవండి: Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఖాన్కు ఘోర అవమానం.. పరువు పాయే -
నావికాదళంలోకి ఐఎన్ఎస్ వేలా
ముంబై: భారతా నావికాదళం మరింత శక్తిమంతమయ్యేలా మరో అస్త్రం వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి గురువారం నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. 2005లో భారత్, ఫ్రాన్స్ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఇది నాలుగవది. ఈ సందర్భంగా కరమ్బీర్ సింగ్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్ఎస్ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు. ఫ్రాన్స్కు చెందిన డీసీఎన్ఎస్, భారత్కు చెందిన మాజ్గావ్ డాక్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్ఎస్ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరాంజ్లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్ఎస్ వేలా మరింత ఆలస్యమైంది. 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్ రష్యా తయారు చేసిన ఆ సబ్మెరైన్ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు. పాక్కు చైనా ఎగుమతులు చైనా నుంచి పాకిస్తాన్కు మిలటరీ హార్డ్వేర్ ఎగుమతులు అధికమయ్యాయని, ఇది అంతిమంగా భారత్ భద్రతకు ముప్పు కలిగిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలు, జలాంతర్గాముల ఎగుమతులు పెరిగాయని, అన్నింటికి భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేకతలు.. ► వేలా సబ్మెరైన్ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ► ఈ జలాంతర్గామి నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ► ఐఎన్ఎస్ వేలా సీ303 యాంటీ టార్పెడో కౌంటర్మెజర్ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్మెరైన్లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు. ► ఎనిమిది మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ► స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి. -
అమెరికాపై ఫ్రాన్స్ ఆగ్రహం
పారిస్: సాంప్రదాయక జలాంతర్గాముల కొనుగోలు వ్యవహారం అమెరికా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 66 బిలియన్ డాలర్ల విలువైన 12 డీజిల్–ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి 2016లో ఆస్ట్రేలియా ఫ్రాన్స్తో భారీ కొనుగోలు ఒప్పందం కుదర్చుకుంది. అయితే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల కొత్త ‘ఆకస్’ కూటమి పరోక్షంగా ఈ కొనుగోలు ఒప్పందం రద్దుకు దారితీసింది. సంప్రదాయక జలాంతర్గాములు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయబోమని, ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు లేఖ రాశారు. ఫ్రాన్స్కు బదులుగా అమెరికా నుంచి అత్యాధునిక అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియా కొనుగోలుచేయనుంది. తమతో ఒప్పందం రద్దుకు అమెరికానే ప్రధాన కారణమని ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకు నిరసన అమెరికాలో తమ రాయబారి ఫిలిప్ ఎతీన్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. ఆస్ట్రేలియా వైఖరిని తూర్పారబడుతూ అక్కడి తమ రాయబారి జీన్ పియర్ థబాల్ట్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. -
చైనాకు చెక్: రూ. 50 వేల కోట్లతో ప్రాజెక్ట్-75కి ఆమోదం
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా రోజుకో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధవవుతోంది. ఈ క్రమంలో భారత నావికా దళం కోసం తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్-75కి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా 50 వేల కోట్ల రూపాయలతో ఆరు జలంతర్గాముల నిర్మాణానికి తుది అనుమతి లభించింది. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ జలంతార్గాములను నిర్మించనున్నారు. ఈ క్రమంలో రెండు భారతీయ కంపెనీలు, ఓ విదేశీ కంపెనీతో కలిసి పనిచేయడానికి అనుమతిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్పీఎఫ్)ను జారీ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన డిఫెన్స్ సమావేశంలో ఆర్ఎఫ్పీకు క్లియరెన్స్ ఇచ్చారు. మజాగావ్ డాక్స్ (ఎండీఎల్), ప్రైవేట్ షిప్-బిల్డర్ లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) లకు రక్షణ శాఖ ఆర్ఎఫ్పీ జారీ చేసింది. ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా క్రింద కలిసి పని చేస్తాయి. అంతేకాక భారత వ్యూహాత్మక భాగస్వాములు అయిన ఎండీఎల్, ఎల్ఆండ్టీ కపెంనీలు.. సాంకేతిక, ఆర్థిక బిడ్లను సమర్పించడానికి ఎంపిక చేసిన ఐదు విదేశీ షిప్యార్డులలో ఒకదానితో జతకడతాయి. ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరు అధునాతన జలంతర్గాములను మజగావ్ డాక్యార్డ్లో వీటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్ క్లాస్ జలంతర్గాముల కంటే దాదాపు 50శాతం పెద్దదైన ఈ ప్రాజెక్టు కింద ఆరు సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను నిర్మించాలని భారత నావికాదళం భావిస్తోంది. ఈ జలాంతర్గాముల తయారీలో 95 శాతం దేశీయ వస్తువుల వినియోగించనున్నారు. మారిటైమ్ ఫోర్స్ స్పెసిఫికేషన్ల ప్రకారం.. జలాంతర్గాముల్లో హెవీ డ్యూటీ ఫైర్పవర్, కనీసం 12 ల్యాండ్ అటాక్ క్రూయిస్ క్షిపణులు (ఎల్ఐసీఎం), యాంటీ షిప్ క్రూయిస్ క్షిపణులు (ఏఎస్సీఎం) ఉండాలి. కొత్తగా అభివృద్ది చేయబోయే జలంతర్గాములు సముద్రంలో 18 హెవీవెయిట్ టార్పెడోలను మోసుకెళ్లే, ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నేవీ పేర్కొంది. తర్వాతి తరం స్కార్పియన్ శ్రేణి కంటే ఎక్కువ ఫైర్పవర్ అవసరం. ప్రస్తుతం భారత నావికాదళంలో 140కి పైగా జలాంతర్గాములు, ఉపరితల యుద్ధ నౌకలు ఉన్నాయి. పాక్ నావికాదళంలో 20 మాత్రమే ఉన్నాయి. మరోవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి భారత నావికాదళం అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది. చదవండి: ఇండో – పసిఫిక్ చౌరస్తా! -
జలాంతర్గామి జలసమాధి
బన్యువాంగి: బుధవారం బాలి సముద్రంలో గల్లంతైన సబ్మెరైన్ మునిగిపోయిందని, అందులోని 53మంది సిబ్బంది మృతి చెందినట్లేనని ఇండోనేసియా నేవీ ప్రకటించింది. జలాంతర్గామి కోసం జరిపిన అన్వేషణలో సబ్మెరైన్ తాలుకా విడిభాగాలు లభ్యమయ్యాయని, దీన్నిబట్టి సబ్మెరైన్ మునిగిపోయి ఉంటుందని, శనివారం ఉదయం వరకే అందులోని ఆక్సీజన్ సరిపోతుందని, అందువల్ల దానిలోని సిబ్బంది బతికిబట్టకట్టే అవకాశమే లేదని భావిస్తున్నట్లు తెలిపింది. జలాంతర్గామి గల్లంతైన ప్రాంతంలో చమురు తెట్టలు, ధ్వంసమైన భాగాలు లభించాయని, ఇవి జలాంతర్గామి మునకకు ప్రధాన సాక్ష్యాలని ఆ దేశ మిలటరీ చీఫ్ హది జజాంటో చెప్పారు. శనివారం ముందువరకు సబ్మెరైన్ గల్లంతైందని ఇండోనేసియా చెబుతూ వచ్చింది. సబ్మెరైన్ పేలితే ముక్కలై ఉండేదని, సోనార్లో తెలిసేదని, కానీ ఈ ప్రమాదంలో జలాంతర్గామి నీటి అడుగుకు పోతున్న కొద్దీ పగుళ్లు వచ్చాయని దీంతో నీళ్లు లోపలికి చేరి మునిగి ఉంటుందని నేవీ చీఫ్ యుడు మర్గానో అభిప్రాయపడ్డారు. జలాంతర్గామి 655 అడుగుల వరకు నీటిలోపలకి వెళ్లే సామర్ధ్యం కలిగి ఉండగా, ఈ ప్రమాదంలో అది దాదాపు 2000– 2300 అడుగుల లోతుకు మునిగి ఉంటుందని నేవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థాయిల్లో నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ పీడనాన్ని జలాంతర్గామి తట్టుకోలేదని వివరించారు. -
మునిగిపోయిన సబ్మెరైన్.. 53 మంది గల్లంతు
జకార్తా: 53 మంది సభ్యులతో కూడిన సబ్మెరైన్ గల్లంతైంది. ఈ దారుణం ఇండోనేషియాలో బుధవారం చోటు చేసుకుంది. మిలిటరీ చీఫ్ హదీ తహ్జం తెలిపిన వివరాల ప్రకారం.. మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా ‘కేఆర్ఐ నంగాల 402 సబ్మెరైన్’ గల్లంతైందని తెలిపారు. బాలి దీవి ఉత్తర తీరం నుంచి నీటిపై 95 కిలోమీటర్ల దూరం తర్వాత దాని నుంచి సిగ్నల్స్ సరిగా రాలేదు. ఎంత సేపటికీ ఆ సబ్మెరైన్ నుంచి ఎటువంటి సమాచరం రాకపోవడం, సిగ్నల్స్ మొత్తంగా బ్లాక్ కావడంతో మునిగిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు. మెరైన్ను కనుగొనేందుకు సింగపూర్, ఆస్ట్రేలియాల సాయం కోరామని ఆయన అన్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ సైతం నీటి మీద తిరుగుతూ మెరైన్ జాడను పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టమైన ఆచూకీ తెలియడం లేదు. ఇండోనేషియా మీడియా చూపిస్తున్న వివరాల ప్రకారం సముద్ర మట్టం నుంచి 2,300 అడుగుల లోతులో అది మునిగిపోయినట్లు తెలుస్తోంది. సబ్మెరైన్ ప్రారంభమైన చోట ఆయిల్ లీకైన జాడలను ఓ హెలికాప్టర్ గుర్తించిందని అందులో పేర్కొన్నారు. బహుశా ఈ ప్రమాదానికి కారణం ఆయిల్ లీకేనని అధికారులు భావిస్తున్నారు. ( చదవండి: జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసు: అతడే దోషి ) -
రష్యా ఇంజినీర్ విశాఖలో మృతి
మల్కాపురం (విశాఖ పశ్చిమ): రష్యా నుండి వచ్చిన ఓ ఇంజినీర్ గుండెపోటుతో విశాఖలో మృతిచెందారు. సంఘటనకు సంబంధించి మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రష్యా దేశానికి చెందిన గ్రాచవ్ దిమిత్రి (43) ఈ ఏడాది ఫిబ్రవరి 27న విశాఖ వచ్చారు. ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ నౌకలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వాటిని సరిచేసేందుకు ఆయనను ఇక్కడికి పిలిపించారు. దిమిత్రి యారాడ డాల్ఫిన్ హిల్స్ ప్రాంతంలోని క్వార్టర్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం నౌకలో పనులు చేస్తుండగా మ.1.15 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అక్కడి సిబ్బంది వెంటనే ఆయనను ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మ.2.45 గంటలకు మృతిచెందారు. నేవల్ అధికారుల ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చంటి బిడ్డను ఇంట్లో వదిలేసి పార్టీలకు.. వచ్చి చూస్తే..) -
‘ఏలియన్స్ ప్రపంచంలా వింతగా ఉంది’
బీజింగ్: చైనా అరుదైన ఘనత సృష్టించింది. ఓ సబ్మెరైన్ని సముద్రం అడుగున పార్క్ చేసింది. ఆ సమయంలో దాని మీద ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు. దాదాపు 10 వేల మీటర్లకు పైగా లోతున అనగా భూమి మీద గల అత్యంత లోతైన సముద్ర కందకం(ఒషియన్ ట్రెంచ్)లోకి మనుషులతో కూడిన సబ్మెరైన్ని పంపిన దృశ్యాలను లైవ్లో ప్రసారం చేసింది. చైనా ఈ విన్యాసాలను పసిఫిక్ సముద్రంలో నిర్వహించింది. ''ఫెండౌజ్ "అనే పిలవబడే సబ్మెరైన్ పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్లోకి ముగ్గురు శాస్త్రవేత్తలని తీసుకుని వెళ్లింది. చైనా అధికారిక చానెల్ సీసీటీవీలో ఇది లైవ్ స్ట్రీమ్ అయ్యింది. సబ్మెరైన్కి అమర్చిన డీప్ సీ కెమరా ఆకుపచ్చ-తెలపు వర్ణంలోని ఫెండౌజ్ నల్లని నీటిలో లోతుకు మునిగిపోతూ సముద్రపు అట్టడుగు భాగాన్ని తాకడాన్ని రికార్డు చేసి ప్రసారం చేసింది. ఫెండౌజ్ ఈ విన్యాసాలు చేయడం ఇదే రెండో సారి. ఈ నెల ప్రారంభంలో మొదటి సారిగా 10,909 మీటర్ల లోతుకు వెళ్లి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. (చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన) (సబ్మెరైన్తో పాటు సముద్రం అట్టడుగు భాగానికి వెళ్లి వచ్చిన శాస్త్రవేత్తలు) ఇక ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో అత్యంత లోతుకు వెళ్లిన ఘనత అమెరికన్ సబ్మెరైన్ సాధించింది. ‘అమెరికన్ ఎక్స్ప్లొరర్’ అనే సబ్మెరైన్ 2019లో సముద్రంలో 10,927 మీటర్ల లోతుకు వెళ్లి రికార్డు సృష్టించింది. ఇక సముద్రం అడుగున గల జీవ నమూనాలను రికార్డు చేయడానికి ఫెండౌజ్కి రోబోటిక్ చేతులను అమర్చారు. ఇది తన చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించడానికి సోనార్ కళ్లని అమర్చారు. ఇవి ధ్వని తరంగాల సాయంతో పని చేస్తాయి. ఇక ఫెండోజ్ శక్తి సామార్థ్యాలను పరీక్షించడం కోసం పలుమార్లు దాన్ని నీటిలో మునకలు వేయించారు. ఇక సబ్మెరైన్తో పాటు సముద్రంలెరి ప్రయాణించిన శాస్త్రవేత్తలు తన అనుభవాలను వెల్లడించారు. ‘సముద్ర అడుగు భాగం ఏలియన్స్ ప్రపంచంలా.. చాలా వింతగా ఉంది. అక్కడ మనకు తెలియని ఎన్నో జాతులు, జీవుల పంపిణీ ఉంది’ అని తెలిపారు. ఇక తమ పరిశోధనల కోసం కొన్ని నమునాలను తమతో పాటు తీసుకొచ్చామన్నారు. రెండు సార్లు ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఇది విజయవంతమయ్యిందని చెప్పగలం అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త జూ మిన్ తెలిపారు. -
భారత నౌకదళం అమ్ముల పొదిలోకి మరో అస్త్రం
-
కలవరపెట్టిన పాక్ సబ్మెరైన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక సబ్మెరైన్ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్ పాక్ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్ నేవీకి చెందిన అగొస్టా క్లాస్ సబ్మెరైన్ ‘పీఎన్ఎస్ సాద్’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్ఎస్ సాద్ మిగతా సబ్మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్పై దాడికి పాక్ పీఎన్ఎస్ సాద్ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్ఎస్ సాద్ గుజరాత్ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్మెరైన్ ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు. వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు. భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్ఎస్ సాద్ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్ సాద్ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్ తీరంలోనే ïసాద్ అగిపోయిందని పేర్కొన్నారు. -
నేవీకి మరింత శక్తి
వాషింగ్టన్: సముద్రంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేకించిన ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర రూ.1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో చైనా క్రియాశీలకంగా మారుతున్న నేపథ్యంలో యుద్ధ సమయాల్లో భారత నావికాదళానికి ఈ హెలికాప్టర్లు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. శత్రు దేశాల సబ్మెరైన్లు, నౌకలను వెంటాడి వాటిని ధ్వంసం చేసేందుకు వీలుగా వీటిని రూపొందించారు. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. యుద్ధనౌకల నుంచి, విధ్వంసక నౌకల నుంచి, క్రూజర్ల నుంచి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ప్రయోగించగలిగే హెలికాప్లర్లలో ఇవే అత్యాధునికమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవీ ప్రత్యేకతలు... ♦ అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు. ♦ లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది. ♦ ఈ హెలికాప్టర్లలో సబ్మెరైన్లను ధ్వంసం చేసే పరికరాలతో పాటు సర్చ్, రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా, సమాచారం చేరవేసే సాంకేతికతను అనుసంధానం చేసింది. ♦ సరుకులు, వ్యక్తుల తరలించే వెసులుబాటు ఉంది. ♦ 2721 కిలోగ్రాముల బరువైన సామగ్రిని తాడుతో తరలించే సదుపాయం కూడా ఇందులో ఉంది. ♦ జూలై 2001లో తొలి హెలికాప్టర్ తయారైంది. ♦ ఇందులో ముగ్గురు లేదా నలుగురు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ♦ దీనికి సెన్సర్లను అమర్చారు. దీనివల్ల హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చే వాటిని గుర్తిస్తుంది. ♦ చిన్న ఆయుధాలు, మంటలు అంటుకున్నా కూడా ఎలాంటి హాని కలగకుండా ఏర్పాట్లు చేశారు. ♦ 1,425 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బో షాఫ్ట్ ఇంజన్లను దీనికి అమర్చారు. -
ఫేక్ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన పాక్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. అసత్య ఆరోపణలతో అడ్డంగా బుక్కైంది. ఓ పాత వీడియో తీసుకొచ్చి భారత్పై బురదజల్లేందుకు సిద్ధమైంది. భారత్కు చెందిన సబ్మెరైన్ తమ జలలాల్లోకి చొరబడేందుకు యత్నించిందని, ఆ ప్రయత్నాన్ని పాక్ నౌకాదళం దీటు తిప్పికొటి్ందని వెల్లడించింది. ‘భారత్ సబ్మెరైన్ను కనుకొన్న ఫుటేజ్ ఇదే’ అంటూ 50 సెకన్ల నిడివి గల ఓ వీడియో ఫుటేజీని పాక్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్రభుత్వానికి అక్కడి మీడియా వంత పాడింది. (వైరల్ : సర్జికల్ స్ట్రైక్స్-2 ఫేక్ వీడియో) ‘అవును, భారత సబ్మెరైన్ మా జలాల్లోకి రావడానికి యత్నించింది’ అంటూ పాక్ మీడియా బ్రేకింగ్లతో ఊదరగొట్టింది. సోషల్ మీడియాలో సైతం ఇదే తరహా ప్రచారం సాగింది. అయితే, ఇదంతా భారత్పై దష్ప్రచారం అని తేలింది. పాక్ ప్రభుత్వం, అక్కడి మీడియా చూపిస్తున్న వీడియో ఫుటేజీ పాతదని ఇండియా టుడే యాంటి ఫేక్ న్యూస్ వార్ రూమ్ (ఏఎఫ్డబ్ల్యూఏ) కనుగొంది. అసత్య ఆరోపణలు చేస్తున్న పాక్ వైఖరిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ ఫేక్ వీడియో ఫుటేజీని పాక్ ప్రభుత్వం విడుదల చేసే ముందే మీడియాలో ప్రత్యక్షమవడం గమనార్హం. (సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫేక్ వీడియో) అది 2016 వీడియో.. 2016కు చెందిన వీడియోపై తాజా తేదీ, సమయం అంటించి పాక్ గగ్గోలు పెడుతోందని ఇండియా టుడే ఏఎఫ్డబ్ల్యూఏ స్పష్టం చేసింది. డాష్వేర్ అనే సాఫ్ట్వేర్తో ఈ ఫేక్ వీడియో గుట్టు రట్టు చేశామని వెల్లడించింది. కాగా, 2016లో సైతం ఇదే వీడియో చూపెట్టిన పాక్ భారత్పై నిందలు మోపింది. తమ జలాల్లోకి భారత సబ్మెరైన్ దూసుకొచ్చేందుకు యత్నించిందని ఆరోపించింది. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది. -
అడ్డంగా దొరికిపోయిన పాక్
-
విశాఖలో సబ్ మెరైన్ హెరిటేజ్ మ్యూజియం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సబ్ మెరైన్ హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం టూరిజం ప్రమోషన్ బోర్డు సమావేశంలో పలు ప్రాజెక్టులపై పర్యాటక శాఖ అధికారులతో ఆయన చర్చించారు. పారిస్కు ఈఫిల్ టవర్, ఆగ్రాకు తాజ్ మహల్ లాగా, విశాఖకు సబ్ మెరైన్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ కావాలన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద స్కూబా డైవింగ్, విశాఖ, విజయనగరం జిల్లాలలో స్కై స్కూల్ కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం, దిగువన చోడవరం ప్రాజెక్టులు పూర్తయితే రాజధాని ప్రాంతంలో కృష్ణానది వాటర్ ఫ్రంట్గా ఉంటుందన్నారు. అదే తరహాలో ఉత్తరాంధ్రలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నుంచి 50 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలని చెప్పారు. గ్రామ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, స్థానిక జానపదాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ దర్శని, నగర దర్శనిలో రాబోయే 5 నెలల్లో 774 కళాకారుల బృందాలకు వర్క్షాపులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగానికి త్వరలో ఒక విధానాన్ని తీసుకు వస్తామని సీఎం చెప్పారు. సచివాయంలో శుక్రవారం విద్యుత్ వాహనాల వినియోయాగంపై సమీక్ష నిర్వహించారు. కాగా, రూ. కోటిన్నర విలువైన నిత్యావసర సరుకులతో కేరళకు బయలుదేరిన వాహనాలకు సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో ఈ సరుకులు సేకరించి సచివాలయానికి తెచ్చారు. -
నోరు జారాడు.. అనుభవిస్తున్నాడు
థాయ్ కేవ్ ఆపరేషన్లో పాల్గొన్న ఓ బ్రిటీష్ డైవర్పై.. టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సదరు డైవర్ అసలు సహాయక చర్యల్లో పాల్గొనలేదని.. పైగా అతను చిన్నారులను లైంగికంగా వేధించే వ్యక్తి అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. థాయ్ కేవ్ ఆపరేషన్లో భాగంగా వైల్డ్ బోర్ అనే డైవర్స్ టీం సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ బృందంలో బ్రిటీష్ డైవర్ వెర్నోన్ అన్స్వోర్త్ కూడా ఉన్నారు(మ్యాపింగ్ రూట్ సమాచారం అందించటం...). టెస్లా తరపున సహాయక చర్యల కోసం మస్క్.. జలంతర్గాములను పంపించాడు. అయితే అవి చాలా చిన్నవిగా ఉన్నాయని, ఆపరేషన్కి పనికి రాలేదని, ఆ విషయం తెలిసికూడా టెస్లా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే వాటిని పంపిందని వెర్నోన్ పేర్కొన్నారు. దీంతో మండిపోయిన మస్క్.. వెర్నోన్ను విమర్శిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. ‘మా సబ్మెరెన్లు పనికి రావని ఆ పెద్ద మనిషి అన్నారు. కానీ, ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. కేవలం ప్రచారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం కూడా నాకు ఈ మధ్యే తెలిసింది. ఆయనొక పెడో. (పెడో.. పైడోఫిలేకి సంక్షిప్త రూపం.. పిల్లల్ని ప్రలోభ పెట్టి లైంగికంగా వాడుకోవటం). అలాంటి వ్యక్తి చేసే పనికిమాలిన కామెంట్లను పట్టించుకోవటం.. మాకు అవమానం’ అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు. అయితే ఈ విషయంలో వెర్నోన్కే మద్ధతుగా చాలా మంది నిలిచారు. మస్క్ను విమర్శిస్తూ పెద్ద ఎత్తున్న పోస్టులు వెల్లువెత్తటంతో చివరకు మస్క్ ఆయా ట్వీట్లను డిలేట్ చేశారు. ఇక ఈ విషయంపై అన్స్వోర్త్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా కథనాల ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. మస్క్పై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా’ అని వెల్లడించారు. భారీ నష్టాలు.. ఇదిలా ఉంటే మస్క్ చేసిన ట్వీట్లు టెస్లా మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం దాదాపు 4 శాతానికిపైగా షేర్లు పడిపోవటంతో 295 మిలియన్ డాలర్ల మేర నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆటోమేకర్ రంగంలో దిగ్గజం అయిన టెస్లా.. ఎలోన్ మస్క్ నిర్ణయాలు, ప్రవర్తన మూలంగా ఏడాది కాలంలో 2 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఎలోన్.. టెస్లా కొంప ముంచుతున్నాడంటూ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కరంజ్ జలప్రవేశం
ముంబై: భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్లాంబా భార్య రీనా లాంబా బుధవారం నాడిక్కడ ఐఎన్ఎస్ కరంజ్ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐఎన్ఎస్ కరంజ్తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. అనంతరం లాంబా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిపాటు పరీక్షించిన తర్వాతే కరంజ్ను విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్ఎస్ కరంజ్గా నామకరణం చేశామన్నారు. విధుల నుంచి తప్పించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ను వైజాగ్లో మ్యూజియంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందితే విరాట్ను అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కల్వరి సబ్ మెరైన్ వచ్చేసింది...
ముంబై: స్కార్పిన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ కల్వరి’ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. కల్వరి రంగ ప్రవేశంతో దేశ రక్షణ సన్నద్ధతలో భారీ ముందడుగు పడిందని, ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్ ఇన్ ఇండియా’ విజయానికి ఇది చక్కటి ఉదాహరణ అని మోదీ పేర్కొన్నారు. ఈ జలాంతర్గామి నౌకాదళ ప్రవేశం 125 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, దీనిని జాతికి అంకితం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్ఎస్ కల్వరిని డిజైన్ చేయగా... ముంబైలోని రక్షణ శాఖకు చెందిన మజగాన్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) దీన్ని నిర్మించింది. జలాంతర్గామిని నౌకాదళంలో ప్రవేశపెట్టిన అనంతరం లోపలికి వెళ్లిన మోదీ అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే 1967 నాటి మొదటి కల్వరి జలాంతర్గామిలో సేవలందించిన మాజీ ఉద్యోగులతో ఆయన ముచ్చటించారు. అనంతరం ముంబైలోని నౌకా దళ డాక్యార్డ్లో మోదీ ప్రసంగిస్తూ.. గత మూడేళ్లుగా దేశ రక్షణ రంగంలో మార్పులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ‘కల్వరి చేరికతో దేశ నౌకాదళ సన్నద్ధతలో కీలక అడుగు పడింది. కల్వరి శక్తి మన నౌకాదళాన్ని బలోపేతం చేస్తుంది. ఇతర దేశాలు భారత్ ప్రయాణిస్తున్న శాంతి, సుస్థిర మార్గంలో కలిసి సాగాలని కోరుకుంటున్నాయి. భారతదేశం బలోపేతం కావడం మొత్తం మానవాళికి ఎంతో కీలకం’ అని ప్రధాని చెప్పారు. హిందూ మహాసముద్రం కీలకం: సరిహద్దు దేశాలైన శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా భారతదేశమే మొదటిగా స్పందిస్తుందని మోదీ వెల్లడించారు. ‘ నౌకల్లో దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ వేట వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. ఇతర దేశాలతో సంబంధాల బలోపేతానికి హిందూ మహాసముద్రం ఎంతో సహాయకారిగా ప్రధాని మోదీ తెలిపారు. ‘మా ప్రభుత్వ పథకాల్లో, విధాన నిర్ణయాల్లో హిందూ మహాసముద్రానికి కీలక స్థానం ఉంది. ఈ సముద్రాన్ని నేను సాగర్ ( .అ.ఎ.అ.ఖ– సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) అని పిలుస్తాను.. అంటే ఈ ప్రాంతంలోని అందరి భద్రత, వృద్ధికి సహాయకారి అని అర్థం. ఈ శతాబ్ది అభివృద్ధి పథంలో హిందూ మహాసముద్రం పాత్ర ఎంతో కీలకం. అందుకే ప్రభుత్వ విధానాల్లో ప్రత్యేక స్థానం కల్పించాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. టైగర్ షార్క్ పేరే.. హిందూ మహాసముద్రం లోని భయంకర ‘టైగర్’ షార్క్ (మలయాళంలో కల్వరి అంటారు) పేరును ఈ జలాంతర్గామికి పెట్టారు. దీనిని ఫ్రెంచ్ నౌకా రక్షణ, ఎనర్జీ కంపెనీ డీసీఎన్ఎస్ డిజైన్ చేయగా... రక్షణ శాఖకు చెందిన ముంబైలోని మజగాన్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. మొత్తం ఆరు స్కార్పిన్ సబ్మెరైన్లు నిర్మిస్తుండగా అందులో మొదటిది కల్వరి. కల్వరి ప్రత్యేకతలివీ.. ♦ శత్రువుకు జలాంతర్గామి జాడ చిక్కకుండా ధ్వనిని అదుపు చేసే అత్యాధునిక సాంకేతికత. ♦ కచ్చితత్వంతో దూసుకెళ్లే ఆయుధాలతో శత్రువును దెబ్బకొడుతుంది. టార్పెడోలతో పాటు ట్యూబుల ద్వారా యాంటీ షిప్ క్షిపణులతో నీళ్లలోను, సముద్ర ఉపరితలంపైనా దాడిచేయవచ్చు. ♦ రేడియేషన్ స్థాయిలు అతి తక్కువగా ఉంటాయి. ♦ పొడవు: 67.5 మీ (221 అడుగులు) ♦ వేగం: నీటిలో ఉన్నప్పుడు గంటకు 37 కి.మీ. ♦ సముద్ర ఉపరితలంపై గంటకు 22 కి.మీ. ♦ పరిధి: ఉపరితలంపై 12,000 కి.మీ. నీటిలో ఉన్నప్పుడు 1,020 కి.మీ. ♦ 18 టార్పెడోలను మోసుకెళ్లగలదు ♦ 350 మీటర్ల లోతుకు వెళ్లగలదు -
విశాఖలో సబ్ మెరైన్ ఉత్సవాలు
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్లో సబ్ మెరైన్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 39 మంది అధికారులు, 621మంది నావికులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరేడ్ గ్రౌండ్కు విచ్చేసి పరేడ్ను తిలకించారు. గవర్నర నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా విచ్చేశారు. నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నౌకాదళంలో 1967 డిసెంబర్ 8న జలాంతర్గామి విభాగం ప్రారంభం కాగా తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి చేరింది. -
విపత్తులు ఎదుర్కొనేందుకు సదా సన్నద్ధతతో ఉంటాం
విశాఖ సిటీ: భారత సాగర తీరంలో శాంతి భద్రతల్ని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తూర్పు నౌకాదళం సేవలందిస్తోందని ఈఎన్సీ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. జాతీయ విపత్తులను ఎదుర్కొనేందుకు నౌకాదళం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. నౌకాదళంలో సబ్మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న సబ్మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు కరమ్బీర్ సింగ్ తెలిపారు. 1968లో సేవలు ప్రారంభించిన తూర్పు నౌకాదళానికి 2018 మార్చి నాటికి 50 ఏళ్లు పూర్తవుతున్నా యన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ డిసెంబర్ 7, 8 తేదీల్లో జరిగే స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. -
అట్లాంటిక్ సముద్రంలో మిసైన సబ్మెరైన్
-
భయపెట్టిన సబ్మెరైన్ ఇదే..
ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెరైన్ 'ప్రిన్స్ ఆఫ్ మాస్కో' తీరానికి వచ్చింది. రష్యా నేవీ దినోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు ఈ భారీ సబ్మెరైన్ నావల్ బేస్కు చేరుకుంది. నేవీ డే సందర్భంగా భారీగా ఆయుధసంపత్తిని ప్రదర్శించనుంది. వాస్తవానికి కోల్డ్ వార్ సమయంలో అమెరికన్లను భయాందోళనలకు గురి చేసింది ఈ సబ్మెరైనే. 1359 నుంచి 1389 మధ్య మాస్కోను పాలించిన ద్మిట్రీ డోన్స్కోయ్ పేరును ఈ సబ్మెరైన్కు పెట్టారు. దీని పొడవు 520 అడుగులు. ఒక్కసారి సముద్రం లోపలికి వెళితే 120 రోజుల పాటు స్వేచ్ఛగా మనగలదు. టైఫూన్ క్లాస్కు చెందిన ఈ సబ్మెరైన్ ఒకేసారి ఇరవై అణు టార్పెడోలను ప్రయోగించ గలదు. -
భారతీయ సిల్వర్ స్క్రీన్ చూడని చిత్రం ఘాజీ
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ ఎవరూ చూడని చిత్రంగా ఘాజీ ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు రానా పేర్కొన్నారు. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవాగా జీవించి భళా అనిపించుకున్న బహుభాషా నటుడు రానా. టాలీవుడ్ నటుడే అయినా తమిళం, హిందీ భాషల్లోనూ బహుళ ప్రాచుర్యం పొంది మోస్ట్ వాంటెడ్ నటుడిగా ఎదుగుతున్న రానా తాజాగా కథానాయకుడిగా నటించిన మరో త్రిభాషా చిత్రం ఘాజీ. నటి తాప్సీ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పీవీపీ.సినిమా, మ్యాట్నీ ఎంటర్టెయిన్ మెంట్ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నవ దర్శకుడు సంకల్ప్ వెండితెరపై ఆవిష్కరించిన భారీ ఎండ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం ఘాజీ. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి వచ్చిన రానాతో సాక్షి భేటీ. ప్ర: ఘాజీ చిత్ర నేపథ్యం ఏమిటి? జ: ఇది 1971లో విశాఖపట్టణంలో జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య సముద్ర భాగంలో జరిగిన యాదార్థ యుద్ధం ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం. ప్ర: ఇంతకు ముందు ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఘాజీ చిత్రానికీ డిఫరెంట్ ఏమిటి? జ: ఇంతకు ముందు ఇండియా–పాకిస్తాన్ ల మధ్య పోరు కథలతో భారతీయ చిత్రాలు చాలా తక్కువే వచ్చాయి. అయితే ఘాజీ చిత్రం నేవి నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఈ తరహా చిత్రాలను ఇప్పటి వరకూ భారతీయ వెండితెరపై చూసి ఉండరు. ప్ర: ఘాజీ చిత్రంలో మీరు నటించడానికి ప్రధాన కారణం? జ: ముందుగా కొత్త కాన్సెప్్టతో కూడిన కథా చిత్రాల్లో నటించడానికి నేను చాలా ఆసక్తి చూ పుతాను. ఆ విధంగా నేను సినిమా లవర్ని. ఘాజీ చి త్రం మనదేశంలో మన విశాఖపట్టణంలో 1971లో నాకు తెలియని చిన్నతనంలో విన్న యుద్ధం గురించిన కథ. ఘాజీ అనే సబ్మెరైన్ లో 71 రోజుల పాటు జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య యుద్ధం ఇతివృత్తం కావడంతో సహజంగానే ఈ చిత్రంలో నటించాలనే కోరిక కలిగింది. ఇంకా చెప్పాలంటే బ్లూఫిష్ అనే కథ చదివి దీని రచయిత, దర్శకుడు అయిన సంకల్ప్ను వెతుక్కుంటూ వెళ్లి ఈ చిత్ర అవకాశాన్ని అందుకున్నాను. మనం ఇక్కడ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే అందుకు కారణం సరిహద్దులో పోరాడుతున్న సైనికుల పోరు, త్యాగాలే. వారిని గౌరవించేలా ఈ ఘాజీ చిత్రం ఉంటుంది. ప్ర: ఘాజీ చిత్రంలో హైలెట్స్ గురించి? జ: చిత్ర కథే ఒక హైలెట్. చిత్రం 60 శాతం అండర్వాటర్లోనే జరుగుతుంది. అండర్వాటర్లో నటించడం చాలా రిస్క్తో కూడింది. సూర్యరశ్మి సోకదు. సాధారణ దుస్తులు ధరించలేం. అందుకు ప్రత్యేక దుస్తులు ధరించి నటించాం. చిత్రం చాలా సీరియస్గా సాగుతుంది. ఇందులో నేను లెఫ్టినెంట్ ఆర్మీ అధికారిగా నటించాను. అతి ఫోర్స్ గానీ, అనవసర సంభాషణలు గానీ ఉండవు. కథ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఘాజీ చిత్రంలో నటించడం గర్వంగా భావిస్తున్నా. ప్ర: నటి తాప్సీ గురించి? జ: నటి తాప్సీది ఇందులో కీలక పాత్ర. తను ఇందులో బెంగాలీ అమ్మాయిగా నటించారు. ఆమె నటనకు చాలా పేరు వస్తుంది. ప్ర: మీరు ఎక్కువ పిరియడ్ కథా చిత్రాల్లోనే నటించండానికి కారణం? ప్ర: కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఏ చిత్రానికైనా కంటెంట్ ముఖ్యం. కథ నన్ను ఆకట్టుకుంటే ఏ తరహా చిత్రం అయినా చేయడానికి నేను రెడీ. సక్సెస్ అవుతుందనే చిత్రాలు చేయలేం. ఉదాహరణకు బాహుబలి చిత్రాన్ని విజయం సాధించాలన్న ఒక్క కారణంతోనే చేయలేదు. ఒక గొప్ప చిత్రం, వినూత్న ప్రయోగంతో చేయాలన్న లక్ష్యంతో ఆ చిత్రం చేశాం. అది భారతీయ సినిమా గర్వించే చిత్రంగా నిలిచింది. ప్ర: బాహుబలి–2 చిత్రం గురించి? జ: బాహుబలికి సంబంధించిన రెండు కథలు ముందుగానే సిద్ధం అయ్యాయి. బాహుబలి చిత్రం అద్భుత విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్ ఇంకా ప్రముఖ సాంకేతిక నిపుణులతో మరింత బ్రహ్మాండంగా తెరెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ప్ర: మీ తాతగారు డి.రామానాయుడు ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. వాటిలో ఏదైనా రీమేక్లో నటించాలన్న కోరిక ఉందా? జ: కోరిక ఉన్నా వాటిని రీమేక్ చేయడం, అందులో నటించడం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే అవన్నీ గోల్డెన్ హిట్ చిత్రాలు. సరిగా చేయలేమేమోనన్న భయం. అందుకే అలాంటి సాహసం చేయలేను. ప్ర: తదుపరి చిత్రాలు? జ: ప్రస్తుతం తెలుగులో తేజ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. త్వరలో దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది 1945 నేపథ్యంలో సాగే పిరియడ్ కథా చిత్రమే. -
యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్
ఇస్లామాబాద్: జలాంతర్గామి మీద నుంచి ప్రయోగించే అణు యుద్ధ క్షిపణి బాబర్-3ని పాకిస్థాన్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. సోమవారం చేసిన ఈ పరీక్ష విజయవంతం అయినట్లు పాక్ మీడియా తెలిపింది. అణ్వస్త్రాలను ఈ క్షిపణి దాదాపు 450కిలో మీటర్లు మోసుకెళ్లగలదు. హిందూ మహాసముద్రంలో గుర్తు తెలియన ప్రాంతంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. పాక్ వద్ద అత్యంత శక్తిమంతమైన వార్హెడ్లలో ఇదే రెండో అతిపెద్దది అని ఆ దేశ మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ’బాబర్-3ని నీటి అడుగు భాగం నుంచి జలాంతర్గామిపై ఏర్పాటు చేసిన మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోగించాం' అని అక్కడి మీడియా, పబ్లిక్ రిలేషన్ సంస్థ వెల్లడించింది. అంతకుముందు బాబర్ 2ను పాక్ డిసెంబర్లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసింది. బాబర్ 3 యుద్ధ క్షిపణిని భారత్లోని బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చెబుతున్నారు. -
ఇదేనా.. రక్షణ
మూడురోజుల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి తన పిస్టల్కేబలైన తేజ్వీర్సింగ్ అలవాటైన పనిలోనే ప్రాణాలు విడిచిన పాండే కాలం చెల్లిన ఆయుధాలు, యంత్రాలు, నౌకలతో తరచూ ప్రమాదాలు మొన్న నావికుడు.. నేడు సబ్ లెఫ్టినెంట్ దుర్మరణం.. ఒకరిది విద్యుత్ షాక్.. మరొకరిది ఆత్మహత్య అని అనుమానం.. తూర్పు నావికాదళంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.. ఎందుకిలా జరుగుతోంది?.. వాస్తవాలు ఎందుకు బయటకు రావడం లేదు??.. నౌకలు పాతబడిపోయి ప్రమాదాలకు ఆస్కారమిస్తుండటం.. ఉద్యోగపరంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు.. ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నట్లు తెలుస్తున్నా.. అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు.. ప్రత్యేక విచారణ జరుపుతున్నామంటున్నారు గానీ.. ఆ తర్వాత కూడా ఆ వివరాలు బయటకు రావడం లేదు.. సాక్షి, విశాఖపట్నం : నిర్లక్ష్యమో.. నిర్వహణ లోపమో.. ఒత్తిళ్లో.. కారణమేదైనా.. తూర్పు నావికాదళ సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఐఎన్ఎస్ సింధ్ధ్వజ్సబ్మెరైన్లో పాండే అనే నావికుడు విద్యుత్ షాక్తో మృతిచెందిన ఒకరోజు వ్యవధిలోనే 9 ఎంఎం పిస్టల్ మిస్ఫైర్ కావడంతో సబ్ లెఫ్టినెంట్ తేజ్వీర్సింగ్ మృతి చెందాడు. కాగా తేజ్వీర్ సింగ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను తన పిస్టల్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సూసైడ్ లేఖ కూడా సంఘటన ప్రదేశంలో లభించిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు వెల్లడించని ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు మాత్రం ఆదేశించారు. ఇక పాండే విద్యుత్ షాక్తో గురై పదో తేదీన చనిపోతే మరుసటి రోజు వరకూ అధికారులు విషయం బయటపెట్టలేదు. నిజానికి పాండే సాధారణ ఎలక్ట్రీషియన్ కాదు. నేవీలో లీడింగ్ ఎలక్ట్రికల్ పవర్ సెయిలర్. అలాంటి వ్యక్తి విద్యుత్ షాక్కు గురై చనిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పురాతన నౌకలతో యాతన ఐఎన్ఎస్ సింధుధ్వజ్ సబ్మెరైన్ నేవీలో 1987లో ప్రవేశించింది. ఇది సింధుఘోష్ తరహా సెకండ్ అటాక్ సబ్మెరైన్. ఇందులో ఆరు ఎలక్ట్రికల్, డీజిల్ మోటార్లు ఉంటాయి. 52 మంది సిబ్బంది ఉంటారు. ఐఎన్ఎస్ కుఠార్ కూడా 1990లో భారత నేవీలో ప్రవేశించింది. 2014లో ఒకసారి నౌక దెబ్బతినడంతో బాగుచేసి మళ్లీప్రవేశపెట్టారు. వీటిలో ఒకటి 29 ఏళ్లుగా, మరొకటి 26 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. సబ్మెరైన్ పూర్తిగా శిథిల స్థితికి చేరుకున్నా ఇంకా వినియోగిస్తున్నారు. లోపలి ఎలక్ట్రికల్ విభాగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయని సమాచారం. అయినప్పటికీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రతిభ గల ఉద్యోగిని కోల్పోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరచూ ప్రమాదాలు గత ఏడాది ఈస్ట్రన్ నేవల్ కమాండ్లో ఓ ఉద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మార్చి 2014లో అరిహంత్ సబ్మెరైన్లో హైడ్రాలిక్ ట్యాంక్లో ఒత్తిడితో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. నేవీలో ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు బయటకు రావడం లేదు. పాండే సోమవారం విద్యుత్ షాక్కు గురై మరణిస్తే మంగళవారం వరకూ ప్రకటించలేదు. పాత నౌకల్లో పరికరాలు ఊడిపోయి, విరిగిపోయి సిబ్బందిపై పడటంతో తరచుగా గాయాలపాలవుతున్నారు. మరోవైపు రోజుల తరబడి విధుల్లో ఉండటం.. కుటుంబాలకు దూరం కావడం వంటి కారణాలతో సిబ్బంది మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాలను నేవీ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రక్షణ విభాగాల్లో విషయాలు రహస్యంగా ఉం చడం మంచిదే అయినా.. ప్రమాదాల సమాచారాన్ని కూడా దాచిపెట్టడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
టైటాన్ అధ్యయనానికి నాసా జలాంతర్గామి!
వాషింగ్టన్: శనిగ్రహ ఉపగ్రహం టైటాన్ పైకి జలాంతర్గామిని పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రణాళికలు రచిస్తోంది. అక్కడి సముద్రం లోతు, జీవ జాడలను అన్వేషించేందుకు ఈ ప్రయోగం చేపడుతుంది. సముద్రంలోని రసాయన అనుఘటకాలు, ప్రవాహాలు, అలలు, సముద్ర ఉపరితల నిర్మాణం తదితరాలను అధ్యయనం చేసే పరికరాలను జలాంతర్గామి మోసుకెళ్తుందని పరిశోధకులు అంటున్నారు. దాని పైభాగాన ఉన్న స్తంభం అది భూమికి సమాచారం పంపేలా ఉపకరిస్తుంది. నీటిలో మునిగితే సంకేతాలు పంపే అవకాశం లేనందున దాని అన్వేషణ జీవితకాలం స్వతంత్రంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టైటాన్ పరిశోధనకు శాస్త్రవేత్తలు ప్రధానంగా రెండు కారణాలను పేర్కొంటున్నారు. ఒకటి, అక్కడ హైడ్రోకార్బన్ ఆధారిత జీవజాలం ఉండే అవకాశాలు ఉన్నాయో కనుగొనడం. రెండు, మేఘాలు, వాతావరణంతో కూడిన ఏకైక ఉపగ్రహమైన టైటాన్... తీవ్ర చలి, ద్రవ మీథేన్ సముద్రాలతో పాటు భూమితో ఇతర సారూప్యతలను కలిగి ఉంది. మీథేన్ సముద్రం ద్వారా జీవ పరిణామం ఎలా జరిగింది, వీలైతే గ్రహాంతర సూక్ష్మ జీవుల ఆవిర్భావం గురించి తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. -
'స్కార్పిన్ లీకేజీపై ఆందోళన వద్దు'
న్యూఢిల్లీ: స్కార్పిన్ జలాంతర్గామి సమాచారం బహిర్గతం కావడంపై ఆందోళన పడొద్దని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. లీకైన పత్రాల్లో ఆయుధ వ్యవస్థ వివరాలు లేనందున కంగారు పడొద్దన్నారు. రక్షణ శాఖ వెబ్సైట్ భారత్శక్తి.ఇన్ నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేవీ తనకిచ్చిన సమాచారంతోనే మాట్లాడుతున్నానని, అత్యంత దుర్భర పరిస్థితులున్నాయని రక్షణ శాఖ భావిస్తుండటం వల్లే ఆందోళనలు పెరిగాయన్నారు. జలాంతర్గామి సమాచారంతో పాటు ఆయుధ వ్యవస్థ వివరాలు కూడా బయటకు పొక్కాయని, వాటికి సంబంధించిన ప్రతులను సోమవారం బహిర్గతం చేస్తామని ‘ది ఆస్ట్రేలియన్’ ప్రకటించింది. -
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తరకొరియా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన మధ్య శ్రేణి ఖండాతర క్షిపణి ప్రయోగం విఫలమైందని దక్షిణకొరియా తెలిపింది. దీంతో రెండు వారాల వ్యవధిలో క్షిపణి ప్రయోగంలో రెండోసారి ఆ దేశం విఫలమైంది. దేశ తూర్పు తీరం నుంచి ప్రయోగించిన కొన్ని సెకన్లకే క్షిపణి భూమిపై పడిపోయిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పసిఫిక్ సముద్రంలో ఉన్న గుయామ్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఈ మధ్యశ్రేణి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్-2 జయంతి సందర్భంగా ఈ నెల 15న నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అది పేలిపోయిందని పెంటగాన్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు మే 6 తేదీ నుంచి కిమ్ జోంగ్ ప్రభుత్వం ఐదో అణుపరీక్ష ప్రారంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరకొరియా వరుసగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. క్షిపణుల్లో పట్టేందుకు వీలుగా చిన్నస్థాయి అణ్వాయుధాల్ని రూపొందించడంతో పాటు గత శనివారం సబ్మెరైన్ నుంచి ఖండాతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. -
ఐఎస్పై రష్యా ముమ్మరదాడి
మాస్కో: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై రష్యా దాడులను తీవ్రం చేసింది. మంగళవారం మధ్యదరా సముద్రంలో మోహరించిన జలాంతర్గామినౌక నుంచి తొలిసారిగా క్షిపణులను ప్రయోగించి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గె షోగు చెప్పారు. ఇంతకుముందు యుద్ధనౌకల నుంచి క్షిపణులతో దాడి చేసిన రష్యా.. తాజాగా సబ్మెరిన్ను కదనరంగంలోకి దింపింది. 'రోస్టోవ్-ఆన్-డాన్ సబ్మెరిన్ నుంచి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించాం. సిరియాలోని రక్కా చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాద స్థావాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా దాడులు జరిపాం. నిర్దేశిత లక్ష్యాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ఆయిల్ కంపెనీలు, యుద్ధ సామాగ్రి డిపోలు, గనుల ఫ్యాక్టరీలపై దాడులు చేశాం' అని రష్యా రక్షణ మంత్రి చెప్పారు. గత మూడు రోజులుగా రష్యా మిలటరీ జెట్స్ సిరియాలోని 300 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. -
'పాక్తో దోస్తీ అంటే భారత్తో దుష్మనీ కాదు'
బీజింగ్: భారత ప్రాదేశిక జలాల్లోకి తమ జలాంతర్గామి (సబ్మెరైన్) ప్రవేశించడంపై చైనా వివరణ ఇచ్చింది. గత మే నెలలో చైనా జలాంతర్గామి ఒకటి భారత జలాల గుండా కరాచీ పోర్టుకు వెళ్లిన దరిమిలా అనేక సందేహాలు ఉత్పన్నమయిన సంగతి తెలిసిందే. చైనా మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జియాంగ్ బిన్ బుధవారం బీజింగ్లో మీడియాతో మాట్లాడుతూ చైనా జలాంతర్గామి కరాచీకి వెళ్లడం వెనుక భారత్ను కవ్వించడం లాంటి దురుద్దేశమేది తమకు లేదన్నారు. రెగ్యులర్ ఈవెంట్లో భాగంగానే తమ జలాంతర్గామి కరాచీకి వెళ్లిందని, శ్రీలంక, బంగ్లాదేశ్ తీరాలకు కూడా వెళ్లిందని గుర్తుచేశారు. రక్షణ రంగంలో పాక్- చైనాలు ఎప్పటినుంచో సహకరించుకుంటున్నాయని, ఆ దేశం తమకు సంప్రదాయ స్నేహితుడని జియాంగ్ అన్నారు. పాక్తో దోస్తీ (స్నేహం) వల్ల భారత్తో దుష్మనీ (శత్రుత్వం) తలెత్తే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఇటీవలికాలంలో ఇరు దేశాధినేతల సందర్శనలతో చైనా- భారత్ బంధం మరింత బలపడిందన్నారు. 'పాక్, భారత్ల మధ్య నెలకొన్న సమస్యలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. అందుకు మా (చైనా) సహకారం అవసరమని అవి (భారత్, పాక్ లు) భావిస్తే అప్పుడు తప్పకుండా సహాయం చేస్తాం' అని జియాంగ్ వ్యాఖ్యానించారు. -
అన్వేషణం: సాగర గర్భాన సుందర నిర్మాణం
సబ్ మెరైన్ (జలాంతర్గామి)ని కనిపెట్టినప్పుడు అందరూ చాలా వింతగా చూశారు. ఇది సముద్రం అడుగుకు వెళ్తుందా, అలల మధ్య విహరిస్తుందా, సాగర గర్భాన ఉన్న వింతల్ని చూసే అవకాశం కల్పిస్తుందా అంటూ ఆశ్చర్యపోయారంతా. కానీ అంతకు మించిన వింత, అంతకంటే అద్భుతమైన వింత ఒకటి దుబాయ్లో ఉంది. అదే... హైడ్రోపోలిస్. సముద్రపు అడుగున అందంగా కట్టిన స్టార్ హోటల్ ఇది. దాదాపు 550 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి కట్టిన హైడ్రోపోలిస్ హోటల్ గురించి మాటల్లో వినాలనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే... దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే వినడం కంటే చూడటమే కరెక్ట్. నీటి అడుగున జెల్లీఫిష్ ఆకారంలో కట్టారు దీన్ని. ఈ హోటల్ పైకప్పు మాత్రమే నీటిపైన కనిపిస్తుంది. మిగతా హోటలంతా నీటి అడుగునే ఉంటుంది. ఈ లగ్జరీ హోటల్లో మొత్తం 220 సూట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ బుడగల ఆకారంలో నిర్మించారు. జోషిమ్ హాసర్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఈ హోటల్లో... ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండే అన్ని సదుపాయాలూ ఉంటాయి. ప్రపంచంలోని అన్ని రుచులనూ అందించే రెస్టారెంట్, స్పా, థియేటర్, బాల్రూమ్, బార్ తదితర ఏర్పాట్లన్నీ ఉన్నాయి. మొత్తం అద్దాలతో నిర్మించడం వల్ల చుట్టూ ఉన్న సముద్రం నీలిరంగులో కనిపించి మురిపిస్తూ ఉంటుంది. అలల మధ్యన జరజర సాగిపోయే చేపలు, బుడుంగున మునిగే పీతలు, పలురకాల సముద్ర జీవులు, వింత వింత మొక్కలను చూస్తూ గడపడం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఇంతకీ నీటి అడుగున ఉంటే, ఈ హోటల్లోకి ఎలా వెళ్తాం అనే సందేహం వచ్చిందా? కచ్చితంగా వస్తుంది. ఈ హోటల్లోకి వెళ్లడం కోసం ఎంతో ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. సముద్రపు ఒడ్డునుంచి హోటల్ వరకూ ఓ రైలు మార్గాన్ని వేయడం జరిగింది. శబ్దం చేయని ఓ అందమైన రైలు సందర్శకులను, టూరిస్టులను అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. ఏమాత్రం శబ్దం చేయని విధంగా ఈ రైలును ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే వెంటనే వెళ్లి అక్కడ బసచేసి, ఆ అందాలను ఆస్వాదించాలని, ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని ఎవరికైనా అనిపించక మానదు. అయితే అక్కడ బస కాస్త కాస్ట్లీనే. ఒక్క రాత్రి ఉండటానికి 5,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో... మూడు లక్షల ముప్ఫై వేలన్న మాట! ఇది పూయాలంటే... శతాబ్దం ముగియాలి! ఏ మొక్క అయినా ఎప్పుడు పూస్తుంది? ఒకటి వేసవిలో పూస్తుంది. ఇంకోటి వసంతమాసంలో పూస్తుంది. ఒక్కో రకం ఏడాదికోసారి పూస్తుంది. ఇంకో రకం సంవత్సరానికి రెండు మూడు సార్లు పూస్తుంది. కానీ ‘క్వీన్ ఆఫ్ ఆండిస్’ అనే మొక్క ఎన్నేళ్లకోసారి పూస్తుందో తెలుసా? సుమారు వందేళ్లకోసారి! క్వీన్ ఆఫ్ ఆండిస్ మొక్కలు పెరూ, బొలీవియా దేశాల్లోని ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మాత్రమే మొలుస్తాయి. వీటికి కొమ్మలు, ఆకులు అంటూ ఉండవు. మొత్తం కాండంలాగా పొడవుగా... 33 అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతాయి. ఈ మొక్కలకు పైనుంచి కింద దాకా ముళ్లుంటాయి. ఈ ముళ్ల మధ్యలోకి పొరపాటున చెయ్యిగానీ పెట్టామా... ముక్కలుగా తెగిపోవాల్సిందే తప్ప బయటకు తీసుకోలేం. చాలాసార్లు పక్షులు వీటిలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతాయి. అయితే ఈ ముళ్లకు చివర్ల అందమైన పూలు పూస్తాయి. ఒకేసారి మూడు నాలుగు వేల పూలు విచ్చుకుని ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ ఇవి ఎనభై నుంచి వంద సంవత్సరాలకొకసారి మాత్రమే పూస్తాయి. అదే విశేషం! -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం దృశ్యాలు
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది.అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది.జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో ఇద్దరు
-
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో ఇద్దరు విశాఖవాసుల మృతి
ముంబైలో బుధవారం తెల్లవారుజామున జరిగిన జలాంతర్గామి ప్రమాదంలో విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు పెద్దగంట్యాడకు చెందిన రాజేష్ కాగా, మరొకరు గోపాలపట్నం వాసి దాసరి ప్రసాద్. వీరిలో రాజేష్ జలాంతర్గామిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. బుధవారం తెల్లవారుజామున ముంబైలోని నేవల్ డాక్యార్డులో నిలిపి ఉన్న ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మంటలు చెలరేగి, అది మునిగిపోవడం, భారీ పేలుడు సంభవించడంతో అందులో దాదాపు 18 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో రాజేష్, దాసరి ప్రసాద్ కూడా ఉన్నట్లు విశాఖపట్నంలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కొంతమంది సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ.. రాజేష్, ప్రసాద్ మాత్రం మరణించినట్లు తెలియడంతో.. వారిద్దరి కుటుంబ సభ్యలు శోక సంద్రంలో మునిగిపోయారు. వారు ముంబై వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత నౌకాదళానికి చెందిన కిలో క్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ సింధురక్షక్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. నావల్ డాక్ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి కూడా చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు. జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో పాటు పేలుడు కూడా సంభవించడంతో జలాంతర్గామితో పాటు నౌకాదళ ఆస్తులకు కూడా తీవ్రనష్టం సంభవించింది. మంటలు, పొగలను అదుపుచేయడానికి ముంబై అగ్నిమాపక దళానికి, ముంబై పోర్టు ట్రస్టుకు చెందిన దాదాపు 16 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి తరలించారు. దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ పొగ ప్రభావం కనిపించింది. సెలవులో ఉండి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పి.ఎస్.రహాండలే అనే డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముందుగా ఇక్కడి పేలుడు శబ్దాన్ని విన్నారు.ఆయన వెంటనే అగ్నిమాపక దళాన్ని, అత్యవసర సర్వీసుల విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. -
ముంబాయి డాక్యార్డ్లో అగ్ని ప్రమాదం
-
రష్యాలో రీఫిటింగ్, ఆధునీకరణ.. అయినా తప్పని ప్రమాదం
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి కారణం ఏంటి? అది ఎన్నాళ్ల క్రితం జల ప్రవేశం చేసింది.. ఈ మధ్య కాలంలో దానికి మరమ్మతులు ఏమైనా జరిగాయా.. ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, భారత నౌకాదళానికి చెందిన డీజిల్-ఎలక్ట్రికల్ జలాంతర్గామి అయిన సింధురక్షక్కు ఇటీవలే రష్యాలోని జ్వెజ్డోచ్కా నౌకాశ్రయంలో రీఫిటింగ్ జరిగింది. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి (ఎస్ 63)కి రీ ఫిటింగ్ చేసి, ఆధునీకరించాలన్న ఒప్పందం ఎప్పుడో 2010 జూన్ నెలలో జరిగింది. ఈ విషయాన్ని రియా నొవొట్స్కి అనే వార్తా సంస్థ తెలిపింది. రీఫిటింగ్లో భాగంగా ఇందులో క్లబ్-ఎస్ క్రూయిజ్ మిసైళ్లను, పదికి పైగా భారతీయ, విదేశీ రక్షణ వ్యవస్థలను, ఉషుస్ హైడ్రో-అకోస్టిక్ (సోనార్) వ్యవస్థను, సీఎస్ఎస్ -ఎంఎ-2 రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు జలాంతర్గామిలో ఉండే కూలింగ్ వ్యవస్థను కూడా సవరించారు. ఇలా మొత్తం సరికొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయడం వల్ల జలాంతర్గామికి సైనిక సామర్థ్యం, భద్రత ఎక్కువ అవుతాయని అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరడంతో ఆ తర్వాత దాన్ని రష్యాలోని అత్యంత పురాతనమైన నౌకాశ్రయాల్లో ఒకటైన జ్వెజ్డోచ్కా నౌకాశ్రయానికి తరలించారు. ఈ జలాంతర్గామిలో మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. ఇది గంటకు గరిష్ఠంగా 19 నాటికల్ మైళ్ల (35 కిలోమీటర్ల) వేగంతో వెళ్తుంది, సముద్రంలో 300 మీటర్ల లోతున తిరుగుతుంది. గతంలో సింధువీర్, సింధురత్న, సింధుఘోష్, సింధుధ్వజ్ అనే నాలుగు జలాంతర్గాములకు కూడా జ్వెజ్డోచ్కా నౌకాశ్రయంలోనే రీఫిటింగ్ చేయించారు. -
జలాంతర్గామిలో ప్రమాదం.. 18 మంది సిబ్బంది గల్లంతు!
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది. అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది. జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. భారత నౌకాదళానికి చెందిన కిలోక్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ సింధురక్షక్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. నావల్ డాక్ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి కూడా చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉండే నావల్ డాక్యార్డులో బుధవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతుల సంఖ్య, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. తీవ్రంగా గాయపడిన కొంతమంది సిబ్బందిని మాత్రం కొలాబాలోని ఐఎన్హెచ్ఎస్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో పాటు పేలుడు కూడా సంభవించడంతో జలాంతర్గామితో పాటు నౌకాదళ ఆస్తులకు కూడా తీవ్రనష్టం సంభవించింది. మంటలు, పొగలను అదుపుచేయడానికి ముంబై అగ్నిమాపక దళానికి, ముంబై పోర్టు ట్రస్టుకు చెందిన దాదాపు 16 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి తరలించారు. దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ పొగ ప్రభావం కనిపించింది. సెలవులో ఉండి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పి.ఎస్.రహాండలే అనే డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముందుగా ఇక్కడి పేలుడు శబ్దాన్ని విన్నారు.ఆయన వెంటనే అగ్నిమాపక దళాన్ని, అత్యవసర సర్వీసుల విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.