swaroopanandendra saraswathi swamy
-
విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస దీక్ష విరమణ
-
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు..!
-
అర్చకులకు వంశపారంపర్య హక్కులు.. స్వరూపానందేంద్ర స్వామి స్పందన ఇదే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్దంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరం అన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్ఛడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరమవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామంగా స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. సీఎం జగన్కు ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ లేకుండా వీలైనంత కాలం పనిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఏపీ అర్చక సమాఖ్య సీఎం జగన్కు బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అంటూ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణకూ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
గిరిజనులకు సేవచేస్తే దేవుణ్ణి పూజించినట్లే
అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం: గిరిజనులకు సేవ చేయడం భగవంతుని ఆరాధించడంతో సమానమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. అరకులోయలోని ఎన్టీఆర్ మైదానంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం శంకరాచార్య గిరి సందర్శన మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామీజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో కలిసి ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభించారు. 500 మంది పేద వృద్ధులకు దుప్పట్లు, 500మంది భక్తులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు కల్మషం లేనివారని, వారికి సేవచేయాలని ఉద్బోధించారు. అందరూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో భగవంతుని కొలుస్తారు కానీ ఇక్కడ గిరిజన ప్రజలు ప్రకృతిని, చెట్లను దైవంగా ఆరాధిస్తారన్నారు. ఆంజనేయస్వామి గిరిజనుడే అని, అడవి బిడ్డలంతా అంజనీపుత్రుని వారసులేనని తెలిపారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మతమార్పిడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేసేందుకే క్రిస్మస్ రోజున భగవద్గీతలను పంపిణీ చేశామన్నారు. గిరిజన ప్రాంతంలో దేవాలయల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు. పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్య అందించేందుకు త్వరలోనే పాఠశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాలు ఏర్పడటం ఆనందంగా ఉందని, ఏపీలో మాత్రమే ఇలా గిరిజనులకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటయ్యాయని స్వామీజీ అన్నారు. చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రజలను దైవ మార్గంలో నడిపించేందుకు కృషిచేయడంతోపాటు విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తున్న విశాఖ శారద పీఠానికి రుణపడి ఉంటామన్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి జగదీష్బాబు, ఎంపీపీ ఉషారాణి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విశాఖలో ఆదిశంకరుల భారీ విగ్రహం
సింహాచలం/అంబాజీపేట: విశాఖలో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా శంకరుల ప్రతిమ ఉంటుందని చెప్పారు. కోనసీమ జిల్లా ముక్కామలలో కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతిని స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం కలిసి వైదిక, ఆధ్యాత్మిక, సంప్రదాయపరమైన అంశాలపై చర్చించారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ వానప్రస్థంలోకి అడుగుపెడుతోన్న వృద్ధ దంపతుల కోసం పురాణ, వేదాంత పరమైన ధర్మ సందేహాల నివృత్తికి ప్రత్యేక కోర్సుని ప్రవేశ పెట్టే ఆలోచన ఉందని, 2– 3 ఏళ్ల నిడివితో కోర్సుని రూపొందించాలని భావిస్తున్నామని విజయేంద్ర సరస్వతి దృష్టికి తీసుకెళ్లారు. స్వరూపానందేంద్ర యోచన పట్ల విజయేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. అర్చకత్వం, ఆలయ సంపద పరిరక్షణ తదితర అంశాలపై కూడా ఇరువురూ చర్చించారు. హైందవ ధర్మం పరిరక్షణకు విశాఖ శ్రీశారదాపీఠం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని విజయేంద్ర సరస్వతి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడే పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి అని ఆయన పేర్కొన్నారు. అనేకసార్లు గురువులు జయేంద్ర సరస్వతితో కలిసి విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పీఠం నుంచి వెలువడిన అనేక వేదాంత గ్రంథాలను పరిశీలించినట్టు తెలిపారు. అమలాపురం ఎంపీ అనూరాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు యతీంద్రులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ముక్కామలలో నిర్వహించిన బ్రహ్మసత్ర మహోత్సవ ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతులు హాజరయ్యారు. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాజశ్యామల ఉపాసన కేంద్రం విశాఖ శారదాపీఠం
సింహాచలం: తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల అమ్మవారిని ఆరాధించే ఏకైక ఉపాసన కేంద్రంగా విశాఖ శ్రీశారదాపీఠం ఖ్యాతిగాంచిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ఎంతోమంది ఉన్నతస్థాయికి చేరుకున్నారని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ రాజశ్యామల అమ్మవారిని ఏకాంతంగాను, అంతర్లీనంగాను ఉపాసించాలంటే అది కేవలం విశాఖ శ్రీశారదాపీఠంలోనే సాధ్యమని చెప్పారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే వారు అదృష్టవంతులవుతారన్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ సాధారణ రోజుల్లోకన్నా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఆరాధిస్తే వేయిరెట్లు ఫలితం సిద్ధిస్తుందని చెప్పారు. ఈవేడుకల్లో లోకకల్యాణార్ధం చండీహోమం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణం, రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జగన్మాత రాజశ్యామల అమ్మవారి ప్రీతికోసం శ్రీచక్రానికి నవావరణార్చన చేస్తున్నట్లు చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత మహాగణపతిపూజ, చండీహోమం, రాజశ్యామల హోమాన్ని నిర్వహించే పండితులు దీక్షాధారణ చేశారు. తొలిరోజు సోమవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. -
నేటి నుంచి విశాఖ శ్రీ శారదా పీఠం చాతుర్మాస్య దీక్ష
-
13 నుంచి శారదా పీఠాధిపతి చాతుర్మాస దీక్ష
పెందుర్తి: ఈనెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్షను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేపట్టనున్నారు. రుషికేష్లోని పవిత్ర గంగానదీ తీరాన శ్రీశారదాపీఠం శాఖలో గురుపూర్ణిమ సందర్భంగా స్వామీజీలు ఈ దీక్షను ఆచరించనున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతుంది. స్వామీజీకి ఇది 26వ చాతుర్మాస దీక్ష కాగా.. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నాలుగోసారి దీక్ష చేపట్టనున్నారు. దీక్షా కాలంలో పరివ్రాజ్యలు(పర్యటనలు) చేయరు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పుదినుసులను స్వీకరించరు. ఈ సమయంలో సాధువులకు, సన్యాసులకు భండారా (అన్నదానం) నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు. గంగమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తరువాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేపడతారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్కు వెళ్తుంటారు. -
అసలైన ఉన్మాది చంద్రబాబే..
పెందుర్తి: రాష్ట్రంలో అసలు సిసలైన ఉన్మాదిలా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. 14 ఏళ్ల పాలనలో మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఏనాడైనా పని చేశాడా.. అని ప్రశ్నించారు. శనివారం విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి రోజా చినముషిడివాడలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైందన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి తక్షణమే విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడిని, విజయవాడలో టీడీపీ నాయకుడు ఓ యువతిపై లైంగికదాడికి యత్నించినప్పుడు చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడని ధ్వజమెత్తారు. కాల్మనీ సెక్స్ రాకెట్పై తాను ప్రశ్నించినప్పుడు తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి రోజా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని పర్యాటక కేంద్రాలపై షార్ట్ఫిల్మ్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తామన్నారు. శ్రీశారదా పీఠం సందర్శన.. విశాఖ శ్రీశారదాపీఠాన్ని మంత్రి రోజా శనివారం సందర్శించి, రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె వెంట ఎమ్మెల్యే అదీప్రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఉన్నారు. -
ఎయిర్పోర్టులో సింహాద్రి అప్పన్న
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో చందనధారుడు ప్రయాణికులకు దర్శనమివ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పన్న ఆలయ అధికారులు చందన రూపంలో ఉండే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సోమవారం తొలి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చంద్రకళ మాట్లాడుతూ.. విశాఖపట్నం వచ్చే ప్రయాణికులు అప్పన్నను దర్శనం చేసుకునే అవకాశం కల్పించామన్నారు. స్వామి వారి చరిత్ర, డొనేషన్లు ఇచ్చే వారి కోసం వెబ్సైట్లు ఏర్పాటు చేశామన్నారు. స్వామి చరిత్ర ఆడియో వినేందుకు క్యూఆర్ కోడ్ త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్లో అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్థానాచార్యులు రాజ్గోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈవో రమణమూర్తి, శిల్పి రమణ, ఈఈ శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్రాజు, దొడ్డి రమణ, సతీష్, పాత్నుడు, చందు, సువ్వాడ శ్రీదేవి, వంకాయల నిర్మల, రామలక్ష్మి పాల్గొన్నారు. అప్పన్నను దర్శించుకున్న కేజీఎఫ్ హీరో విమానాశ్రయంలో సింహాద్రి అప్పన్న విగ్రహం ప్రారంభోత్సవం జరిగిన కొద్దిసేపటికే కేజీఎఫ్ హీరో యష్ రావడంతో తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ పురోహితులు సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో చంద్రకళ యష్కు స్వామివారి శేష వస్త్రాలు కప్పి స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని యష్ తెలిపారు. -
రాజశ్యామల తంత్ర మహిమాన్వితం శ్రీశారదా పీఠం
పెందుర్తి: జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఉపాసన పూర్తిస్థాయిలో తెలిసిన ఏకైక పీఠం శ్రీశారదాపీఠం అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. 14 ఏళ్ల పాటు హిమాలయాల్లో సంచరించిన సమయంలో తపస్సంపన్నుల సాన్నిహిత్యం, మహానుభావుల ఉపదేశంతో రాజశ్యామల అమ్మవారి తంత్రాన్ని తెలుసుకోగలిగానన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ.. రాజశ్యామల అమ్మవారి ఉపాసన బలంతో ఇక్కడ పీఠాన్ని నెలకొల్పామని తెలిపారు. కుల, మత బేధ రహిత అద్వైత వేదాంతాన్ని బోధించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుని బోధనలను తమ పీఠం పుణికిపుచ్చుకుందన్నారు. వార్షికోత్సవాల్లో ప్రతి ఏటా శ్రౌత, శాస్త్ర సభలు నిర్వహించడం ఆనవాయితీ అని.. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సభలు రద్దు చేశామని తెలిపారు. శ్రీశారదాపీఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎంతో అనుబంధం ఉన్నందున సీఎంను ప్రత్యేకంగా వార్షికోత్సవాలకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రోక్తంగా కార్యక్రమాలు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సారథ్యంలో పీఠం వార్షిక మహోత్సవాలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. స్వామీజీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పండితులకు దీక్షా వస్త్రాలను అందించారు. లోకకల్యాణార్థం లక్ష్మిగణపతి హోమం, మేధాదక్షిణామూర్తి హోమం చేపట్టారు. శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన గావించారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన చతుర్వేద పారాయణంలో వందలాది మంది పండితులు పాల్గొన్నారు. -
ఢిల్లీలోనూ విశాఖ శారదా పీఠం సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ శారదా పీఠం కార్యక్రమాలను దేశ రాజధాని ఢిల్లీకి సైతం విస్తరించాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం అని, ఆ క్రమంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వెల్లడించారు. ఇందుకోసం స్థలం కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. తెలుగు వారందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణలో శారదా పీఠం విశిష్ట సేవలందిస్తోందని, తాజాగా విశాఖ ఏజెన్సీ నుంచి గిరిజనులను తీర్థయాత్రలకు తీసుకెళ్లామని తెలిపారు. దళిత, గిరిజనుల కోసం ఎన్నో ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిన ఇప్పటికే తమకు కాశీ మహాక్షేత్రంతో పాటు రిషికేశ్ గంగానది తీరాన ఆశ్రమం ఉందని, హైదరాబాద్లోనూ నిర్మాణం పూర్తికాబోతుందని వెల్లడించారు. -
ధర్మ ప్రచార నిధి ఏర్పాటు చేయాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. తద్వారా వాడవాడలా హిందూ ధర్మ ప్రచారం సాగేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్ మంగళవారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఆలయాల భద్రత కోసం నియమించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీస్ శాఖ ద్వారా శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ వ్యవస్థలో పరిపాలనపరమైన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. ప్రధాన దేవాలయాల ప్రచార రథాలకు మరమ్మతులు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు. ధర్మ ప్రచారం కోసం శ్రీశారదా పీఠం పెద్ద ఎత్తున కసరత్తులు చేసి కులాలకు అతీతంగా ప్రచారం ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. దేవాలయ సాహిత్యం, కవీశ్వరుల రచనలను వెలుగులోకి తీసుకురావాలని స్వామీజీ చెప్పారు. పురాణ సభలను ఏర్పాటు చేసి.. ఎంపిక చేసిన పండితుల ద్వారా ఆలయాల చరిత్ర, స్థల పురాణం పుస్తకరూపంలో తీసుకురావాలన్నారు. -
బాలాత్రిపుర సుందరిగా రాజశ్యామల అమ్మవారు
పెందుర్తి: విశాఖ శ్రీశారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల చేతుల మీదుగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గణపతి పూజతో అంకురార్పణ, అనంతరం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లోక కల్యాణార్థం పీఠంలో చండీ హోమాన్ని చేపట్టారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో శ్రీమత్ దేవి భాగవత పారాయణం నిర్వహించారు. సాయంత్రం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరులకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పీఠార్చన చేశారు. కాగా, శుక్రవారం అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. -
ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయాలి
పెందుర్తి: దేవదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యమయ్యేలా ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయాలని, ఆ సలహా మండలి సూచనలతో ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. రుషికేష్లో విశాఖ శ్రీ శారదా పీఠం ఆశ్రమంలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని మంత్రి వెలంపల్లి శనివారం కలిశారు. మంత్రితో స్వరూపానంద మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకుని హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు. అన్యాక్రాంతం అవుతోన్న ఆలయాల భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల అభివృద్ధికి కేంద్రంతో చర్చించాలన్నారు. చాతుర్మాస దీక్ష అనంతరం పంచారామ క్షేత్రాలపై విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సీతారామపురం ఆలయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం మంత్రి వెలంపల్లి రిషికేష్లోని గంగానదిలో స్నానం ఆచరించారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరుల పీఠార్చనకు హాజరయ్యారు. -
వంశపారంపర్య అర్చకులకు విధి విధానాలు
సాక్షి, అమరావతి: ఆలయాల్లో పనిచేసే అర్చకుల కలలు నిజంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎనిమిది రకాల అంశాలకు సంబంధించి ఏ ఒక్క అంశంలో ఆధారాలు చూపినా వారిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకత్వానికి అర్హుడిగా గుర్తిస్తూ ఆలయ 43(10) రిజిస్టర్లో నమోదు చేయాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలోని అందరు రీజనల్ జాయింట్ కమిషనర్లు, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఎనిమిది అంశాలను అ ఉత్తర్వులలో వివరించారు. అవి.. ► అర్చక ఇనాం భూములను అనుభవిస్తూ ప్రస్తుతం అర్చకత్వం చేస్తున్న వారు సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకులుగా గుర్తించబడతారు. ► దరఖాస్తుదారుని తండ్రి లేదా తాతలు ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తే అతడిని ఆ ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల రిజిస్టర్ 25లో గానీ, 1966 నాటి ఆంధ్రప్రదేశ్ దేవదాయ చట్టం ప్రకారం ఆలయ రిజస్టర్ 38లో గానీ అర్చకులుగా నమోదై ఉన్న వారి వారసులను సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకులుగా గుర్తిస్తారు. ► అర్చకులందరూ ఒక అవగాహనకు వచ్చి ఓ వ్యక్తిని సూచించినా అతడిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► గతంలో కోర్టు ఆదేశాలున్న చోట.. అలాంటి వారిని సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకునిగా అర్హుడవుతారు. ► ఎలాంటి వివాదాల్లేని చోట ప్రస్తుతం ఆలయ అర్చకుడే ఆ ఆలయ వంశపారంపర్య అర్చకుని హోదా పొందవచ్చు. ► ఏదైనా ఆలయంలో వంశపారంపర్య అర్చకునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు పేపరు నోటిఫికేషన్ ద్వారా అతని నియామకానికి చర్యలు చేపడతారు. ► వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉండి ఆలయ అర్చకునిగా పనిచేసిన వారు చనిపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నిబంధనల ప్రకారం అర్హులు లేనట్లయితే భర్తను కోల్పోయిన అర్చకుని భార్య సూచించిన వ్యక్తి ఆమె జీవితకాలం వంశపారంపర్య హోదా అర్చకునిగా పనిచేయవచ్చు. .. పై ఎనిమిది అంశాల ప్రాతిపదికన రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం గుర్తింపు ప్రక్రియను దేవదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలోనే చేపడతారు. రూ. కోటిలోపు ఆదాయం ఉండే 6(ఏ) కేటగిరి ఆలయాలలో ఈ గుర్తింపు ప్రక్రియ రీజనల్ జాయింట్ కమిషనర్ల అనుమతితో చేపడతారు. 6 (బీ) కేటగిరి ఆలయాల్లో జోనల్ డిప్యూటీ కమిషనర్లు, 6(సీ) కేటగిరి ఆలయాల్లో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియకు అనుమతిస్తారు. ఏపీ అర్చక సమాఖ్య హర్షం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దేవదాయ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలు ఖరారుతో పాటు అప్పటి చట్టం అమలుకు పూనుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్తో పాటు వెలంపల్లి, వాణీమోహన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చక సమస్యలపై చొరవ అవసరం పెందుర్తి: అర్చకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. వంశపారంపర్య హక్కులను అమలు చేయాలన్నారు. రుషికేష్లోని శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి పీఠ పూజలో పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని సూచించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఏపీ బడ్జెట్పై స్వరూపానందేంద్రస్వామి హర్షం
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినందనీయులు అని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. సీఎం జగన్కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పారు. శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండు లక్షల 29 వేల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. దీంతోపాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం
పెందుర్తి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ జాతకాలు బాగుండటం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు ప్లవనామ సంవత్సరంలో మేలు జరుగుతుందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే రోజుల్లో నిరంతరాయంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో ఉగాదిని పురస్కరించుకుని ఉగాది ఆస్థానం నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేసూ్త.. సేనాధిపతి కుజుడు కావడంతో ఈ ఏడాది దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పారు. చాలా పెద్ద నాయకుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆర్థికంగా తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండవని.. ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వివరించారు. నేతల మధ్య ఏర్పడే సమన్వయ లోపం కారణంగా విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదన్నారు. దేశానికి ఇది మంచిది కాదన్నారు. దేశంలో కుట్ర పూరిత యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. కుటుంబాల మధ్య కూడా అనిశ్చితి ఏర్పడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. శ్రీప్లవనామ సంవత్సరంలో చతుగ్రహ కూటమి తరచూ ఏర్పడుతుందని దీనివలన కాలసర్ప దోషాలు సంభవిస్తాయని.. ఈ పరిణామాల వలన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా కొన్ని విపత్కర పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉంటుందని, వర్షాలు బాగా పడి పంటలు పండుతాయని చెప్పారు. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు. కరోనా మహమ్మారి జూలై వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని..ఆ తర్వాత ఎంతవరకు ప్రబలుతుందో ఆ తర్వాత గానీ నిర్ణయించలేమని స్పష్టం చేశారు. ప్రజలు తిరుమల శ్రీవారిని, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్నస్వామి, బెజవాడ కనకదుర్గమ్మను, యాదాద్రి నరసింహస్వామిని, వేములవాడ రాజరాజేశ్వరస్వామిని, బాసర సరస్వతీదేవిని కొలవాలని సూచించారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ ప్లవ అంటే వెలుగునిచ్చేదని అని అర్థాన్ని వివరించారు. వికారి, శార్వరి నామ సంవత్సరాల్లో కమ్ముకున్న చీకట్లను తొలగించి ప్లవ నామ నూతన సంవత్సరం వెలుగులివ్వాలని కోరుతూ అంతా రాజశ్యామల అమ్మవారిని ప్రార్థించాలని అన్నారు. గంటల పంచాంగం ఆవిష్కరణ పీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పఠనంతో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. స్వామీజీల చేతుల మీదుగా శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. స్వర్ణ కవచధారిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు విశేష అర్చనలు అందుకున్నారు. పీఠాధిపతి, ఉత్తరాధికారి చేతుల మీదుగా గంటల పంచాంగం ఆవిష్కరణ జరిగింది. పీఠం ఆస్థాన సిద్ధాంతి పంతుల రామలింగ స్వామి పంచాంగ శ్రవణం వినిపించారు. భక్తులకు స్వామీజీ చేతుల మీదుగా ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు. -
హిందూ ధర్మం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం
పెందుర్తి/దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘ధర్మపోరాటాలకు శారదా పీఠం పుట్టిల్లు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మపోరాటాల ద్వారా పీఠం ఎన్నో విజయాలు సాధించింది’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ధర్మ జాగృతి కోసం దళితులు, గిరిజనులకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో తిరుమల యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి సోమవారం విశాఖ జిల్లా చినముíÙడివాడలోని శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో 1,500 మంది దళితులు, గిరిజనులు తిరుమలకు బయల్దేరగా.. స్వరూపానందేంద్ర స్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. రెండేళ్ల కిందట శ్రీకారం.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రెండేళ్ల కిందట హిందూ ధర్మ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. 33 వేల కిలోమీటర్ల మేర ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగింది. స్వాత్మానందేంద్ర స్వామి మైదాన, అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మారుమూల గిరిజన తండాలను సందర్శించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం తిరిగారు. అక్కడి గిరిజనులను హిందూ ధర్మం గురించి చైతన్య పరిచారు. దేవాలయ వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తించి ఓ నివేదిక కూడా తయారుచేశారు. ప్రభుత్వానికి త్వరలో నివేదిక.. స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఇటీవల కొందరు పీఠంపై దు్రష్పచారం చేస్తున్నారని, అలాంటి వారికి ధర్మ ప్రచారంతోనే సమాధానం చెబుతున్నామన్నారు. ఉత్తరాధికారి తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ద్వారా దేవాలయ వ్యవస్థలోని లోపాలను గుర్తించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద స్వాత్మానందేంద్ర సరస్వతి నారికేళాలు సమర్పించారు. బుధవారం ఉదయం దళితులు, గిరిజనులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నా.. తిరుమల వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన శారదా పీఠానికి ధన్యవాదాలు. ఆ స్వామిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోరిక ఇలా తీరింది. –సీలదేరి అప్పలమ్మ, లబరి గొంది శ్రీవారిని చూసే భాగ్యం కలిగింది.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. శారదా పీఠం వాళ్లు ఉచితంగా తీసుకెళ్లడం బాగుంది. ఆ స్వామిని చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలుగుతోంది. –మజ్జి భీష్మ, అరకు -
రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తు లేడు, కానీ ఇప్పుడు బాబుకు దేవుడు గుర్తొచ్చాడని విమర్శించారు. చంద్రబాబు ఆలయాలను కూల్చిన వ్యక్తి.. బాబు.. దేవాలయ ఆస్తులను తన బినామీలకు దారాదత్తం చేశారని చురకలు అంటించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. అసలు బాబుకు దేవుడంటే నమ్మకముందా? అని సూటిగా ప్రశ్నించారు. ఆలయాలను కూల్చిన వ్యక్తి సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. బాబు పాపాలు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఓడించాడని వ్యాఖ్యానించారు. ఇక రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. దోషులను శిక్షించాలి అంతకు ముందు విశాకు వెళ్లిన వెల్లంపల్లి అక్కడ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వామి సరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. దేవాలయాల్లో దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితి విధించాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రామతీర్ఠంలో అసలు ఏం జరిగిందంటే... రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. (చదవండి: రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?) చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
దేవాలయాలపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్తో ఫోన్ ద్వారా ఆయన చర్చించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టతో పాటు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించడం అవసరమన్నారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. -
సుజనా, మురళీ మోహన్ ఆశీస్సులు తీసుకోలేదా?
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. (చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు: మల్లాది) మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు. స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు. -
స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం నాదనీరాజనం మండపంలో జరుగుతున్న విరాటపర్వం కార్యక్రమంలో స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్ తిరుమలని కాలుష్య రహితంగా మార్చడానికి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్లాస్టిక్ని రద్దు చేసింది. తాజాగా పర్యావరణ పరిరక్షణలో బాగంగా ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల-తిరుపతి మధ్య నడపటానికి సన్నాహాలు చేస్తోంది. జీరో శాతం కాలుష్య రహిత వాహనాలను గత మూడు రోజులుగా ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి కార్యాలయం నుంచి అన్నమయ్య భవన్ వరకు బస్సులో ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిమీ మైలేజ్ వస్తుంది. ప్రభుత్వం, ఆర్టీసీతో చర్చించి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ నివారించాం. కాంక్రీట్ కట్టడాలు కూడా తగ్గించాం అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
విశాఖ.. మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది
సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సంతాపం ప్రకటించారు. ద్రోణంరాజు శివైక్యం చెందారన్న వార్తను తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మంచి రాజనీతిజ్ఞుడిని విశాఖ నరగం కోల్పోయిందని పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠంతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. (చదవండి : మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత) సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ద్రోణం రాజు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలతోనే ద్రోణంరాజు జీవించారని కొనియాడారు. ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని రాజశ్యామల అమ్మవారిని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. -
పాట కోసమే ఆయన పుట్టారు..
సాక్షి, విశాఖపట్నం: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన శివైక్యం పొందడం బాధాకరమన్నారు. బాలు మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు అని.. సంగీతమే ఊపిరిగా ఆయన జీవించారని తెలిపారు. విశాఖ శారద పీఠంతో బాలుకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఆయన ఉండేవారని చెప్పారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాల సుబ్రహ్మణ్యం అని స్వరూపానందేంద్ర ప్రస్తుతించారు. బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. (చదవండి: ‘అది అదృష్టంగా భావిస్తున్నా’) ఆయన పాట కోసమే పుట్టారు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ: పాట కోసమే పుట్టిన మహనుభావులు ఎస్పీ బాలు అని, ఆయన లోటు మరే గాయకులు పూడ్చలేనిదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాట్లాడినా, పాట పాడిన తెలుగు భాష, తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునే ఎస్పీ బాలు భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా నగరంతో ఎస్పీ బాలుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు
-
శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు
సాక్షి, తిరుపతి: రిషికేశ్లో విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను ఆదివారం టీటీడీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీలకు శ్రీవారి శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డికి స్వామీజీ ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా స్వామీజీలు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష వివరాలను టీటీడీ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ధార్మిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. (చదవండి: కాగ్ ద్వారా టీటీడీ ఆడిటింగ్..!) తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక అంశాలను కాగ్ పరిధిలోకి తీసుకొచ్చే యోచన ఆహ్వానించదగ్గ పరిణామమని స్వామి స్వరూపానందేంద్ర అభినందించారు. అలాగే గుడికో గోవు కార్యక్రమం చేపట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ధార్మిక నిర్ణయాలపై సాంప్రదాయ గురువులను సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భజన మండళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయాలను ముఖ్య నగరాలతో పాటు హరిజన, గిరిజన ప్రాంతాల్లోనూ నిర్మించాలని స్వరూపానందేంద్ర సూచించారు. -
విశాఖ శారదా పీఠాధిపతుల పుణ్య స్నానం
రిషికేశ్: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ వద్ద గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే రిషికేశ్లో శారదాపీఠం ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరానికి చేరుకున్నారు. తన పరివారంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. పీఠాధిపతులు ఇద్దరూ దండ తర్పణం నిర్వహించారు. అనంతరం వేద విద్యార్ధులతో కలిసి చండీ పారాయణ చేసారు. స్వామి స్వాత్మానందేంద్ర గ్రహణ సమయాన్ని మొత్తం నదీ తీరంలోనే గడిపారు. నదీ జలాల్లో మునిగి ప్రత్యేక జపమాచరించారు. గ్రహణ కాలంలో విశాఖ శారదాపీఠం ఆవరణలోని సకల దేవతా మూర్తుల ఆలయాలను కూడా మూసివేశారు. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడల్లా ఈ తరహా నియమాలను పాటించడం విశాఖ శారదా పీఠానికి ఆనవాయితీగా వస్తోంది. -
సర్వ మానవాళి కోసమే ‘విష జ్వర పీడ హర యాగం’
సాక్షి, విశాఖపట్నం: సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. కరోనా నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం శనివారంతో విజయవంతంగా ముగిసింది. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ప్రపంచానికి గురుస్థానంలో భారతదేశం ఉందని.. మానవులంతా ఆరోగ్యంతో ఉండాలని ఈ యాగం చేశామని తెలిపారు. వేదాల్లో అనేక అంశాలను పరిశీలించి యాగం తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ధన్వంతరి జపం, అపమృత్యు దోష నివారణతో కూడిన మంత్రాలతో యజ్ఞం చేసామని వివరించారు. (కరోనా పాజిటివ్: ఆ జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్) ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ల ఆదేశాలను ప్రజలందరూ పాటించాలని స్వరూపానందేంద్ర సరస్వతి విజ్ఞప్తి చేశారు. శారదాపీఠం భక్తులంతా అన్నార్థులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులను దేశ సైనికులుగా భావించి గౌరవించాలని పేర్కొన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ, దేవాదాయ శాఖ అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. -
ముగిసిన విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు
-
అత్యంత వైభవంగా..
సాక్షి, విశాఖపట్నం: రాజశ్యామల అమ్మవారు కొలువైన విశాఖ నగరం చినముషిడివాడలోని విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనం, లోక కల్యాణార్థం శారదాపీఠం తలపెట్టిన రాజశ్యామల యాగం శాస్త్రోక్తంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్ సోమవారం ఈ కార్యక్రమాల్లో పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. ఉదయం 11.25 గంటలకు శారదా పీఠానికి చేరుకున్న ఆయనకు మేళతాళాలు, పూర్ణకుంభంతో పీఠం ధర్మకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. స్వరూపానందేంద్ర ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలతోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. గోమాతకు పూజలు ఆచరించి నైవేద్యం సమర్పించారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనం, శారదాపీఠం తలపెట్టిన రాజశ్యామల యాగం, మహా పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయంజ్యోతి మండపాన్ని ప్రారంభించారు. స్వరూపానందేంద్ర తన వ్యాఖ్యానంతో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం వైఎస్ జగన్కు అందజేశారు. శ్రౌత మహాసభలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తంగిరాల విశ్వనాథ పౌండరీకయాజులుకు సీఎం చేతుల మీదుగా స్వర్ణ కంకణధారణ చేశారు. అహితాగ్ని భాస్కర అనే బిరుదును అంకితం చేశారు. శాస్త్ర సభలో ప్రతిభ చూపించిన లక్ష్మీప్రసన్నాంజనేయశర్మకు స్వర్ణ కంకణధారణ చేశారు. అనంతరం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి అందజేసిన ప్రసాదాన్ని సీఎం స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. విశాఖ ప్రజల ఘనస్వాగతం.. శారదాపీఠం వార్షికోత్సవాలకోసం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నగర ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. సోమవారం ఉదయం 10.55 గంటలకు విశాఖ విమాన్రాశయానికి సీఎం చేరుకోగా.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి శారదాపీఠానికి సీఎం బయల్దేరారు. ఈ క్రమంలో ఎన్ఏడీ జంక్షన్ నుంచి శారదాపీఠం వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర విశాఖ ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలవర్షం కురిపించారు. థ్యాంక్యూ సీఎం.. థ్యాంక్యూ సీఎం.. అనే నినాదాలు చేస్తూ, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం పట్ల తమ హర్షాతిరేకాన్ని వ్యక్తీకరించారు. ఉదయం 11.25 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు శారదాపీఠంలో గడిపిన సీఎం... మధ్యాహ్నం 2.36 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని గన్నవరానికి తిరుగుపయనమయ్యారు. తెలంగాణ గవర్నర్ హాజరు.. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ హాజరయ్యారు. రాజశ్యామల అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శారదా పీఠానికి చేరుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయనేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా హాజరయ్యారు. -
ధర్మమే స్వరం..హైందవమే సర్వం
వేదభూమిగా పేరుపడ్డ భరతావనిలో ఎందరో మహిమాన్వితులు.. మరెందరో దివ్య చరితులు. చరిత్ర సైతం ఎరగని కాలంలో శంకరాచార్యుడి నుంచి.. ఇప్పటి విజయేంద్ర సరస్వతి వరకు.. హైందవతత్వాన్ని.. ఆర్ష ధర్మాన్ని కాపాడేందుకు అవతరించిన మహనీయులు.. మహోన్నత పరంపరకు ప్రతీకలు. దేశం వివిధ ప్రాంతాల్లో వెలసిన వివిధ పీఠాలకు ఎందరో అధిపతులు.. ఇంకెందరో పరివ్రాజకులు. అందరి కర్తవ్యం సనాతన ధర్మ సంరక్షణమే. అందరి విధి.. హిమవన్నగ సమాన నమున్నతమైన హైందవ ఔన్నత్య పరిరక్షణమే. ఈ బాధ్యతను అపూర్వరీతిలో శిరసున ధరించి సంరక్షిస్తున్న వారిలో అగ్రగామి విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. విద్యావాచస్పతిగా.. వివేకంలో బృహస్పతిగా ఎన్నదగ్గ ఈ మహాస్వామి.. హైందవ ధర్మానికి హాని.. గ్లాని కలిగే సందర్భాలలో ఎదురొడ్డి పోరాడే ధర్మ యోథుడిగా వన్నెకెక్కారు. భరతావనిలో ఏమూల హిందూ ధర్మానికి చేటు చేకూరే ప్రమాదం సంభవించినా.. ముందుగా శంఖారావం పూరించే చైతన్య స్వరూపంగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. శారదామాత చల్లని దృక్కులను దీనులపై సమానంగా ప్రసరింపజేసే వాహికగా మతాన్ని వినియోగించే సహృదయశీలిగా పదిమంది ప్రశంసలకు పాత్రులవుతున్నారు. ఆధ్యాత్మికతకు ఆలవాలంగా, ధార్మికతకు ప్రతి బింబంగా, సేవాభావానికి నిలువెత్తు నిదర్శనంగా గుర్తింపు పొందినా.. అంతులేని వినమ్రతకు ప్రతీకగా సార్థక జీవితం గడుపుతున్న స్వరూపానందేంద్ర మహాస్వామి నాగులచవితి పర్వదినాన తన జన్మదినాన్ని జరుపుకోనున్నారు. పెందుర్తి: హైందవ ధర్మానికి ఎక్కడ ఏమాత్రం ప్రతికూలత ఎదురైనా ఆయన దండంతో కదను తొక్కుతారు. దేశంలో ఎక్కడ.. ఎవరి వల్ల ఆర్ష ధర్మానికి ఆపద వాటిల్లినా నిర్ద్వంద్వంగా.. నిర్మొహమాటంగా వాదనకు సంసిద్ధులవుతారు. అవతలివారు ఎవరన్నది లక్ష్యపెట్టకుండా.. జరుగుతున్న అన్యాయాన్ని పదాలకోసం తడుముకోకుండా ధ్వజమెత్తుతారు. ఇలా సనాతన ధర్మ సంరక్షణకు కంకణబద్ధుడైన పీఠాధిపతిగా విశాఖశ్రీశారదాపీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ వన్నెకెక్కారు. సమాజానికి దూరంగా.. ఆచారాల గురించి అవగాహన లేక అమాయకంగా బతికే గిరి పుత్రులను హైందవ ధర్మ ఛత్రం పరిధిలోకి తెచ్చి.. వారికీ హైందవ ధర్మజలాలు అందించిన సంస్కారవంతుడిగా గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తిత్వమూ ఆయనదే. మరోవైపు లోకకల్యాణం కోసం అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు శారదాపీఠాధిపతి. సమకాలిన సమాజంలో పోరాటానికి ధైర్యం, ఆర్ష ధర్మ రక్షణకు అపారజ్ఞానం, దేశంపై అలవిమాలిన అభిమానం కలగలిసిన మఠాధిపతుల్లో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అగ్రస్థానంలో నిలుస్తారు. దేశభద్రత, రైతుల సంక్షేమం, ప్రజల సుఖసంతోషాలు కోరుతూ నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న పరివ్రాజకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఇటు ధార్మికాన్ని ..అటు సామాజికాన్ని సమతూకంగా చూస్తూ ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలను కూడా ఏకకాలంలో సమాజంలో నిర్వహిస్తున్న స్వామీజీ జన్మదినం నాగులచవితి రోజున సంభవించడంతో.. ఈ సందర్భంగా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో స్వామీజీ జన్మదిన వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హిందూధర్మ పరిరక్షణ దినోత్సవంగా స్వామీజీ జన్మదినోత్సవాన్ని పరిగణిస్తున్నారు. మత రక్షణకు ఉద్యమ పథం తిరుపతి సమీపంలో ఇస్లామిక్ యూనివర్శిటీ నిర్మాణం చేపట్టే ప్రతిపాదనపై స్వామీజీ తీవ్రస్థాయిలో ఉద్యమానికి తెరతీశారు. తిరుమలతో పాటు దేశంలోని పవిత్ర హిందూ దేవాలయాల వద్ద ఎటువంటి అన్యమత ప్రచారం జరిగినా, దేవాలయాలకు ఏ హాని జరిగినా స్వామీజీ సహించరు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన కొద్ది రోజులకే విజయవాడలో టీడీపీ ప్రభుత్వహయాంలో పదుల సంఖ్యలో దేవాలయాలను రోడ్డు విస్తరణ పేరుతో రాత్రికి రాత్రే కూల్చేయడాన్ని స్వామీజీ అత్యంత హేయమైన చర్యగా ఆక్షేపించారు. అభివృద్ధి పేరుతో దేవాలయాలను కూల్చేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుష్కరాల సమయంలో ఎందరో భక్తులు మరణించడం పట్ల స్వామీజీ తీవ్రంగా కలత చెందారు. ఇంతటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎక్కడా చూడలేదని తీవ్రస్థాయిలో ఆవేదన వెలిబుచ్చారు. సేవలో స్ఫూర్తిదాయకం ఐదేళ్ళ క్రితం హుద్హుద్ తుపాను కారణంగా విశాఖ అతలాకుతలం కావడంతో స్వామీజీ కలతకు గురయ్యారు. తక్షణమే తన శిష్య పరివారాన్ని రంగంలోకి దించి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి బియ్యం, వస్త్రాలు, నిత్యవసరాలు అందజేశారు. వందలాది మంది బాలలకు వేదం, స్మార్థం ఉచితంగా బోధింపజేస్తూ సమాజానికి ఉపకారం చేస్తున్నారు. గిరిజన ప్రాంత రైతులకు ఉచితంగా ఆవులు, ఎద్దులను వితరణ గావిస్తున్నారు. 2012లో పీఠం ఆధ్వర్యంలో 500 మంది గిరిజనులను తిరుమల పంపించి వెంకన్న దర్శనం చేయించారు. ఏటా ఏదో ఒక సందర్భంలో పేదల కోసం సేవా కార్యక్రమాలు చేపడతారు. తన ప్రతి జన్మదినోత్సవం నాడు వేలాది మంది ప్రజలకు వస్త్రదానం చేస్తారు. పీఠంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వేదపండితులను ఘనంగా సత్కరిస్తారు. పాదయాత్రకు అంకితం స్వరూపానందేంద్ర సరస్వతి తొలిసారి 1994లో ఋషీకేష్, కేదార్నా«థ్, బదరీనా«థ్లలో పాదయాత్ర చేశారు. 1995లో ఋషీకేష్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వరకు దాదాపు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 1996లో కర్ణాటకలోని అద్వైతానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద సన్యాసం స్వీకరించి స్వామీజీ యోగపట్టా పొందారు. స్వామీజీ పరమ గురువు సచ్చిదానందేంద్ర మహాస్వామి. ⇒ శారదాపీఠానికి తిరుపతి, శ్రీశైలంలతో పాటు ఋషికేష్, వారణాశిలో అనుబంధ పీఠాలు ఉన్నాయి. హైదరాబాద్లోని ఫిలింనగర్లో దైవసన్నిధానంతో పాటు రాష్ట్రంలోని అనేక దేవాలయాలు పీఠం ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. పీఠంలో గురువారంకార్యక్రమాలు ⇒ ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం ⇒ ఉదయం 9 గంటలకు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకాలు ⇒ 9.45 గంటలకు రుద్రాక్రమార్చన ⇒ 10 గంటలకు అవహంతి హోమం, అయుష్య హోమం ⇒ 10.30 గంటలకు పాదపూజ, భిక్షావందనం ⇒ 11.30 మహాపూర్ణాహుతి ⇒ మధ్యాహ్నం 11.45 నుంచి అన్నదానం. ⇒ సాయంత్రం 4 గంటలకు సామూహిక లలిత, విష్ణు సహస్ర పారాయణం ⇒ 4.30 నుంచి గంటలకు స్వామీజీ అనుగ్రహ భాషణం ⇒ వేడుకల్లో స్వామీజీ చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం ⇒ గవర్నర్ హరిచందన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. లోక కల్యాణమే లక్ష్యం చినముషిడివాడలోని శారదాపీఠంతో పాటు తిరుపతి, శ్రీశైలం, హైదరాబాద్, రుషీకేష్, హరిద్వార్లలోని శారదాపీఠం శాఖల్లో నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఏటా పీఠం వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు.. పదకొండేళ్లుగా అతిరుద్ర లక్ష చండీయాగం ఐదు రోజుల పాటు.. ఇతర హోమాలు, యజ్ఞాలు స్వామీజీ నేత్రత్వంలో జరుగుతాయి. తాజాగా ఐదు రోజులపాటు పీఠంలో అతిరుద్ర చండీయాగం వైభవంగా నిర్వహించారు. దైవ కృప కోసం ఎన్ని కార్యక్రమాలు చేసినా అంతిమంగా లోకకల్యాణం జరగాలన్నదే తన ఆకాంక్ష అంటూ స్వామీజీ సెలవిస్తారు. నేడు గవర్నర్ రాక రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం నగరానికి రానున్నారు. ఆయన ఉదయం 10.50కి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సాలూరుకు వెళతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి విశాఖ చేరుకుని చినముషిడివాడలొని శారదాపీఠానికి వెళ్తారు. రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం వెళ్తారు.. వేడుకలకు మంత్రులు రాక.. స్వరూపానందేంద్ర పుట్టిన రోజు వేడుకులలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. -
ముగిసిన శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష
రిషికేశ్: లోక కల్యాణం కోసం విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేపట్టిన చాతుర్మాస్య దీక్ష ముగిసింది. గత పదేళ్లుగా రిషికేశ్లో స్వరూపానందేంద్ర దీక్ష చేపడుతున్నారు. ఈ ఏడాది స్వరూపానందేంద్రతో కలిసి ఉత్తరాధికారి స్వాత్మానంద్రేంద్ర దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వరులు, రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. దీక్ష ముగియడంతో త్వరలో పీఠాధిపతులు విశాఖకు పయనం కానున్నారు. -
శారదాపీఠం సేవలు అభినందనీయం
న్యూఢిల్లీ : టీటీడీలో మెరుగైన సేవల కోసం సూచనలు,సలహాలు అందించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. రిషికేశ్లో సుబ్బారెడ్డి దంపతులు శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీతో కలిసి గంగా స్నానమాచరించారు. శారదా పీఠాధిపతి చేపట్టే చాతుర్మాస్య దీక్షలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శారదా పీఠం చేపట్టిన సేవలు అభినందనీయం అని ప్రస్తుతించారు. కేంద్ర మంత్రుల్ని కలిసిన టీటీడీ ఛైర్మన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా,రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.రాష్ట్రానికి నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్ర మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు నెరవేరేలా చూడాలని కోరారు. -
శారదా పీఠం దానికే అంకితం
సాక్షి, ఢిల్లీ: ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేందుకే శారదా పీఠం అంకితమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ దేవాలయాల భూముల ఆక్రమణకు, అన్య మత ప్రచారానికి వ్యతిరేకంగా శారదా పీఠం పోరాటం చేసిందని చెప్పారు. ఈ పోరాటంలో తాను అలిసిపోయానని, ఇక నుంచి శారద పీఠానికి ఉత్తరాధికారిగా స్వామి స్వాత్మనంద పని చేస్తారని వెల్లడించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం అన్ని తరాలు పనిచేయాలనేది శారదాపీఠం సంకల్పమని ఆయన వ్యాఖ్యానించారు. -
దైవ సన్నిధానంలో శ్రీ స్వరూపానందేంద్ర
సాక్షి, హైదరాబాద్ : విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం ఫిలిం నగర్ దైవ సన్నిధానాన్ని సందర్శించి పూజా కార్యక్రామాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, శ్రీమతి సురేఖ, ఎస్. గోపాల్ రెడ్డి, దర్శకుడు బి . గోపాల్ , హీరో శ్రీకాంత్, ఊహ, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు నిర్మల, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ - ‘రెండు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మహోన్నత స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు. నేను రజినీకాంత్ గారు ఒక సారి వారి పీఠానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజమైన ప్రశాంతత కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఒక్కసారి వైజాగ్ లోని శ్రీ శ్రీ శ్రీ శారదా పీఠం ని దర్శించుకోవాల్సిందిగా మనవి. అలాంటి బృహత్తర రూపం గల శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి భాద్యతలు ఇవ్వడం మంచి పరిణామం. వారికి దాదాపు భారతదేశం లో 108 మఠాలు ఉన్నాయి. వారి ఆశీస్సులు ఫిలిం నగర్ దైవసన్నిదానానికి ఎల్లవేళలా ఉంటాయి’ అన్నారు. శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఫిలిం నగర్ దైవసన్నిధానంలో సినిమా వారు ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే మోహన్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాలకు ఒక పరిచయ వేదికగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. విశాఖ శ్రీ శారదా పీఠం అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం 21 సంవత్సరాలుగా అవిశ్రామంగా కృషి చేస్తుంది. మా పీఠానికి శ్రీ సుబ్బిరామి రెడ్డి గారు ఎంతో చేయూత నిస్తున్నారు. ఆయన నేను లేకుండా ఏ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరు. నా తరువాత ఆది శంకరాచార్యుల దృక్పథాన్ని నిలబెట్టడానికి 5వ యావత్ భారత దేశానికి ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గారిని నియమించడం జరిగింది. ఫిలిం నగర్ దైవసన్నిధానం నుండి విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది’ అన్నారు. కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఫిలిం నగర్ దైవసన్నిధానం ఎల్లప్పుడూ కలకలడానికి కారణం భారత దేశంలో అతి తక్కువ సమయంలోనే అన్ని చోట్లా పీఠాలను నెలకొల్పిన శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు. వారి జీవిత లక్ష్యం ప్రతి ఒక్కరికి ధార్మిక జీవితాన్ని ప్రసాదించడం. అలాగే స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహా జ్ఞాని. ఆయన నాకు చాలా కాలంగా పరిచయం. నేను గత 27 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేసిన వారు, వారి ఆశీస్సులు నాతోనే ఉంటాయి’ అన్నారు. శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ‘మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ళక్రితం ఇక్కడే గణపతి ప్రదక్షిణాలు చేసి స్వామి వారి దగ్గర పాఠాలు నేర్చుకునే వాడిని. నాకు ఈ ఫిలిం నగర్ దైవసన్నిధానం తో చాలా అభినాభావ సంభందం ఉంది. రెండు సంవత్సరాల క్రితం మా గురువు గారు ఉత్తరాఖండ్లో తపస్సు చేయమని చెప్పారు. చాలా క్లిష్ట మైన ప్రదేశం. అక్కడ జవాన్లు మాత్రమే ఉండగలరు. అక్కడ కూడా తెలుగు వారు వచ్చి ఫిలిం షూటింగ్ లు జరుపుతున్నారు. ప్రేక్షకులకు రెండు మూడు గంటలు ఆనందం ఇవ్వడం కోసం అంత కస్టపడి సినిమాలు తీస్తారా? అని ఆశ్చర్యానికి లోనయ్యాను. అలా సైనికులు ఉండగలిగే ప్రదేశాలలో షూటింగ్ చేయడం సినిమా వారికే చెల్లింది’ అన్నారు. -
‘ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శ్రీ శారదా పీఠాదిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహర్షులు స్థాపించిన ఈ పీఠాలు భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పేవని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారని అన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు రాష్ట్రంలో ప్రతిఒక్కరి మీద ఉండాలని ఆశిస్తున్నా అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో వర్షాలు పడి పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం తనదైన శైలిలో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలను ప్రతి ఒక్కరు స్వాగతిస్తారని అన్నారు. -
స్వామీజీకి తప్పని నిరీక్షణ
విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అసహనం వ్యక్తం చేశారు. చందనోత్సవానికి వచ్చిన స్వామీజీకి గేటు తీయకపోవడంతో ఆయన తన వాహనంలోనే సుమారు 15 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్వామీజీ తన వాహనంలో రాజగోపురం వరకు వెళ్లేందుకు ఎంక్వైరీ కార్యాలయం వద్దనున్న గేటు వద్దకు వచ్చారు. ఆ సమయంలో గేటు తాళాలు వేసి ఉండడంతో ఆయన కారులోనే ఉండిపోయారు. ఎవరు తాళాలు తీస్తారని ఎదురుచూశారు. దీంతో స్వామీజీ అసహనానికి గురయ్యారు. తాళాలు ఈవో దగ్గర ఉన్నాయంటూ అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు చెప్పారు. ఈవోకు ఫోన్లో స్వామీజీ వచ్చినట్టు సమాచారం ఇచ్చి, తాళాలు తీసుకొచ్చారు. చివరికి తాళాలు తీసి ఆయనను లోపలికి పంపారు. ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అనుగ్రహించాలని స్వామీని కోరుకున్నా : స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చాలా దిగ్విజయంగా జరిగిందని శారదా పీఠాధిపతి తెలిపారు. ఈ ఏడాది శారదా పీఠానికి తొలి అడుగని, ఈ ఏడాది పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని పెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఒక నెల ముందు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నామన్నారు. ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అనుగ్రహించాలని స్వామిని వేడుకున్నామన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం అనంతరం వేద స్వస్తిని అర్చకులు నిర్వహించారు. ప్రసాదాన్ని ఈవో కె.రామ చంద్రమోహన్ అందజేశారు. తాను ఆలయం లోపల ఉండిపోవడంతోనే తాళం తీయడానికి ఆలస్యమైందని ఈవో స్వామీజీకి సంజాయిషీ ఇచ్చారు. -
శారదాపీఠంలో వైభవంగా మహాకుంభాభిషేకం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం గురువారం వైభవంగా జరిగింది. దేశంలోని పవిత్ర నదులైన గంగా, యయున, సరస్వతి, వృద్ధ గంగగా పేరుగాంచిన గోదావరి జలాలతో కార్గిల్, లడాక్ ప్రాంతాల్లోని ఇండస్, జాన్సర్గ్ నదుల నుంచి సేకరించిన జలాలతో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అభిషేకాలు జరిపారు. పీఠంలో రాజశ్యామల స్వరూప శారదామాత ఆలయాన్ని స్వామీజీ చేతుల మీదుగా పునఃప్రారంభించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. తొలిపూజ స్వామీజీ ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేస్తూ దేశంలో ఎక్కడా లేని రాజశ్యామల స్వరూప శారదామాత ఆలయాన్ని శారదాపీఠంలో నిర్మించడం అమ్మవారి కృపగా భావిస్తున్నామన్నారు. తరతరాలుగా భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్న తలంపుతో ఉపానాది స్థూపి పర్యాంతం(పునాది నుంచి శిఖరం వరకు శిల) ఆలయం నిర్మించామన్నారు. దేశంలోని శారదాపీఠం శాఖలన్నింటికీ ఉత్తరాధికారిగా కిరణ్కుమార్శర్మ(బాలస్వామి)ని జూన్ 17న అమరావతిలో జరిగే కార్యక్రమంలో నియమిస్తామని స్వామీజీ ప్రకటించారు. మహాపూర్ణాహుతి ఘట్టంతో వార్షిక వేడుకలు ముగిశాయి. స్వామీజీ చేతుల మీదుగా పండిత సత్కారం, పీఠం ఆస్థాన శిల్పి గణపతి కుమారుడు జయేంద్ర స్థపతికి స్వర్ణకంకణం, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మకు స్వర్ణ అంగుళీకం, ఆభరణ శిల్పి గణేష్కు అంగుళీకం ప్రదానం చేశారు. ప్రధాని మోదీ దూతగా ఎంపీ జీవీఎల్ నర్శింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు తరపున ఎమ్మెల్యే, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్రెడ్డి దంపతులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతినిధిగా జీవీడీ కృష్ణమోహన్ వేడుకలకు హాజరయ్యారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, విరంచి ఫ్యాషన్స్ అధినేత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, వేలాదిగా భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. -
జ్ఞానమే ముక్తి మార్గం
ధర్మపరిరక్షణలో భాగంగా విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు పంచారామ పాదయాత్ర చేశారు. ఆగమ పరిరక్షణ కోసం తిరుమల శ్రీవారి ఆస్థానమండపంలో వైఖానస ఆగమ సదస్సు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు గోవులను పంపిణీ చేసి, వారిని ధర్మమార్గం వైపు నడిపిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలలో వేదపాఠశాలలను నిర్వహిస్తూ వేద పరిరక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షకోసం హృషీకేశ్లో ఉన్న స్వామి వారు 27న దీక్ష ప్రారంభిస్తారు. ఈ పర్వదినాన గురుపూజతోపాటు అనేక కార్యక్రమాలుంటాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ కి ప్రశ్నోత్తరాల రూపంలో అందించిన ప్రత్యేక అనుగ్రహ భాషణమిది. చాతుర్మాస్య వ్రతం చేయవలసిన సమయం ఏది? ఆ సమయాన ఏమి చేయాలి? స్వామీజీ: ఆషాఢ పున్నమినాడు∙మొదలుపెట్టి కార్తీక పున్నమికి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. శ్రీ మహావిష్ణువు నిదురించు కాలమైన ఈ నాలుగు మాసాల కాలంలో ఈ వ్రతాన్ని శైవ, వైష్ణవభేదం లేక గృహస్థులందరూ ఆహారాది నియమాలను పాటిస్తూ ఆచరించాలి. లోకానికి ఆదర్శంగా నిలచే యతీంద్రులు ఈ చాతుర్మాస్యాన్ని ఆచరిస్తారు. మానవ జన్మ లక్ష్యం ఏమిటి? విశ్వమంతటికి కారణమైన ఒకే ఒక తత్త్వం ఉన్నది. అదే బ్రహ్మం. దానికే సత్యం, అక్షరం, పురుషుడు తదితర పేర్లు. ఆ బ్రహ్మతత్వమే మనందరి నిజ స్వరూపం. సకల జీవులు ఈ బ్రహ్మ స్వరూపమే అయి ఉన్నారు. దీనికి సరియైన రీతిలో అనుభవంతో తెలిసికొనిన వారికి సంసార భయం లేదు. దీనికే మోక్షం అని పేరు. ఇదే మానవ జన్మ లక్ష్యం. పిల్లలకు మంచి అలవాట్లు ఎలా వస్తాయి? భారతీయ సంస్కృతి, నాగరికతను, జీవన విధానాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అలవాటు చేయాలి. అలా చేయాలంటే ముందు వారికి అలవాటు ఉండాలి. తరువాత తమ సంతానానికి అలవాటు చేయగలుగుతారు. అలా ప్రవర్తిస్తుంటే మనం మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాము. దీక్ష అంటే ఏమిటి? గురువునుండి శిష్యుడు పొందే అనుగ్రçహాన్ని లేక ఉపాసనను దీక్ష అంటారు. ఇది లౌకిక వ్యవహారానికి సంబంధించినది కాదు. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పాపాన్ని నిర్మూలించేది దీక్ష. శిష్యుడు సరైన మార్గం అనుసరించడానికి ఇచ్చే దీక్ష సమయదీక్ష. యోగమార్గం, మోక్షమార్గాలకు సంబంధించినది నిర్వాణ దీక్ష. వివాహితకి పతే ప్రత్యక్షదైవమంటారు. మరి దైవం ప్రధానం కాదా? స్త్రీ దైవాన్ని విడనాడాలని శాస్త్రం చెప్పలేదు. అలాగని దైవారాధనలు చేస్తూ భర్తను విస్మరించమనలేదు. అటు దైవారాధన చేస్తూనే, ఇటు భర్త చెప్పినట్లు వింటూ కుటుంబ జీవితం గడపాలి. అప్పుడు ఆ స్త్రీ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఈనాటి వేగవంతమైన జీవితంలో మంత్రానుష్ఠానాన్ని సావకాశంగా చేయడానికి కాలం సరిపోవడంలేదు. దీనిని సంక్షిప్తంగా చేసే మార్గం..? కాలం సరిపోవడం లేదన్నది సరియైన అంశం కాదు. కాలం నీ అధీనంలో ఉంది. నీవు కాలం అధీనంలో లేవు. మనకు శ్రద్ధ తగ్గడం చేత కాలం చాలడం లేదనే సాకు చెపుతున్నాము. నిత్యపూజను, ధ్యానాన్ని క్లుప్త పరచే వీలు లేదు. కర్మలకు ఫలితం ఉంటుందా? ‘న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకత్’ శరీరం ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. మనిషి పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండజాలడు. అలాగే భూమి తిరగటం మనం చూస్తున్నామా? లేదు. అలా తిరగటం ఒక క్రియ. భూమి తన చుట్టు తాను తిరగటం వలన రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. తిరగటం అనే కర్మఫలితమే రేయింబవళ్ళు. ఇలాగే భూమి సూర్యుని చుట్టు తిరగటం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ కర్మ అంతా మనకు కన్పించదు. ఇది అవ్యక్త కర్మ. దీని ఫలితమే రాత్రింబవళ్ళు. ఋతువులు కనిపిస్తున్నాయి. ప్రత్యక్షదైవాలు ఎవరు? తల్లిని మించిన దైవం లేద’ని, ‘న మాతుః పరదైవతం’ అన్నారు. ‘మాతృదేవో భవ, పితృదేవోభవ’ అని తైత్తిరీయం. తల్లిదండ్రులను దైవంగా భావించాలని శ్రుతి ఆదేశించింది. తల్లి చల్లని చూపులు లేకపోతే లోకమే లేదు కదా? కరుణామూర్తియైన భగవంతుడే మాతృమూర్తి రూపంలో అందరిని రక్షిస్తున్నాడు. తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరులని భావించి సేవిస్తే అంతకంటె గొప్ప ఉపాసనయే లేదు. ఇది సకల మానవులకు స్వధర్మం. దేవుడు ఉన్నాడా? మనకు కనిపించనంత మాత్రాన దేముడు లేడని చెప్పడం సరికాదు. దేముని యీ చర్మచక్షువులతో చూడడం సాధ్యంకాదు. జ్ఞానదృష్టితో అనుభవం ఆధారంగా చూడగలం. వాయువునకు రూపంలేదు. అంతమాత్రాన వాయువు లేదని చెప్పగలమా? వెన్నెల, నక్షత్ర కాంతి, గ్రహసంచారం ఆ పరమాత్ముని అనుగ్రహం వల్లనే కలుగుతున్నాయి. భగవంతుడు సర్వవ్యాపి. ఆయనకు నామరూపాలు లేవు. అది వర్ణనకు అందని చైతన్యం. మనయందే చైతన్యంగా ఉన్నాడు. దైవసాక్షాత్కారం ఎలా కలుగుతుంది? దైవసాక్షాత్కారమన్నది మామూలు విషయం కాదు. మన అజ్ఞానం వల్ల యీ దేహేంద్రియ సంఘాతమే నేను అనుకుంటున్నాము. దృఢచిత్తంతో సద్గురువుని సమీపించి శాస్త్రాధ్యయనం చేసి యీ దేహమే నేను అనే మన అపోహను తొలగించుకోవాలి. అప్పుడు మనకు గల అత్యాశ తొలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమార్గంలో పయనిస్తూ ముందుకు సాగితే భగవదనుభూతి కలుగుతుంది. దైవీ సంపదతో కూడిన దేవతామూర్తులు గొప్పవా? గ్రహాలు గొప్పవా? హెచ్చుతగ్గులు అన్నవి లోక వ్యవహార దృష్టిలో సహజం. గ్రçహాలకు ఉన్న శక్తి గ్రహాలకు ఉంటుంది. అందువలన గ్రహశాంతి అవసరం. గ్రహశాంతులు నిత్యం చేసేవి కావు. ఆయా గ్రహాలకు సంబంధించి అవసరమైన కాలంలో గ్రహశాంతులు చేస్తారు. అనునిత్యం దైవారాధన చేయవచ్చు. దైవశక్తి ముందు ఏ గ్రహశక్తియైనా తలవంచవలసిందే. గ్రామదేవతల ప్రాధాన్యం ఏమిటి? పరాశక్తి రూపాలు అనేకం. ఈ రూపాలే గ్రామ దేవతలుగా కొలువబడుతూ గ్రామ ప్రజలను మారీ, విషూచ్యాది రోగాల నుండి, భూతప్రేతాల నుండి కాపాడుతుంటాయి. గ్రామదేవత మందిరం కొన్ని గ్రామాలలో ఊరిచివర ఉంటుంది. ఈ గ్రామ దేవతలకు బహుకొద్ది ప్రాంతాలలో నిత్యపూజలు జరుగుతాయి. మిగిలిన చోట్ల విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుతారు. సాధారణంగా గ్రామదేవత పూజ అవైదికంగా ఉంటుంది. గ్రామదేవతలను అందరూ పూజించి నైవేద్యం సమర్పిస్తారు. దానధర్మాలవల్ల ఫలితం ఉంటుందా? ‘‘యజ్ఞం, దానం, తపశ్చైవ, పావనాని మనీషిణావ్ు’’ అని భగవంతుడే చెప్పి ఉన్నాడు. దానం చేత మన దారిద్య్రం తొలగుతుంది. దానం మూడు విధాలు. మనస్సు, వాక్కు, కాయము, మనస్సు ద్వారా, ఇతరులకు శుభం జరగాలనే సంకల్పంతో కాలాన్ని వినియోగించడం. దానం చేస్తూ తనదైన ఆ వస్తువును యిచ్చివేస్తున్నాననే శంక భావంలో కూడా ఉండరాదు. ఆవిధంగా సత్యహరిశ్చంద్రుడు చేసినట్లు పురాణాలలో తెలుసుకుంటాము. కర్ణుడు, శిబి, మొదలయినవారు. వారంతా తమ దానధర్మాలవల్ల ప్రసిద్ధులయి పుణ్యలోకాలకు వెళ్ళారు. అర్చనలో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎందుకు ? భగవంతుడు సర్వవ్యాపి. యావత్తు సృష్టిని ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయనను మించి వ్యాపకం గల వస్తువు వేరొకటి లేదు. పంచభూతాలు అంటే పృథ్వి, ఆప, తేజో, వాయు, ఆకాశాల ఆధారంగా యీ సృష్ఠి కృతజ్ఞతాభావంతో మనం పూజావిధానం ద్వారా ఆయనకు అర్పిస్తున్నాము. కలలు ఎందుకు వస్తాయి? స్వప్నంలో వచ్చే విషయాలు భవిష్యత్తును సూచిస్తాయా? జాగ్రదవస్థలో జరిగిన కొన్ని అంశాలు స్వప్నంలో రావడం సహజం. అనేక జన్మల సంస్కారం వల్ల చిత్రవిచిత్రంగా తోచే కలలు వస్తూ ఉంటాయి. స్వప్నంలో వచ్చినవన్నీ వాస్తం కావాలనే నియమమేది ఎక్కడా చెప్పలేదు. మెలకువలోకి వచ్చినపుడు మాత్రమే మనం స్వప్నం గురించి చెప్పుకుంటూ అది మంచిని సూచిస్తున్నది, లేక చెడును సూచిస్తున్నది అని చెప్పుకుంటాము. ఇది అంతా మన భ్రాంతి. జపస్థానాన్ని బట్టి ఫలితం మారుతుందా? మారుతుంది. ఇంటిలో జపం చేసిన ఒక ఫలితమైతే, గోశాలలో దానికి పదింతలు, వనంలో నూరురెట్లు, చెరువునందు వేయింతలు, నదీతీరాన లక్షరెట్లు, పర్వతాగ్రాన కోటిరెట్లు, శివాలయంలో నూరుకోట్ల అధిక ఫలం కలుగుతుంది. గురుసాన్నిధ్యాన చేస్తే అనంత ఫలం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. సత్యం అంటే ఏమిటి? సత్యానికి పదమూడు రూపాలున్నాయి. వాటిని మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజునకు ఉపదేశించాడు. ఏవిధంగా నంటే సత్యం, శమం, దమం, అమాత్సర్య, క్షమ, లజ్జ, తితిక్ష, అసూయ, త్యాగం, ధ్యానం, ఆర్యత, ధృతి, అహింస ఈ పదమూడున్నూ సత్యానికి ఆకారాలు. అన్ని ధర్మాలూ సత్యంలోనే వెలిసినాయి. సత్యం అన్ని ధర్మాలకు ప్రాణం. సత్యం లేని అహింస అహింస కాదు. సత్యం లేని ఆచారం దురాచారమే. సత్యం లేని శమాదులు వ్యర్థమే. సత్యం లేని బ్రహ్మచర్యం, తపస్సు, శౌచం అంతా కపట నాటకమే. రావణుడు కూడా తపస్సు చేశాడు. కాని ఆ తపస్సులో సత్యం లేదు. దుర్యోధనుడు సదా అన్నదాననిరతుడు. కాని ఆ దానధర్మానికి సత్యం అనే ఆధారశిల లేనందున నశించిపోయాడు. సత్యం అనే ధర్మం ఒక్కటుంటే చాలు ‘శతే పఞ్చాశత్’ వందలో యాభై అణగి ఉన్నట్లు సత్యంలో అన్ని ధర్మాలు నెలకొన్నాయి. ‘సర్వం పదం హస్తిపదే నిమగ్నం’ అన్నట్లు ఏనుగు అడుగు జాడలో అన్ని ప్రాణులు ఇమిడి ఉన్నట్లు సత్యధర్మం సకల ధర్మాలను తనలో ఇముడ్చుకుంది. అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనను అంగీకరిస్తుందా? అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనకు వ్యతిరేకం కాదు. మంత్ర, శిల్ప శాస్త్రాలలో, పురాణాలలో విగ్రహారాధనను గూర్చి వివిరంగా చెప్పారు. స్వర్గలోకప్రాప్తి లేదా చిత్తశుద్ధి ద్వారా క్రమ ముక్తిని గూర్చి తెలిపారు. మందమధ్యమాధికారులకు విగ్రహారాధన అవసరం. తెలిసిన వారు కూడా లోకసంగ్రహం కోసం విగ్రహారాధన చేస్తారు. -
‘రాజకీయ పెత్తనం ఎక్కువైంది.. మంచిది కాదు’
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. చందనోత్సవం సందర్భంగా పెందుర్తి శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చందనోత్సవం సందర్బంగా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కానీ ఆలయంపై రాజకీయ పెత్తనం ఎక్కువ అయింది. ఇది మంచిది కాదు. వీఐపీ పాసులు పూర్తి జబర్దస్తీగా తీసుకోవటం, ఎవరిని బడితే వారిని రప్పించడంతో భక్తులకు ఆటంకం కలిగింది. ఈ ఘటన దేవాదాయ శాఖకు పెద్ద మచ్చ. అసలు ఆలయాలను భక్తులకు చేరువలో ఉండేలా చేయాలి గానీ రాజకీయ నాయకులు పెత్తనం చేయడం దారుణం. శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్నలు పేదల దేవుళ్లు.. అలాంటి దేవుళ్లను పేదలకే దూరం చేయడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా దేవాదాయ శాఖలో మార్పులు తీసుకురావాల’ని స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. -
'గోవధను అరికట్టడంలో కేంద్రం విఫలం'
తిరుమల: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా దేశంలో గోవధ ఏమాత్రం తగ్గలేదని, గోవధను అరికట్టడంలో కేంద్ర సర్కార్ చొరవ చూపడంలేదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గో హత్యలు జరక్కుండా, గోవులు తరలిపోకుండా, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రెండున్నరేళ్లకు ముందు హిందూ సమాజం అంతా ఏకమై బీజేపీకి అధికారం అప్పగించిందని గుర్తుచేశారు. అయినప్పటికీ గో హత్యలు, గో మాంస భక్షకుల సంఖ్య పెరగడంతో పాటు విదేశాలకు తరలిపోతున్నాయన్నారు. గంగా ప్రక్షాళన కూడా ఇంతవరకూ జరగలేదన్నారు. గోవధ అరికట్టాలని గోవులు పాలించే గోపాలుడైన గోవిందుని వేడుకున్నానన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ గగనతలంపై విమానాలు చక్కర్లు కొట్టడం అపచారమని, అయినప్పటికీ వాటిని అరికట్టడంలో కేంద్రం విఫలమైందన్నారు.