system
-
ఆర్జీ కర్ ఆస్పత్రి మెడిసిన్ కొనుగోళ్లలో భారీ లోపాలు: సీబీఐ
కోల్కతా: కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు.. కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్తో పాటు సందిప్ ఘోష్కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కోల్కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు -
ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం
చంద్రగిరి(తిరుపతి జిల్లా): ‘దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే... అది కూడా ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తాం..’ అని వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. ‘హెల్తీ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాల అధికారులు, ప్రజాప్రతినిధులు 3 బృందాలుగా ఏర్పడి శనివారం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రగిరి మండలంలోని తొండవాడ పంచాయతీలో ఛండీగఢ్, జమ్ము–కశ్మీర్, పంజాబ్, హరియాణ, రాజస్థాన్, కేరళకు చెందిన 49 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. వారికి స్థానిక సర్పంచ్ మల్లం దీపిక, సింగల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో అసోం, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు 47మంది, చెర్లోపల్లి గ్రామంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ , తెలంగాణకు చెందిన 48మంది ప్రతిని«దులు పర్యటించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, వెల్నెస్ సెంటర్ ఎస్డబ్ల్యూపీసీ, ప్రభుత్వ పాఠశాలలు వంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలతోపాటు డిజిటల్ క్లాసులు, ట్యాబుల ద్వారా విద్యాబోధన ఒక అద్భుతమని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాది నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీలు, పాఠశాలలు ఆరోగ్య కేంద్రాల పనితీరు చాలా గొప్పగా ఉందని చెప్పారు. తొలుత నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆనంద్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తొండవాడ పంచాయతీలో పర్యటించిన బృందం వెంట ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. -
పిట్ట బతుకే ఓటరుదీ... పిట్టమెదడే వాడి యుక్తి!
‘‘వాళ్లకు ఇవ్వం. మనం వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెటిఫిట్స్ ఇవ్వం. మన జెండా మోసినోళ్లకు, మనతోని తిరిగినోళ్లకు..వాళ్లకే మన స్కీముల ప్రయోజనాలు ఇస్తం. మనోళ్లు కానోళ్లు ఎవ్వరైనా ఇళ్లు కట్టుకుంటుంటే.. మున్సిపాలిటీ వాళ్లకు చెప్పి, నేనే దగ్గరుండి కూలగొట్టిస్త’..ఇదీ కొన్ని దశాబ్దాలుగా ఎన్నికవుతూ ఉన్న ప్రజాప్రతినిధి మాట. అదీ పబ్లిగ్గా మీటింగ్లో. అదీ ఆన్ రికార్డ్. ఇలా అనడం కరెక్టేనా సార్’’ అమాయకంగా అడిగాడు ఓటరు. ‘‘ఆయనంటే ఏదో మామూలు మంత్రిస్థాయి వ్యక్తి. కానీ ఆయన కంటే గొప్పగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ‘ప్రజలకు విచక్షణ ఉన్నప్పుడు ప్రభుత్వానికీ ఉంటది. కాబట్టి మేం మా ఇష్టమైనోళ్లకే ఇచ్చుకుంటం మా బెనిఫిట్లు’ అన్నాడు కదా నాయనా. ఈయనతో పోలిస్తే ఆయనెంత’’ అని చిద్విలాసంగా అన్నారు స్వామీ ఎలక్షనానంద. ‘‘కేవలం నలభై శాతం ఓట్లతోనే ఎన్నికైనా, అంటే అరవై శాతానికి ఆమోదం కాకపోయినా, దాన్నే మెజారిటీ ఓపీనియన్ అంటారు. తనకు ఓట్లు వేయనోళ్లకు కూడా గెలిచిన వ్యక్తే ప్రతినిధి అనేది మన ఎలక్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్లో ఎన్నికై..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా సార్’’ ఎలక్షనానందస్వామిని మళ్లీ అడిగాడు ఓటరు. నిజానికి ఆయన పేరు సలక్షాణానంద స్వామి. ఓ మంచి స్వామీజీగా అన్ని అంశాలతో పాటు రాజకీయాలూ, నేతల అంతర్గత భావాల మీద కూడా వ్యాఖ్యానిస్తుంటారు. ఎన్నికలతో సహా అన్ని విషయాల మీదా నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెబుతుంటారు కాబట్టి ఆయన్నలా పిలుస్తారు. ‘‘పిట్టలు చాలా అమాయకంగా కనిపిస్తాయి. ‘పిట్టప్రాణం’ అనే మాట వినే ఉంటావు. ఓ సామాన్యుడి బతుకులాగే అంతటి బక్కప్రాణం దానిది. అంతటి అర్భకపు ప్రాణికీ ఎన్నో యుక్తులూ, దాని మీద మరెన్నో కథలు. ఎన్నోసార్లు విన్న అలాంటి కథే మచ్చుకు మరోసారి చెబుతా విను నాయనా’’ అంటూ ఎలక్షనానంద స్వామి ఈ కథ చెప్పారు. అనగనగనగా రాణివారి తోట. అందులో ఓ చెట్టు. ఆ చెట్టు మీద ఓ పిట్టల జంట కాపురముంటోంది. అదే చెట్టుకు కాస్త ఆవల ఓ పుట్ట. ఆ పుట్టలో ఓ పాము నివాసముంటోంది. ఎవరి బతుకు వారు బతుకుతున్నంత కాలం..ఎదుటివాడిని కూడా బతకనిస్తున్నంత కాలం... ఎవరికీ అభ్యంతరముండదు. కానీ..ఆడ పిట్ట గుడ్లు పెట్టిన ప్రతిసారీ పాము రావడం, గుడ్లు తిని వెళ్లిపోవడం..ఇది ప్రతిసారీ జరుగుతోంది. అప్పటికీ పిట్టల జంట చాలాసార్లు పామును కోరాయి..ఇక తమను వదిలేయమనీ, తమ బతుకు తమను బతకనివ్వమని. కానీ తేలిగ్గా దొరికే ఆహారాన్ని వదల్లేక పాము ప్రతిసారీ అదే పని చేస్తోంది. పిట్ట బతుకెంత? దాని ఔకాదెంత? పామునది ఏమీ చేయలేదు. అందుకే ఓరోజున రాణిగారి అంతఃపురంలోకి పోయింది పిట్ట. అక్కణ్నుంచి చాలా విలువైన, రాణిగారికి అత్యంత ప్రియమైన నగను నోటకరచుకొని వచ్చి, సరిగ్గా పుట్టలో వేసింది. నగ పుట్టలో పడిన ఆనవాలు వదులుతూ మరీ వేసింది. అంతే నాయనా..భటులు పుట్ట తవ్వేశారూ, నగను పట్టేశారు. ఇక్కడ గమనించాల్సిన ఓ విషయం ఒకటుంది. పిట్టలు తాము పెట్టిన గుడ్ల బెనిఫిట్టును తమ పిల్లల రూపంలో పొందాలి. పిట్టబిడ్డ పిట్టకు ముద్దు కాదా. అందుకే అది నగను పుట్టలో వేసింది. నగలాగే విలువైనది ఓటు కూడా. ఆ ఓటును పిట్టప్రాణమంతే ఉన్న బక్కజీవి ఓట్ల పెట్టెలో వేసేశారనుకో..మిగతా పనంతా పనంతా ప్రజాస్వామ్యం చూసుకుంటుంది నాయనా. ఇది నేను చెప్పిన నీతి కథ కాదు. అనాదిగా అందరూ చదివిందే. దీని తాలూకు నీతి ఏమిటో ఇంకా విపులంగా వివరించి చెప్పాల్సిందేమీ లేదనుకుంట..అంటూ మరోసారి చిద్విలాసంగా నవ్వేరు స్వామి ఎలక్షనానంద. -
మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్!
మానసికంగా బాగుంటేనే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. మెంటల్గా బాగుంటేనే మన రోజూవారీ లైఫ్కి ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి మనసే స్ట్రగులైతే సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను నిలువునా పతనం దిశగా తీసుకువెళ్లి మట్టుబెట్టేంత వరకు వదలదు ఆ మానసిక వ్యాధి. దీన్ని జోక్గా తీసుకోవద్దు. ప్రతిమనిషి మానసికంగా బలంగా ఉంటే దేన్నేనా అవలీలగా జయించగలడు అన్నది సత్యం. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక అనారోగ్యం ఎందుకొస్తుంది? ఎలా బయటపడాలి? తదితరాల గురించే ఈ కథనం.! మానసిక అనారోగ్యామే అని కొట్టి పారేయొద్దు. అది ఓ భయానకమైన వ్యాధి మనిషిని నిలువునా కుంగదీసి చనిపోయేలా ప్రేరేపిస్తుంది. ముందుగానే మేల్కొని బయటపడేందుకు ప్రయత్నించకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మానసికంగా బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజూకి అనూహ్యంగా పెరుగుతుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపించేంత టెక్నాలజీ మన వద్ద ఉంది. టెక్నాలజీ పరంగా ఆర్థిక పరంగా మనిషి అభివృద్ధి శరవేగంగా దూసుకు వెళ్తోంది. అయినా మానసిక రుగ్మత బారిన పడి మనిషి ఎందుకు విలవిల్లాడుతున్నాడు. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి ఏం చేయలేను అనేంత స్థాయికి దిగజారి నిరాశ నిస్ప్రుహలోకి వెళ్లిపోతున్నాడు. ఎక్కడ ఉంది ఈ లోపం. వ్యవస్థలోనా? మనిషిలోనా ?అంటే.. మనిషి టెక్నాలజీ, అభివృద్ధి పేరుతో పెడుతున్న పరుగులు తనకు తెలియకుండానే మనసుపై ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఎదుటి వాడు తనకన్న బెటర్గా ఉన్నాడనే అక్కసు, తాను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను అన్న నిరాశ, తాను అనుకున్నవి సాధించలేకపోయాను అన్న నిట్టూర్పుతో.. ఢీలా పడి ఈ మానసిక రుగ్మత బారిన ఈజీగా పడి పోతున్నాడు. ఆ తర్వాత దీన్నుంచి బయటపడలేక గుంజుకుపోతున్నాడు. చివరికి తనను తాను అంతం చేసుకునేంత స్థితికి దిగజారిపోతున్నాడు. ఎలా బయటపడాలి..? ముందుకు కెరీర్ పరంగా లేదా ఆర్థిక పరంగానో,కుటుంబ పరంగానో మీరు ఉన్నతంగా లేదా మంచి స్థాయిలో లేకపోయామనే నిరాశ ఉంటే..దాన్ని వెంటనే మనసులోంచి తీసేయండి. అందరూ అన్ని సాధించలేకపోవచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే అది గుర్తించుకోండి. మొక్కలన్నింటి పువ్వులు ఉండవు. పుష్పించిన పూలన్నీ సుగంధాలు వెదజల్లవు. కానీ వాటికి ఉండే ప్రత్యేకత విభిన్నం, పోల్చదగినది కాదు. ఔనా!. సుగంధ భరితం కానీ పువ్వు ఔషధం అవుతుంది. సుగంధం వెద్దజల్లే పువ్వు అత్తరుగా మారతుంది. అలాగే మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనం కోల్పోయినవి, సాధించలేనివి తలుచుకుని.. వాటితో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆత్యనూన్యతకు గురై బాధపడటం మానేయండి. మొదట మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు గుర్తు తెచ్చుకోండి. రికార్డు స్థాయి విజయాలు కాకపోయినా పర్వాలేదు. మీదైనా చిన్ని ప్రపంచంలో మీరు సాధించింది ఎంత చిన్నవైనా అవి గొప్పవే. మీలా మీ స్థాయిలో ఉన్నవాళ్లు ఎవ్వరూ సాధించలేకపోయారు లేదా చేరుకోలేకపోయారు. కనీసం మీరు ప్రయత్నించారు, కొంత అయినా సాధించారు అని మనస్సు పూర్తిగా ఫీలవ్వండి, సంతోషపడండి. పరాజయం పెద్దదైన చిన్నదైనా ఐ డోంటే కేర్ అనే పదం స్మరించండి. అది అన్నింటికీ అసలైన మందు. ఏ రోజుకైన ఎప్పటికైనా మీకంటూ ఓ రోజు వస్తుంది. మీరు సాధించగలుగుతారు అనేది సత్యం అని చాలా బలంగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇలా అనుకుంటే ఎలాంటి మానసిక వ్యాధైనా పరారే. వియోగం వల్ల వచ్చే మానసిక బాధ.. మనకు నచ్చిన వ్యక్తి లేదా ఆత్మీయుడు మన సొంతం అనే వ్యక్తి కాలవశాత్తు లేదా ప్రమాదవశాత్తు దూరం అయినా మానసికంగ కుంగిపోవద్దు. ఇది సర్వసాధారణం. అందరి జీవితాల్లో జరిగేదే. కొందరికి చిన్నతనంలోనే నా అనేవాళ్లు దూరం అయితే మరికొందరికీ ఓ స్టేజ్లో దూరం అవ్వచ్చు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ముందుకు సాగిపోండి. అదే ప్రేమికులు/భార్యభర్తలు విడిపోయినా లేదా చనిపోయినా మీ బాధ వర్ణనాతీతం. ఎవ్వరూ తీర్చలేనిది తట్టుకోలేనిది ఒప్పుకుంటాం. కొందరూ మన జీవిత ప్రయాణంలో కొంత వరకే. వారి జ్ఞాపకాలు మన వెంట పదిలంగా ఉంటాయి. గుండె నిండా శ్వాస పీల్చుకుని వారిని గుర్తు చేసుకోండి అలానే ఎందుకు దూరం అయ్యారని బాధపడొద్దు. మీకు తీరని ద్రోహం చేసి నిలువునా మోసం చేసి వెళ్లిపోయారని అస్సలు చింతించొద్దు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇదొక గుణపాఠంగా తీసుకో. నీ స్థాయికి సరిపోని వాడు అని గడ్డిపరకను తీసిపడేసినట్టు పడేయి. నీ మనసు పట్టి పీడుస్తున్న వేదన దూదిపింజలా తేలిక అయిపోతుంది. మనిషి ఎంతో తెలివైన వాడు. అసాధ్యలన్నింటిని సాధించగలుగుతాడు. తనలాంటి సాటి మనుషుల చేతిలో మోసపోయిన, ధగ పడితే మాత్రం తిరిగి లేచి నిలబడలేక విలవిలలాడతాడు. ఎందుకిలా? 'ఓ మనిషి' నీకు మహాశక్తి ఉంది. మెలి పెడుతున్న మనుసును మధించి సరైన మార్గంలో పెట్టి దూసుకుపోవాలి. గమ్మతైన మనసు కథ.. మనల్ని ఎంతో ప్రేమించి మనమే సర్వస్వం అనుకునే వాళ్లని ప్రతి క్షణం స్మరించం. కానీ మనల్ని బాధపెట్టిన వాడిన మన మనసు పదే పదే గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది. నీలో నీవే తిట్టుకుంటూ, భోంచేసినా, కూర్చొన్నా, అతడినే గుర్తు తెచ్చుకుంటావు. మనకు ఇష్టం లేకపోతే మనకు నచ్చిన స్వీట్ అయినా పక్కన పెడతాం. అలాంటిది మనకు నచ్చని వ్యక్తి, వేదన పాలు చేసిన వాళ్లను, వాళ్ల తాలుకా గాయాలను ఎందుకు తలుచుకుంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా?. కనీసం ఛీ! వీడు నన్ను ఇంతలా బాధపెట్టాడు గుర్తు తెచ్చుకోవడమే పాపం అని గట్టిగా మీరు అనుకున్నట్లయితే. ఏ మానసిక సమస్య మీ దరిదాపుల్లోకి రాగలదు. జీవితం సాఫీగా సాగితే నీ గొప్పదనం ఉండదు. ఆటుపోట్లు ఉంటేనా మంచి కిక్కు ఉంటుంది. అదే నీ గొప్పతనన్ని బయటపెట్టుకునే ఓ గొప్ప అవకాశం. దురదృష్టవంతుడివి కాబట్టి కష్టాలు రాలేదు. నువ్వు తట్టుకోగల సమర్థుడువి కాబట్టే నీకు వచ్చాయి. అవే రాకపోతే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. పైగా నువ్వు గొప్పోడివి అని చూపించుకునే అవకాశం ఉండదు. మిత్రమా! సాధించలేకపోవడంలోనే సాధన ఉంది. కోల్పోవడంలోనే పొందడం ఉంది. ఇదే నిజం! కూల్గా ఆలోచించి.. మనో చిత్తాన్ని పట్టిపీడించే చింతను చిత్తుచేసి మానసికంగా ధృఢం ఉండేలా మనసుకి శిక్షణ ఇవ్వండి. సులభంగా మానసిక అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
మా తరానికి విద్యా ప్రదాత సీఎం జగన్
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మా మాటలను ప్రపంచమంతా ఆసక్తిగా ఆలకించిందంటే మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల పుణ్యమే! చెట్ల కింద సాగే వానాకాలం చదువులను సంస్కరణల బాట పట్టించిన సీఎం జగన్ సర్దే ఆ గొప్పతనమంతా! చదువులతోటే పేదరికాన్ని ఎదిరిద్దామన్న ఆయన పిలుపు అక్షర సత్యం! విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చో దేశానికే మార్గ నిర్దేశం చేశారు. ప్రతిభతో రాణిస్తున్న పేదింటి బిడ్డలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఐరాస, వరల్డ్ బ్యాంక్ వేదికగా అంతర్జాతీయ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించడం.. ఎన్నడూ రాష్ట్రం దాటని మేం ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో కాలు మోపడం.. కాణీ ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి రావడం.. ఇదంతా ఇంకా నమ్మశక్యంగా లేదు!.. ఇదీ నిరుపేద కుటుంబాల్లో జన్మించి అంతర్జాతీయ వేదికలపై అందరినీ ఆకట్టుకున్న 10 మంది విద్యార్థుల మనోగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 45 లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించి వివిధ వేదికలపై తమ గళాన్ని సగర్వంగా వినిపించారు. ప్రభుత్వ బడి నుంచి ఐఎంఎఫ్కు.. ఎకరం పొలంతో పాటు కేబుల్ ఆపరేటింగ్ పనులు చేసుకునే రైతు బిడ్డనైన నాకు 190 దేశాలకు సభ్యత్వమున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే. అది సీఎం జగన్ సర్ తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమే. మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాన్ని అగ్రరాజ్యం ప్రతినిధులకు వివరించడం చాలా సంతోషంగా ఉంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, షూలు, నాణ్యమైన పోషకాహారం, ట్యాబ్లు, కార్పొరేట్ స్థాయిలో పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని తెలియచేశా. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రమణ్యన్ మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరువకూడదని, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఖండాతరాలకు విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నా. పేద పిల్లలకు జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉంది. – వంజివాకం యోగీశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరసింగాపురం, తిరుపతి జిల్లా ఎన్నడూ చూడని సదుపాయాలు.. మా బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాం. గతంలో ఎన్నడూ చూడని సదుపాయాలను సీఎం జగన్ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – నాగరాజు, విజయ (యోగీశ్వర్ తల్లిదండ్రులు, అక్క) నిజంగా.. నేనేనా! ఐరాస, వరల్డ్ బ్యాంకుల్లో ప్రసంగించింది నేనేనా అని ఆశ్చర్యంగా ఉంది. అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించడాన్ని కూడా నమ్మలేకున్నా. సోషల్ పుస్తకంలో ఫొటో మాత్రమే చూసిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఒక రోజంతా ఉన్నాం. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ కార్యక్రమంలో పాల్గొని ఇతర దేశాల విద్యార్థులతో ముచ్చటించి వారి సంస్కృతిని తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలను వివరించాం. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద తదితర పథకాల అమలు తీరుతోపాటు బడుల్లో తాగునీరు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, ల్యాబ్స్తో పాటు జగనన్న కానుక కింద స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, షూలు ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇవ్వడంపై వరల్డ్ బ్యాంక్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో మాట్లాడాం. నయాగరా వాటర్ ఫాల్స్ చూశాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, 2001లో కూలిపోయిన ట్విన్ టవర్స్ చరిత్ర తెలుసుకున్నా. – అల్లం రిషితారెడ్డి, కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల, విజయనగరం ఇంత గుర్తింపు ప్రభుత్వ చలవే.. గతంలో మా ఇద్దరు అమ్మాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాం. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాం. ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదివించి ఉంటే ఇంత గుర్తింపు లభించేది కాదు. – ఉదయలక్ష్మి, రామకృష్ణారెడ్డి (రిషితారెడ్డి తల్లిదండ్రులు) విద్యా సంస్కరణల అమలుతో.. మా అమ్మ ఫాతిమా వ్యవసాయ కూలీ. మాలాంటి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసగించే అవకాశాన్ని సీఎం జగన్ సర్ కల్పించారు. అమెరికాలో 15 రోజుల పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. విద్యాపరంగా ఎలాంటి సంస్కరణలు అమలుపరిస్తే దేశం అభివృద్ధి చెందుతుందో ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాడు–నేడు, విద్యాకానుక, డిజిటల్ బోధన, గోరుముద్ద, అమ్మఒడి లాంటి పథకాలను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా స్వేచ్ఛ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – షేక్ అమ్మాజాన్, ఏపీ ఆర్ఎస్, వేంపల్లి, శ్రీసత్యసాయి జిల్లా పేద కుటుంబాలకు విద్యా ప్రదాత ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న సీఎం జగన్ మా తరంలో పేద కుటుంబాలకు విద్యా ప్రదాతగా నిలిచిపోతారు. మన రాష్ట్రంలో తెచ్చిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఐరాస వేదికగా వీటిని చాటిచెప్పాం. ఈ పర్యటనను కలలో కూడా ఊహించలేదు. మాలాంటి పేద విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం వల్లే ఈ అవకాశం లభించింది. రెండు వారాల పాటు ఎందరో ప్రముఖులతో చర్చించడం గర్వంగా ఉంది. – మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ, ఎటపాక, ఏఎస్ఆర్ జిల్లా ధీమాగా చదువులు.. కేజీబీవీలో చదువుకున్న నా బిడ్డకు ఈ అవకాశాన్ని కల్పిం చిన సీఎం జగన్కు రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలాంటి తండ్రులకు పిల్లల చదువులపై బెంగ పోయింది. డబ్బున్న వారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపడం విద్యా సంస్కరణల పుణ్యమే. – రామారావు, ఆటో డ్రైవర్ (చంద్రలేఖ తండ్రి) ప్రపంచానికి చాటి చెప్పా.. మా నాన్న దస్తగిరి లారీ డ్రైవర్. అమ్మ రామలక్ష్మి రజక వృత్తిలో ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే అవకాశాన్ని సీఎం జగన్ కల్పిం చారు. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. న్యూయార్క్లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి తెలియచేశా. నాడు– నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించా. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. టాయిలెట్ల శుభ్రతతో పాటు బాలికలకు ప్రత్యేకంగా న్యాప్కిన్ల వాడకంపై అవగాహన కల్పించడం, అమ్మఒడి పథకంతో స్కూళ్లలో డ్రాప్అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ అంశాలను ఐరాస ప్రతినిధులకు వివరించా. మన దేశ ఆర్థి క వ్యవస్థలో యువత భాగస్వామ్యంపై ప్రసంగించా. ఐఐటీ గ్రాడ్యుయేట్స్లో చాలా మంది స్టార్టప్లు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పా. – చాకలి రాజేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్, నంద్యాల పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే మాకు.. కాకినాడ జిల్లా తీరప్రాంత గ్రామమైన రమణక్కపేటలో నిరుపేద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కుటుంబంలో జన్మించిన నాకు అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేలా సీఎం జగన్ సార్ గొప్ప అవకాశాన్ని కల్పించారు. నాన్న సింహాచలం సెక్యూరిటీ గార్డు కాగా అమ్మ శాంతి గృహిణి. నేను, చెల్లి, తమ్ముడు.. ఇదీ మా కుటుంబం. నాన్న కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే కుటుంబం నుంచి వచ్చిన నేను అమెరికా వెళ్లానంటే అది జగన్ సార్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల పుణ్యమే. విద్యతోనే అన్నీ సాధ్యమవుతాయని సీఎం సార్ చెబుతుంటారు. అది నిజమే. అందుకు నేనే నిదర్శనం. సాధారణ విద్యార్థులను ప్రభుత్వ ప్రతినిధులుగా అమెరికా పంపించి సీఎం జగన్ సర్ చరిత్ర సృష్టించారు. భవిష్యత్లో ఐఏఎస్ అయ్యి సీఎం జగన్ సార్ ఆశయ సాధనకు కృషిచేస్తా. రాష్ట్రంలోని విద్యా సంస్కరణలు విదేశాల్లో సైతం గుర్తింపు పొందాయి. కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవప్రదమైన జీవనోపాధులపై వివరించడం ఆనందంగా ఉంది. – దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల,వెంకటాపురం, కాకినాడ జిల్లా మరపురాని అనుభూతి.. ఐరాస, కొలంబియా యూనివర్సిటీల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై మాట్లాడటం మరపురాని అనుభూతి. మా జీవితాన్ని మలుచుకునేందుకు ఈ పర్యటన ఎంతో స్ఫూర్తినిచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేం. విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. – పసుపులేటి గాయత్రి, జడ్పీహెచ్ఎస్, వట్లూరు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా ఎంతో నేర్చుకున్నాం.. నాకు ఇంత అరుదైన అవకాశం జగన్ మామయ్య పాలనలో దక్కడం, అందుకు ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావడం ఎన్నటికీ మర్చిపోలేను. సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు జరిగిన విదేశీ విజ్ఞాన యాత్రలో ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్ని సందర్శించాం. కొలంబియా యూనివర్సిటీలో ఎకో ఎంబాసిడర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ట్విన్ టవర్స్ కూలిన చోటు, నయాగరా జలపాతం ఇలా వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాం. విదేశీ విద్యార్థులతో ముచ్చటించడం కొత్త అనుభూతిని కలిగించింది. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆర్థి క విషయాలు, అంతర్జాతీయ ఆర్థి క అవసరాలు, ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలను నేర్చుకున్నాం. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ను సందర్శించే అవకాశం రావడం మరపురాని అనుభూతి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో 12 శాతం విద్యపై ఖర్చు చేయటాన్ని బట్టి చదువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. – జి.గణేష్ అంజన సాయి, వల్లూరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా గిరిజన బిడ్డకు గర్వకారణం.. మాది కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామం. కుటుంబ కారణాలతో తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఏసీ బస్సు అంటే ఏమిటో కూడా తెలియదు. గతంలో ఓసారి విశాఖపట్నం, మరోసారి సైన్స్ ఎగ్జిబిషన్ కోసం విజయవాడ వెళ్లా. అలాంటిది మన రాష్ట్ర ప్రతినిధిగా విమానం ఎక్కి ఏకంగా అమెరికా వెళ్లి రావడం కలగానే ఉంది. మన విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలను ఐరాస, యూఎస్ స్టేట్ అధికారులకు వివరించా. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తెలియచేశా. వివిధ దేశాల విద్యార్థులతో మాట్లాడి భిన్న సంస్కృతులను తెలుసుకునే అవకాశాన్ని కల్పిం చిన ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు. – సామల మనస్విని, కేజీబీవీ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రభుత్వ స్కూళ్ల విశిష్టతను చాటిచెప్పాం.. నాన్న సోమనాథ్, అమ్మ గంగమ్మ వ్యవసాయ కూలీలు. పేద కుటుంబాల నుంచి వచ్చిన మేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిం చిన సదుపాయాలు, విశిష్టతను ప్రపంచానికి తెలియచేశాం. విద్యారంగంలో మన రాష్ట్రం ఏ స్థాయిలో రాణిస్తోందో చాటాం. ఈ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నా. యూఎన్వో హెడ్ క్వార్టర్స్, ఐఎంఎఫ్ సమావేశంలో ప్రసంగించడం మరచిపోలేని అనుభూతి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, నయగారా ఫాల్స్, మ్యూజియం, వైట్హౌస్ లాంటి ప్రదేశాలను సందర్శించడం మాలాంటి వారికి అసాధ్యం. సీఎం జగన్ సర్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిభ చాటిన మాకు మరువలేని అవకాశాన్ని కల్పిం చారు. చదువుల్లో రాణించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ సదస్సులకు ఎంపిక చేయడం దేశంలో ఇదే ప్రథమం. – మాల శివలింగమ్మ, కేజీబీవీ, ఆదోని, కర్నూలు జిల్లా -
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి -మంత్రి బుగ్గన
-
‘చెలిమి’కి అంకురం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా వ్యవస్థలో శాస్త్రీయతను జోడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేలా ‘చెలిమి’ విద్యార్థుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’అనే కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లలు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సమాయత్తం చేసుకొనేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోని అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏయే రంగాల్లో రాణిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయ మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు. మంచి భవిష్యత్ను అందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బి.వినోద్కుమార్ అన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
బురద చల్లుతూనే ఉంటారు.. పట్టించుకోవద్దు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల -
ఆర్బీఐ కొత్త తరం డేటా వేర్హౌస్ - ముందుగా వారికే..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త తరం డేటా వేర్హౌస్ అయిన సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను (సీఐఎంఎస్–సిమ్స్)ను ఆవిష్కరించింది. ముందుగా కమర్షియల్ బ్యాంకులు దీనికి రిపోర్టింగ్ చేయడం మొదలుపెడతాయని, ఆ తర్వాత అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకూ దీన్ని వర్తింపచేస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో 17వ స్టాటిస్టిక్స్ డే నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ప్రజలకు మరింత డేటాను అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర యూజర్లు ఆన్లైన్లో గణాంకాలపరమైన విశ్లేషణ చేపట్టేందుకు కూడా కొత్త సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుందని దాస్ చెప్పారు. -
ఓఎన్డీసీలో ఫిర్యాదుల పరిష్కారానికి ఆటోమేటెడ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులను కూడా ఈ–కామర్స్లో భాగం చేసేందుకు ఉద్దేశించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో టీ. కోషి తెలిపారు. త్వరలోనే ఆన్లైన్ పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. చిన్న రిటైలర్లు కూడా డిజిటల్ కామర్స్ ప్రయోజనాలను అందుకోవడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2021 డిసెంబర్లో ఓఎన్డీసీని ప్రవేశపెట్టింది. ఇది కొన్నాళ్లుగా శరవేగంగా విస్తరిస్తోందని, గత కొద్ది నెలల్లోనే నెట్వర్క్లోని విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య లక్ష దాటిందని కోషి వివరించారు. -
Karimnagar: అద్భుతం.. ఆకర్షణీయం
ఎప్పుడెపుడా అంటూ ఎదురుచూస్తున్న తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్ 14న వంతెన ప్రారంభించాలి. కానీ.. పనులు పూర్తికాకపోవడం.. ఓ సభలో మంత్రి కాలికి గాయంకావడం తదితర కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండురోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. #KarimNagar Cable Bridge 🌉. pic.twitter.com/MJgXbQHadO — Aravind Alishetty (@aravindalishety) June 16, 2023 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పర్యాటకంలో కలికితురాయిగా నిలి చే కేబుల్ బ్రిడ్జిని తొలుత నగరవాసులకు పరిచయం చేయాలని మంత్రి కమలాకర్ నిర్ణయించారు. స్థాని కులు వంతెనపై తిరిగేందుకు వీలుగా ప్రతీ ఆదివా రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాలకు అనుమతి నిలిపివేశారు. పర్యాటకులను రంజింపజేసేలా మ్యాజిక్ షో, మ్యూజిక్ షో, కళకారుల ఆటాపాటలు తదితర వినోద కార్యక్రమాలు సిద్ధంచేశారు. రకరకాల ఫుడ్కోర్టులు ఏర్పాటుచేయనున్నారు.దసరా వరకు కు టుంబాలతో వచ్చి సరదాగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. వంతెన వద్ద కొరియా సాంకేతికతతో రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నేపథ్యమిదీ.. వరంగల్ – కరీంనగర్ నగరాల మధ్య దాదాపు 7. కి.మీల దూరం తగ్గించడం, హైదరాబాద్–కరీంనగర్ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది. 2018లో రూ.180 కోట్ల అంచనా బడ్జెట్తో పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని దుర్గంచెరువు తీగల వంతెన తర్వాత తెలంగాణలో రెండో బ్రిడ్జి కరీంనగర్దే కావడం విశేషం. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో వంతెనను నిర్మించారు. రేపటి నుంచి కార్పొరేషన్ పరిధిలోకి.. వంతెన నిర్వహణ బాధ్యతలు గురువారం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్(ఎంసీకే) చేతుల్లోకి వెళ్లనుంది. వంతెనపై లైటింగ్, పారిశుధ్యం నిర్వహణ, విద్యుత్ తదితరాలు ఇకపై బల్దియా చూసుకుంటుంది. రెండేళ్లపాటు వంతెనకు సంబంధించిన సాంకేతికపరమైన నిర్వహణను మాత్రం ఆర్ అండ్ బీ అధికారులు చూస్తారు. వంతెనపై రెండు భారీ పిల్లర్ల అంచున నాలుగు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు ప్రకటనలు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చే యాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బ్రిడ్జి విశేషాలు.. 500 మీటర్ల పొడవైన రోడ్డు, ఫోర్లేన్ ఇటలీ నుంచి తెప్పించిన 26 పొడవైన స్టీల్ కేబుల్స్ వంతెనకు రెండు పైలాన్లు.. వీటి మధ్యదూరం 220 మీటర్లుపైలాన్ నుంచి ఇంటర్ మీడియన్కు దూరం 110 మీటర్లు రూ.180 కోట్ల బడ్జెట్.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్ వ్యవస్థ రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్వెడల్పు 21.5 మీటర్లు, ఒక్కోటి 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్లు టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం 2017 డిసెంబర్లో నిర్మాణానికి శంకుస్థాపన 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం 2023 జనవరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి2023 జూన్ 21న వంతెన ప్రారంభం పర్యాటక కేంద్రంగా.. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని టూరిజం స్పాట్గా నిలపాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల్లో భాగంగానే తీగల వంతెన ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయనకు కరీంనగర్ మీద ఉన్న మమకారం అలాంటిది. రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి, రూ.410 కోట్లు వెచ్చించి మానేరు పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్ ఫ్రంట్(ఎంఆర్ఎఫ్) ప్రాజెక్టును మంజూరుచేశారు. – మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్ పర్యటన ఇలా.. కేబుల్ బ్రిడ్జితోపాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మున్సిపల్, ఐటీ మినిస్టర్ కె.తారకరామారావు బుధవారం సాయంత్రం 5 గంటలకు రూ.10 కోట్లతో కశ్మీర్గడ్డలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 5.05 గంటలకు రూ.7 కోట్లు వెచ్చించి నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 కోట్ల వ్యయంతో సిటిజన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐసీసీ వీడియో వాల్ కంట్రోల్ రూం, 14 జంక్షన్ల ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్), 18 చోట్ల ఏర్పాటు చేసిన పబ్లిక్ అండ్రసింగ్ సిస్టం(పీఏఎస్), 8 చోట్ల వేరియబుల్ మెసేజింగ్ సిస్టం, ఐదుచోట్ల వాతావరణ సూచికలు, 18 ప్రాంతాల్లో వైఫై హాట్స్పాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు కమాన్మీదుగా ఓపెన్టాప్ జీపులో ర్యాలీగా వెళ్లి కేబుల్ బ్రిడ్జి ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన డైనిమిక్ లైటింగ్ సిస్టమ్కు స్విచ్ఛాన్ చేయనున్నారు. -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించిన సీఎం వైయస్ జగన్ గారికి కృతజ్ఞతలు
-
మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్ను విడుదల చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్ను పైలట్గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. దేశంలోని అన్ని టెలికాం నెట్వర్క్లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్కు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమోదించిన IMEI నంబర్లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్వర్క్లకు ఉంటుంది. అంటే తమ నెట్వర్క్లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్లను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? -
వాటర్లోని సూక్ష్మజీవులను క్షణాల్లోనే నాశనం చేసే డివైజ్, ధర ఎంతంటే?
ఇది అధునాతనమైన వాటర్ డిసిన్ఫెక్షన్ సిస్టమ్. అమెరికన్ కంపెనీ ‘అక్విసెన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ‘పెర్ల్ అక్వా డెకా 30సీ’ పేరిట రూపొందించిన ఈ వాటర్ డిసిన్ఫెక్షన్ సిస్టమ్ నీటిలో సాధారణంగా ఉండే ప్రమాదకరమైన సూక్ష్మజీవులను క్షణాల్లోనే నాశనం చేసి, నీటిని పరిశుభ్రంగా, సురక్షితంగా మారుస్తుంది. ఇది యూవీసీ– ఎల్ఈడీ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఆన్ చేసుకోగానే దీనిలో వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు, దీని నుంచి సరఫరా అయ్యే నీటిలోని సూక్ష్మజీవులను 99.9 శాతం మేరకు నాశనం చేస్తాయి. ఇళ్లల్లోనే కాకుండా, వాణిజ్య సంస్థల్లోను, కార్యాలయాల్లోను వినియోగించుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుందని ‘అక్విసెన్స్’ సీఈవో ఆలివర్ లావాల్ చెబుతున్నారు. దీని ధర 500 డాలర్లు (రూ.40,957) మాత్రమే! -
దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్గేమ్': న్యాయశాఖ మంత్రి
కేంద్ర న్యాయశాఖ మంత్రి కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ మేరకు రిజిజ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియమాకానికి సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సుప్రీం కోర్టు కొలీజియంకి సంబంధించిన సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కొలీజియం ఇష్యూ అంతా మైండ్గేమ్గా అభివర్ణించారు. దీనిపై తాను మాట్లాడనని కూడా చెప్పారు. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్లో 4జీ సేవల కోసం 254 మైబెల్ టవర్లను అంకితం చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ..కఠినమైన భూభాగాలను కలిగిన సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత స్థానికులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రిజిజు అరుణాచల్ ప్రదేశ్లోని తపిర్ గావో లోక్సభకు ప్రాతినిధ్యం వహస్తున్నారు. కాగా, ఆయన కొలీజియంని మన రాజ్యాంగానికి విరుద్ధమైనదిగా కూడా పిలివడం గమనార్హం. (చదవండి: ఇది నిజం మాట్లాడినందుకు చెల్లిస్తున్న మూల్యం! రాహుల్ గాంధీ) -
ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్
ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు. -
వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తున్నారు : మంత్రి ఆదిమూలపు సురేష్
-
గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాజ్ భవన్ వద్ద సీపీఐ నినాదాలు
-
అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా?
దేశంలో గవర్నర్ల వ్యవస్థ రాను రానూ వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నారు గవర్న ర్లు. వారి బాధ్యత రాజ్యాంగ పరిరక్షణతో పాటూ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలూ, సూచనలూ ఇవ్వడం. శాసనసభలో ఎవరికీ మెజారిటీ రాని సందర్భంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరిని తొలుత ఆహ్వానించాలనే అంశంలో, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. రాష్ట్ర శాసన సభ, మండలిలో ఆమోదించిన బిల్లు లను లాంఛనంగా ఆమోదించడం గవర్నర్ విధి. కొన్ని ప్రత్యేక, అసాధారణ సందర్భాలలో బిల్లులను రాష్ట్రపతికి పంపవచ్చు. లేదంటే గవర్నరే బిల్లులపై తన అభిప్రాయంతో సహా తిరిగి చట్ట సభలకు పంపవచ్చు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుండి తిరిగి వచ్చిన బిల్లులను, గవర్నర్ అభిప్రాయానికి అనుగుణంగా సవరించినా, లేదా యధావిధిగా మరోసారి ఆమోదించి పంపినా గవర్నర్కు వాటిపై ఆమోద ముద్ర వేయడం తప్ప వేరే మార్గం లేదు. బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న తీరు అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా? అనే చర్చను తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణలో గవర్నర్ వద్ద శాసనమండలి, శాసనసభ ఆమోదించి పంపిన ఏడు బిల్లులు రెండు నెలలకు పైగా.. కేరళ శాసననసభ ఆమోదించిన ఆరు బిల్లులు నెలలు తరబడీ, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 20 బిల్లులను అనేక మాసాలుగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్లో పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలలో గవర్నర్లను ఉపయోగించు కొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొత్తేమీ కాదు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ... గవర్నర్ల నుండి రప్పించిన తప్పుడు నివేదికల ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను డిస్మస్ చేసి రాష్ట్రపతి పాలనను విధించి, గవర్నర్ల ఆధ్వర్యంలో కేంద్రం పాలన సాగించడం చూశాం. కేరళలో ఎన్నికైన కమ్యూ నిస్టు ప్రభుత్వమే మొదటిసారిగా ఆర్టికల్ 356 బారిన పడింది. ఇప్పటి వరకు 41 ప్రభుత్వాలు అలా డిస్మిస్ కాబడ్డాయి. 1977లో జనతాపార్టీ అప్పటివరకు ఉన్న గవర్నర్లను డిస్మిస్ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకొంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ విధంగానే గవర్నర్ల మార్పు కొనసాగింది. 1984లో ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీ ఆర్ను నాటి గవర్నర్ రాంలాల్ పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతాన్నీ, కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఆర్ బొమ్మై చారిత్రాత్మక కేసునూ ఎలా మరవగలం? బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. గతంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖంఢ్ వంటి రాష్ట్రా లలో అత్యధిక శాసనసభ్యులు ఎన్నికైన పార్టీని విస్మరించి, బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు గవర్నర్లు సహ కరించారు. అరుణాచల్ ప్రదేశ్లోనైతే 2016లో గవర్నర్ ఆజ్ఞ మేరకు శాసనసభ సమావేశాలను ముందుకు జరిపి, ముఖ్యమంత్రి లేకుండానే ఏకంగా ఒక హోటల్లో అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. 2019లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ మెజారిటీ లేనప్పటికీ తెల్లవారు జామున బీజేపీకి చెందిన ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, వారి పార్టీ ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయాలనూ, ఆ సందర్భంగా గవర్నర్ వ్యవహరించిన తీరునూ ప్రజలంతా గమనించారు. సర్కారియా కమిషన్తో పాటు, అనేక కమిషన్లు గవర్నర్ వ్యవస్థ తీరును తప్పు పట్టాయి. దాని ప్రక్షాళనకు అనేక సిఫార్సులు చేశాయి. కానీ అవన్నీ బుట్ట దాఖలే అయ్యాయి. గవర్నర్ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే... అది ఆరవ వేలు లేదా అపెండిక్స్ లాంటిదని అర్థమవుతోంది. దాన్ని రద్దు చేయడమే ఏకైక మార్గం. ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీర్మానం కూడా చేసింది. గవర్నర్ వ్యవస్థ రద్దయితే... అది నిర్వహించే బాధ్యతలను న్యాయ వ్యవస్థకూ, శాసన సభలోని సెలెక్ట్ కమిటీ లేదా స్టాండింగ్ కమిటీకి అప్పగించవచ్చు. ఉదాహరణకు మెజారిటీ లేని సందర్భంలో సీఎంగా ఎవరిని ఆహ్వానించాలి, ప్రమాణ స్వీకారం, బలాబలాలు లాంటి వివాదాస్పద అంశాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. సంక్లిష్ట సమస్యలపై బిల్లులను కూలంకషంగా చర్చించేందుకు సెలెక్ట్ కమిటీకి నివేదించవచ్చు. లేదా స్టాండింగ్ కమిటీలకు అందించవచ్చు. ఆ కమిటీలు సూచించిన ప్రతి పాదనలతో బిల్లులపై చర్చించి చట్టసభలు ఆమోదిస్తే, గవర్నర్ జోక్యం ఇక అవసరం ఉండదు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి -
న్యాయవ్యవస్థలో కుల ప్రస్తావన దురదృష్టకరం : ఏపీ అడిషనల్ ఏజీ పొన్నవోలు
-
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు. -
వ్యాక్సిన్ పంపిణీకి ప్రధాని కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే తరహాలోనే వ్యాక్సిన్ పంపిణీకి సిద్దం కావాలంటూ ప్రధాని అధికారులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే కరోనా వ్యాక్సీన్ డెలివరీ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థలు పాల్గొనేలా చూడాల్సి ఉందన్నారు. దేశంలోని కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని, టీకా పంపిణీ, ఆయా వ్యవస్థల సంసిద్ధతను ప్రధాని శనివారం సమీక్షించారు. (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్) దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సిన్ను వేగంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధాని కోరారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సీన్ అందుబాటులో ఉండాలని సూచించారు. లాజిస్టిక్స్, డెలివరీ, పద్ధతులు అడుగడుగునా కఠినంగా ఉండాలని, కోల్డ్ స్టోరేజ్ చెయిన్ అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్వర్క్, వ్యాక్సినేషన్ క్లినిక్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ఇందుకు దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందులో రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్య నిర్వాహకులు, పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అవసరమైన అన్ని డొమైన్ల నిపుణులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ప్రధాని ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్), ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర ముఖ్య అధికారులు, ప్రభుత్వ ఇతర విభాగాలు పాల్గొన్నాయి. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1,12,998కు చేరుకుంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 65 లక్షలు దాటి రికవరీ రేటు 87.78 శాతానికి చేరిందని మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఈ ఏడాది నుంచే ‘ఆనర్స్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆనర్స్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్ సమీక్ష అనంతరం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. ♦విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ సహా వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నందున ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ 90 శాతానికి పెరగాలి. 3 ఏళ్ల డిగ్రీ, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే అమలు. వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లోనూ ఆనర్స్ విధానం. ♦నాలుగేళ్ల బీఈ, బీటెక్ కోర్సుల్లో 10 నెలలు అప్రెంటిస్షిప్ విధానం. కనీసం 20 క్రెడిట్లు సాధిస్తే బీటెక్ ఆనర్స్ డిగ్రీ. ఉదాహరణకు బీటెక్ మెకానికల్ చేస్తూ కంప్యూటర్ సైన్సులో కొన్ని అంశాలను అధ్యయనం చేయడం ద్వారా 20 క్రెడిట్లు సాధిస్తే ఆ విద్యార్థికి బీటెక్ ఆనర్స్ ఇవ్వాలని సూచన. ♦ప్రకాశంలో ఉపాధ్యాయ విద్య కోర్సుకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక వర్సిటీ, విజయనగరంలో మరో కొత్త వర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశం. టీచర్ ట్రైనింగ్ వర్సిటీకి జిల్లాల్లోని టీచర్ ట్రైనింగ్ సంస్థలు అనుబంధంగా ఉంటాయి. ♦సెప్టెంబర్ 3వ వారం నుంచి ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ. -
అవాంఛిత కాల్స్ నియంత్రణకు వ్యవస్థ
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా వ్యాపారపరమైన అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ మొదలైన వాటిని నియంత్రించేందుకు చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ–కామర్స్ విధానంపై రూపొందించిన 41 పేజీల ముసాయిదాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాధిత ఆన్లైన్ వినియోగదారుల ఫిర్యాదులను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పరిష్కరించి, పరిహారం చెల్లించే అంశం కూడా ఇందులో ఉంది. ఇందుకోసం ఈ–కన్జూమర్ కోర్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదన సైతం ఈ ముసాయిదాలో పొందుపర్చారు. ఇక ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్లో కార్యకలాపాలు నిర్వహించే వెబ్సైట్లు, యాప్స్ అన్నీ తప్పనిసరిగా దేశీయంగా వ్యాపార సంస్థగా రిజిస్టర్ అయి ఉండాలి. కొరియర్స్ ద్వారా భారత్కు వస్తువులను పంపే క్రమంలో కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించే చైనా వెబ్సైట్లకు కళ్లెం వేసే క్రమంలో తాత్కాలికంగా అటువంటి పార్సిల్స్పై నిషేధం విధించాలని ముసాయిదా ప్రతిపాదించింది. అయితే, ప్రాణావసర ఔషధాలకు మాత్రం మినహాయింపునివ్వచ్చని పేర్కొంది. -
నవ దశాబ్ద నారీమణి
ఉద్యమాల్లో మహిళలు.. చట్ట సభల్లో మహిళలు.. సదస్సులలో మహిళలు.. సమాలోచనల్లో మహిళలు! ఈ ఏడాది మొత్తం ప్రతి రంగంలోనూ, ప్రతి సందర్భంలోనూ మహిళలు క్రియాశీలంగా ఉన్నారు. 2019లో కూడా ఈ ఒరవడి కొనసాగబోతోంది. కొన్ని గంటల్లో రాబోతున్న కొత్త సంవత్సరం.. ఒక కొత్త మహిళా దశాబ్దపు ‘మార్చ్’కి తొలి అడుగు అయినా ఆశ్చర్యం లేదు. తక్కెడ సమానంగా ఉండాలి. సూచీ నిటారుగా ఆకాశాన్ని చూస్తుండాలి. అదే సరైన కొలమానం. సూచీ అటు వైపుకో ఇటువైపుకో వంగిందీ.. అంటే అది సమతూకం కానే కాదు. సమతూకం వ్యాపార సంబంధాల్లోనే కాదు, సామాజిక సంబంధాల్లోనూ ఉండాలి. సమతూకం లేని చోట సమన్యాయం జరగదు. వ్యవస్థ అవ్యవస్థీకృతంగా జడలు విప్పుతుంది. సమాజంలో మహిళ పరిస్థితీ అలాగే ఉంది. అందుకే ఇన్ని సదస్సులు, సమావేశాలు, చర్చలు, తీర్మానాలూ ఇంకా అవసరమవుతూనే ఉన్నాయి.‘ ‘వేకువ జామున లేచాను. ఇంటెడు చాకిరీ. చేస్తూనే ఉన్నాను. ఇంకా చేయాల్సిన పనులెన్ని ఉన్నాయో, ఇవన్నీ పూర్తయ్యేదెప్పుడు, ఒక ముద్ద తిని నడుం వాల్చేదెప్పుడు..’’ ఇది మధ్య తరగతి ఇల్లాలి ఆవేదనలాగానే కనిపిస్తుంది. కానీ ఇది సగటు ప్రపంచ మహిళ ఆవేదన. తాను ఇప్పటికే చక్కబెట్టిన పనులను తృప్తిగా కళ్ల నిండుగా చూసుకుందామనేలోపు కాలం తరుముతూ ఉంటుంది ఇంకా మిగిలిపోయి ఉన్న పనులను గుర్తు చేస్తూ. మహిళ పరిస్థితీ అంతే. ఒకమ్మాయి ఒక పతకం గెలిచిందని సంతోషంగా ఆకాశానికి ఎత్తేస్తుంటుంది మీడియా. ఆమె స్ఫూర్తితో ముందడుగు వేయండి... అని వెన్నుతడుతుంది. ఆ ప్రోత్సాహాన్నందుకుని ఒక అడుగు వేద్దామని సమాయత్తమయ్యే లోపు మరో పేజీలో మహిళల మీద హింస, లైంగిక దాడులు... ఆడపుట్టుకకు ఎన్ని కష్టాలో అని వికటాట్టహాసం చేస్తుంటాయి. ఇది సంఘర్షణ మహిళాభివృద్ధి, మహిళల స్థితిగతుల మీద ఏటా సింహావలోకనం ఉంటుంది. ఆ పునశ్చరణలో ‘సాధించింది ఎంత; సాధించాల్సింది ఎంత’ అనే తులనాత్మకమైన అధ్యయనాలు జరుగుతూనే ఉంటాయి. మహిళల పోరాటాన్ని ‘సమానత్వ సాధన పోరు’ అంటుంది అభ్యుదయ సమాజం. ‘ఆధిక్యత కోసం ఆరాటం’ అంటుంది పురుషాధిక్య భావజాలం. ‘ఇది మా అస్తిత్వ వేదన, మనుగడ కోసం గుండెల్లో చెలరేగుతున్న సంఘర్షణ మాత్రమే, అర్థం చేసుకోండి’ అంటోంది స్త్రీ ప్రపంచం . తప్పని ఆత్మగౌరవ పోరు మహిళ వంటింటికి పరిమితం కావడం లేదిప్పుడు. తనను తాను నిరూపించుకోవడానికి కత్తిమీద సాము చేస్తోంది. ఆమె విజయాలను చూపిస్తూ ‘చూశారా! మేము మహిళలకు ఎన్ని అవకాశాలిచ్చామో’ అంటోంది మేల్ చావనిజం. ‘ఇవ్వడానికి మీరెవరు? మా జీవితాన్ని మా చేతుల్లో ఉంచుకోనివ్వకుండా దోపిడీ చేసిందే మీరు కదా’ అని మహిళ మనసు రోదిస్తూనే ఉంటుందా మాటలు విన్న ప్రతిసారీ. ‘అయినా సరే... మేమేంటో మళ్లీ నిరూపించుకుంటాం. మీ చేతుల్లో చిక్కుకున్న మా జీవితాలను మా వెన్నెముక మీద నిలబెట్టుకుంటాం’ అని తిరిగి స్వీయనిరూపణ కోసం స్వయంశక్తిని అర్పించడానికి ప్రతిరోజూ కొత్తగా సిద్ధమవుతూనే ఉంటుంది మహిళ. అప్పుడు బయటపడుతోంది మరో మేల్ కోణం. ‘మీరు అర్పించాల్సింది మేధను కాదు, శ్రమను కాదు. జస్ట్ దేహాన్ని’ అంటూ పురుషాధిక్యత తన అమానవీయ కోణాన్ని అలవోకగా బయటపెడుతోంది. ఇన్ని అరాచకాల మధ్య... మహిళ అస్తిత్వ పోరాటంలో ఆత్మగౌరవ పోరాటం అనివార్యంగా వచ్చి చేరింది. ఆ పోరాటమే లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలను నిరసిస్తూ భారతీయ మహిళ కదం తొక్కుతున్న ‘డిగ్నిటీ మార్చ్’. ఈ ఏడాది డిసెంబర్ 20న ముంబయిలో మొదలైన ఈ మార్చ్ వచ్చే ఫిబ్రవరి 22న న్యూఢిల్లీకి చేరనుంది. అయినా.. మహిళావాదం, మహిళ అవసరాలు, స్థితిగతులు.. అంటూ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేని రోజు ఎప్పటికి వస్తుంది? ఎప్పుడైనా, ఎక్కడైనా... అది ప్రాచ్యమైనా, పాశ్చాత్యమైనా సరే... పురుషవాదం జడలు విప్పినప్పుడే మహిళావాదం పురుడు పోసుకుంటుంది. అప్పటి వరకు ఉండేది వ్యక్తివాదమే. సమన్యాయం లేని సమాజంలో సమతూకం కోసం, వ్యక్తివాద సమాజం కోసం మహిళలు తరంగంలా కదిలి వస్తున్నారు. ‘మాతోపాటు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాం’ అని నినదిస్తున్నారు. వ్యక్తివాద సమాజం ఎప్పటికి వచ్చినా అది మహిళల పోరాటంతోనే వస్తుంది. ఆ పోరాటం ఎన్నేళ్లనేదే అంతుచిక్కని ప్రశ్న. – వాకా మంజులారెడ్డి -
వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది
హైదరాబాద్: వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పదని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయాధికారులు వ్యవస్థ గొప్పతనాన్ని ఇనుమడింపజేయాలని సూచించారు. ప్రతి పనికి నిర్ధిష్టమైన విధానం ఉండటం అవసరమని అన్నారు. వివిధ రకాల కేసులకు సంబంధించిన విచారణకు ప్రత్యేక విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి జ్యుడీషియల్ అకాడమీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ కోర్టు.. శిక్షణలో ఉన్న న్యాయాధికారులు, జడ్జీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి జ్యుడీషియల్ అకాడమీలో గౌరవ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ వి.రాఘవేంద్ర ఎస్ చౌహాన్, జ్యుడీషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు పీవీ సంజయ్కుమార్, సి.సుమలత, ట్రెయినీ న్యాయాధికారులు, జ్యుడీషియల్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు జ్యుడీషియల్ అకాడమీలో కంప్యూటర్ ల్యాబ్, చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి జ్యుడీషియల్ అకాడమీ రూపొందించిన స్టాండర్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు. -
పని ఎక్కువ...జీతం తక్కువ
విద్యాశాఖలో ఉపాధ్యాయులు, సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్స న్స్ (సీఆర్పీ)ను ప్రభుత్వం విస్మరిస్తోంది. మండల విద్యాశాఖాధికారుల పరిధిలో పనిచేసే సీఆర్పీలు రోజురోజుకూ పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్కూల్ అసి స్టెంట్లతో సరిపోయే అర్హతలతో నియమితులైన సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం అందని ద్రాక్షగానే మిగిలింది. డిగ్రీ, బీఎడ్, టెట్, పీజీ చేసిన వారు కూడా సీఆర్పీలుగా పనిచేస్తున్నా.. వారికి చాలీచాలని వేతనాలే అందుతున్నాయి. అరకొరగా ఇస్తున్న వేతనాలు రవాణా ఖర్చులకే సరిపోతుండడంతో జీవనోపాధికి నానాపాట్లు పడుతున్నారు. – సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి ఎర్ర శ్రీనివాస్ సీఆర్పీ వ్యవస్థ ఏర్పడిందిలా.. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి డిప్యూటేషన్పై ఎమ్మార్పీ (మండల రిసోర్స్ పర్సన్)లుగా నియమించే వారు. పాఠశాలలు దెబ్బతింటున్నాయనే ఉద్దే శంతో ఆ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ విధా నంలో ఆరేళ్ల క్రితం (2012లో) సీఆర్పీ వ్యవస్థ ను రూపొందించింది ప్రభుత్వం. డీఎస్సీ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణత, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం సీఆర్పీలను నియమించారు. నియామక సమ యంలో రూ.5,500 వేతనం. అందులోనే టీఏ బిల్లు ఇచ్చేవారు. క్రమంగా.. 2013లో రూ. 7 వేలు, 2014లో 8,500 చెల్లించారు. ప్రస్తుతం రూ.15వేలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2298 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. ఇవీ డిమాండ్లు..: ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనం రూ. 28,940 స్కూల్ అసిస్టెంట్ పోస్టు కేటగిరి ప్రకారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్, ఆరోగ్యకార్డులు, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఏడాదికి 22 సాధారణ సెలవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. కేజీ నుంచి పీజీ విద్యలో భాగస్వాములను చేయాలి. వేతన వ్యత్యాసం వివిధ రాష్ట్రాలలో సీఆర్పీలకు ఇచ్చే వేతనాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే వేతనాలకు వ్యత్యాసం భారీగా ఉంది. ఉత్తరాఖండ్లో రూ. 75 వేలు, గుజరాత్లో రూ. 55,640, హర్యానాలో రూ.54వేలు, తమిళ నాడులో రూ. 51 వేలు, హిమాచల్ప్రదేశ్లో రూ. 57,390, సిక్కింలో రూ. 60,500 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా వేతనం కేవలం రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవీ సీఆర్పీల విధులు.. - సీఆర్పీలను స్కూల్ కాంప్లెక్స్లకు అనుసంధానించారు. ఒక్కో సీఆర్పీ దాదాపు 15 నుంచి 18 పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. - ఏదో ఒక స్కూల్ను ప్రార్థన సమయంలో సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేసుకొని వాట్సాప్లో అధికారులకు పంపాలి. - మండల వనరుల కేంద్రానికి, పాఠశాలలకు అనుసంధాన కర్తగా పని చేస్తూ సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. - ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే సీఆర్పీ విధులు నిర్వర్తించాలి. - కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సహకరించాలి. - సర్వశిక్షా అభియాన్తోపాటు ఇతర విద్యాశాఖ కార్యక్రమాలను చేపట్టాలి. - మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలి. - బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం, రెగ్యులర్గా రాని వారిని వచ్చేలా చేయడం వీరి విధి కూడా.. - పాఠశాలలో నిధుల వినియోగాన్ని సమీక్షించాలి. - క్లస్టర్ స్థాయిలో ఎగ్జిబిషన్ మేళాలు నిర్వహించడానికి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహకరించాలి. - వేసవి బడులను నిర్వహించాలి. -
రేయ్.. అఖిల్ ఆ విషయం నాకు చెప్పలేదూ..!
అవునా.. నాగార్జున–రామ్గోపాల్ వర్మ తుపాకీ ఎక్కుపెట్టారా? ‘సిస్టమ్’ని ప్రశ్నించబోతున్నారా? .. మంగళవారం ఫిల్మ్నగర్లో ఇదే చర్చ. దీనికి కారణం లేకపోలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రానికి ‘గన్’, ‘సిస్టమ్’ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారట. ఈ రెండిటిలో ఏ టైటిల్ని ఫిక్స్ చేస్తారబ్బా? అన్నది డిస్కషన్. కొంతమంది ‘గన్’కి ఫిక్సయ్యారు. ఎందుకంటే, చేతిలో గన్తో సీరియస్గా ఉన్న నాగార్జున లుక్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మాత్రం ‘సిస్టమ్’కి ఫిక్సయ్యారు. ఎవరేం ఫిక్స్ అయినా వర్మ వేరే ఫిక్స్ అవుతున్నారు. ‘‘ప్రచారంలో ఉన్న ఈ రెండు టైటిల్స్ నిజం కాదు’’ అని ‘సాక్షి’కి క్లారిటీ ఇచ్చారు రామ్గోపాల్ వర్మ. మరి.. ఏం పెట్టాలనుకుంటున్నారు? అంటే.. ‘శపథం’ అని ఊహించవచ్చు. ఎందుకంటే గాసిప్పురాయుళ్ల కథనాల్లో ఈ టైటిల్ కూడా ఉంది. మరి.. ఈ టీమ్ ఈ టైటిల్కే ఫిక్స్ అవుతుందని శపథం చేయొచ్చా? ఏమో.. మరి.. వర్మ ఏం ఫిక్స్ అయ్యారో? వెయిట్ అండ్ సీ. కాగా ఈ సినిమాలో మైరా సరీన్ అనే కొత్తమ్మాయి నాగార్జునతో జోడీ కడుతున్నారు. అఖిల్ చెప్పలేదు..! అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హాలో’. ఈ సినిమా ఆడియో గురంచి అఖిల్ ట్విట్టర్లో ‘‘జస్ట్.. ‘హాలో’ ఫైనల్ ఆడియో మిక్స్ విన్నా. సాంగ్స్ను మీ అందరికీ వినిపించాలని చాలా ఎగై్జటింగ్గా ఉంది. వెయిట్ చేయలేను. ఇవాళ (బుధవారం) సమ్థింగ్ లాంచ్ చేయబోతున్నాను’ అని అఖిల్ పేర్కొన్నారు. ‘‘ రేయ్.. అఖిల్ నువ్వు ఇవాళ సాంగ్ను లాంచ్ చేస్తున్నావన్న విషయం నాకు చెప్పలేదు? నువ్వు రిలీజ్ చేయబోయే సాంగ్ ఇదేనా? (పాట క్లిప్పింగ్ వీడియోను పోస్ట్ చేశారు). ఐ లవ్ ది సెట్ (పాట సెట్ను ఉద్దేశించి)æ’’ అని నాగార్జున సరదాగా ట్వీట్ చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఈ నెల 22న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అత్యాధునిక నిర్మాణం.. ట్రాఫిక్ నియంత్రణ
-
‘మాధ్యమిక ’ మాఫియా
విద్యా విధానంలో మార్పు రావాలి మాజీ ఎంపీ హర్షకుమార్ కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : ఇంటర్మీడియెట్ విద్య ఒక మాఫియాలా తయారైందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. స్థానిక రాజీవ్గాంధీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తెలు సైతం తాకట్టుపెట్టుకుని తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలి, అయితే ఫలితాలు వచ్చిన రోజే ఆయా కళాశాలల్లో సీట్లు అయిపోయాయని చెబుతున్నారని, ఎక్కడా రిజ్వేషన్ అమలు చేయడం లేదున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ.2,300 వరకు అయితే ఒకో విద్యార్థి నుంచి రూ.లక్షల్లో గుంజడం మాఫియాను తలపిస్తోందన్నారు. కళాశాలలన్నింటికీ ఒకే ఫీజు విధానం అమలు చేయాలన్నారు. పేద విద్యార్థుల్లో మంచి మార్కులు వచ్చిన వారిని తీసి, వారికి కార్పొరేట్ విద్యాసంస్థల్లో రూ.70 వేల వరకు ప్రభుత్వమే ïఫీజు కట్టడం ఎంత దారుణమో తెలుస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలలు నడుచుకోకపోతే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఇంటర్ బోర్డు ఆర్ఐవోకు ఉందన్నారు. బలహీన వర్గాలకు చెందిన 12 వేలమందికి పైగా విద్యార్థులు స్కాలర్షిప్కు నోచుకోలేదన్నారు. ఇంటర్ విద్యలో తయారైన మాఫియాను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ఆయన కోరారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించడం ఆనందదాయకమన్నారు. -
నూతన విధానం విద్యావ్యవస్థకు చేటు
కర్నూలు సిటీ: నూతన విద్యా విధానం-2016లో భాగంగా రూపొందించిన ప్రతిపాదనలు విద్యా వ్యవస్థను దెబ్బతిసేలా ఉన్నాయని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవింద రాజులు అన్నారు. స్థానిక మద్దూరునగర్లోని పింగళి సూరన తెలుగు తోటలో నూతన విద్యా విధానం-2016 ప్రతిపాదనలు, విద్యా రంగంపై ప్రభావం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గోవిందరాజుతోపాటు ఆర్యూ ప్రొఫెసర్ డా.గీతాసేత్, ప్రభుత్వ బీఎడ్, డైట్ కాలేజీల ప్రిన్సిపాల్స్ డా.పార్వతిదేవి, మున్నయ్య, రిటైర్డ్ అధ్యాపకులు డా.అబ్దుల్ హాక్, డా.ఎ కృష్ణ తదితరులు ప్రసంగించారు. విద్యను వ్యాపారంగా మార్చారని, విద్యరంగంతో సంబంధం ఉన్న వారితో కాకుండా ఇతరులతో కలిసి నూతన విద్యా విధానాన్ని తయారు చేశారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం నో డిటెన్షన్ విధానాన్ని తీసుకురావడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘కాంట్రాక్ట్’కు మించిన దోపిడీ లేదు
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: ‘‘కాంట్రాక్టర్ల వ్యవస్థ అన్యాయమైనది. ఇది ఓ వ్యక్తిని పోషించే వ్యవస్థ. ఏ పనీ చేయని మధ్య దళారి.. కార్మికుల జీతాల్లో కొంత భాగాన్ని ఎగరేసుకుపోతున్నాడు. అతనెవరో కార్మికులకూ తెలియదు.. పని చేసే వారిని కాదని ఏ పనీ చేయని కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వడం సరికాదు..ఇంతకు మించిన అన్యాయమైన దోపిడీ వ్యవస్థ మరొకటి ఉండదు.’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల యాత్ర పోస్టర్ను సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆవిష్కరించారు. విద్యుత్ జేఏసీ సమన్వయకర్త, జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు నేతృత్వంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కోదండరాం ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదన్నారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో అవినీతి జరుగుతోందనీ, భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో నిరుద్యోగులు రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లించి ఉద్యోగాల్లో చేరుతున్నారని విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం 31వ తేదీ నుంచి 90 రోజుల పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో యాత్రను నిర్వహిస్తామని, అన్ని శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులను ఏకం చేస్తామని యూనియన్ అధ్యక్షుడు జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
వసతిగృహాల్లో బయోమెట్రిక్ విధానం
బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు భానుగుడి (కాకినాడ) : బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, వార్డెన్ల గైర్వాజరును తగ్గించేందుకు త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు డి.డి.చినబాబు తెలిపారు. వసతిగృహాల్లో బయోమెట్రిక్ వి«ధానానికి సంబంధించి సోమవారం వార్డెన్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 82 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానం అమలుకానుందన్నారు. ఈ వసతిగృహాల్లో 5వేలకు మందికి పైగా విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ విధానంపై వార్డెన్లకు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల, వార్డెన్ల హాజరును బయోమెట్రిక్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. -
పీజీ వరకూ నాణ్యమైన విద్యనందించాలి
నల్లజర్ల : దేశ విద్యా విధానాన్ని సంస్కరించడం, పునర్నిర్మించడం, పరిపుష్టి చేయడం పేరుతో ప్రభుత్వం బహిరంగ చర్చకు పెట్టిన జాతీయ విద్యావిధానం ముసాయిదాను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సదస్సు తిరస్కరించింది. నల్లజర్ల జెడ్పీ హైస్కూల్ ఆవరణలో శనివారం డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.కృష్ణయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. అభివృద్ధి నిరోధక బోధనా దుకాణాలకు ఊతమిచ్చే ముసాయిదా స్థానంలో సామాజిక ఉత్పత్తి విధానానికి అనుగుణమైన కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను కామన్ స్కూల్ రూపంలో సమాజానికి అందించాలని సదస్సు డిమాండ్ చేసింది. ఈ సదస్సులో నూతన విద్యా విధానంపై అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యుడు సీఎస్ఆర్ ప్రసాద్, ప్రొఫెసర్ ఎం.రవికుమార్, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీ రమణయ్య, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొణతం నరహరి మాట్లాడారు. డీఈవో డి.మధుసూదనరావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా చూడాలని సూచించారు. పిల్లల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయ వృత్తికే మనుగడ ఉండదన్న విషయం గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహార్, ఎంపీడీవో చిన్నారావు, మండల సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షుడు యలమాటి శ్రీనివాసరావు, ఎంఈవో ఐడీవీ అప్పారావు పాల్గొన్నారు. -
ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలి
– టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి మహబూబ్నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర మహాసభలలో సామాజిక, విద్యారంగ అంశాలపై చర్చిస్తామని, జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబాటుపై డాక్యుమెంటరీ రూపొందిస్తామని అన్నారు. మహాసభలు మహబూబ్నగర్లో డిసెంబర్ నెలలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నారు. గౌరవ చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, చైర్మన్గా టీజేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా జంగయ్య, కోశాధికారిగా ఎన్.వెంకటేష్, టీఎస్యూటీఎఫ్ పూర్వనాయకులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు, ప్రజాసంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేష్, జంగయ్యలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
గైట్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
రాజానగరం: బస్సుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి భద్రత కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని గైట్ కళాశాల ఆటోమొబైల్ విభాగం విద్యార్థులు రూపొందించారు. అకడమిక్ ప్రాజెక్టులో భాగంగా హెచ్ఓడీ వి.సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో టీడీఎస్ సుబ్బారెడ్డి, జి.మణికంఠ, కె.మురళీకృష్ణ, కె.దుర్గాశ్రీకాంత్ దీనిని రూపొందించారు. తొలుత ఒక బస్సు మోడల్ని తయారుచేశారు. ఇదే కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న టి. వెంకటశివారెడ్డి సహకారంతో బస్సు క్యాబిన్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తం చేసే వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు ఇంజన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అత్యవసర ద్వారం తెరుచుకుని కార్బన్ డై ఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ముందుగా నిర్ణయించిన మొబైల్ నంబర్లకు సంఘటన జరిగిన ప్రాంతం వివరాలను సంక్షిప్తంగా మెసేజ్ పంపిస్తుంది. ఈ వ్యవస్థకు ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ (ఎఫ్డీఎస్ఎస్) అని పేరుపెట్టారు. -
జంబ్లింగ్ వద్దు...
-
వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు
-
జీపీఎస్ కు బదులుగా ఇస్రో సొంత సిగ్నల్ వ్యవస్థ
జీపీఎస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ మారుమూల ప్రాంతాన్ని చేరాలన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. మొబైల్ అందుబాటులో ఉంటే చాలు... వెళ్లాల్సిన ప్రాంతాన్ని యాప్ లో ఎంటర్ చేశారంటే... మ్యాపింగ్ ద్వారా మీరు చేరాల్సిన గమ్యాన్ని అదే చూపిస్తుంది. ఏ మలుపు ఎక్కడ తిరగాలో కూడా చెప్తుంది. అమెరికాకు చెందిన ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్లో ఉపగ్రహాలు మొత్తం భూమిని కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా అందించే సమాచారాన్ని మనకు అందుబాటులోకి తెస్తాయి. అయితే ఇప్పుడు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జీపీఎస్ కు బదులుగా ఇండిజినస్ పొజిషన్ డిటర్మినేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థను స్థాపించనుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ ను ఉపయోగించి... జీపీఎస్ను భర్తీ చేసేలా ఈ కొత్త విధానం వచ్చే ఏడాది మధ్యనాటికి అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రారంభమౌతుందని, ఇస్రో ప్రచురణ ప్రజా సంబంధాల డైరెక్టర్ దేవీప్రసాద్ కార్నిక్ చెప్తున్నారు. పూర్తిగా భారత ప్రభుత్వం నియంత్రణలో పనిచేసే ఈ కొత్త ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS) దేశంలోని యూజర్లకు సరైన సమాచారాన్ని, స్థానాన్ని అందించేందుకు ఇస్రో అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే... సిగ్నల్స్ మరింత మెరుగ్గానూ, కచ్చితంగానూ ఉంటాయని ఇస్రో అధికారులు భావిస్తున్నారు. విదేశీ ప్రభుత్వ నియంత్రణలో ఉండే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్... అన్ని పరిస్థితుల్లోనూ మనకు సేవలు అందిస్తుందన్న హామీ లేకపోవడంతో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అవసరమౌతుందని భావిస్తున్నారు. రెండు విధాలుగా సేవలు అందించే ఐఆర్ఎన్ఎస్ఎస్ లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ (SPS). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్ (RS). మిలట్రీ సహా కొంతమంది ప్రముఖ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విధానం విపత్తు నిర్వహణ, వాహన ట్రాకింగ్, నౌకా నిర్వహణ సహా మొబైల్ ఫోన్లతో అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులకు కావలసిన లింకులు, వాహనాలు నడిపేవారికి విజువల్, వాయిస్ నేవిగేషన్లతో పాటు మరిన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. మొత్తం ఏడు ఉపగ్రహాలతో పనిచేసే ఈ సిస్టమ్ లో ప్రస్తుతం నాలుగు ఉపగ్రహాలు కక్ష్యలో ఉండగా మిగిలిన మూడింటిని వచ్చే ఏడు జనవరి, మార్చి మధ్య స్థాపించేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం జీపీఎస్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా ఉండటంతో తాము సొంత సిగ్నల్తో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు ఇస్రో అధికారులు చెబుతున్నారు. -
'ఇన్స్పెక్టర్ రాజ్' పూర్తిగా అంతం కాలేదు
హైదరాబాద్: ఇందిరాగాంధి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన 'ఇన్స్పెక్టర్ రాజ్' ఇప్పటికీ వ్యవస్థలో కొనసాగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో 1990 లలో ప్రవేశపెట్టిన ఆర్థీక సంస్కరణలతో ఇన్స్పెక్టర్ రాజ్ విధానం క్షీణించినప్పటికీ పూర్తిగా అంతం కాలేదన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రధాని జవహార్లాల్ నెహ్రూ తన వివేకంతో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతను కల్పించారనీ, అయితే ఇందిరాగాంధీ తన స్వంత ప్రయోజనాల కోసం చేసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా ఇన్స్పెక్టర్ రాజ్ విధానం ఏర్పడిందన్నారు. ఇన్స్పెక్టర్ రాజ్ అనేది ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ యూనిట్ల మీద ప్రభుత్వం యొక్క అతి జోక్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా 1970-80 మధ్య కాలంలో దేశంలో ఈ విధానం విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఈ మధ్య కాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కూడా దానిని పూర్తిగా తొలగించలేకపోయిందనీ అయితే చాలా వరకు దాని ప్రభావం క్షీణించిందని వెంకయ్యనాయుడు తెలిపారు. -
చిన్నారి నవల సూపర్హిట్టు
పట్టుమని పదేళ్ల వయసైనా లేని పిల్లలు ఆవు వ్యాసం రాయడానికే ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఇంగ్లాండ్లో తొమ్మిదేళ్ల చిన్నారి ఏకంగా ఒక నవల రాసి పారేసింది. అయితే, పదమూడేళ్ల వయసులో ఆమె రచనా వ్యాసంగాన్ని మానేసింది. చిరుత కూకటి నాడు 1890లో రాసిన ఆ నవలను ఆమె చాలాకాలం మర్చిపోయింది కూడా. వయసొచ్చాక ఆమెకు పెళ్లయింది. ఇక సంసార సాగరంలో పడింది. ఆమె తల్లి 1919లో మరణించడంతో పుట్టింటికి వచ్చింది. అంత్యక్రియలన్నీ అయ్యాక చెల్లెళ్లతో కలసి ఇంట్లోని వస్తువులన్నీ చూస్తుంటే, అప్పుడెప్పుడు తన చిన్నతనంలో పెన్సిల్తో రాసిన నవల కనిపించింది. తిరిగి ఆ నవల చదివింది. ఒక స్నేహితురాలికి కూడా చూపించింది. నవల అద్భుతంగా ఉందంటూ స్నేహితురాలు భరోసా ఇవ్వడంతో ప్రచురణకర్తలను సంప్రదించింది. విక్టోరియన్ కాలం నాటి కులీన వ్యవస్థను కళ్లకు కడుతూ రాసిన ఆ నవల ‘ది యంగ్ విజిటర్స్’. ఆ రచయిత్రి డైసీ ఆష్ఫోర్డ్. ఆ నవలకు ప్రముఖ రచయిత జె.ఎం.బ్యారీ ముందుమాట రాశాడు. మార్కెట్లోకి విడుదల కావడమే తడవుగా హాట్కేకుల్లా అమ్ముడుపోయింది. ఆ నవలపై వచ్చిన రాయల్టీతో రచయిత్రి డైసీ ఆష్ఫోర్డ్ ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొనుక్కుని, అందులోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. -
‘మైనస్’లోనే డిమాండ్..!
మే నెలలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 2.36 శాతం క్షీణత - వరుసగా ఏడో నెలా ఇదే ధోరణి - ఆహార ద్రవ్యోల్బణం మినహా మిగిలినవన్నీ క్షీణతే... న్యూఢిల్లీ: వ్యవస్థలో కొనసాగుతున్న డిమాండ్ మందగమన ధోరణికి ద్రవ్యోల్బణం అద్దం పడుతోంది. 2015 మే నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టోకు ధరల సూచీలో అసలు పెరుగుదల లేకపోగా ఈ రేటు వార్షికంగా 2.36 శాతం క్షీణించింది. అంటే టోకున బాస్కెట్ ధర 2014 మేతో పోలిస్తే 2015 మేలో అసలు పెరుగుదల లేకపోగా -2.36 శాతం క్షీణించిందన్న మాట. దీనిని ప్రతి ద్రవ్యోల్బణంగా (డిఫ్లేషన్) కూడా పరిగణిస్తారు. సూచీలో భాగంగా ఉండే మూడు విభాగాలనూ పరిశీలిస్తే- ఒక్క ఆహార టోకు ద్రవ్యోల్బణం మినహా అన్ని కేటగిరీలూ మైనస్లోనే ఉన్నాయి. ఆహార బాస్కెట్ ధర మాత్రం వార్షికంగా 2014 మేతో పోలిస్తే 2015 మేలో 3.80 శాతం పెరిగాయి. నవంబర్ నుంచీ క్షీణ ధోరణి... 2014 నవంబర్లో ఈ సూచీ మొట్టమొదటిసారి తటస్థంగా ఉంది. డిసెంబర్లో టోకు ధరల రేటు 0.11 శాతంగా ఉంది. అటు తర్వాత జనవరి (-0.39 శాతం), ఫిబ్రవరి (-2.06 శాతం), మార్చి (-2.33 శాతం), ఏప్రిల్ (-2.65 శాతం)నెలల్లో ద్రవ్యోల్బణం క్షీణతలోనే కొనసాగింది. మూడు విభాగాలూ వేర్వేరుగా... - ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్లతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగం (20.12 శాతం వెయిటేజ్)కు సంబంధించి ద్రవ్యోల్బణం రేటు 0.77 శాతం క్షీణించింది. ఇందులో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ (వెయిటేజ్ 14.34 శాతం) ను తీసుకుంటే ఈ రేటు 3.80 శాతం పెరిగింది. అయితే నాన్-ఫుడ్ ఆర్టికల్స్ (4.26 శాతం వెయిటేజ్) విభాగం మాత్రం 2.24 శాతం క్షీణించింది. - ఇక ఇంధనం- విద్యుత్ విభాగానికి (14.91% వెయిటేజ్) వస్తే ఈ రేటు 10.51 శాతానికి క్షీణించింది. - ఇక మొత్తం సూచీలో 65.97 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం -0.64 శాతం క్షీణించింది. భవిష్యత్ తేల్చాల్సింది రుతుపవనాలే... ద్రవ్యోల్బణం మున్ముందుసైతం ఇదే పరిస్థితిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయో-లేవో తేల్చాల్సింది భవిష్యత్ వర్షపాత పరిస్థితులేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది సాధారణంకన్నా 12 శాతం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఇప్పటి వరకూ కురిసిన వర్షాలు కొంత సంతృప్తినిచ్చాయి. ఇప్పటికే ఈ ఏడాది 75 బేసిస్ పాయింట్లు రెపో తగ్గించిన ఆర్బీఐ... వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పట్లో మరోదఫా రేట్ల కోత ఉండకపోవచ్చని జూన్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొంది. కూరగాయలు, ఆలూ ధరలు తగ్గాయ్..! కూరగాయల ధరలు వార్షిక రీతిన మేలో పెరక్కపోగా 5.5 శాతం తగ్గాయి. ప్రత్యేకించి ఆలూ ధరలు 52 శాతం డౌనయ్యాయి. అయితే పప్పుధాన్యాల ధరలు 22.8 శాతం పెరిగాయి. ఉల్లిపాయల విషయంలో ఈ రేటు 20.41 శాతం పెరిగింది. కాగా పండ్లు, పాలు, గోధుమల వంటి ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పండ్ల ధరలు 8.65 శాతం ఎగశాయి. పాల ధరలు 6.85 శాతం ఎగశాయి. గోధుమలు 2.79 శాతం ఎగశాయి. మరోదఫా రేట్ల కోత అవసరం: పరిశ్రమలు ద్రవ్యోల్బణం క్షీణ దశలో కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్కు, పారిశ్రామిక ఉత్పత్తుల వృద్ధికి ఆర్బీఐ మరోదఫా రెపో రేట్ల కోత నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఐఐ: ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం కూడా తగిన పాలనాపరమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ మరోదఫా రేట్ల కోతకు ఇది సరైన సమయం. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించుకున్న స్థాయిలోనే (5% దిగువన) మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇది డిమాండ్కు ఊతం ఇచ్చే అంశం. - ఫిక్కీ: సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ, ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి తగిన చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితి లేదు. రెపో రేటు తగ్గించడానికి ఇది తగిన సమయం. అసోచామ్: ధరల స్థిరత్వానికి సంకేతంగా తగిన గణాంకాలు వెలువడుతున్నాయి. ఆర్థిక క్రియాశీలతను పెంపొందించడానికి ఇది సరైన సమయం. తయారీ రంగంసైతం క్షీణతలో ఉంటున్న విషయాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. రేట్ల కోతకు చాన్స్: ఎస్బీఐ, సిటీగ్రూప్ కాగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించుకున్న స్థాయిలోనే కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఏడాది నాల్గవసారి రెపోరేటును మరోపావు శాతం తగ్గించే అవకాకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సేవల దిగ్గజం సిటీగ్రూప్లు వేర్వేరుగా విడుదల చేసిన తమ తాజా విశ్లేషణా నివేదికల్లో పేర్కొన్నాయి. -
తల్లీ ! నీ త్యాగం నేర్పిన పాఠాలు...
పద్యానవనం చీపురు నొక్క చేత, ఒక చేతను చింపిరి గంప బూని, యీ పాపపు గుప్పలూడ్చెదవు బాలిక! చీదర లేదె సుంత? నీ యోపిక చూచి మెచ్చి తలయూచు జగత్పిత కన్నుగొల్కులన్ తేవకు తేవకున్ బయలు దేఱు నవే నులివెచ్చ బాష్పముల్! అసహ్యమని చీదరించుకోకుండా ఓపిగ్గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న పాకీపిల్ల (స్కావెంజర్)ను సంభోదిస్తూ చెబుతున్నాడు కవి! ‘ఎంత ఓపిక తల్లీ! ఓ చేత చీపురు మరో చేత చిరిగిన గంప/బుట్ట ధరించి ఈ భూమ్మీద సాటి మనుషులు వదిలిన మలినాల చెత్త కుప్పలనూడ్చే పనిలో నిమగ్నమయ్యావు’ అని! తర్వాత్తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనిషి విసర్జించే మాలిన్యాల్ని మనుషులు ఎత్తిపోసే పారిశుధ్యపు పనుల్ని అధికారికంగా నిషేధించాయి. యాంత్రిక నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు, భూగర్భమురుగు కాల్వల వ్యవస్థ వంటివి పూర్తిస్థాయిలో తీసుకువచ్చే కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. కానీ, అక్కడక్కడ ఇప్పటికీ ఆ పనిని మనుషులే నిర్వర్తించడం మన వ్యవస్థలో కొనసాగుతున్న దురవస్థ. కడు పేదరికం వల్ల, పొట్టపోసుకునే ఇతర పనులు దొరక్క, వృత్తి ధర్మాన్నే నమ్ముకొని, తరతరాలుగా ఈ పనిలో నిమగ్నమైన వారున్నారు. చీదరించుకోకుండా ఈ మాలిన్యాల్ని తొలగించే పాకీ వృత్తిలో ఉన్నవారి సేవల్ని చూసి, సృష్టికర్తయే చలించిపోతున్నాడనీ, తడవ తడవకు కంటతడి పెడుతున్నాడనీ కవి భావన! కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘ఉదయశ్రీ’లో పాకీపిల్ల శీర్షికన రాసిన ఖండిక లోనిదీ పద్యం. ఈ రోజున ‘స్వచ్ఛ భారత్’ పేరిట స్పృహను రగిల్చే రకరకాల కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఉద్దేశం మంచిదే! పని కన్నా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విచారకరం. ఎవరి పనులు వారు చేసుకోవడాన్నే గొప్పకార్యంగా భావించే పరిస్థితులు దాపురించాయి. మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకునే మనం విశాల సమాజహితంలో జరిపే కార్యక్రమాల విషయంలో ఇంకా ఎంతో పరిణతి సాధించాల్సి ఉంది. ‘స్వచ్ఛభారత్’ను ఆవిష్కరించడానికి ముందు మనం కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పారిశుధ్యం విషయంలో ఎవరి పనులు వారు చేసుకోవడంలోనే గొప్పతనం ఉందని ప్రపంచమంతా గ్రహించింది. ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని తీసుకున్నా, ఆయా దేశాల్లో ఎన్ని అభివృద్ధి చెందిన కుటుంబాల్ని తీసుకున్నా శుభ్రతకు వారిచ్చే ప్రాధాన్యత ఆశ్చర్యం కలిగిస్తుంది. మన సమాజంలో అది లేకపోగా, విధి లేక అటువంటి విధుల్లో ఉన్నవారి పట్ల చిన్న చూపు, తూష్ణీభావం నెలకొని ఉన్నాయి. శ్రమను గౌరవించే సంస్కృతి మన దగ్గర మరుగున పడి, ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో ఆదరణ పొందడాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరు, ఎటునుంచి ఎటు పయనిస్తున్నారో శ్రద్ధగా గ్రహించాలి. అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే మనం పారిశుధ్యం విషయంలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలిస్తే గుండె జారిపోతుంది. పొరుగునున్న అభివృద్ధి చెందని దేశం బంగ్లాదేశ్ కంటే కూడా మనమీ విషయంలో వెనుకబడి ఉన్నామంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నేటికీ పెద్ద సంఖ్యలో కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం లేక బహిర్భూమినే నమ్ముకోవాల్సిన దురవస్థ నెలకొని ఉంది. పట్టణ ప్రాంతాల్లో మరింత దయనీయ స్థితి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు పాలకులు చిత్తశుద్ధితో చేసిన యత్నాలు తక్కువ. ఇప్పటికైనా ఏలినవారు నిర్దిష్ట ప్రణాళికలు రచించి ‘స్వచ్ఛ భారత్’ను ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు, దేశంలోని ప్రతి మనిషి కూడా, మహాత్ముడు బాపూజీ చెప్పినట్టు తానాశించిన మార్పు తన నుంచే మొదలుకావాలనే స్ఫూర్తిని అందుకోవాలి. ‘‘ఒక్క రోజీవు వీథుల నూడ్వకున్న తేలిపోవును మా పట్టణాల సొగసు: బయటపడునమ్మ బాబుల బ్రతుకులెల్ల ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప’’ అన్న కరుణశ్రీ మాటలు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ... ఎవరికి వారం ‘స్వచ్ఛ భారత్’ ఆవిష్కరణలో ఆచరణాత్మక పాత్ర పోషించడమే మనందరి ముందున్న కర్తవ్యం! -
ఆన్లైన్ టెండర్ల విధానాల్లో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ టెండర్ల విధివిధానాలను పునః సమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ల ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు టెండర్ల నియమనిబంధనల్లో సైతం మార్పులు చేర్పులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐటీ శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సర్వీసెస్(ఏపీటీఎస్) ఎండీతో పాటు నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పబ్లిక్ హెల్త్ తదితర ఇంజనీరింగ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 9న ఏపీటీఎస్ ఎండీ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. ఈ విషయుంలో సలహాలు, సూచనలు అందించాలని ముఖ్య ఇంజనీర్లకు ఐటీ శాఖ ఆహ్వానం పంపింది. ఆన్లైన్లో టెండర్ బిడ్లు తెరుచుకోకపోవడం, టెక్నికల్ బిడ్ను తెరిస్తే ఫైనాన్షియల్ బిడ్ తెరుచుకోవడం, ఒక్కోసారి ఆన్లైన్ నుంచి టెండర్ బిడ్లు అదృశ్యం కావడం తదితర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఇంజనీరింగ్ శాఖలు తరుచుగా ఫిర్యాదు చేస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక లోపాల పరిష్కారంతో పాటు విధానపర మార్పులపై కమిటీ నిర్ణయం తీసుకోనుందని అధికారవర్గాలు తెలిపాయి. -
పెద్ద ఆశయం.. చిరు ప్రయత్నం..
వ్యవస్థను తిడుతూ కూర్చొనే కన్నా దాన్ని మార్చడానికి ఏం చేయాలన్నది ఆలోచించడమే ఎవరైనా చేయాల్సిన పని. ఓటర్లలో ఆ చైతన్యం కలిగించడా నికి ఓ కాలేజీ కుర్రాడు ‘నేను సైతం...’ అంటూ ప్రయత్నించాడు. బి.టెక్ రెండో సంవత్సరం విద్యార్థి శ్రీపాద్ సాయినందన్ తాజా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ‘మీ ఓటు ఎవరికి?’ అంటూ ఓ లఘుచిత్రం రూపొందించాడు. ‘‘మా స్నేహితులు సిద్ధార్థ, విక్రమ్లతో కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను. ఒక్కరోజులో షూటింగ్ పూర్తిచేశాను’’ అని చెప్పాడీ కుర్రాడు. హైదరాబాద్లో ముఫఖంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుతున్న శ్రీపాద్కు ఇంటి చుట్టుపక్కల ఉన్న మురికివాడలలో నివసించే వారిని చూశాక, ఈ చిత్రం తీయాలనిపించిందట. గతంలో ఒక లఘుచిత్రం తీసి, అనేక లఘుచిత్రాలలో నటించిన అనుభవం అందుకు పనికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్ 19కి క్రికెట్ ఆడే శ్రీపాద్ తీసిన ఈ తాజా లఘుచిత్రంలోని పాత్రధారులంతా అతని స్నేహితులు, బంధువులే. ‘‘మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. అయితే సాయంత్రానికల్లా పూర్తిచేసుకోమనీ, రాత్రుళ్లు బయటకెళ్లవద్దనీ సూచించారు’’ అని నవ్వుతూ చెప్పాడీ యువకుడు. ‘‘ఓటు హక్కును వినియోగించుకొమ్మంటూ యువతను మేల్కొల్పడమే ఈ చిత్ర రూపకల్పన ఉద్దేశం’’ అన్నాడు. వయసు చిన్నదైనా సమాజం కోసం తన వంతుగా ఈ యువకుడు చేసిన ప్రయత్నం ప్రశంసనీయమే. - డా.వైజయంతి -
ట్రాఫిక్ నియంత్రణకు కొత్త సిస్టం