urea
-
రైతన్నల పడిగాపులు
-
యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?
ఫెర్టిలైజర్సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు. రోజుకి 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ నిర్మించారు. 2023 డిసెంబర్ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్ను పర్యవేక్షిస్తుంది. పైప్లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్ స్టీమ్ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్ పైప్లైన్ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్ను పునరుద్ధరించారు. ప్లాంట్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్ స్టీమ్ పైప్లైన్లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్ షట్డౌన్ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో గ్యాస్ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లి మిటెడ్ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది. ప్లాంట్పై ఒత్తిడి మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్ పెరగడంతో రామగుండం ప్లాంట్లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. -
యూరియా సరఫరాలో కోత
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దానివల్ల భూసారం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల సరఫరాలో కోతలు విధించాలని నిర్ణయించింది. యూరియా వినియోగం వీలైనంత మేరకు తగ్గించేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యూరియా ఎంత తగ్గిస్తే, అంతే స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. యూరియా అధిక వాడకం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, పంటలు కూడా విషపూరితమవుతున్నాయి. ఆయా ఆహార పదార్థాలు తింటున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా సహా ఇతరత్రా అన్ని రకాల ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని కేంద్రం సూచించింది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు, పురుగు మందులు వాడాలని తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా వాడకాలను తగ్గించేలా చూస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగు తగ్గినా పెరిగిన యూరియా వాడకం రైతులు పంట పొలాల్లో యూరియాను కుమ్మరిస్తున్నారు. దీని వినియోగం ఏటా పెరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. రైతులు గత ఏడాది వానాకాలం సీజన్లో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంట పొలాల్లో వాడారని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. గత ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే అధికంగా యూరియాను వినియోగించారు. వాస్తవానికి గత వానాకాలం సీజన్లో యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అంతకుముందు వానాకాలం సీజన్ కంటే గత ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. 2022– 23 ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం 1.29 లక్షల మెట్రిక్ టన్నులు పెరగడం గమనార్హం. పలుమార్లు వర్షంతోనూ పెరుగుతున్న వాడకం గత ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల మాత్రం వర్షాలు కురవడంతో రైతులు పత్తి లాంటివి వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడుసార్లు వేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. దీంతో రెండు బస్తాలకు బదులు మూడు, నాలుగు బస్తాల వినియోగం జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. ఈ అదనపు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
యూరియా గుప్పించారు
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో యూరియాను గుప్పిస్తున్నారు. ఇలా ఏడాదికేడాదికి యూరియా వినియోగం పెరుగుతోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. దీనివల్ల భూసారంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు పంట పొలాల్లో వాడారని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. 2021–22 వానాకాలం సీజన్లో 9.50 లక్షల మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల ఎకరాల్లో యూరియా వినియోగించగా, ఈసారి ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. ఆగస్టు నెలలో 3.42 లక్షల మెట్రిక్ టన్నులు, సెపె్టంబర్ నెలలో 3.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారు. సాగు తగ్గినా పెరిగిన యూరియా వినియోగం... వాస్తవానికి ఈ ఏడాది యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవంగా గత ఏడాది వానాకాలం సీజన్ కంటే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం గతేడాది కంటే ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా పెరగడం విశేషం. పలుమార్లు విత్తనాలు విత్తడంతో పెరిగిన వినియోగం ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు పత్తి వంటి వాటిని వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది. దీంతో రెండు బస్తాలు వాడాల్సిన చోట మూడు నాలుగు బస్తాల యూరియా చల్లారని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుకమేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
యూరియా కొరత.. రోడ్డెక్కిన రైతులు
పెన్పహాడ్, హాలియా: ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలోని సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో వాటి ఎదుగుదల లేక.. దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. సరిపడా యూరియాను త్వరితగతిన సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనుముల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. అందరికీ అందక నిరాశతో వెనుదిరిగారు. -
ఆర్ఎఫ్సీఎల్ షట్డౌన్
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
పుడమి తల్లికి తూట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : పుడమి తల్లి నిస్సారంగా మారిపోతోంది. చాలాకాలంగా నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర రసాయన ఎరువులకు తోడు పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల దిగుబడిని పెంచుకోవడానికి, క్రిమిసంహారానికి మోతాదుకు మించి వాడుతున్న రసా యన ఎరువులు, మందుల కారణంగా సారవంతమైన నేల కాస్తా గుల్ల అవుతోంది. రసాయన ఎరువుల వాడకం పుడమి కాలుష్యంతో పాటు, వాయు, నీటి కాలుష్యానికి కూడా దోహదపడుతోంది. ఒక టన్ను రసా యన ఎరువులను వినియోగిస్తే.. అందులో కేవలం మూడున్నర క్వింటాళ్ల రసాయన ఎరువులను మాత్రమే పంటలు స్వీకరిస్తాయని, మిగిలిందంతా పుడమిలోకి ఇంకిపోవడం, వర్షాలు పడినప్పుడు చెరువులు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల్లోకి వెళ్లిపోవడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలతో పోల్చిచూస్తే..మన దేశంలో వీటి విని యోగం తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వాడుతున్న ఈ రసాయన ఎరువుల వల్ల పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్తో మేలు.. ♦ దిగుబడి పెంచుకోవడానికి వినియోగించే ఎరువుల్లో ఆర్గానిక్, ఇనార్గానిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఎరువులు ప్రకృతి సిద్ధమైనవి. పంట వ్యర్థాలు, మొక్కలు, జంతువుల వ్యర్థాలు, మునిసిపల్ వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులను ఆర్గానిక్ ఎరువులుగా పరిగణిస్తారు. ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు, వాన పాములు, సూక్ష్మజీవుల పునరుత్పత్తికి దోహద పడుతుంది. ఇక రసాయనాలను వినియోగించి తయారు చేసేవే ఇనార్గానిక్ ఎరువులు. పంటల ఎదుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది. ఫాస్ఫేట్ మొక్కలకు ముఖ్యమైన పోషక విలువలను అందిస్తుంది. వీటితో పాటు పొటాషియం భూమిలో నీటి సామర్థ్యాన్ని, భూ సాంద్రతను పెంచుతాయనే వాదన ఉన్నా.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లాలు చర్మంపైన, శ్వాసపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సేంద్రీయ సేద్యం పెరుగుతున్నా దేశంలో సేంద్రీయ సేద్యం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించే గణాంకాలు చెబు తున్నా.. రసాయన ఎరువుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలి గించే అంశం. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు రసాయన ఎరువుల వాడకంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఎరువులు భూమిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే యడంతో భూమి తన సారాన్ని కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు. పంటల దిగు బడి కోసం శాస్త్రీయ ఎరువులు వినియోగించకుండా కేవలం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గి, తదనంతర కాలంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దాదాపు 50% మేరకు పెరిగినట్లు అగ్రికల్చర్ ఇన్పుట్ సర్వే వెల్లడిస్తోంది. చైనాలో హెక్టార్కు 13.06 కిలోలు చైనా ఒక హెక్టార్కు 13.06 కిలోల పురుగు మందులు వాడుతుంటే, జపాన్ 11.85 కిలోలు, బ్రెజిల్ 4.57 కిలోలు వినియోగిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశా ల్లోనూ ఇలాంటి మోతాదుల్లోనే వినియోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో అత్యధికంగా పంజాబ్లో ప్రతి హెక్టార్కు 0.74 కిలోలు వినియోగిస్తున్నారు. పంజాబ్, హరియాణాలు పంటల దిగుబడి కోసం అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగి స్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హరియాణాలో 0.62 కిలోలు, మహారాష్ట్రలో 0.57 కిలోలు, కేరళలో 0.41 కిలోలు, ఉత్తరప్రదేశ్లో 0.39 కిలోలు, తమిళనాడులో 0.33 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. జాతీయ సగటు 0.29 కిలోలుగా ఉంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. యూరియానే అత్యధికం.. ఎరువుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, ఒక బస్తా యూరియా వేయాల్సిన చోట పంట ఎదుగుదల, దిగుబడి కోసం రెండు మూడు బస్తాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కంటే దీని ధర తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం సైతం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. యూరియాపై కేంద్రం దాదాపు 75 శాతం మేరకు సబ్సిడీ అందిస్తుంటే.. డీఏపీ లాంటి ఎరువులపై 35 శాతం మాత్రమే ఇస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉన్నా.. భూసార పరీక్షల నిర్వహణ ద్వారా ఏయే భూములకు ఎలాంటి పోషకాలు కావాలి, అవి ఏయే రసాయన ఎరువుల్లో ఉంటాయో తెలుసుకుని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాల్సి ఉన్నా.. రైతులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన ఎరువులను యథేచ్ఛగా వాడుతున్నారు. తద్వారా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి, వరి, గోధుమ, చెరకు పంటలకు ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నారు. పంజాబ్లో కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నష్టాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే.. నత్రజని కాలుష్యం పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పంజాబ్లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరింది. కొంతకాలం ఎరువుల వినియోగం తర్వాత భూమి లోపల ఉండే బ్యాక్టీరియా చచ్చిపోయి, కార్బన్, మినరల్స్ వంటివి పోయి ఈ రసాయనాలే డామినేట్ చేస్తాయి. మొక్కకు సహజ సిద్ధమైన బలం చేకూరకుండా నేరుగా రసాయనాలే ప్రభావితం చేస్తాయి. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. రెండు, మూడు పంటలు వచ్చే ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో వరి పొలాల్లో విపరీతంగా యూరియా ఇతర రసాయనాల వినియోగం కారణంగా నేల మొత్తం రసాయనాలే నిండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రసాయనేతర ఎరువులైన ఆవు, ఇతర జంతువుల పేడ, గృహాల నుంచి వచ్చే చెత్తతో తయారుచేసిన ఎరువుల వినియోగం పెంచాలి. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు, పాలసీ అనలిస్ట్ రసాయన, సేంద్రీయ కాంబినేషన్ మంచిది రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమి తన నిజ స్వరూపం, సారాన్ని కోల్పోతుంది. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చనిపోతాయి. ఎరు వులు వాడితే మొక్కల్లో నీటి నిల్వశాతం కూడా తగ్గు తుంది. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మొక్క కు రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువులు కాంబినేషన్గా అందించాలి. ఉదాహరణకు మొత్తం పది బస్తాల ఎరువులు వినియోగిస్తామను కుంటే.. అందులో ఆరు బస్తాలు రసాయన ఎరువులు, 4 బస్తాల సేంద్రీయ ఎరువులు ఉండేలా చూడాలి. దీనితో సమతుల్యత ఉంటుంది. పురుగుల మందుల వల్ల బీపీ, షుగర్, కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు. – కె.రాములు ఎండీ, ఆగ్రోస్ లిమిటెడ్ సబ్సిడీలు తగ్గించుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్లో భాగంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా రైతులకిచ్చే సబ్సిడీలు కూడా తగ్గిస్తోంది. శ్రీలంక తరహాలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించాలని చూస్తోంది. సేంద్రీయ, రసాయన ఎరువులు కలగలిపి ఉపయోగించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కానీ ఒక్క సేంద్రీయ లేదా రసాయన ఎరువుల వాడకంతో పంటలు పండవు. చైనా, అమెరికాతో పోల్చితే భారత్లో తక్కువగానే ఎరువులు వాడుతున్నారు నిజమే. అయితే చైనాలో హెక్టార్కు 80 క్వింటాళ్లు, అమెరికాలో 60 క్వింటాళ్లు పండిస్తున్నారు. కానీ మన దేశంలో 25 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. 1991లో మనం ఎగుమతులు చేసే దశ నుంచి, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు సహా, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు, మాంసం, నూనెలు, పప్పుధాన్యాలు, పంచదార వంటివి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ దిగుమతులకు డంపింగ్ కేంద్రంగా మారింది. భారత్లో ఉత్పత్తులను దెబ్బతీసి దిగుమతులపై ఆధారపడేలా చేసే ధనిక దేశాల ప్రయత్నాలకు కేంద్రం లొంగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ. – సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం నేత, వ్యవసాయ నిపుణులు -
టెక్స్టైల్ పార్క్కు సహకరించడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఎంవోయూకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని పెద్దలను తాను అనేక సార్లు అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కును తీసుకొస్తే ఇక్కడి సర్కారు నుంచి స్పందన లేక పోగా ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి మోదీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తోందన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్ సీజన్నుంచే అమల్లోకి వస్తుందని, రైతులకు మేలు చేసేలా కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. భారత్ బ్రాండ్ పేరుతో యూరియా నానో యూరియాతో పాటు భారత్బ్రాండ్ పేరుతో యూరియా ప్రవేశ పెడుతున్నట్టు, ఇందుకు 8 ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు కిషన్రెడ్డి తెలిపారు. 2014లో దేశ వ్యవసాయ బడ్జెట్ రూ.21,933 కోట్లు ఉంటే, తొమ్మిదేళ్లలో రూ.లక్షా 25 వేల 33 కోట్లకు పెరిగిందని వివరించారు. కిసాన్క్రెడిట్కార్డుల ద్వారా రూ.28,590 కోట్ల వ్యవసాయ రుణాల మంజూరు, 23 కోట్ల సాయిల్హెల్త్ కార్డులను రైతులకు అందజేసినట్టు తెలియజేశారు. ఒకప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన నూనెల దిగుమతి ఉండేదని, ఇప్పుడు రైతుల నుంచి నూనె గింజల సేకరణ 1,500 శాతం పెరిగిందని తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం, పప్పుదినుసుల సేకరణలో కూడా కేంద్రం 7300 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఎరువుల రాయితీ గత ఏడాదికి ఈ ఏడాదికి పోలిస్తే 500 శాతం పెరిగిందని చెప్పారు. రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని కిషన్రెడ్డి వివరించారు. ప్రస్తుతమున్న ఈ–నామ్మార్కెట్లు 1260 బాగా నడుస్తున్నాయని తెలిపారు. ♦ 9 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను గురించి కిషన్రెడ్డి వివరించారు. అవేంటంటే... ♦ తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్యోజన ద్వారా ఏటా రూ.6 వేలు అందజేత ♦ రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం. ♦ సించాయ్యోజన కింద చిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి. ♦ దీని కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులను గుర్తించి, వాటిని పూర్తి చేసుకోవడం కోసం ఇప్పటి వరకు రూ.1,248 కోట్లు కేటాయింపు. ♦ రూ.23,948 కోట్లతో ఎల్సీడీసీ ద్వారా గొర్రెల పెంపకం, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు రుణాల మంజూరు. ♦ ఆయిల్ పామ్ మిషన్ కింద రూ.214 కోట్లు. ♦ ఒక్క ఎరువుల మీద రూ.27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ. ♦ రైతులకు మేలు చేసే ‘వేపపూత’ యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చారు ♦ తెలంగాణలో ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఒకప్పుడు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు వెచ్చిస్తోంది. -
ఎరువుల ప్రణాళిక ఖరారు...
సాక్షి, హైదరాబాద్: రాబోయే వానాకాలం సీజన్లో 24.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎరువుల ప్ర ణాళికను ఖరారు చేసింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం కేటాయించిన ఎరువులు వానాకాలం సీజన్కు పూర్తిస్థాయిలో సరిపోతాయని తెలిపాయి. ఎరువుల్లో అత్యధికంగా 9.50 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించారు. 9.40 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, లక్ష మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కేటాయించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. కాగా, ఏడాదికేడాదికి యూరియా వాడకం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చరొట్ట విత్తనాలను సరఫరా చేయడం వల్ల, గతం కంటే ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం తగ్గుతోందంటున్నారు. మండలాలకు ఎరువుల సరఫరా... వచ్చే నెల మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఒక వర్షం పడితే చాలు రైతులు దుక్కులు దున్నుతారు. దీంతో ముందస్తుగా మొదటి దఫా ఎరువులను మండలాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మండలాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సే వా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశా రు. రైతులకు ఎరువులు నిత్యం అందుబాటు లో ఉండేలా చూడాలని ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఎరు వుల కొరత రాకుండా, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఎరువులను రేక్ పాయింట్ల నుంచి రవాణా చేసేందుకు మార్క్ఫెడ్ ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. మొత్తం 20 రేక్ పాయింట్ల నుంచి ఎరువులను తీసుకెళ్లేందుకు మూడు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒక ఏజెన్సీకే 18 రేక్ పాయింట్లు వచ్చాయి. మిగిలిన రెండు రేక్ పాయింట్లు మరో రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఎరువుల రవాణా కోసం రూ. 96 కోట్లు ఖర్చు కానుంది. -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్షా తెలిపారు. -
భవిష్యత్ నానో యూరియాదే
సాక్షి, అమరావతి: భవిష్యత్ అంతా నానో యూరియాదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. నానో టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా వినియోగంతో పర్యావరణానికి, పంటలకు అత్యంత మేలు జరుగుతుందని తెలిపారు. రవాణా, వాడకం, ధరలతో పాటు పంటల దిగుబడి విషయంలో సంప్రదాయ యూరియాతో పోలిస్తే ఎన్నోరెట్లు అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. నానో యూరియా వినియోగం, అవగాహనపై మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గే ఈ యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇఫ్కో డైరెక్టర్ ఎం.జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. 8 శాతం పెరిగిన దిగుబడి ఇఫ్కో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ టి.శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ 500 ఎంఎల్ బాటిల్లో ద్రవరూపంలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమని చెప్పారు. నానో యూరియా వినియోగించిన అనేక పంటల్లో ఎనిమిదిశాతం మేర దిగుబడి పెరిగిందని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. నానో యూరియా వాడకంపై రూపొందించిన కరపత్రాలను మంత్రి కాకాణి విడుదల చేశారు. జాతీయ రహదారుల్లో మిల్లెట్ కేఫ్లు జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయ్యాలని మంత్రి కాకాణి సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్ల ఏర్పాటు వల్ల చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల స్థానిక స్వయం సహాయక సంఘాలతో పాటు యువతకు అప్పగించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ద్వారా యూనివర్సల్ కవరేజ్ సాధించిన మొదటి రాష్ట్రం మనదేనని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్బాబు పాల్గొన్నారు. -
రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి. సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు. డిమాండ్ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ట్రయల్రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమృద్ధిగా నానో యూరియా నిల్వలు నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – టి.శ్రీధర్రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
నానో యూరియాతో వ్యవసాయ రంగంలో విప్లవం: మంత్రి నిరంజన్రెడ్డి
ఏజీవర్సిటీ: వ్యవసాయరంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలోని ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటి సారిగా యారియాను ద్రవరూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిదని, ఇది దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎరువులు–రసాయనాల వాడకం–నానో యూరియా వినియోగం అవశ్యకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా గురించి రైతులకు వివరించారు. భారతీయుడైన రమేశ్ రాలియా దీనిని కనుగొన్నారని, 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను ప్రయోగించి.. ఫలితాలను పరిశీలించాక మార్కెట్ల్లో విడుదల చేశారని చెప్పారు. దీని వల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని, దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నానో యూరియా వల్ల రవాణా ఖర్చులు తగ్గి, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతుల భారం తప్పుతుందని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హన్మంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, మార్కెఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్కుమార్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సీజన్: దండిగా యూరియా
ఖరీఫ్ సీజన్కు ముందే వ్యవసాయానికి అవసరమైన ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో జూన్ నెల్లోనూ జలవనరులు తొణికిసలాడుతున్నాయి. జిల్లాలో ముందస్తుగా ఎడగారు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో సాగు విస్తీర్ణం చాలా తక్కువ. అయినా ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టి పీడించేది. గతంతో పోల్చుకుంటే.. జిల్లాలో గడిచిన మూడేళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో మూడింతల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసింది. సాక్షి,నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్ ముందస్తుగానే ప్రారంభమవుతోంది. ఇప్పటికే సాగు విస్తీర్ణం అంచనాకు అనుగుణంగా విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయశాఖ తాజాగా అవసరమైన మేరకు ఎరువులు కూడా సిద్ధం చేస్తోంది. వ్యవసాయానికి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీజన్కు ముందే గత నెల్లోనే పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద రూ.7,500 జమ చేసింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎడగారుకు ముందుగానే ఎరువుల నిల్వలు ఉంచాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. 109 సొసైటీల ద్వారా సరఫరా జిల్లాలో 561 ఆర్బీకేల ద్వారా ఎరువులను గ్రామాల్లోనే రైతులకు సరఫరా చేస్తుంటారు. జిల్లాలో 470 ప్రైవేట్ డీలర్స్ కూడా ఎరువుల విక్రయాలు చేస్తున్నారు. తాజాగా జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న మార్క్ఫెడ్ సంస్థ పరిధిలో 109 సొసైటీల ద్వారా కూడా రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వివిధ రకాల ఎరువులను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రబీ ముగిసిన తర్వాత ఖరీఫ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎరువుల సమస్య రాకుండా నిల్వ చేశారు. జిల్లాలో యూరియా 18 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 5 వేల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,700 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 13 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2 వేల మెట్రిక్ టన్నులు చొప్పున 39,700 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు అవసరం అవుతాయని అంచనా. మరో 32 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల ఈ వారంలో రానున్నాయి. ప్రతి నెలా 20 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల వరకు అవసరానికి అనుగుణంగా జిల్లాకు పంపిణీ చేస్తున్నారు. ఎరువుల కొరత ఎక్కడా లేదు జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా కావాల్సినంత ఎరువులు జిల్లాకు వస్తున్నాయి. ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ నెలకు కావాల్సిన స్టాక్ కన్నా ఎక్కువగానే నిల్వ ఉంది. రైతులు ఎవరూ ఎరువులు లేవనే అసత్య ప్రచారాలు నమ్మవద్దు. రైతులకు ఎక్కడకు వెళ్లినా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. – సుధాకర్రాజు, జేడీ వ్యవసాయశాఖ -
ఆర్బీకేల్లోనూ నానో యూరియా
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. రానున్న ఖరీఫ్లో ఈ యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు వారికి మరింత అందుబాటులోకి ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేసింది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా లిక్విడ్ రూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 500 మిల్లీ లీటర్ల బాటిల్లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా బాటిల్ కేవలం రూ.240కే అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17వేల లీటర్లు) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో సుమారు లక్ష మందికి పైగా 5,46,012 బాటిళ్లు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. కొరత లేకుండా నిల్వలు.. ముందస్తు ఖరీఫ్ కోసం ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం సీజన్లో రైతులకు ఏ దశలోనూ ఎరువుల కొరత రానీయకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఖరీఫ్లో 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 6.19లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేసింది. సాంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 2022–23 సీజన్ కోసం 16లక్షల బాటిళ్ల (8లక్షల లీటర్లు) ఇఫ్కో ఏపీకి కేటాయించింది. వీటిలో కనీసం 10లక్షల బాటిళ్లు (5 లక్షల లీటర్లు) ఖరీఫ్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వీటిలో కనీసం 25 శాతం ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయిల్ రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కావాల్సినంత నిల్వలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీలో నానో యూరియా వినియోగం పెరుగుతోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రానున్న ఖరీఫ్ సీజన్ కోసం 8లక్షల లీటర్ల నానో యూరియా బాటిళ్లను ఏపీకి కేటాయించాం. అవసరమైతే కేటాయింపులు మరింత పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – శ్రీధర్రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో వారంలో వ్యవసాయ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో అధికారులు ఎరువుల సరఫరా ప్రారంభించారు. ఈ సీజన్లో 25 లక్షల టన్నుల ఎరువులు అవసర మవగా అందులో 10 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప టికే అన్ని జిల్లాలకు కలిపి 4.20 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మార్క్ఫెడ్ 2.13 లక్షల యూరియా నిల్వలను ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్ ఎరువులు బఫర్ స్టాక్లో ఉన్నట్లు మార్క్ఫెడ్ వర్గాలు వెల్లడిం చాయి. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా సిద్ధం గా ఉండాలని మార్క్ఫెడ్ను వ్యవసాయశాఖ ఆదేశించింది. వానాకాలం సీజన్లో ఎరువుల సరఫరా, పంపిణీ, పర్యవేక్షణపై వ్యవసాయశాఖ మార్గదర్శకాలు తయారు చేసింది. మార్గదర్శకాలు ఇవీ.. ♦రిటైల్ డీలర్లకు రెండు ట్రక్కుల కంటే ఎక్కువగా ఎరువులను కేటాయించకూడదు. ♦ఏదో ఒక కంపెనీ లేదా బ్రాండ్లకు చెందిన వాటిని ప్రోత్సహించేలా జిల్లా వ్యవసాయా ధికారులు వ్యవహరించకూడదు. ♦అంతర్రాష్ట్ర అనధికారిక ఎరువుల సరఫరాను అడ్డుకోవాలి. సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలి. ♦ప్రతి నెలా మొదటి వారంలో ఎరువుల డీలర్ల సమావేశాన్ని జిల్లా వ్యవసాయాధికారి నిర్వహించాలి. ♦ఎరువుల లైసెన్సులను మాన్యువల్ ప్రాతి పదికన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు జారీచేయకూడదు. ♦జిల్లాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేసే వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. -
రామగుండంలో 3.74 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్సిటీ(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో 2021–22 సంవత్సరం 3,74,728.32 టన్ను ల యూరియా ఉత్పత్తి అయిందని ఆ కర్మాగారం సీజీఎం విజయ్కుమార్ బంగార్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కర్మాగారం వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. దేశీయంగా ఎరువుల కొరత తీర్చడమే ఆర్ఎఫ్సీఎల్ ఉద్దేశం. ఈ ప్లాంట్లో ప్రతిరోజూ 2,200 టన్నుల అమ్మో నియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కర్మాగారం వాణిజ్య ఉత్పత్తుల్లో తెలంగాణకు 2,11,073.13, ఆంధ్రప్రదేశ్కు 1,00,321.11, కర్ణాటకకు 63,334.08 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల కొరత తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరించిందని, వాటిల్లో ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్సీఐ) కూడా ఒకటని తెలిపారు. -
నెల్లూరులో నానో యూరియా ప్లాంట్!.. రూ.250 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన బెంగళూరులో తొలి ప్లాంట్ నెలకొల్పిన భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) రెండో ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్లాంట్ను నెలకొల్పడంపై ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు జరుపుతోంది. ఎందుకింత ఆదరణ....? సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా దవ్ర రూపంలో ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరియా బస్తాతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, మెరుగైన పనితీరు, ద్రవరూప యూరియా బాటిళ్లను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుండటం, రవాణా ఖర్చులు ఆదా కావడం దీనికి ప్రధాన కారణాలు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నానో యూరియా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఏపీలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది. కోటి లీటర్ల సామర్థ్యంతో నెల్లూరు అగ్రి సెజ్లో ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో ఆసక్తి చూపుతోంది. కనీసం 20 ఎకరాల్లో ప్లాంట్ నెలకొల్పేందుకు భూ కేటాయింపుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. బస్తా యూరియాతో సమానం.. 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియాను బాటిళ్లలో ఇఫ్కో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా నానో యూరియా బాటిల్ రూ.240కే లభిస్తోంది. సంప్రదాయ ఎరువుల్లో ఉండే పోషకాలన్నీ కలిగి ఉండడం, అన్ని పంటలకు అనుకూలమైనది కావడం, 80–90 శాతం యూరియా మొక్కకు అందడం, భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని రుజువు కావడంతో ‘నానో’ పట్ల రైతుల్లో ఆదరణ పెరుగుతోంది. గత ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా సుమారు 20 వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17,064 లీటర్లు) కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది డీఏపీ, జింక్, కాపర్ కూడా.. నానో యూరియా విక్రయాలను ప్రోత్సహిస్తూ రిటైల్ మార్కెట్లతో పాటు ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత రబీ సీజన్ కోసం 5.25 లక్షల బాటిల్స్ (2.65 లక్షల లీటర్లు) అందుబాటులో ఉంచగా రికార్డు స్థాయిలో 4.35 లక్షల బాటిళ్ల (2.17 లక్షల లీటర్లు) విక్రయాలు జరిగాయి. డిమాండ్ను బట్టి నిల్వ పెంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేస్తోంది. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ఇఫ్కో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ఉత్పత్తులతో ట్రయిల్ రన్ నిర్వహించింది. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కలుపు తగ్గింది.. దిగుబడి పెరిగింది ఖరీఫ్లో ఆరు ఎకరాల్లో ఎం–7 వరి రకం సాగు చేశా. 30వ రోజు, 60వ రోజు నానో యూరియాను రెండుసార్లు లీటర్ నీటిలో 4 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేశాం. కలుపు సమస్య, ఖర్చు తగ్గింది. దిగుబడి సరాసరిన రెండు బస్తాలు అధికంగా వచ్చింది. – అశోక్కుమార్, ఎల్లాయపాడు, నెల్లూరు జిల్లా త్వరలో ప్లాంట్కు పునాది రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇఫ్కో అంగీకరించింది. నెల్లూరులో భూములను కేటాయించడంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ప్లాంట్కు పునాదిరాయి వేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. – వై.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ -
ఎరుపు కోసం రైతన్నపడిగాపులు
-
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం రైతులకు పండుగ ముందు తీపికబురు అందించింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని కేంద్రం భారీగా పెంచింది. ప్రస్తుతం యూరియాపై అందిస్తున్న రాయితీని రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు అందించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రాయితీ ధర రూ.1200 నుంచి రూ.1650కి, ఎన్పీకే ఎరువుపై ఇస్తున్న రాయితీ ధర రూ.900 నుంచి రూ.1015కి, ఎన్ఎస్ పీపై ఇస్తున్న రాయితీ ధరను రూ.315 నుంచి రూ.375కి పెంచింది. ఈ రాయితీ పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.28వేల కోట్ల భారం పడనుంది. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదని కేంద్ర మంత్రి వివరించారు.(చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!) -
యాదాద్రి రింగ్రోడ్డు.. అందాలు మెండు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతోపాటు ఆహ్లాద వాతావరణం కలిగేలా వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రి కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్కు సమీపంలో నిర్మించిన సర్కిల్ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 60 మీటర్లతో ఏర్పాటు చేసిన ఈ సర్కిల్లో చెన్నై నుంచి తెచ్చిన ఫీనిక్స్ ఫాం జాతి మొక్కలతోపాటు సీజనల్ పూల మొక్కలను నాటారు. దీంతో ఇప్పుడు ఆ సర్కిల్ రంగుల వలయంలా మారి ఆకట్టుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ యాదాద్రి భువనగిరి యూరియా.. రైతుల బాధ ఇదయా! కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. –సదాశివనగర్ (ఎల్లారెడ్డి) జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో ధరూరు/దోమలపెంట(అచ్చంపేట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు 1,00,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇన్ఫ్లో తగ్గడంతో ఉదయం ప్రాజెక్టు 15క్రస్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 10 క్రస్టు గేట్లను ఎత్తి 67,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 1,00,948 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి 1,45,169 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. రెండు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,692 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 64,487క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. -
తెల్లవారుజాము 3 గంటల నుంచే..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
దక్షిణ తెలంగాణలో ప్లాంటు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: భూసార పరిరక్షణలో నానో యూరియా కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ కలోల్లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణ నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని, ఈ దిశగా ఇఫ్కో యోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, నానో యూరియా వినియోగంతో భూసార పరిరక్షణతో పాటు తక్కువ వినియోగంతో అధిక దిగుబడులు సాధించే వీలుందన్నారు. మంత్రితో పాటు జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ ఉన్నతాధికారి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేశ్ రాలియా తదితరులున్నారు. విస్తృతంగా వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు రాష్ట్రంలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ దిశగా అధ్యయనం కోసం అత్యధిక పరిశ్రమలు ఉన్న గుజరాత్లో పర్యటించి పరిశ్రమలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శనివారం గుజరాత్లోని సబర్కాంఠ జిల్లాలో పరిశ్రమలను బృందం సందర్శించింది. ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీఎం కె.చంద్రశేఖరరావు సూచనల మేరకు జిల్లాల వారీగా పంట ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్రానికి నానో యూరియా
సాక్షి, హైదరాబాద్: నానో యూరియా.. ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న ఘన యూరియాకు ప్రత్యామ్నాయం. తక్కువ ఖర్చు, పర్యావరణ హితం, మంచి దిగుబడి దీని ప్రత్యేకత. భారతీయ రైతాంగ స్వీయ ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ఆవిష్కరించిన ఈ నానో యూరియా అతి త్వరలో రాష్ట్రానికి చేరనుంది. గుజరాత్లోని కలోల్ నుంచి రాష్ట్రానికి బయల్దేరే నానో యూరియా ట్రక్ను శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆన్లైన్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు పాల్గొన్నారు. నానో ప్రత్యేకతలివే ♦నానో టెక్నాలజీతో రూపొందించిన నానో యూరియాతో ప్రభుత్వాలపై సబ్సిడీ, రవాణా భారాలు తగ్గుతాయి. ♦ప్రస్తుతం ఒక బస్తాపై రూ.800 నుంచి రూ.1000 వరకు ప్రభుత్వం రాయితీ భారాన్ని మోస్తోంది. రూ.240కే లభించే 500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ♦ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ పొందింది. ♦ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత నానో యూరియాను రెండుసార్లు పిచికారీ చేయాలి. మామూలు యూరియా సమర్థత 30 శాతమైతే దీని సమర్థత 80 శాతమని ఇఫ్కో చెబుతోంది. -
తొలిసారిగా.. అర లీటర్ సీసాలో బస్తా యూరియా
సాక్షి, అమరావతి: సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) దీనిని ఇటీవల ఆవిష్కరించింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కారం. నానో టెక్నాలజీపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతుండగా.. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాను ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. ఏమిటీ నానో యూరియా.. తరతరాలుగా మనందరికీ తెలిసిన సంప్రదాయ యూరియా తెల్లటి గుళికల రూపంలో ఉంటుంది. బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను కేవలం 500 మిల్లీలీటర్ల సీసాలో పట్టేలా చేశారు. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయి. పైగా ఇది మహా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సీసాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. భావి ఎరువుల మార్కెట్ రంగంలో ఇదో మేలి మలుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుంది. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.240 కాగా.. యూరియా బస్తా ధర రూ.268. -
యూరియా కోసం బారులు..
-
యూరియా కోసం బారులు.. లైన్లో మందు సీసాలు
సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూ లైన్లో తమ గుర్తుగా వస్తువులు ఉంచారు. చెప్పులు, రాళ్లతో పాటు మందు బాటిళ్లను కూడా లైన్లో ఉంచారు. తాగి పడేసిన మందు సీసాలను లైన్లో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (విక్రయాల్లో విచిత్రాలెన్నో..) -
విక్రయాల్లో విచిత్రాలెన్నో..
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా అమ్మకాల్లో ప్రయివేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు ఒడిగట్టారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టాలంటూ కలెక్టర్ను ఆదేశించింది. దీంతో ఆయన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పుల్లయ్యతో విచారణ చేయిస్తున్నారు. ఇప్పటికే డీఆర్వో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు. ఈ క్రమంలో డీలర్ల ‘వేషాలు’ వెలుగు చూశాయి. ♦నందికొట్కూరులోని రెండు దుకాణాల్లో ముగ్గురు వ్యక్తులే 188 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. దీనిపై డీఆర్వో విచారణ చేయగా.. ఆ ముగ్గురూ ఆయా షాపుల్లో పనిచేసే గుమాస్తాలేనని తేలింది. బిజినవేములకు చెందిన ఇర్ఫాన్ 84.6 టన్నులు, షేక్ సికిందర్ 49.14 టన్నులు, చెరుకుచెర్లకు చెందిన శివన్న 54.945 టన్నులు కొన్నట్లు డీలర్లు రికార్డు చేశారు. ♦నంద్యాలలోని ఒక ఫర్టిలైజర్ దుకాణంలో బి.గోవిందు అనే వ్యక్తి ఏకంగా 174.555 టన్నుల యూరియా (3,491 బస్తాలు) కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. ఒక మండలానికి సరిపోయే యూరియాను ఒకే వ్యక్తి కొన్నట్లు డీలర్లు మాయ చేశారు. అలాగే అద్దంకి సత్యనారాయణ అనే వ్యక్తి 169.155 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు చూపారు. ♦ఇలా 23 మంది వేలాది బస్తాల యూరియా కొనుగోలు చేసినట్లు డీలర్లు చూపడం వెలుగులోకి వచ్చింది. యూరియాతో సహా రసాయనిక ఎరువులను పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం మేరకు ఈ–పాస్ మిషన్లో రైతు వేలిముద్ర తీసుకుని పంపిణీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. 3 షాపుల లైసెన్స్ సస్పెండ్ యూరియా అధిక ధరకు అమ్ముతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలిన నేపథ్యంలో కల్లూరు మండలం చిన్నటేకూరులోని ధనుంజయ ఫర్టిలైజర్స్, కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని సాయికృప ఏజెన్సీస్, వసుంధర ఆగ్రో ఏజెన్సీస్ లైసెన్స్లను సస్పెండ్ చేస్తూ కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ ఆర్.విజయశంకర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అందుబాటులో అవసరమైన యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, దీన్ని దశలవారీగా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ‘యూరియా లాక్ ’శీర్షికన ఆదివారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చారు. జూలై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయకపోవడంతో వెంటనే సీఎం కేసీఆర్ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రితో మాట్లాడారని, తాను కూడా కేంద్రమంత్రిని కలిశానని పేర్కొన్నారు. దీంతో కేంద్రం వెంటనే జూలై కోటా సరఫరా మొదలుపెట్టిందని, ఈ నెలలో 2.05 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మిగిలిన యూరియాను ఈ నెలాఖరుకల్లా ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈరోజుకు రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, -
యూరియా ‘లాక్’
సాక్షి, హైదరాబాద్: కరోనా... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి రాష్ట్రంలోని వ్యవసాయ అవసరాలపై కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ వైరస్ విజృంభిస్తున్న వేళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే కాదు స్థానికంగా ఏర్పడిన ‘లాక్డౌన్’పరిస్థితులు అడుగడుగునా రాష్ట్రంలోకి ఎరువుల రాకను అడ్డుకుంటున్నాయి. విదేశాల నుంచి యూరియాను తెచ్చే నౌకల గమ్యస్థానాలైన పోర్టుల నుంచి రాష్ట్రంలో ఉండే ర్యాక్ పాయింట్లు, గోదాముల వరకు అన్నిచోట్లా ఈ మాయదారి వైరస్ తన ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్కు యూరియా ముప్పు పొంచి ఉందని, కరోనాకు తోడు తుపానులు కూడా యూరియా దిగుమతులకు అడ్డంకిగా మారాయని వ్యవసాయశాఖ ఓ నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం గత నెల నుంచే ప్రారంభం కావడం, ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు గరిష్టంగా వినియోగం జరిగే అవకాశం ఉండడంతో ఏం చేయాలో కూడా ఆ శాఖ అధికారులకు పాలుపోవడం లేదు. మొత్తంమీద కరోనా ప్రభావం కారణంగా అవసరానికన్నా 2.5 లక్షల టన్నుల వరకు యూరియా కొరత ఏర్పడిందని, రాష్ట్రంలో ప్రస్తుతం 5.84 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులే అందుబాటులో ఉన్నాయని, అందులోనూ యూరియా కేవలం 1.89 లక్షల మెట్రిక్ టన్నులే ఉందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. నాలుగు నెలలుగా సరఫరాలో జాప్యం వాస్తవానికి, రాష్ట్రంలో ప్రతి సీజన్కు సాగు చేసే పంటల విస్తీర్ణం ఆధారంగా తమకు ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫర్టిలైజర్స్ శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. ఆ మేరకు ప్రతి సీజన్కు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ (డీవోఎఫ్) ఎరువులను కేటాయిస్తుంది. ఈ ఏడాది మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయనే అంచనాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈసారి ఎరువుల కేటాయింపు ప్రతిపాదనలను భారీగానే పంపింది. దీనికి అనుగుణంగానే డీవోఎఫ్ కూడా ఈసారి మన రాష్ట్రానికి 10.50 లక్షల మెట్రిక్ టన్నులు (గత సంవత్సరాలతో పోలిస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా) యూరియాను కేటాయించింది. ఇందులో ఈనెల 31 నాటికి 6.13 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏప్రిల్, మే, జూన్, జులై మాసాల్లో కేవలం 3.70 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇక మిగిలిన ఎరువులు కూడా కలిపి మొత్తం 22.50 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కేటాయించగా, అందులో జూలై వరకు రావాల్సిన దాంట్లో ఇప్పటివరకు 5 లక్షల టన్నుల మేర తక్కువ రావడం గమనార్హం. మరో 37 వేల టన్నులు వచ్చే చాన్స్ ఇక వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రాష్ట్రానికి ఈనెల 31 వరకు మరో 37 వేల టన్నులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉన్న 8 ర్యాక్ పాయింట్ల నుంచి పలు ఫర్టిలైజర్ కంపెనీలు ఈ మేరకు ఎరువులు ఇస్తాయని ఆ శాఖ అంచనా వేస్తోంది. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా అవి కూడా ఏ మేరకు వస్తాయన్నది సందేహాస్పదమే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత ఏర్పడే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు గాను గత నెలల్లో తక్కువగా వచ్చిన ఎరువులనయినా రాష్ట్రానికి పంపాలని, రానున్న నెలల్లో కేటాయింపుల కంటే ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇవీ అడ్డంకులు: ►మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అక్కడ లేబర్ సమస్య బాగా ఏర్పడింది. దీనికి తోడు ఆంఫా, నిసర్గా తుపానుల కారణంగా ఆ రాష్ట్రంలోని యూరియా ఉత్పత్తి కార్మాగారాల్లో పనులు నిలిచిపోయాయి. ►మే నెలలోనే కృష్ణపట్నం పోర్టులో లేబర్ సమస్య రావడంతో సప్లై నెమ్మదించింది. ఇక, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 10 నుంచి 16 వరకు అక్కడ లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు. జూన్లో పారాదీప్ పోర్టుకు రావాల్సిన యూరియా నౌక ఇంకా చేరలేదు. ►ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ర్యాక్ పాయింట్లలో కూడా లోడింగ్, అన్లోడింగ్ నిలిచిపోయింది. యూరియా రవాణా ఆగింది. ►సనత్నగర్, ఆదిలాబాద్ ర్యాక్ పాయింట్లలో ఏప్రిల్ నెలలో, కరీంనగర్ పాయింట్లో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కారణంగా అన్లోడింగ్కు అవాంతరాలు కలిగాయి. ►ఇక నిజామాబాద్ ర్యాక్పాయింట్లో యూరియా అన్లోడింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఇక్కడ బియ్యం దిగుమతికి ప్రాధాన్యత ఇస్తుండడం, ప్లాంట్లు, పోర్టుల నుంచి యూరియా తెచ్చే ర్యాక్లు తక్కువగా లోడ్ అవుతుండడంతో ఇక్కడ కూడా ఆశించిన స్థాయిలో యూరియా దిగుమతి కావడం లేదు. ►రవాణా లారీల్లో ఎక్కువగా మక్కలు వెళుతున్నాయి. దీనికి తోడు రబీలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులతో గోదాములు నిండిపోవడంతో యూరియా నిల్వకు సమస్య ఏర్పడుతోంది. ►మన రాష్ట్రానికి యూరియాను ఎక్కువగా సరఫరా చేసే కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్సీఎల్)ను ఈనెల మొదటివారం నుంచి షట్డౌన్ చేయడం ఈ ఆలస్యానికి మరింత కారణం అవుతోంది. చెన్నై, మహారాష్ట్రల్లోని యూరియా ప్లాంట్లు కూడా ఏప్రిల్ నుంచి మూతపడి ఉన్నాయి. ►కోవిడ్, తుపానుల కారణంగా చైనా, వియాత్నాం, గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన యూరియా నౌకలు సమయానికి రావడం లేదు. -
యూరియా కోసం పడిగాపులు
రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఆదివారం యూరియా పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్తోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారు జామున 3 గంటలకే చెన్నారావుపేట సొసైటీ ఆవరణకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలీసు బందోబస్తు మధ్య యూరియా అందించారు. అమీనాబాద్ సహకార సంఘం వద్దకు కూడా రైతులు అధికంగా తరలివచ్చారు. – చెన్నారావుపేట -
యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎరువుల సంస్థలో అవినీతి ఏపుగా పెరిగింది. మార్క్ఫెడ్కు మరక అంటింది. రైతులకు సరిపడా యూరియాను సిద్ధం చేయలేని ఆ సంస్థ, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అనవసరంగా అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కొనాల్సిందేనని అధికారులు ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్)పై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా యూరియా కొరతను ఎరువుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాలకు ఒక కంపెనీ ఏకంగా ఉత్తర్వులే జారీ చేశారని, ఒక జిల్లాకు చెందిన మార్క్ఫెడ్ అధికారి సంబంధిత కంపెనీతో ఘర్షణకు దిగారనే విషయాలు కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఖరీఫ్లో ఎరువుల పంపిణీ వ్యవసాయ లక్ష్యం -19.40 లక్షల మెట్రిక్ టన్నులు ఇందులో యూరియా - 8.50 లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు - 10.90 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువుల కంపెనీలతో కుమ్మక్కై.. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద డీఏపీ 14,900 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,800 మెట్రిక్ టన్నులు, యూరియా 10,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కంటే ఇతర ఎరువులనే మార్క్ఫెడ్ అధికారులు ఎక్కువగా అందుబాటులో ఉంచడం గమనార్హం. యూరియా కొరత ఉన్నందున లింకు పెడితే రైతులు కొంటారని అధికారులకు కంపెనీలు నూరిపోస్తున్నాయి. అలా చేస్తే పర్సంటేజీలు ఇస్తామని ఆశ చూపిస్తున్నాయి. యూరియా కోసం గత్యంతరం లేక ప్యాక్స్లు, అక్కడి నుంచి రైతులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయక తప్పడంలేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం గమనార్హం. ఇష్టారాజ్యంగా ధరలు... జూలై, ఆగస్టులోనే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం వాటికి డిమాండ్ లేదు. అయినా రైతులతో కొనిపిస్తున్నారు. మార్క్ఫెడ్ ధరల ప్రకారం ప్యాక్స్కు ఇచ్చే డీఏపీ బస్తా ధర రూ.1,250 కాగా, డీలర్లకు కంపెనీలు ఇచ్చే ధర రూ. 1,150 నుంచి రూ. 1,190 మాత్రమే. కాంప్లెక్స్ ఎరువులకు మార్క్ఫెడ్ ఇచ్చే ధర బస్తా రూ. 980 కాగా, డీలర్లకు ఇచ్చే ధర రూ. 900 నుంచి రూ. 940 మాత్రమే. డీఏపీ బస్తా ధర మార్క్ఫెడ్ వద్ద రూ. 50 నుంచి రూ. 100, కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.40 నుంచి రూ.80 అధికం. -
ఖరీఫ్ నేర్పిన పాఠం..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో యూరియా పంపిణీలో ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న రబీ సీజన్లో ఎరువుల పంపిణీకి ముందుజాగ్రత్త పడుతోంది. గతేడాది రబీ సీజన్లో ఎరువుల కేటాయింపుల కోసం పంపిన ప్రతిపాదనలకు దాదాపు రెట్టింపు నిల్వలు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సాక్షి, నిజామాబాద్: గత ఏడాది 2018 రబీ సీజన్లో 36,720 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని ప్రతిపాదించగా.. ఈ ఏడాది ఖరీఫ్లో ఎదురైన అనుభవాల రీత్యా రబీ సీజన్లో ఏకంగా 71,537 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంటే గతేడాది కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో కేటాయింపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గత రబీ సీజన్లో జిల్లాకు ఏ మేరకు యూరియా వచ్చిందనే అంశంపైనా లెక్కలు తీస్తున్నారు. ఎరువులు : 1.21 లక్షల మెట్రిక్ టన్నులు.. రబీ సీజన్లో మొత్తం 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి పంపించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 71,537 టన్నుల యూరియాతో పాటు, 8,621 మెట్రిక్ టన్నుల డీఏపీ, 7,570 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 958 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ, 33,045 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కేటాయించాలని కోరుతున్నారు. ముందస్తు నిల్వలు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సహకార సంఘాలు ఎరువుల విషయంలో అలసత్వం వహించడంతో యూరియా కొరతకు కారణమైంది. సహకార సంఘాలు ముందస్తుగా నిల్వలు చేసుకోకపోవడంతో ఒక్కసారిగా వచ్చిన డిమాండ్కు సరిపడా ఎరువులను సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. రెండు బస్తాల యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. వ్యవసాయ పనులన్నీ మానుకుని రోజంతా క్యూలైన్లో నిలబడితే రెండు బస్తాల యూరియా దొరకడం కష్టంగా మారింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. పాసుపుస్తకాలను, చెప్పులను క్యూలో పెట్టి అనేక పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రబీ సీజన్లో ఇలా పరిస్థితులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త పడాలని నిర్ణయించింది. ఇందుకోసం సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు ముందుగానే అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆర్థికంగా బలంగా ఉన్న సహకార సంఘాలు, వరి విస్తీర్ణం అధికంగా ఉండే ప్రాంతాల సహకార సంఘాల్లో ముందస్తుగా నిల్వలు తెప్పించుకుని పెట్టుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో ఒక్క ఆర్మూర్ సబ్ డివిజన్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల వరి విస్తీర్ణం అధికంగా ఉంటుంది. దీంతో ఈ సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలుంచాలని నిర్ణయించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా ఇలాగే ముందస్తు నిల్వలు తెప్పించి పెట్టుకోవాలని వ్యవసాయశాఖ సహకార సంఘాల పాలకవర్గాలకు ఆదేశాలు జారీ చేసినా.. పలు సంఘాలు పెడచెవిన పెట్టడంతో యూరియా కొరత తీవ్రమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 82 వేల హెక్టార్లలో వరి అంచనా... ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 82 వేల హెక్టార్లలో వరి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 13 వేల హెక్టార్లలో ఎర్రజొన్న, ఆరు వేల హెక్టార్లలో మొక్కజొన్న, పది వేల హెక్టార్లలో శనగ, మరో ఆరు వేల హెక్టార్లలో బాజ్రాతో పాటు నువ్వు, కూరగాయలు, పప్పుదినుసు వంటి పంటలు సాగవుతాయి. ఈసాగు విస్తీర్ణానికి అవసమైన ఎరువులను తెప్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. -
యూరియా కష్టాలు.. గంటల కొద్ది పడిగాపులు
సాక్షి, జనగాం : రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం గంటల కొద్ది లైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్ల వద్ద చెప్పులతో రైతులు బారులు తీరుతున్నారు. పాలకుర్తి మండలం ఎఫ్ఎస్సీఎస్ కోపరేట్ బ్యాంకు వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కాళ్లు తిమ్మిర్లు పట్టేలా గంటల పాటు వరుసలో నిలబడి ఉన్నా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఒక లారీ లోడ్లో 506 యూరియా బస్తాలు వస్తే రోజు వెయ్యి మంది నుoచి 1200 మంది రైతులు బస్తాలకోసం వస్తున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, యూరియా బస్తాల కొరత లేకుండా అన్ని ప్రాంతాలకు రవాణా చేసి అధికారులు ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. -
‘యూరియా పంపిణీలో క్షణం వృథా కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: రైతులకు యూరియా అందించడంలో క్షణం కూడా వృథా కానివ్వబోమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. ఎరువులను త్వరితగతిన రాష్ట్రానికి చేర్చేందుకు రోడ్డు, రైల్వే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రబీకి కూడా యూరియా నిల్వలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అన్ని పోర్టుల నుంచి 20,387 మెట్రిక్ టన్నులు, విశాఖ నుంచి 6,800 మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఏపీ లోని గంగవరం పోర్టులో అధికారులతో సమావేశమైన మంత్రి యూరియా సత్వర రవాణాపై చర్చించారు. తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు కారి్మకులు, రవాణాదారులు సహకరించాలని, అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు. మంత్రి వెంట వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులున్నారు. -
తీరనున్న యూరియా కష్టాలు
సాక్షి, జడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పడుతున్న యూరియా కష్టాలు ఇక తీరనున్నాయి. తాజాగా బుధవారం జడ్చర్ల రైల్వేస్టేషన్కు వ్యాగన్ ద్వారా స్పిక్ కంపెనీకి చెందిన 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. గురువారం మరో రెండు వ్యాగన్ల ద్వారా 3,800 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది. జడ్చర్ల రేక్పాయింట్కు చేరుకున్న యూరియాను మహబూబ్నగర్ డీఏఓ సుచరిత, మార్క్ఫెడ్ ప్రతినిధి ప్రణీత్, రేక్పాయింట్ అధికారి, జడ్చర్ల ఏఓ రాంభూపాల్ పరిశీలించారు. వచ్చిన ఈ యూరియాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయా జిల్లాలకు పంపిణీ ఇలా యూరియాను మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. గద్వాల, నాగర్కర్నూలు జిల్లాలకు 129 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను పంపించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించిన యూరియాలో జడ్చర్ల మండలానికి 120 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోరమండల్ యూరియా మొదటి విడతగా 800 మెట్రిక్ టన్నులు, రెండో విడతగా 3,000 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి జిల్లాలో కొరత లేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యూరియా కొరత లేదని డీఏఓ సుచరిత స్పష్టం చేశారు. బుధవారం జడ్చర్ల రేక్పాయింట్ పరిశీలించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, గురువారం 3,800 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కావాల్సిన విధంగా యూరియాను సరఫరా చేస్తున్నామన్నారు. వచ్చిన యూరియాలో 50 శాతం మార్క్ఫెడ్ ద్వారా సంఘాలకు ఇస్తామని, మిగతాది డీలర్లకు కేటాయిస్తామన్నారు. తద్వారా రైతులు రద్దీ లేకుండా సౌకర్యంగా యూరియా తీసుకువెళ్లగలుగుతారన్నారు. గత జూన్లో వర్షాలు కురియకపోవడం వల్ల యూరియా డిమాండ్ లేదన్నారు. జూలై, ఆగస్టులో వర్షాలు కురియడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.17 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. వీటికోసం 34 వేల మెట్రిక్టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు పంపామన్నారు. నెల వారీగా నివేదికలు ఇచ్చామని అందులో బుధవారం సాయంత్రం వరకు 22,649 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యిందన్నారు. జిల్లాలో మండలాల వారీగా ముందుజాగ్రత్తలు తీసుకుని యూరియా నిల్వలు ఉంచటం వల్ల సమస్య తలెత్తకుండా చూశామన్నారు. అవసరమైన ప్రాంతాలకు నిల్వ ఉన్నచోటనుంచి పంపిణీ చేశామని తెలిపారు. -
సేంద్రియ యూరియా!
రెండేళ్లుగా సేంద్రియ యూరియా తయారు చేసి వాడుకుంటూ చక్కని దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ యువ రైతు సోదరుల విజయ సూత్రాలే నేటి నేటి సాగుబడిగా మీ ముందు... ఆరుగాలం చెమటోడ్చి వ్యవసాయం చేసే రైతులు స్వతహాగా స్వేచ్ఛా జీవులు. అయితే, విత్తనాలు, ఎరువులకు, పురుగుమందులకు పూర్తిగా మార్కెట్పైనే ఆధారపడడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఉత్సాదకాలన్నిటినీ దుకాణాల్లో కొనుక్కొని వాడుకోవడానికి అలవాటు పడిన రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమకున్న స్వేచ్ఛను కోల్పోతున్నారు. యూరియా వంటి రసాయనిక ఎరువు బస్తాల కోసం తెలంగాణ జిల్లాల్లో రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడుతూ నానా బాధలు పడుతున్నారు. అయితే, జగిత్యాల జిల్లాలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రం తమ స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నారు. తమ పంటలకు అవసరమైన సేంద్రియ యూరియాను ఇసుక, ఆవు మూత్రంతో తామే తయారు చేసుకుంటూ నిశ్చింతగా పంటలు పండించుకుంటున్నారు. అటువంటి ఓ యువ రైతు సోదరుల విజయగాథ ఈ వారం ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ♦ దండవేని నరేష్, సురేష్ అన్నదమ్ములు, యువకులు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. ఐదేళ్లుగా 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేస్తున్నారు. పాలేకర్, చౌహాన్ క్యు, సీవీఆర్ మట్టిసేద్యంపై యూట్యూబ్లో వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం చేపట్టి అభివృద్ధి పథంలో కొనసాగుతున్నారు. ♦ రెండెకరాల్లో 16 రకాల కూరగాయలు, 3 ఎకరాల్లో వరి, మిగతా 3 ఎకరాల్లో చిరుధాన్యాలు, పసుపు తదితర పంటలు పండిస్తున్నారు. రసాయనాలు వాడకుండా తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను జగిత్యాల పట్టణంలో సొంతంగా స్టాల్ ఏర్పాటు చేసుకొని మార్కెట్ ధరపై 10% అధిక ధరకు స్వయంగా అమ్ముకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు. ♦ నరేష్, సురేష్ పంటలకు ఘనజీవామృతం, జీవామృతం, లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, మట్టి ద్రావణం, చేప అమినోయాసిడ్ ద్రావణం, జీవన ఎరువులు వంటి వాటిని పంటల పోషక అవసరాలకు తగినట్లుగా వాడుతూ ఉంటారు. వీటిని స్వయంగా తామే తయారు చేసుకుంటారు. అయితే, రెండేళ్లుగా ఇసుక, ఆవు మూత్రంతో సేంద్రియ యూరియాను కూడా తయారు చేసుకొని పంటలకు వేసుకుంటున్నారు. వాడకానికి సిద్ధమైన సేంద్రియ ఇసుక యూరియా 30 రోజుల్లో సేంద్రియ యూరియా సిద్ధం సేంద్రియ యూరియాకు కావాల్సిన ముడి పదార్థాలు.. ఇసుక, నాటు ఆవు మూత్రం. యూరియా తయారీకి నాటు ఆవు మూత్రం శ్రేష్టమని, దీనితోపాటు ఏ పశువు మూత్రమైనా వాడుకోవచ్చని నరేష్, సురేష్ చెబుతున్నారు. దగ్గరలో ఉన్న వాగు నుంచి ఇసుకను సేకరించుకోవాలి. అందులో రాళ్లు, రప్పలు లేకుండా జల్లించుకోవాలి. వర్షం, ఎండ పడకుండా కొష్టం/షెడ్లో సేంద్రియ యూరియా తయారు చేసుకోవాలి. ఇందుకు 30 రోజులు పడుతుంది. మొదటి 20 రోజులు ఇసుకలో ఆవు మూత్రం రోజూ కలుపుతూ తడిగా ఉంచాలి. తర్వాత 10 రోజులు ఆ ఇసుకకు గాలి తగలకుండా ప్లాస్టిక్ షీట్లో మూటగట్టి ఉంచాలి. తయారు చేసే విధానం: ఇసుకను ఒక పెద్ద నల్లని ప్లాస్టిక్ కవర్పై పోయాలి. 100 కిలోల ఇసుకపై 10–12 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని పోసి, ఇసుక పూర్తిగా తడిసేలా కలగలపాలి. తర్వాత, గాలి చొరబడకుండా కవర్ కట్టేయాలి. 19 రోజుల పాటు రోజూ కవర్ను విప్పి, ఇసుక తడి ఆరకుండా ఉండేంత ఆవు మూత్రాన్ని చల్లి.. మళ్లీ కవర్ను గట్టిగా తాడుతో కట్టి నీడలో ఉంచాలి. 20 రోజులకు ఇసుక యూరియా పసుపు నుంచి నల్లని రంగులోకి మారుతుంది. ఇక సేంద్రియ యూరియా వాడకానికి సిద్ధమైనట్టే. సేంద్రియ యూరియా తయారీకి మరో పద్ధతి సేంద్రియ యూరియాను మరింత సులభంగా తయారు చేసుకునే పద్ధతి మరొకటి ఉందని రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్కుమార్(98661 92761) తెలిపారు. పశువుల చావిడిలో నేలపైన ఇసుక పోసి, అక్కడ పశువులను కట్టేయాలి. అవి పేడ వేస్తాయి, మూత్రం పోస్తాయి కదా. పేడను విడిగా తీసుకొని.. మూత్రంతో తడిసిన ఇసుకను ఏరోజుకారోజు తీసి పక్కన కుప్పగా పోసుకోవాలి. పశువుల మూత్రమే కాదు మనుషుల మూత్రం కూడా సేంద్రియ యూరియా తయారీకి అద్భుతంగా పనిచేస్తుంది. అలా 20 రోజులు చేయాలి. 21వ రోజున ఆ ఇసుకకు గాలి ఆడకుండా ఉండేలా మూటగట్టి 10 రోజుల తర్వాత తీయాలి. అంతే.. సేంద్రియ యూరియా సిద్ధం! రసాయనిక యూరియా పంటపై చల్లితే ఎక్కువ తక్కువగా పంటకు అందుతుందని, అది కూడా 20% మాత్రమేనని, మిగతాది వృథా అవుతుందని కొక్కు అశోక్కుమార్ అన్నారు. సేంద్రియ యూరియా పంటపై చల్లినప్పుడు సమానంగా, పుష్కలంగా అందుతుందని తెలిపారు. పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం దీని వల్ల ఉండదని, మోతాదు ఎక్కువైనా పంటకు నష్టం ఉండదని, చీడపీడల విజృంభించవని అన్నారు. రైతులందరూ సేంద్రియ యూరియాను తయారు చేసుకొని వాడుకుంటే ఆర్థికంగా, పర్యావరణపరంగా, భూసారం పరంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఎకరానికి 200 కిలోలు రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్కుమార్ గత ఖరీఫ్కు ముందే జగిత్యాలలో రైతులకు సేంద్రియ యూరియా తయారీపై శిక్షణ ఇచ్చారు. నరేష్, సురేష్ కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు. వాళ్లు వరి సాగుకు సేంద్రియ యూరియా వాడటం ఇది వరుసగా మూడో సీజన్. నాటు వేసిన 20 రోజులకు ఎకరానికి 200 కిలోలు, పొట్ట దశలో మరో 200 కిలోల సేంద్రియ యూరియా చల్లుతున్నారు. 2018 ఖరీఫ్లో ఎకరానికి 28 క్వింటాళ్లు, రబీలో 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి పొందారు. రసాయనిక యూరియా కోసం తోటి రైతులు రోజుల తరబడి క్యూలలో నిల్చుంటూ ఉంటే.. ఈ యువ రైతులు మాత్రం.. స్వల్ప ఖర్చుతో ముందే తాము తయారుచేసి పెట్టుకున్న సేంద్రియ యూరియాను సకాలంలో వరి పంటకు అందించడంతోపాటు పొటాషియాన్ని అందించే పొగాకు కషాయం పిచికారీ చేసి నిశ్చింతగా ఉన్నారు. వర్షం పడని చోట దాచుకుంటే 1–2 రెండేళ్ల వరకు నిల్వ ఉంచుకొని వాడొచ్చని నరేష్(96409 63372), సురేష్ తెలిపారు. ప్టాస్టిక్ కవర్కు బదులు సిమెంటు తొట్టెలో సైతం సేంద్రియ యూరియాను సులభంగా, పెద్దమొత్తంలో తయారు చేసుకునే వీలుంది. ఎకరానికి విడతకు 100 నుంచి 200 కిలోలు వేసుకోవచ్చు. రసాయనిక యూరియా వేసిన తర్వాత పంటకు చీడపీడల బెడద ఎక్కువ అవుతుందని, సేంద్రియ యూరియా వల్ల ఆ సమస్య రాలేదన్నారు. సేంద్రియ యూరియాపై భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లోతైన పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
యూరియా ఆగయా!
సాక్షి, నిజామాబాద్: అన్నదాతల ఇక్కట్లు తొలగి పోనున్నాయి. యూరియా కష్టాలు తీరనున్నాయి.. జిల్లాలో కొద్ది రోజులుగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎరువు కోసం రైతులు సొసైటీల వద్ద బారులు తీరి నానా తిప్పలు పడ్డారు. అయితే, యూరియా కొరత తీర్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. తాజాగా ఆదివారం జిల్లాకు 2,551 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రైలు వ్యాగన్లలో వచ్చిన ఎరువు బస్తాలను గ్రామాలకు పంపిస్తున్నారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకుని అన్ని సొసైటీలకు లారీల్లో సరఫరా చేశారు. జిల్లాలో ని 90 సొసైటీలకు ఇప్పటికే ఎరువు బస్తాలు చేరుకున్నాయి. సోమవారం నుంచి రైతులకు ఎరువు బస్తాలు అందజేయనున్నారు. ఆందోళన వద్దు.. యూరియాకు ఎక్కడా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అధికారులకు సూచించారు. రైలులో వచ్చిన స్టాక్ను సొసైటీలకు తరలించే ప్రక్రియను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. యూరియా సరఫరా పూర్తి కాకముందే అవసరం మేరకు ఇండెంట్ పెట్టాలని అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి జిల్లాకు యూరియా స్టాక్ వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల మేర ఎరువులు జిల్లాకు వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని డీఏవో వివరించారు. రైతులకు సరిపడా ఎరువును సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రవాణాలో జాప్యం జరగడం వల్ల కొంత సమస్య ఏర్పడిందని చెప్పారు. ఇక మీదట ఆ సమస్య ఉండబోదని, రైతులకు సరిపడా ఎరువులను సొసైటీలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
యూరియా కష్టాలు ఎవరి పాపం?
గత నెల రోజులుగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంటలకు డోకా లేదు, ఈ ఫసలు గట్టెక్కుతం అనుకున్న రైతన్నలను ఈ ఖరీఫ్ సీజన్లో ’యూరియా’ కొరత తీవ్రంగా బాధపెడుతోంది. రైతులు ఆధార్ కార్డులు చేతబట్టి, డీ.సీ.ఎం.ఎస్.ల ముందు వారం రోజుల పాటు తిరిగితే తప్ప యూరియా బస్తాలు దొరకడం లేదు. పగలు– రాత్రి అని తేడా లేకుండా వంతుల వారిగా రైతులు క్యూలో నిలబడుతున్నారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు తిండితిప్పలు మానేసి యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు వదులుతున్నారు. అసలు రైతులకు ఇన్ని బాధలు ఎందుకు? ఈ పరిస్థితికి రావటానికి కారణం ఎవరు? ఈ యూరియా కొరత పాపం ఎవరిది? యూరియా మన రాష్ట్రంలో తయారీ కాదు. మహారాష్ట్ర, బిహార్ లాంటి పక్క రాష్ట్రాల మీద ఆదారపడాల్సిందే. సీజన్ ప్రారంభంలోనే అంచనా వేసిన మొత్తం ఎరువులను మన రాష్ట్రానికి తెచ్చి, మార్కుఫెడ్ గోదాములలో నిల్వచేసుంటే రైతులకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వర్షాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతూనే పంటలు పచ్చగా కావాలంటే రైతులు యూరియా మందు వేయాల్సిన పరిస్థితి. అసలే ఇక్కడ మన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే, మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను నాలుగు రోజులపాటు పక్క రాష్ట్రం కర్ణాటకకు మళ్ళిం చారు. రైతులు వేసే అడుగు మందుల ద్వారా మొక్కజొన్న కర్రలకు, పత్తి చెట్లకు పూర్తి బలం చేకూర్చాలంటే తేమ అధికంగా ఉన్నపుడే యూరియా వేయవలిసి ఉంటుంది. కాలం పోతే (వానలు ఆగిపోతే) పదును లేకపోతే, ఆరుగాలం చేసిన కష్టం మట్టిలో కల్సిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి ముందే, ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం పడుతుందనే లెక్కలు అంచనా వేసి, దానికనుగుణంగా యూరియా నిల్వ సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ, రాష్ట్ర వ్యవసాయ మంత్రి, అధికారులు ఏ ముందస్తు చర్యలూ చేపట్టలేదు. దీంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ. 267. కానీ, యూరియా కొరతను సాకుగా చూపి కొన్ని ప్రాంతాల్లో పెర్టిలైజర్ దుకాణాదారులు ఒక్కొక్క యూరియా బస్తా మీద రూ. 50 పెంచి అమ్ముతున్నారు. మొన్న దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిలబడి, అలసిపోయి ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. సీఎం సొంత ఇలాకాలో ఎరువుల కొరత ఒక రైతు ప్రాణం తీసింది. వ్యవసాయ మంత్రి రైతుల కష్టాలను హేళన చేస్తూ వెకిలిగా, అసంబద్ధంగా మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరో వారం రోజుల్లో పత్తి, మొక్కజొన్న పంటలు పూతకు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి సకాలంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తరువాత రాబోయే వారం, పది దినాల్లో వరి పొలాలకు యూరియా ఎక్కువ అవసరం. కనీసం ఇప్పటికైనా, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి, యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తెప్పించి, రైతులకు అందుబాటులో ఉంచి, పంటలను కాపాడాలి. వ్యాసకర్త: కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు మొబైల్ : 98667 76999 -
మార్క్ఫెడ్ అప్పు.. రూ. 1,827 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మార్క్ఫెడ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కంపెనీల నుంచి యూరియా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయడం, పంటను మద్దతు ధరకు కొనడానికి ఏర్పాటైన మార్క్ఫెడ్ పరిస్థితి ఇప్పుడు అత్యంత అధ్వా నంగా మారింది. అప్పులను చెల్లించకపోతే బ్యాం కుల ఎగవేత జాబితాలోకి వెళ్లే అవకాశముందని తాజాగా మార్క్ఫెడ్ సర్కారుకు పంపిన నివేదికలో తెలిపింది. యూరియా కొనుగోలు కష్టంగా మారుతుందని, భవిష్యత్లో రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడమూ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దీంతో మార్క్ఫెడ్ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మార్క్ఫెడ్ను గాడిలో పెట్టడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సరైన ధరకు వ్యాపారులకు విక్రయించడంలో విఫలమవడం, కమీషన్లకు కక్కుర్తిపడి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విక్రయ కమిటీకి తెలప్పకుండానే మొక్కజొన్న ధరను నిర్ణయించి విక్రయించిందన్న ఆరోపణలొచ్చాయి. అప్పులు, నష్టాలు... రైతులు పండించిన మొక్కజొన్న, కంది, మినుములు తదితర పంటలను మార్క్ఫెడ్ మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి అప్పు కింద తీసుకుంటుంది. ఆ తర్వాత తాము కొన్న పంటలను వ్యాపారులకు అమ్ముతుంది. సర్కారుకు పంపిన నివేదిక ప్రకారం.. 2013–14 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు రూ.4,589 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో నిర్వహణ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆ పంట ఉత్పత్తులను వ్యాపారులకు రూ. 3,347 కోట్లకు విక్రయించింది. అంటే నికరంగా రూ.1,241 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది. 2017–18లో కందిని వ్యాపారుల కు విక్రయించడం ద్వారా రూ.350 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము పోను ఇంకా రూ.1,827 కోట్లు బ్యాంకులకు, సంస్థలకు అప్పు చెల్లించాల్సి ఉందని నివేదికలో తెలిపింది. వాయిదాల చెల్లింపులకు నిధులు లేక చేతులెత్తేసింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ)కి గత నెలలో రూ.401 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా, ఇప్పటికీ ఇవ్వలేదు. సకాలంలో ఆయా బ్యాంకులకు అప్పులు చెల్లించకపోతే ఎగవేత జాబితాలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది. -
ఊరికి యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. 3,4 రోజుల్లోనే డిమాండ్కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలన్నారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించాలన్నారు. స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించడంపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా డిమాండ్పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడటానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించడంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదు. గత నాలుగేళ్లలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటుఇటుగా యూరియా అవసరం పడింది. ఈసారి ఆగస్టు చివరికే 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడటంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. రైతుల డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయశాఖ ముందుజాగ్రత్తగా వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. అయితే పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని యూరియాను వెంటనే తెప్పించి గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. 3 వేల లారీల ద్వారా పోర్టుల్లోని యూరియా... ఐడీఎల్, ఇఫ్కో, సీఐఎల్, క్రిబ్కో, ఎన్ఎఫ్ఎల్ కంపెనీల ద్వారా వచ్చిన దాదాపు 1.15 లక్షల టన్నుల యూరియా ప్రస్తుతం విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం, న్యూ మంగుళూరు నౌకాశ్రయాలకు చేరింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియాను త్వరగా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ నాగ్యాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివిధ పోర్టుల్లోని యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించడానికి 25 ప్రత్యేక గూడ్సు రైళ్లను కేటాయించాలని కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు యూరియా నేరుగా పంపాలని కోరారు. ఇందుకు రైల్వే అధికారులు అంగీకరించారు. ప్రభుత్వం కోరినట్లు శుక్రవారమే గూడ్సు రైళ్లు కేటాయిస్తామని చెప్పారు. గూడ్సు రైళ్లలో వేగంగా స్టాక్ లోడ్ చేసే పనిని పర్యవేక్షించడానికి ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయశాఖాధికారిని పంపాలని సీఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్లకు స్టాక్ చేరుకోగానే అక్కడ లారీలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ కూడా వ్యవసాయాధికారులను నియమించాలన్నారు. రైల్వే స్టేషన్ల నుంచి మండలాలు, గ్రామాలకు నేరుగా యూరియా పంపాలని, కావాల్సిన లారీలను రైల్వేస్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచాలని రవాణాశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను ఆదేశించారు. వివిధ పోర్టుల్లో ఉన్న యూరియాను తక్షణమే రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతోపాటు 3 వేల లారీలను వాడాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపించే పనిలో సహకరించాలని కోరారు. ఏపీలో వీలైనన్ని ఎక్కువ లారీలను సేకరించి యూరియాను తెలంగాణకు పంపుతామని నాని హామీ ఇచ్చారు. పోర్టుల నుంచి నేరుగా రైల్వే స్టేషన్ల ద్వారా వచ్చే యూరియాను మళ్లీ స్టాక్ పాయింట్లకు తీసుకువెళ్లకుండా ఏ మండలంలో ఎంత డిమాండ్ ఉందో ముందే నిర్ధారించి నేరుగా పంపాలని, ఈ పనిని పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని సీఎం ఆదేశించారు. 3–4 రోజుల్లోనే లక్ష టన్నులు అందాలి... మొత్తంగా మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి తొలగిపోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ పోర్టుల్లోని యూరియాను తెలంగాణకు రప్పించే పనిని ప్రగతి భవన్లోనే ఉండి పర్యవేక్షించాలని వ్యవసాయ, రవాణాశాఖ మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, అధికారులకు నిర్దేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రగతి భవన్ నుంచే వారు రైల్వే అధికారులతో, లారీ యాజమానుల సంఘాలతో, వివిధ కంపెనీలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు కావాల్సిన యూరియా అందే వరకు విశ్రమించవద్దని, రేయింబవళ్లు పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్రావు, పార్థసారధి, సునీల్శర్మ, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోశ్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. యూరియా తెప్పించేందుకు పర్యవేక్షణ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్ నుంచి యూరియాను తెప్పించే పనులను పర్యవేక్షిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్కు పిలిపించారు. వారి ద్వారా రైల్వే శాఖకు రేక్స్ కోసం ఇండెంట్ పెట్టించారు. తక్షణం వివిధ పోర్టులకు 25 రేక్స్ పంపడానికి రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో రేక్ (గూడ్సు రైలు) ద్వారా 2,600 టన్నులు యూరియా రానుంది. కేవలం రైళ్ల ద్వారానే దాదాపు 60 వేల టన్నుల యూరియా 2–3 రోజుల్లో ఆయా జిల్లాలకు చేరుకోనుంది. అదే సమయంలో దాదాపు 4 వేల లారీల ద్వారా కూడా యూరియా వివిధ మండలాలకు చేరుకోనుంది. మొత్తం యూరియా 3–4 రోజుల్లో గ్రామాలకు చేరుతుందని, రైతులు కాస్త ఓపికగా ఉండాలని మంత్రులు సూచించారు. యూరియా కొరతను ఆసరా చేసుకొని ఎవరైనా ధరను పెంచి విక్రయించే అవకాశం ఉందని, రైతులు మోసపోవద్దని చెప్పారు. రైతులకు కావాల్సిన యూరియా అంతా ఆయా మండలాలకు చేరుకుంటుందని, 3–4 రోజుల్లో సమస్య పూర్తిగా తొలగిపోతుందని మంత్రులు భరోసా ఇచ్చారు. -
యూరియా కోసం వెళ్లి రైతు మృతి!
దుబ్బాక టౌన్: యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డ ఓ రైతు గురువారం ఆకస్మికంగా గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సుభాష్గౌడ్, బాధిత రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లికి చెందిన రైతు చేర్వాపురం ఎల్లయ్య (69)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికితోడు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నాలుగు ఎకరాల్లో వరి, మొక్క జొన్న, పత్తి పంటలు సాగు చేశాడు. పంటలకు అవసరమైన యూరియా ఎరువు కోసం మూడు రోజుల నుంచి ఎల్లయ్య దుబ్బాకకు వస్తున్నా దొరకలేదు. గురువారం వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లారీ వచ్చిం దని తెలవడంతో ఉదయం తన భార్య లచ్చమ్మతో కలసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే యూరియా కోసం వందల మంది రైతులు లైన్లో నిలుచున్నారు. దీంతో ఎల్లయ్య లైన్లో నిలబడగా ఆయన భార్య లచ్చమ్మ సైతం మహిళా రైతుల లైన్లో నిలుచుంది. సుమారు గంటసేపు లైన్లో నిలుచున్న ఎల్లయ్య, ఒక్కసారిగా సొమ్ముసిల్లి పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఆసుపత్రిలో ఎల్లయ్యను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. ఎల్లయ్య భార్య లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు కూతుళ్లు.. మృతిచెందిన రైతు ఎల్లయ్యకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు శ్యామల భర్త ఏడేళ్ల క్రితమే మరణించడంతో ఆమె కుటుంబాన్ని కూడా ఎల్లయ్యనే పోషిస్తున్నాడు. రెండో కూతురు నర్సవ్వకు వివాహం అయింది. మూడో కూతురు రేణుక వికలాంగురాలు. చిన్న కూతురు మమతకు నాలుగు నెలల క్రితమే అప్పుచేసి వివాహం చేశాడు. -
రైతన్న ఉసురు తీసిన యూరియా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతులను యూరియా కొరత వేధిస్తోంది. గోదాములు, ఎరువుల షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి. పొలాలు, ఇళ్లు వదలి యూరియా పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. లైన్లో చెప్పులు పెట్టి మరీ వేచి చూడాల్సిన దుస్థితి. అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలో నిలబడి మృతి చెందిన రైతు యూరియా కోసం క్యూలైన్లో నిలబడి రైతు మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య(69) ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతన్నివెంటనే స్థానిక అస్పత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మృతుడు అచ్చుమాయపల్లి వాసిగా గుర్తించారు. ఎల్లయ్య మృతిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తూప్రాన్లో రైతన్నల ధర్నా మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుండి యూరియా వస్తుందని పడిగాపులు కాసి రాత్రి వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరారు. చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. అధికారులు ఎవరు రాకపోవడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపైట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో యూరియా కోసం రైతు సేవాసమితి వద్ద బారులు తీశారు. జనగామా జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల పెద్ద ఎత్తున లైన్లో నిలబడ్డారు. యూరియా కోసం పనులు వదిలిపెట్టుకుని క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు మృతి చెందడం దురదృష్టకరం రైతు ఎల్లయ్య మృతి పట్ల సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. గురువారం ఆయన బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టేవారని ఎగతాళి చేసిన కేసీఆర్కు.. రాష్ట్ర రైతుల బాధ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 30 రోజుల ప్రగతి పేరుతో గ్రామాల్లో పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని, దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
యూరియా కోసం క్యూలైన్లో నిలబడి.. రైతు మృతి
-
ఎరువు.. కరువు.. రైతులకు లేని ఆదరువు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సరిపడా ఎరువు అందక పోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యూరియా కోసం బుధవారం ఉదయం నుంచే సొసైటీల వద్ద రైతులు బారులు తీరారు. కామారెడ్డి, బీర్కూరు, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ తదితర మండలాల్లోని సింగిల్ విండోల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. స్టాక్ రాకపోవడంతో పలుచోట్ల ఆందోళన చేశారు. మాచారెడ్డి: యూరియా కోసం మాచారెడ్డిలో రైతన్న రోడ్డెక్కాడు. ఎన్నిసార్లు వచ్చినా స్టాక్ లేదంటూ సింగిల్విండో సిబ్బంది చేతులెత్తేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్విండో సిబ్బంది వ్యాపారులకు యూరియా దొంగచాటుగా అమ్ముకుని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక వైపు అధికారులు యూరియా కొరత లేదంటూ ప్రకటలు చేస్తుంటే, మరోవైపు సిబ్బంది దొంగచాటుగా యూరియాను అమ్ముకుంటూ రైతులకు ఎగనామం పెడుతన్నారని మండిపడ్డారు. దాదాపు గంట పాటు కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. 700 టన్నుల పై చిలుకు యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 560 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. -
జిల్లాల్లో యూరియా ఫైట్
యూరియా కోసం.. ఎరువుల కోసం రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో యూరియా కోసం మంగళవారం టోకెన్లు పంపిణీ చేయగా.. బుధవారం తెల్లవారుజాము నుంచే సొసైటీ గోదాం వద్ద రైతులు క్యూ కట్టారు. –భీమ్గల్ సాక్షి, హైదరాబాద్: పాత జిల్లాలకు, కొత్త జిల్లాలకు మధ్య యూరియా పోరు నడుస్తోంది. పాత జిల్లాల్లోని మార్క్ఫెడ్ స్టాక్ పాయింట్ల నుంచి కొత్త జిల్లాలకు సరఫరా కావాల్సిన యూరియాను అనేక చోట్ల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లయితే స్టాక్ వెళ్లనీయకుండా లిఖిత పూర్వక ఆదేశాలు ఇస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతానికే దక్కాలని మొండిపట్టు పడుతున్నారు. దీంతో కొత్త జిల్లాలకు సరఫరా నిలిచిపోవడంతో యూరియా కొరత పీడిస్తోంది. దీంతో ఆయా జిల్లాల రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా యూరియా నల్లబజారుకు తరలిపోయింది. దీంతో ఒక్కసారిగా యూరియా ధర పెరిగింది. ఇటీవల వర్షాలు కురవడం, వరి నాట్లు బాగా పడటం, యూరియా వినియో గం పెరగడంతో పాత జిల్లాల రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు మంత్రులు తమ నియోజకవర్గం ఉన్న జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. బఫర్స్టాక్ పాయింట్లు పాత జిల్లాల్లోనే ఈసారి ఖరీఫ్లో 19.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. అందులో యూరియానే 8.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. గత నెల రాష్ట్రానికి రావాల్సిన 2.21 లక్షల మెట్రిక్ టన్నుల్లో 1.04 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇక సెప్టెంబర్కు రెండు లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని వ్యవసాయశాఖ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియానే అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మార్క్ఫెడ్ వద్ద ఎప్పుడూ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్గా ఉండాలి. కేం ద్రం నుంచి రాకపోవడం, ఉన్న నిల్వలను రైతుల కు అందజేయడంతో స్టాక్ 20 వేల మెట్రిక్ టన్నులకు పడిపోవడంతో కొరత ఏర్పడింది. మార్క్ఫెడ్ బఫర్ స్టాక్ పాయింట్లన్నీ పాత జిల్లాల్లో ఉన్నాయి. కొత్త జిల్లాల కోటాను పాత జిల్లాలే ఇలా వాడుకోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా స్లాక్ పాయింట్ నుంచి కామారెడ్డి జిల్లాకు యూరియా పంపవద్దని అక్కడి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అక్కడి జిల్లా వ్యవసాయశాఖ అధికారి విఫలం కావడంతో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాహుల్ బొజ్జా తెలిపారు. నాయకుల తీరుపై మండిపాటు ఆయన వ్యవసాయశాఖ పరిధిలోని ఒక కార్పొరేషన్కు చైర్మన్. తన ప్రాంత పరిధిలోని వ్యవసాయ సహకార సొసైటీకి అవసరమున్నా లేకపోయినా అత్యధికంగా యూరియా కేటాయింపు లు చేసుకున్నాడు. తనకు సన్న యూరియానే కావాలని పట్టుబట్టి కేటాయించుకున్నాడు. పక్క జిల్లాకు తనకు సంబంధం లేదని వాదన పెట్టు కున్నాడు. అదే శాఖలో మరో కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్న నాయకుడి తీరు కూడా అలాగే ఉంది. తన జిల్లాకే ప్రాధాన్యం ఇవ్వాలని, పక్క జిల్లాకు 500 టన్నులు పంపాల్సి ఉన్నా దాన్ని అడ్డుకుంటున్నారని వ్యవసాయశాఖ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్ వ్యవసాయ కమిషనర్ను కలిసి ఈ మేరకు విన్నవించినట్లు తెలిసింది. జిల్లాల మధ్య పోరు, కొందరు నాయకుల తీరు వల్ల కృత్రిమ కొరత తలెత్తిందన్న విమర్శలున్నాయి. దీంతో యూరి యా ధర ఒక్కసారిగా పెరిగింది. -
ఎరువు కోసం ఎదురుచూపులు..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఎరువు కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురైంది. తాజాగా మంగళవారం మరో వెయ్యి మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. వీటిని అత్యవసరమున్న సొసైటీలు, కొంతమేరకు ప్రైవేటు డీలర్లకు సర్దుబాటు చేశారు. మోపాల్, ధర్పల్లి, ఇతర సొసైటీల వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు. అయినప్పటికీ రెండు, మూడు బస్తాల కంటే మించి ఇవ్వలేదు. దీంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ యూరియాను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అందులో కేవలం వరి ఒక్కటే 2.34 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు మాత్రమే. ఈసారి అంచనాకు మించి సాగుచేశారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 37,700 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. ఆగస్టు నాటికి 54 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని నివేదిక సమర్పించగా, సుమారు 15 వేల మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చింది. మోపాల్లో టోకెన్లు పంపిణీ.. మండలకేంద్రంలోని సొసైటీలో మంగళవారం 450 బస్తాల వరకు యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న కంజర్, సిర్పూర్, మోపాల్, ముల్లంగి, నర్సింగ్పల్లి, న్యాల్కల్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉన్నారు. 450 బస్తాలకు సంబంధించిన బిల్లులు ముగియడంతో ఆ తర్వాత నేడు, రేపు రానున్న యూరియా లోడ్ కోసం టోకెన్లు పంపిణీ చేశారు. చాలామంది రైతులు అసంతృప్తితో వెనుదిరిగారు. రైతుల పడిగాపులు భీమ్గల్: మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా కోసం రోజంగా పడిగాపులు పడ్డారు. యూరియా లోడు వస్తుందని వదం రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి పట్టణంలోని నందిగల్లీలోని సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. ఇది అంతకంతకూ పెరిగిపోయి రైతులు వందల సంఖ్యలో పోగయ్యారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల క్యూలైన్ అంతకంతకూ పెరిగిపోయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు చినుకులు కురుస్తున్నా కదలకుండా ఉండిపోయారు. దీంతో పోలీసులు సూచన మేరకు సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. యూరియాను బుధవారం పంపిణీ చేస్తామని తెలిపారు. గోన్గొప్పుల్లో... గోన్గొప్పుల్ పరిధిలోని ముచ్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో యూరియా లారీ లోడు తరలించారు. దీంతో గ్రామంలోని వందలాది మంది రైతులు యూరియా బస్తాల కోసం తరలివచ్చారు. తమకు యూరియా దక్కుతుందో లేదో అన్న ఆందోళన మాత్రం రైతుల్లో స్పష్టంగా కనిపించింది. యూరియా కొరత తీర్చండి ఆర్మూర్ అర్బన్: రైతులకు యూరియా కొరత తీర్చాలని ఏఐకేఎంఎస్ (రైతుకూలీసంఘం)ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. రైతుకూలీసంఘం నాయకులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 15 శాతం వరి సాగు పెరగడంతో యూరియా కొరత తీవ్రమైందన్నారు జిల్లా వ్యాప్తంగా 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ప్రభుత్వం వద్ద కేవలం 35 వేల మెట్రిక్ టన్నుల నిల్వ మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందు చూపులేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం జిల్లాకు సరిపడా యూరియా తెప్పించి రైతులకు సర ఫరా చేయాలని డిమాండ్ చేశారు. హాసకొత్తూర్లో.. కమ్మర్పల్లి: మండలంలోని హాసకొత్తూర్లో రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. చౌట్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోకి మంగళవారం 450 బస్తాల యూరియా వచ్చింది. హాసకొత్తూర్కు 150 బస్తాల యూరియాను కేటాయించారు. వెయ్యి బస్తాల వరకు యూరియా రైతులకు అవసరం కాగా, తక్కువగా రావడంతో గందరగోళం నెలకొంది. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున విక్రయించారు. రెండు రోజుల్లో యూరియాను సరఫరా చేస్తామని సొసైటీ అధికారులు తెలపడంతో రైతులు శాంతించారు. నాలుగైదు రోజుల నుంచి తిరుగుతున్న.. నేను ఐదెకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. ఎనిమిది సంచుల యూరియా అవసరం. నాలుగైదు రోజుల నుంచి రోజూ తిరుగుతున్న. యూరియా మాత్రం దొరకడం లేదు. ఎరువు చల్లే సమయం మించిపోతోంది. మొన్న రెండు గంటలు లైన్లో ఉంటే టోకెన్ రాసిచ్చారు. ఇప్పుడు అది తీసుకొస్తే పని చేయదని చెప్పి పంపిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాను. –మల్లేష్, రైతు, మోపాల్ -
యూరియా కష్టాలు
సాక్షి, మెమిన్పేట: ఖరీఫ్ రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పంటలకు పైపాటుగా యూరియా వేసేందుకు జిల్లాలోని ఆయా పీఏసీఎస్ల వద్ద శనివారం బారులు తీరారు. మోమిన్పేట, మేకవనంపల్లి సహకార సంఘాల్లో శనివారం 920 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా రైతులు అందుకు రెండింతలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురవడంతో పత్తి పంటకు పైపాటుగా వేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీంతో శనివారం ఉదయం నుంచే మోమిన్పేట పీఏసీఎస్ ఎదుట క్యూ కట్టారు. ఎకరానికి 2 బస్తాల చొప్పున 460 బస్తాలను సిబ్బంది రైతులకు విక్రయించారు. ఇంకా 70 మంది రైతులు వరుసలో నిలబడినా వారికి అందలేదు. మేకవనంపల్లిలో అడిగిన మేరకు సిబ్బంది రైతులకు విక్రయించారు. 45 కిలోల యూరియా బస్తాను రూ.266.50 చొప్పున అమ్మేశారు. ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల్లో యూరియా అందుబాటులో లేదు. దుకాణాదారులకు ఎక్కువ ధరకు టోకు డీలర్లు విక్రయిస్తుండడంతో వారికి గిట్టుబాటు కాకపోవడంతో తీసుకురావడం లేదు. కేవలం పీఎసీఎస్ల ద్వారానే యూరియా విక్రయిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటివరకు 50 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. దీంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అధికారులు స్పందించి యూరియా కొరత తీర్చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల అవస్థలు వికారాబాద్ అర్బన్: వర్షాలు కురుస్తుండడంతో రైతులు మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేస్తున్నారు. సబ్సిడీ ఎరువు అవసరం మేరకు లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారెడ్డిపేట్ పీఏసీఎస్, సీఎంఎస్లలో సబ్సిడీ ద్వారా యూరియా విక్రయిస్తున్నారు. వారంరోజులుగా రైతులు ఉదయం 7 గంటలకే యూరియా కోసం వచ్చి కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. గంటల తరబడి వరుసలో నిలబడినా కొంత మందికి లభించడం లేదు. రైతులందరికీ యూరియా అందాలనే ఉద్దేశంతో సిబ్బంది కొంత పరిమితి ఒక్కొక్కరికి రెండు, మూడు బస్తాలను మాత్రమే ఇస్తున్నారు. అధిక ధరలకు విక్రయం పెద్దేముల్: మండల పరిధిలో వ్యాపారులు ఎక్కువ ధరకు యూరియా విక్రయిస్తున్నారు. 45 కిలోల యూరియా బస్తాను రూ.267కు విక్రయించాల్సి ఉండగా రూ.330కి తగ్గకుండ అమ్ముతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తట్టెపల్లి ప్రాథమిక సంఘానికి ఇప్పటి వరకు 650 టన్నుల యూరియా వచ్చిందని, అయినా రైతలకు సరిపోవడం లేదని సీఈఓ రాజమౌలి తెలిపారు. ఇంకా 500 టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రైతులు పత్తి, కంది, మొక్కజొన్న పంటలకు యూరియాను వినియోగిస్తున్నారు. సర్కారు స్పందించి అవసరం మేరకు యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు. యూరియా కొతర ధారూరు: ధారూరు పీఏసీఎస్ ద్వారా ఇంతవరకు వచ్చిన 8,430 బస్తాల యూరియాను శనివారం వరకు రైతులకు సరఫరా చేశారు. మరో 2 వేల బస్తాల వరకు స్టాక్ వస్తే రైతులకు సరిపోతుందని సీఈఓ నర్సింలు తెలిపారు. ఆర్డర్ ప్రకారం వస్తున్న యూరియాను రైతుల రాకను బట్టి సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సరఫరా చేయాలని నిబంధన ఉన్నా.. స్టాక్ లేదు. -
యూరియా కొరతకు కారణమదేనా?
యూరియా కొరత ఏర్పడడానికి కారణం డీలర్లు, అధికారులేనా..? అందుకే సరిపడా యూరియా రావడం లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అందజేసిన పీవోఎస్ మిషన్లను వాడక పోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని సమాచారం. ఈ మిషన్లు వాడి ఉంటే యూరియా వినియోగం ఏ స్థాయిలో ఉంది.. ఇంకా ఎంత స్టాక్ నిల్వ ఉందనే వివరాలు కేంద్రానికి చేరుతాయని, తద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు స్టాక్ను కేటాయిస్తుందని తెలిసింది. సాక్షి, నిజామాబాద్: యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. బుధవారం జిల్లాకు నామమాత్రంగా 1740 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఆగస్టు నెల నాటికి 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా రావడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మార్క్ఫెడ్ వద్ద ఉన్న 18,437 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ను సరఫరా చేసి సర్దుబాటు చేశారు. వర్షాలు ఆగస్టు మాసంలో కురవడంతో జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా వేశారు. సాధారణం కంటే 15 శాతం వరకు అధికంగా వరి సాగైంది. దీంతో యూరియాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. మరోవైపు, యూరియా కొరతకు అధికారులు, వ్యాపారులే కారణమని తెలుస్తోంది. పీవోఎస్ మిషన్లను వాడకపోవడం వల్లే కేంద్రం రాష్ట్రానికి తగినంత యూరియా కేటాయింపులు జరపడం లేదని సమాచారం. పెరిగిన సాగు విస్తీర్ణం.. తగ్గిన సరఫరా జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులో కేవలం వరి ఒక్కటే 2.34 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు మాత్రమే. ఈసారి అదనంగా 30 వేల (15శాతం) ఎకరాల వరకు అదనంగా సాగైంది. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఆగస్ట్ 15 వరకూ వరి నాట్లు వేశారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 38 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. ఆగస్టు నాటికి 54 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని నివేదిక పంపించగా, సుమారు 16 వేల మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చింది. సాగు విస్తీర్ణం పెరిగి, వినియోగం పెరగడంతో యూరియా కొరత ఏర్పడింది. దీన్ని గమనించిన అధికార యంత్రాంగం 2014–15 సంవత్సరం నాటి బఫర్ స్టాక్ను సర్దుబాటు చేసింది. ప్రస్తుతం ఆ బఫర్ స్టాక్ నిల్వలు కూడా నిండుకున్నాయి. 1740 మెట్రిక్ టన్నులు మాత్రమే.. యూరియా కొరత విపరీతంగా ఉన్నప్పటికీ జిల్లాకు పెద్దగా సరఫరా కావడం లేదు. బుధవారం 1740 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఈ యూరియా ప్రస్తుతమున్న డిమాండ్కు ఏ మాత్రమూ సరిపోదు. సోమ, మంగళవారాల్లో మరో 2 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వరి నాట్లు ఆలస్యంగా వేయడంతో ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ నెలలోనే యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాడకపోవడం వల్లే..? యూరియా వినియోగం విపరీతంగా పెరగడంతో కేంద్రం గతంలో పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫుట్ డీలర్లు, సొసైటీలకు మిషన్లను అందజేసి, వాటిపై శిక్షణ కూడా ఇప్పించింది. యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా ఆధార్కార్డు, వేలిముద్రలు పెట్టి తీసుకెళ్లాలి. తద్వారా యూరియా ఎంత వినియోగమవుతోంది.. ఒక రైతు ఎన్ని బస్తాలు తీసుకెళ్తున్నాడు.. అనే వివరాలు కేంద్రం దృష్టికి వెళ్తాయి. కానీ పీవోఎస్ మిషన్లను వాడక పోవడంతో కేంద్ర వ్యవసాయశాఖ అధికారులకు రాష్ట్రంలో ఎరువుల వినియోగంపై స్పష్టత రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి యూరియా కేటాయింపులు జరపడం లేదని సమాచారం. అందుబాటులో ఉంచాలి.. నాలుగెకరాల్లో వరి సాగు చేశాను. యూరియా దొరు కుతదో.. లేదోనని ఆందోళన చెందుతున్నాం. గడ్డలు కట్టిన యూరియా కాకుండా సన్నంగా ఉండే యూరియాను సరఫరా చేయాలి. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి. – బండమీది మహేష్, రైతు, మోపాల్ రెండ్రోజుల్లో వస్తుంది.. జిల్లాలో యూరియా కొరతను అధిగమించేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. బుధవారం 1740 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. సోమ, మంగళవారాల్లో మరో 2 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – ఎం గోవిందు, జిల్లా వ్యవసాయాధికారి -
కొరతే లేకుంటే.. బందోబస్తు ఎందుకో?
సాక్షి, కామారెడ్డి: యూరియా కొరత లేదని అధికారులు పైకి చెబుతున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. గురువారం గాంధారి సింగిల్విండోలో పోలీసు భద్రత మధ్య యూరియా పంపిణీ చేయాల్సి రావడం ఇందుకు నిదర్శనం.. గాంధారి మండలంలో యూరియాకు తీవ్ర కొరత ఉంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎరువు కోసం రైతులు రోజూ ఉదయమే గాంధారిలోని సహకార సంఘం కార్యాలయానికి చేరుకుని వరుస కడుతున్నారు. ఒకటో రెండో లారీల ఎరువు వస్తున్నా.. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో లారీ వస్తుందన్న ఆశతో పంపిణీ కౌంటర్ వద్దే నిరీక్షిస్తున్నారు. స్టాక్ అయిపోయిందనగానే నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంగళవారం కొంతమంది రైతులకు మాత్రమే యూరియా అందింది. బుధవారం లోడ్ రాలేదు. దీంతో గురువారం ఉదయమే సొసైటీకి వచ్చి రైతులు బారులు తీరారు. రెండు రోజులుగా లోడ్ రాకపోవడంతో గురువారం రైతులు భారీగా సొసైటీ వద్దకు చేరుకున్నారు. ఒక లారీ లోడ్ రావడం, చాలా మంది రైతులు ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు సొసైటీకి చేరుకున్నారు. పోలీసు పహారా మధ్య సొసైటీ అధికారులు యూరియా పంపిణీ చేశారు. అంచనాలకు మించి సాగు.. గాంధారి మండలంలో 16 వేల ఎకరాల్లో మక్క పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే దాదాపు 24 వేల ఎకరాల్లో మక్క సాగైంది. పంటకు యూరియా వేయాల్సి న సమయంలో కొరత ఏర్పడింది. మండలంలో ఇప్పటి వరకు 3,803 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశారు. అది ఏమాత్రం సరిపో లేదు. దీంతో రైతులు ఎరువు కోసం ఇబ్బందు లు పడుతున్నారు. మరో పది లారీల యూరి యా మండలానికి వస్తుందని మండల వ్యవసాయ అధికారి యాదగిరి ‘సాక్షి’తో తెలిపారు. కావలసినంత యూరియా ఉందని, అయితే ట్రాన్స్పోర్టు ఇబ్బందుల వల్లే ఆలస్యం అవుతోందన్నారు. గొడవలు జరగకుండా ఉండేందు కే బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ లేకపోవడంపై రైతుల ఆగ్రహం సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, కొరత లేకుంటే రైతులు పనులు వదులుకుని క్యూలో ఎందుకు ఉండాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు. లారీ లోడ్ రాగానే గంటలో ఖాళీ అవుతోందని, చాలా మందికి సరిపడకపోవడంతో వాపస్ వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. పొద్దుగాల అచ్చిన.. మక్క జుట్టు, పీప దశలో ఉంది. వర్షాలు పడుతున్నయి. ఇప్పుడు తప్పకుండా యూరియా వేయాలే. లేదంటే కంకులు చిన్నగ వస్తయి. దిగుబడి పడిపోతది. యూరియా కోసం పొద్దుగాల అచ్చిన. ఒక లారీ అయిపోయింది. ఇంకోటి వస్తదంటున్నరు. అందుకే ఇక్కడనే ఉన్న. – నాన్యా, రైతు, బూర్గుల్ తండా మొన్నటి నుంచి తిరుగుతున్న.. యూరియా కోసం మొన్నటి నుంచి తిరుగుతున్న. మంగళవారం యూరియా దొరకలేదు. తండాకు వట్టి చేతులతోనే పోయిన. బుధవారం యూరియా లారీ రాలేదు. ఇయ్యాల పొద్దుగాల నుంచి లైన్లో ఉంటే ఇప్పుడు కూపన్ దొరికింది. లారీ వద్ద మస్తుమంది ఉన్నరు. మల్ల లైన్ల నిల్సున్న.. – రుక్కి బాయి, రైతు, గుజ్జుల్ తండా -
తగ్గనున్న ఎరువుల ధరలు!
సాక్షి, మెదక్జోన్: అన్నదాతలకు కరువులో కాస్త ఊరట లభించినట్లైంది. ఎరువుల ధరలను కంపెనీల యాజమాన్యాలు తగ్గించటంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. యూరియా తప్ప మిగతా కాంప్లెక్స్ ఎరువులను తగ్గిస్తునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వరుస కరువుకాటకాలతో పంటల సాగు అంతంత మాత్రమే సాగుతుండటంతో ఎరువులకు గిరాకీ తగ్గింది. ఈ తరుణంలోనే ఎరువుల కంపెనీల యజమానులు రసాయన ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెదక్ జిల్లాలో రైతాంగానికి రూ.2.47 కోట్ల భారం తగ్గనుంది. ఈ ఏడాది జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు సాధారణ సాగు 83, 373 హెక్టార్లు అంచన వేశారు. దీని కోసం 3,900 మెంట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,400 కాగా బస్తాకు రూ.100 చొప్పున తగ్గించి రూ.1,300 అమ్మాలని నిర్ణయం జరిగింది. దీంతో ఒక్క డీఏపీ ఎరువులపైన రైతులపై రూ.78 లక్షలు భారం తగ్గనుంది. అలాగే 20–20–0–13 కాంప్లెక్స్ ఎరువులు 13 వేల మెట్రిక్ టన్నులు జిల్లా రైతాంగానికి అవసరం ఉండగా ఈ బస్తా ధర పాతది రూ.1,065 ఉండగా దానిని బస్తాకు రూ.65 తగ్గించి రూ.1,000కి విక్రయించనున్నారు. దీంతో రూ.1.47 కోట్లు తగ్గింది. డీఏపీ, కాంప్లెక్స్ రెండింటికీ కలిపి తగ్గిన ఎరువుల ధరలతో జిల్లా రైతాంగానికి రూ.2.47 కోట్ల భారం తగ్గింది. ప్రస్తుతం ఎరువుల గోడౌన్లలో స్టాక్ ఎరువులు ఉన్నప్పటికీ తగ్గిన ధరలకే రైతులకు ఎరువులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రస్తుతం పాత ధరలు మాత్రమే ఎంఆర్పీ రూపంలో ఉన్నప్పటికీ కొత్త ధరలకు ఎరువులను రైతులకు అందించాలని పేర్కొంది. తగ్గించిన ధరలతో త్వరలో ఎంఆర్పీ ముద్రణతో త్వరలో మార్కెట్కు రానునట్లు ఓ జిల్లా అధికారి పేర్కొన్నారు. అందని ఆదేశాలు ఎరువుల యజమాన్యాలు ధరలను తగ్గించినట్లు ప్రకటించాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభసూచకమని పేర్కొన్నప్పటికీ తగ్గించిన ధరలతోనే రైతులకు ఎరువుల బస్తాలను విక్రయించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పలువురు సహకార సంఘాల చైర్మన్లు పేర్కొంటున్నారు. ఎరువుల ధరలు తగ్గినట్లు తాము పేపర్లో చూడటం తప్పా అధికారికంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించటం మంచి పరిణామమే అయినప్పటికీ పాత స్టాక్ ఎంత ఉంది అనే లెక్కలను సైతం సరిచూసుకోకుండా ఎరువుల ధరలు తగ్గించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వక పోవటంతో ఇబ్బందులు తప్పటంలేదని పలువురు సహకార సంఘాల చైర్మన్లు పేర్కొంటున్నా రు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పం దించి తమకు వెంటనే తగ్గిన ధరల పట్టికను తమ కు అధికారికంగా అందించాలని కోరుతున్నారు. సంతోషంగా ఉంది మందు సంచుల ధరలను ప్రభుత్వం తగ్గించటం సంతోషంగా ఉంది. నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. 15 మందు సంచులు అవసరం ఉన్నాయి. రేట్లు తగ్గించటంతో నాకు రూ.1500 తగ్గాయి. కానీ తగ్గించిన ధరలకే మందు సంచులను అమ్మేలా చూడాలి. – రైతు నర్సింలు జంగరాయి -
నితిన్ గడ్కరీ ఆసక్తికర ప్రతిపాదన
ముంబై : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. దేశ వ్యాప్తంగా యూరిన్ని నిల్వ చేసుకోగలిగితే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన పని లేదన్నారు. నాగ్పూర్లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనం దేశ ప్రజల మూత్రాన్ని నిల్వ చేసుకోగలిగితే.. విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా చాలా సొమ్ము ఆదా అవుతోంది. మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయ’ని తెలిపారు. అంతేకాక ‘విమానాశ్రయాల్లో మూత్రాన్ని నిల్వ చేయమని గతంలోనే నేను కోరాను. కానీ నా ప్రతిపాదనను ఎవరూ అంగీకరించలేదు. కార్పొరేషన్ కూడా నా మాటలు పట్టించుకోలేదు. సనాతన ఆచారాలను పాటించే వారికి నా అద్భుతమైన ఆలోచనలు నచ్చవ’ని గడ్కరీ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి చెబుతూ.. మానవ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి దీన్నో ఉదాహరణగా చెప్పారు గడ్కరీ. ఇదే సమావేశంలో మరో ఉదాహరణ కూడా చెప్పారు. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని.. దాన్ని కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఫలితంగా పంట రాబడి మరో 25 శాతం పెరుగుతుందన్నారు. అమినో యాసిడ్స్ను మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, 180 కంటైనర్ల జీవ ఎరువులను(బయో ఫెర్టిలైజర్స్) దుబాయ్ నుంచి కొనుగోలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. -
యూరియా.. లేదయా..!
సాక్షి,యాదాద్రి : యూరియా కొరతతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పది రోజులుగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలకు పంటలకు యూరియా పెట్టేందుకు రైతులు ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే కంపెనీల నుంచి సరఫరా తగ్గడంతో కొరత ప్రారంభమైంది. ఆడపాదడపా వస్తున్నప్పటికీ ఏమూలకు సరిపోవడం లేదు. దీంతో రైతులు పొరుగున గల జనగామ, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలకు వెళ్తున్నారు. యూరియా వాడకం ఎక్కువ ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన తొలకరి వానలకు రైతులు పత్తి, వరి విత్తనాలు నాటారు. ఆ తర్వాత కరువు పరిస్థితులు కనిపించడంతో రైతులు ముందస్తుగా ఎరువులను కొనుగోలు చేయలేదు. అయితే పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎరువులు పెట్టడానికి రైతులందరూ ఒక్కసారిగా దుకాణాలకు వెళ్తున్నారు. దుకాణాల్లో అధిక నిల్వలు లేకపోవడం, కంపెనీల నుంచి దిగుమతి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. అందులో కాంప్లెక్స్ ధరలు అధికంగా ఉండడంతో యూరియా వాడకంపై ఎక్కువ దృష్టి సారించారు. ఒక్క బస్తాకు బదులుగా రెండు బస్తాల యూరియాను వినియోగిస్తున్నారు. దీంతో యూరియా కొరత అధికమైంది. అడ్డొచ్చిన సెలవులు యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు మిర్యాలగూడెం, హైదరాబాద్ నుంచి రైల్వే రాక్ల ద్వారా ఉమ్మడి జిల్లాలకు సరఫరా అవుతాయి. మిర్యాలగూడెం స్టాక్ పాయింట్కు రైల్ వ్యాగన్లలో వచ్చిన యూరియాను దుకాణాలకు చేరవేసేందుకు రెండో శనివారం, ఆదివారం కావడంతో లోడిం గ్లు కాలేదు. సోమవారం, మంగళవారాల్లో లోడింగ్ అయినప్పటికీ అతి తక్కువ లారీల్లో ఎక్కించారు. ట్రాన్స్పోర్ట్ నుంచి దుకాణాల్లోకి చేరడానికి సమస్య ఎదురైంది. బుధవారం స్వాతం త్య్ర దినోత్సవ సెలవు కావడంతో, యూరియా లోడింగ్ కాలేదు. కేంద్రంనుంచి అందే సబ్సిడీ ఇలా.. కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం యూరియా అమ్మకం మీదనే సబ్సిడీ విధానం(డీబీటీ) ప్రవేశపెట్టింది. ప్రతి ఎరువుల దుకాణానికి పీలోఎస్ మిషన్ ద్వారా అమ్మకం చేస్తోంది. విక్రయించిన యూరియాకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. 50 కిలోల యూరియా బస్తాకు రైతు రూ.295 చెల్లిస్తుండగా, కేంద్రం అందించే సబ్సిడీ రూ.923.74. 45కిలోల యూరియా బస్తాకు రూ.266.53 రైతు ధర కాగా, కేంద్రం రూ.850 వరకు సబ్సిడీ చెల్లిస్తుంది. అందని సబ్సిడీతో ఇబ్బందులు డీలర్లు, వివిధ వర్గాల ద్వారా తెలుస్తున్న సమచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాకపోవడంతో కంపెనీలు యూరియా తయారీని నిలిపివేశాయి. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన యూరియాను తమ కంపెనీల బస్తాల్లో ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు.ఈ యూరియా కూడా డీలర్కు సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్పోర్ట్ చార్జి పేరుతో వసూలు చేస్తున్నాయి. మిర్యాలగూడెం, హైదరాబాద్ ల్యాబ్లనుంచి అదనంగా కిరాయి బస్తాకు రూ.20 నుంచి రూ.30వరకు వసూలు చేస్తుండడంతో డీలర్కు చేరే సరికే అది ఎమ్మార్పీ ధర కంటే మించి అవుతుంది. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కో, క్రిబ్కో, స్పీక్ యూరియా కంపెనీలు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర కంపెనీలు కూడా యూరి యా సరఫరా చేస్తున్నాయి. 50వేల టన్నులు అవసరం ప్రస్తుతం జిల్లాలో సాగైన పంటల అవసరాల కోసం సుమారు 50వేల టన్నుల యూరియా కావాలి.అంటే సుమారుగా 20వ్యాగన్ల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. కానీ ఒక్క వ్యాగన్ మాత్ర మే జిల్లాకు రావడంతో ఉమ్మడి జిల్లా అవసరం మొత్తానికి సరఫరా చేయలేకపోతున్నారు.దీంతో తీవ్రమైన కొర త ఏర్పడుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే పంటలకు యూరియా అధికంగా అవసరం ఉంటుంది. ఈసమయంలోనే యూరి యా సరిపోను లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనలో రైతులు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతుండగా మరో వై పు ఆందోళన నెలకొంది. అదునుకు యూరి యా పెడితే చేను ఏపుగా పెరిగేదని, అధికా రులు వెంటనే స్పందించి సరిపడా ఎరువులు తెప్పించాలని రైతులు కోరుతున్నారు. -
యూరియా.. ఇదేందయా?
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు మోసం చేస్తే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది.. కానీ సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే రైతులను మాయ చేస్తే..? ఎవరికి చెప్పుకోవాలి? రైతుల పక్షాన నిలవాల్సిన మార్క్ఫెడ్ పక్కా వ్యాపార సంస్థగా మారింది. ఒకవైపు వర్షాల్లేక రైతులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు గడ్డ కట్టిన యూరియాను సరఫరా చేసి మరో బండ మోపుతోంది! మూడు నాలుగేళ్ల కిందట కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యూరియా గడ్డ కట్టడంతోపాటు దానిలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఉపయోగం లేదని తెలిసినా మార్క్ఫెడ్ అధికారులు ఒత్తిడి చేసి మరీ రైతులకు అంటగడుతున్నారు. ఈ యూరియా తమ కొద్దంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఈ యూరియా కొన్నా అది పనిచేయక రెండుసార్లు చల్లాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. గడ్డ కట్టిన యూరియాను కంపెనీలకు వెనక్కి ఇచ్చి కొత్తగా తీసుకోకుండా రైతులకు మార్క్ఫెడ్ అన్యాయం చేస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిల్వల వెనుక భారీ స్కాం? ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 66.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ పంటల కోసం రాష్ట్రానికి దాదాపు 8 లక్షల టన్నుల యూరియా అవసరం. అందులో 2 లక్షల టన్నుల యూరియాను మార్క్ఫెడ్ బఫర్స్టాకుగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ పాత నిల్వలను బయటకు పంపిస్తూ మళ్లీ అంతే మోతాదులో కొత్త సరుకును బఫర్ స్టాకుగా ఉంచాలి. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద 1.27 లక్షల టన్నుల యూరియా ఉండగా, అందులో 30,394 టన్నుల యూరియా గడ్డ కట్టినదే కావడం గమనార్హం. కొన్నాళ్లుగా బఫర్ స్టాకును కదిలించకుండా చాలావరకు కొత్త సరుకును రైల్వే రేక్ పాయింట్ల నుంచి నేరుగా ఎరువుల డీలర్లకు పంపిస్తున్నారు. దీంతో మార్క్ఫెడ్ వద్ద మూడు నాలుగేళ్లుగా 2 లక్షల టన్నులకుపైగా యూరియా గడ్డ కట్టుకుపోయింది. రేక్ పాయింట్ల నుంచే యూరియాను మార్కెట్కు పంపిస్తున్నారు. దీంతో లోడింగ్, అన్లోడింగ్, నిర్వహణ వంటి ఖర్చులన్నీ మిగులుతున్నాయి. ఆయా ఖర్చులన్నీ కాగి తాల్లో కనిపిస్తున్నాయే కానీ ఎక్కడా వాస్తవ ఖర్చులేదు. మార్క్ఫెడ్ అధికారులు కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాల నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి. యూరియా నిల్వల నిర్వహణలో భారీ కుంభకోణం దాగి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కక్కుర్తి వల్లే బఫర్ స్టాక్ యూరియా నిల్వలు కాస్తా గడ్డకట్టుకు పోయాయి. తక్కువ ధర అంటూ... రెండు మూడేళ్ల క్రితం బఫర్ స్టాక్కు అదనపు నిల్వలు తీసుకున్నామని, కానీ కాలం కలిసి రాకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయని మార్క్ఫెడ్ అధికారు లు చెబుతున్నారు. పాతవి వదిలించుకోకపోవ డం, కొత్త సరుకు నిల్వ చేయకపోవడం వల్లే వ్యవహారం గందరగోళంగా మారింది. బఫర్స్టాక్ను అధికంగా ఉంచడంలోనూ మాయ జరిగిందన్న విమర్శలున్నాయి. మిగిలిన గడ్డకట్టిన యూరియాను తక్కువ ధర అంటూ అంటగడుతున్నారు. యూరియా నాణ్యమైనదే అయితే తక్కువ ధరకు ఎందుకు అంటగడుతున్నారు? పాత దానికి కొత్త దానికి తేడా లేకపోతే ధర తగ్గించాల్సిన అవసరమేంటన్న దానికి సమా ధానం లేదు. 45 కిలోల యూరియా ధర రూ.252 కాగా గడ్డ కట్టిన 50 కిలోల బస్తా యూరియా ధర రూ.264 ఉంది. గడ్డ కట్టింది కాబట్టే తక్కువకు ఇస్తున్నామని అధికారులు అంటున్నా, యూరియా ఆరు నెలలు దాటితే నాణ్యత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డ కట్టిన యూరియా పనిచేయడం లేదని అటు రైతులు, ఎరువుల డీలర్లు మార్క్ఫెడ్కు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ తీసుకోవాల్సిందేనంటూ మార్క్ఫెడ్ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొందరు డీలర్లు అయితే కమీషన్లు ముట్టజెప్పుకొని కొత్త యూరియాను దక్కించుకుంటున్నారు. లేకుంటే వారికి గడ్డ కట్టిన యూరియానే ఇస్తున్నారు. -
రాష్ట్రంలో యూరియా సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రముఖ ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 6 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో మార్క్ఫెడ్ అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్క్ఫెడ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. యూరియా సంక్షోభం ఉందని తెలిస్తే రైతులు కంగారు పడతారని భావించిన అధికారులు అంతా బాగుందనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మార్క్ఫెడ్ వద్ద బఫర్స్టాక్ 2 లక్షల టన్నుల వరకు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ నెల మూడో తేదీ నాటికి నీమ్ కోటెడ్ యూరియా 91,367 టన్నులే ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకీ పరిస్థితి?: రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసే కంపెనీల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్రధానమైంది. దేశవ్యాప్తంగా యూరియా తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్నట్టే ఈ సంస్థ కూడా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ నుంచి 15 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇందులో 6 లక్షల టన్నులు రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ యూరియా నిల్వలు నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అత్యంత కీలక దశలో ఉంది. తెలంగాణలో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. అందుకోసం రాష్ట్రానికి 8 లక్షల టన్నుల యూరియా అవసరం. నాగార్జునలో ఉత్పత్తి నిలిచి పోవడంతో రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడనుంది. పరిస్థితిని పసిగట్టిన అధికారులు కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో, జువారీ, స్పిక్ గ్రూపు సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. యూరియా కొరతను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దేశంలో 32 యూరియా తయారీ కంపెనీలు ఉంటే వాటిల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.70 వేల కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. -
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిల్బాగ్ సింగ్ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్లఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కుంభకోణం కేసేంటి? ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్ఎఫ్ఎల్ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్ ఎన్ఎఫ్ఎల్కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్ లిమిటెడ్ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్ 2, 1995న అలంకుస్కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్ కంపెనీ అకౌంట్లోకి 1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ఎఫ్ఎల్కు యూరియాను పంపలేదు. కుంభకోణం నేపథ్యం.. 1995,సెప్టెంబర్: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం 1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్కు రూ.133 కోట్ల చెల్లింపు 1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం 1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి పీవీ కొడుకు ప్రభాకర్ రావు పేరు 1998 నవంబర్: ప్రభాకర్ రావు అరెస్టు -
రెండేళ్ల గరిష్ట స్థాయికి సహజ వాయువు ధర?
న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెండేళ్లలో ఇదే గరిష్ట పెంపు కానుంది. దీని వల్ల సీఎన్జీ, విద్యుత్, యూరియా తదితరాల ధరలు పెరుగుతాయి. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతమున్న 2.89 డాలర్ల(సుమారు రూ.189) నుంచి 3.06 డాలర్ల(రూ.199)కు పెరిగే అవకాశాలున్నాయి. -
ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
న్యూఢిల్లీ: యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు. -
టాటా కెమికల్స్ యూరియా వ్యాపార విక్రయం పూర్తి
న్యూఢిల్లీ: టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా, కస్టమైజ్డ్ ఫెర్టిలైజర్స్ వ్యాపార విక్రయాన్ని పూర్తి చేసింది. టాటా కెమికల్స్ ఈ వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ ఎఎస్ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్ ఇండియాకు రూ. 2,682కోట్లకు విక్రయించింది. ఈ డీల్లో ఉత్తరప్రదేశ్లోని బబ్రల ప్లాంట్ మొత్తాన్ని ఆస్తులు, అప్పులతో సహా యారా ఫెర్టిలైజర్స్కు టాటా కెమికల్స్ అమ్మేసింది. నియంత్రణలు అధికంగా ఉన్న యూరియా రంగంలో ఇది తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ షరతులు, సూచనల ప్రకారమే ఈ వాటా విక్రయం పూర్తయినట్లు టాటా కెమికల్స్ స్టాక్ ఎక్సే్చంజ్లకు నివేదించింది. కాగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎరువుల మార్కెట్ అయిన భారత్లో ప్రవేశించడం ఉత్సాహాన్నిస్తోందని యారా ఇంటర్నేషనల్ సీఈఓ, ప్రెసిడెంట్ స్వీన్ టొరె హొల్సెథర్ వ్యాఖ్యానించారు. -
లీటర్ యూరిన్.. రూ. 1
సాక్షి, న్యూఢిల్లీ : మూత్రానికి విలువ పెరుగుతోంది.. ఒక లీటర్ యూరిన్కు రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజం. దేశంలో ఎరువుల కోరత తగ్గించే క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఎవరూ ఊహించని ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని తాలుకా, తహసీల్ కార్యాలయాల్లో యూరిన్ బ్యాంక్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. యూరిన్ బ్యాంక్ల్లో సేకరించిన యూరిన్తో యూరియాను తయారు చేయవచ్చని.. ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల యూరియాను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా అతి తక్కువ ధరకే నాణ్యమైన యూరియాను మన రైతులకు అందించవచ్చని ఆయన తెలిపారు. యూరిన్లో నైట్రోజన్ శాతం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే దృరదృష్టవశాత్తు దీనిని మనం ఉపయోగించుకోవడం లేదన్నారు. దేశంలో వ్యర్థాన్ని సంపదగా మార్చే ఇటువంటి ఆలోచనను అందరూ అంగీరిస్తారని ఆయన చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్ యూరిన్ నుంచి యూరియా రూపొందించే కార్యక్రం మొదటగా మహరాష్ట్రలోని నాగ్పూర్ దగ్గరున్నధాఫ్వడ ప్రాంతంఓ ఏర్పటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా.. 10 లీటర్ల యూరిన్ను బ్యాంక్కు అందిస్తే.. లీటర్కు రూపాయి చొప్పున 10 రూపాయలు కూడా వారికి అందిస్తామని ఆయన తెలిపారు. -
జీఎస్టీతో ఎరువు మరింత బరువు
-
ఎరువు మరింత బరువు!
యూరియాకు జీఎస్టీ దెబ్బ ► టన్నుకు రూ.300–400 వరకు పెరగనున్న ధర ► 50 కిలోల డీఏపీపై రూ.100–125 వరకు పెరిగే అవకాశం ► ఎరువులపై 12 శాతం జీఎస్టీని నిర్ణయించిన కౌన్సిల్ ► రాష్ట్రంలో వచ్చే సీజన్లో 13.5 లక్షల బస్తాల యూరియా, 2.5 లక్షల బస్తాల డీఏపీ వినియోగం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం కోసం తీసుకువస్తున్న ‘వస్తుసేవల పన్ను (జీఎస్టీ)’తో రైతులపై మాత్రం భారం పడనుంది. ఎరువులపై ప్రస్తుతం 4 నుంచి 8 శాతం మధ్య పన్నులు ఉండగా.. జీఎస్టీలో ఎరువులపై 12 శాతం పన్ను విధించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఎరువులు, సూక్ష్మ పోషకాల విక్రయ ధరలు అనివార్యంగా పెరగనున్నాయి. దీనివల్ల సాగు వ్యయం పెరుగుతుందని, ఎరువుల వినియోగంలో సమతుల్యత దెబ్బతింటుందని ఎరువుల కంపెనీలు వాదిస్తున్నాయి. రూ.100 వరకు పెరగనున్న యూరియా జీఎస్టీలో 12 శాతం పన్ను విధించడంతో.. దేశంలోనే అత్యధికంగా వినియోగమయ్యే యూరియా ధర టన్నుకు ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగే అవకాశముంది. డై అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) వంటి ఎరువుల ధరలు కొన్ని రాష్ట్రాల్లో టన్నుకు రూ.3 వేల వరకు పెరగనున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎరువులు, సూక్ష్మ పోషకాలపై ఎటువంటి పన్నులూ లేవు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో నామమాత్రపు పన్నులు న్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎరువుల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశముంది. ఇక రోడ్డు రవాణాపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల కూడా ఎరువుల చిల్లర ధరలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఎరువుల రవాణాపై ఎటువంటి సర్వీసుట్యాక్స్ లేకపోవడం గమనార్హం. వందల కోట్ల భారం.. జీఎస్టీ విధింపుతో ఏయే రకం ఎరువు ధర ఎంతమేర పెరగనుందనే లెక్కలు వేస్తున్నారు. అంతేగాకుండా పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేక రైతులపైనే భారం వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తే మాత్రం ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. అయితే యూరియా ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తోంది. ప్రస్తుతం టన్ను యూరియా ధర రూ.5,630గా ఉంది. ఇది మినహా మిగతా ఎరువులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ఆయా కంపెనీలే ఉత్పత్తి వ్యయం ఆధారంగా ధరలు నిర్ణయించుకుంటాయి. కాగా రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ కోసం 8 లక్షల టన్నులు, యాసంగి కోసం 5.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీంతో పన్ను కారణంగా ధరలు పెరిగితే.. భారం ఎవరిపై పడుతుందనేది ప్రాధాన్యంగా మారింది. డీఏపీ కూడా భారమే.. 50కిలోల డీఏపీ బస్తా చిల్లర ధర రూ.100–125 వరకు పెరిగే అవకాశ ముం ది. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.వెయ్యి వరకు ఉండగా.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను తో కలిపి రూ.1,125 అవుతుందని మార్కె ట్వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభు త్వం అత్యధిక సబ్సిడీ ఇస్తున్న యూరియా కు డీఏపీ సహా మిగతా ఎరువులకు మధ్య ధరలో తేడా బాగా పెరిగే అవకాశ ముంది. దీంతో రైతులు యూరియానే ఎక్కువగా వినియోగించడంపై దృష్టి పెడతారని ఎరువుల కంపెనీలు అంటున్నాయి. దానివల్ల సూక్ష్మ పోషకాలు అందక పంటల దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొం టున్నాయి. కాగా రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్కు 2.5 లక్షల బస్తాల డీఏపీని సరఫరా చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. -
యూరియా కుంభకోణంపై విచారణ
అనంతపురం అగ్రికల్చర్ : గత ఏడాది జూలైలో వెలుగుచూసిన యూరియా కుంభకోణంపై వ్యవసాయ కమిషనరేట్ జేడీఏ శ్రీధర్ గురువారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. క్రిబ్కో కంపెనీ నుంచి వచ్చిన 1,300 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ ఫర్టిలైజర్స్కు చెందిన మిక్సింగ్ ప్లాంట్కు మళ్లించారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేశారు. అలాగే కమిషనరేట్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ వినయ్చంద్ నేతృత్వంలో మరో బృందం రెండు రోజుల పాటు విచారణ చేపట్టి.. కమిషనర్కు నివేదిక అందజేసింది. ప్రాథమిక విచారణ తర్వాత వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ - పీపీ) కె.మల్లికార్జున, అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవికుమార్ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరు హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల సస్పెన్షన్ను రద్దు చేసి.. పోస్టింగ్ ఇచ్చారు. మల్లికార్జున మడకశిర ఏడీఏగా, రవికుమార్ హిందూపురం ఏడీఏగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా... ఈ ఇద్దరు అధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణకు కమిషనరేట్ జేడీఏ శ్రీధర్ను నియమించిన నేపథ్యంలో ఆయన విచారణ మొదలు పెట్టారు. ప్రెజెంటింగ్ అధికారిగా నియమితులైన రైతు శిక్షణ కేంద్రం డీడీఏ డి.జయచంద్ర సమక్షంలో ఏడీఏలు మల్లికార్జున, రవికుమార్ను వేర్వేరుగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరికొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ఆ ఇద్దరూ విచారణాధికారి ముందు చెప్పినట్లు సమాచారం. ఎరువులు దారి మళ్లినట్లు తెలియగానే తనిఖీలతో పాటు ప్రాథమిక విచారణ చేశామని మల్లికార్జున చెప్పగా... రేకు ఆఫీసర్ అనే విషయం తనకు తెలియదని, అధికారం తనకుందని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదని రవికుమార్ తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా విచారణాధికారి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని టన్నుల యూరియా దారిమళ్లింది, ఎవరు దారి మళ్లించారు, ఎవరు లబ్ధిపొందారనే విషయంపై ప్రస్తుతం విచారణ చేయడం లేదన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సస్పెండైన ఇద్దరు అధికారుల విధులు, బాధ్యతలు, వారు స్పందించిన తీరు, ఇందులో వారి ప్రమేయం గురించి వివరాలు రాబట్టామన్నారు. వారం రోజుల్లో కమిషనర్కు నివేదిక అందజేస్తామని తెలిపారు. -
యూరియా స్కామ్ నిందితునిపై కేసు
సాంబశివరావును అరెస్ట్ చేసిన సీసీఎస్ అధికారులు 1996లో నాంపల్లిలో భూమిని స్వాధీనం చేసుకున్న సీబీఐ ఇదే భూమి అభివృద్ధి పేరుతో బెంగళూరు కంపెనీతో డీల్ రూ.1.89 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు హైదరాబాద్: 1996 నాటి యూరియా స్కామ్ కేసులో నిందితుడు ఎం.సాంబశివరావు మరో భారీ మోసానికి పాల్ప డ్డాడు. అప్పట్లో సీబీఐ స్వాధీనం చేసుకున్న భూమిని అభి వృద్ధి చేయడానికి బెంగళూరు కంపెనీతో ఒప్పందం కుదు ర్చుకుని.. వారి నుంచి రూ.1.89 కోట్లు తీసుకుని మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారులు సాంబశివరావును అరెస్టు చేసిన ట్లు డీసీపీ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు. 1996 నాటి యూరియా స్కామ్లో అరెస్ట్.. గుంటూరు జిల్లా ఎమినేనివారిపాలెంకు చెందిన సాంబశివరావు బీఎస్సీ(అగ్రికల్చర్) పూర్తి చేశాడు. 1995లో కర్సాన్ లిమిటెడ్ అనే టర్కిష్ కంపెనీకి భారత ఏజెంట్గా నియమితులయ్యాడు. అదే ఏడాది సెప్టెంబర్లో కేంద్రం యూరియా సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. వీటిలో పాల్గొన్న కర్సాన్ లిమిటెడ్ సంస్థ.. నేషనల్ ఫెర్టిలైజ ర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్సీ) ద్వారా సరఫరా బాధ్యతల్ని పొందిం ది. దీని నిమిత్తం 1996 మార్చిలో కేంద్రం ఎన్ఎఫ్సీ ద్వారా కర్సాన్ సంస్థకు రూ.133 కోట్లు చెల్లించింది. నగదు తీసుకు న్న ఆ సంస్థ యూరియా సరఫరా చేయకుండా చేతులెత్తేసిం ది. దీనిపై అదే ఏడాది మేలో సీబీఐ పలువురిని అరెస్టు చేసిం ది. ఈ కేసులో 1996 సెప్టెంబర్లో సీబీఐ అధికారులు యూరియా స్కామ్లో మూడో నిందితుడిగా ఉన్న సాంబశివ రావు సహా 9 మందిని అరెస్టు చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్రావు సైతం అరెస్టు అయ్యారు. భారీగా ముడుపులు చేతులు మారినట్లు నిర్ధారించిన సీబీఐ ఈ వ్యవహారంలో కొందరు దళారులతో పాటు కర్సాన్ సంస్థకు భారత ఏజెంట్గా ఉన్న సాంబశివరావు సైతం ఇందులో కీలకపాత్ర పోషించారని, ప్రతిఫలంగా భారీ మొత్తం అందుకున్నారని అభియోగాలు మోపింది. నగరంలోని నాంపల్లిలో సాంబశివరావుకు చెందిన రెండు ఎకరాల నాలుగు గుంటల భూమిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం యూరియా స్కామ్ కేసును ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారం.. ఈ కేసులో బెయిల్పై వచ్చిన సాంబశివరావు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు. బేగంపేటలో సాయిశ్రీ ప్రాజెక్ట్స్ సంస్థ ను నిర్వహిస్తున్నారు. 2013లో సాంబశివరావు బెంగళూరుకు చెందిన వి ఆప్టిమైజ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ ప్రశాంత్ శ్రీశైలంను సంప్రదించారు. మరికొందరితో కలసి సీబీఐ స్వాధీనం చేసుకున్న భూమిని అభివృద్ధి చేయడానికి ‘వి ఆప్టిమైజ్’తో ఒప్పందం చేసుకున్నారు. సదరు ఆస్తి సీబీఐ అధీనంలో ఉన్న విషయం దాచిపెట్టి భూమిని అభివృద్ధి చేసేందుకు అప్పగించినందుకు తమకు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ మొత్తంలో అడ్వాన్స్గా రూ.1.89 కోట్లు ‘వి ఆప్టిమైజ్’ నుంచి సాంబశివరావు తీసుకున్నాడు. జరిగిన మోసం గుర్తించిన బెంగళూరు సంస్థ 2014లో సీసీఎస్ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–1 అధికారులు సాంబశివరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
బహిరంగ మార్కెట్లోకి యూరియా
* కరువు కారణంగా భారీగా పేరుకుపోయిన నిల్వ * 1.75 లక్షల టన్నులు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలు.. రాత్రీపగలూ పడిగాపులు కాచే రైతన్నలు.. కొన్నిచోట్ల పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జీలు.. మరి ఇప్పుడు యూరియా కొనే దిక్కే లేకుండా పోయింది. కరువు పరిస్థితుల కారణంగా మూడేళ్లుగా యూరియా మిగిలిపోతోంది. నిల్వ ఉంచడంతో గడ్డ కడుతోంది. ఇంకా అలాగే ఉంచితే పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ ఉంచిన యూరియా నిర్వహణ ఆర్థిక భారంగా పరిణమించింది. దీంతో తొలిసారిగా యూరియా స్టాక్ను బహిరంగంగా అమ్మకానికి పెట్టాలని వ్యవసాయశాఖ నిర్ణయించి.. ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మిక్చర్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలకు, వ్యాపారులకు సాధారణ ధరకే విక్రయిస్తామని పేర్కొంది. 1.75 లక్షల టన్నుల బేరం రాష్ట్రాన్ని 2014-15 నుంచి కరువు పీడిస్తోంది. దీంతో రైతులు పంటలు వేయకపోవడం, వేసినా మధ్యలోనే ఎండిపోవడంతో యూరియా వినియోగం బాగా తగ్గింది. మార్క్ఫెడ్ నిర్వహిస్తోన్న గోదాముల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.77 లక్షల టన్నుల యూరియా పేరుకుపోయింది. 2014-15కి సంబంధించిన యూరియా 10,769 టన్నులు, 2015-16కు చెందిన 1.63 లక్షల టన్నులు, 2016-17కు చెందిన 1.02 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. అందులో ఈ ఏడాది యూరియాను మినహాయించి.. గత రెండేళ్ల స్టాక్ను విక్రయించాలని నిర్ణయించారు. -
యూరియాతో బెట్ట నుంచి విముక్తి
దేవనకొండ : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వాడుపట్టిన పంటలపై యూరియా ద్రావణం పిచికారి చేస్తే బెట్ట నుంచి తాత్కాలికంగా రక్షించుకోవచ్చని ఇక్రిషాట్ శాస్త్రవేత్త ప్రభాకర్పటాక్ తెలిపారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని కూకటికొండ, వెలమకూరు గ్రామాల్లో పర్యటించారు. లీటర్ నీటికి 10 గ్రా. యూరియా, 2గ్రా. జింక్సల్ఫేట్, గ్రాము బోరాన్ను కలిపిన ద్రావణాన్ని వాడుపట్టిన వేరుశెనగ పైరుపై పిచికారి చేయడం వల్ల బెట్ట నుంచి పంట కొన్ని రోజులు తట్టుకుంటుందన్నారు. అదష్టవశాత్తు వర్షాలు కురిస్తే పంటలు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట ఇక్రిషాట్ ఎస్ఓ ఆదినారాయణ, నల్లచెలిమల ప్రాజెక్టు ఆఫీసర్ మధుసూదన్ తదితరులున్నారు. -
యూరియాకు వేపపూత
♦ పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట ♦ ఏటా రూ. 3 వేల కోట్ల యూరియా సబ్సిడీ పక్కదారి ♦ పాల కల్తీ మొదలుకుని పారిశ్రామిక అవసరాలకు ♦ ఇకపై వ్యవసాయంలో వేప పూత యూరియా ♦ ఏటా రూ. 6,500 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ‘గతంలో మాదిరిగా యూరియా అక్రమంగా రసాయన కర్మాగారాలకు దారి మళ్లకుండా వేప పూత వేస్తున్నాం.. ఇన్నాళ్లూ యూరియాను లూటీ చేసిన కెమికల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు నాపై ఆగ్రహంతో.. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్ర చేస్తున్నారు.’.. ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో.. దేశంలో వేప పూత యూరియా వినియోగం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియాను పాల కల్తీ మొదలుకుని.. పారిశ్రామిక అవసరాల వరకు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భూ సారాన్ని కాపాడుతూ దిగుబడులు పెంచే లక్ష్యంతో.. వ్యవసాయ అవసరాలకు వేప పూత ఉన్న యూరియా (ఎన్సీయూ) సరఫరాను గత ఏడాది నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. తద్వారా అక్రమ వ్యాపారాలకు యూరియాను ముడి సరుకుగా వినియోగిస్తున్న అక్రమార్కులకు కళ్లెం వేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా.. మరో 8 నుంచి 9 మిలియన్ టన్నుల యూరియా విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం మెట్రిక్ టన్ను యూరియా ధర రూ. 5,360 కాగా.. సగం ధరకే యూరియాను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తోంది. యూరియాను ముడి సరుకుగా వినియోగించుకుని 55 రకాలైన ఇతరత్రా రసాయన ఉత్పత్తులను తయారు చేసే వీలుంది. దీనిని ఆసరాగా చేసుకుని.. పారిశ్రామిక అవసరాలకు యూరియా తయారీ కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సిన రసాయన కంపెనీలు సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏటా సుమారు 50 లక్షల టన్నుల యూరియా పక్కదారి పడుతుండగా.. రూ. 3 వేల కోట్ల సబ్సి డీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. వేప పూత యూరియాతో అడ్డుకట్ట సబ్సిడీ యూరియా సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేపపూత యూరియా (ఎన్సీయూ) వినియోగాన్ని తెరమీదకు తెస్తూ.. గత ఏడాది నూతన యూరి యా విధానాన్ని ప్రకటించింది. దేశంలో 26 ఎరువుల కంపెనీలు ఎన్సీయూను తయారు చేస్తుండగా.. ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యంలో 100 శాతం వేప పూత యూరియా తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతం లో కేవలం 35 శాతం ఎన్సీయూ తయారీకి అనుమతి వుండగా ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యంలో కనీ సం 75 శాతం ఎన్సీయూ తయారీని తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాకు కూడా వేప పూతను తప్పనిసరి చేసింది. వ్యవసాయ అవసరాలకు 2015 నవంబర్ నుంచి వేపపూత యూరి యాను నూటికి నూరు శాతం తప్పనిసరి చేసింది. సాధారణ యూరియా ఎంఆర్పీ ధరపై అదనంగా ఐదు శాతం ధరలకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రైతులకు సగటున ఒక్కో బస్తాపై పది రూపాయల అదనపు భారం పడనుంది. ఎన్సీయూ వినియోగం ద్వారా సాధారణ యూరియా 10 నుంచి 15 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వేప పూత యూరియా ద్వారా రైతులకు రాబడి పెరగడంతోపాటు, రూ. 6,500 కోట్ల మేర సబ్సిడీ భారం తగ్గుతుందని కేంద్రం లెక్కలు వేస్తోంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా కానుంది. పెరుగుతున్న ఎన్సీయూ ఉత్పత్తి వేప పూత యూరియా ఉత్పత్తి విధానాన్ని ప్రవేశ పెట్టిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఏటా తన ఉత్పత్తిని పెంచుతూ వస్తోంది. యూరియా గుళికలకు ఎంత మోతాదులో వేప నూనెతో పూత వేయాలో ఈ సంస్థ ప్రమాణాలను రూపొందించింది. -
యూరియా నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతి
పరకాల (వరంగల్) : పంట పొలంలో యూరియా కలిసిన నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతిచెందాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం అలియాబాద్ గ్రామ శివారులో సోమవారం వెలుగుచూసింది. పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు ఇది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రసాయనాలు కలిసిన నీళ్లు తాగడం వల్లే చనిపోయి ఉంటాయిని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
‘పాల’కూట విషం
పసిపిల్లలకు పాలు దివ్య ఔషధం అంటారు.. చిన్నారులు ఇష్టంగా తాగే పాలను అమృతంతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటిని అక్రమార్కులు ‘పాల’కూట విషంగా మార్చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. రసాయనాలు, నూనె, పాల పౌడర్, యూరియాతో కృత్రిమపాలను సృష్టిస్తూ విషతుల్యంగా మార్చేస్తున్నారు. నిర్భయంగా వాటిని ప్రజలకు అంటగడుతూ ఆస్పత్రుల ‘పాలు’ చేస్తున్నారు. తమస్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో నురగ, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. - ఘట్కేసర్ టౌన్/ ఘట్కేసర్ గతంలో పాడి సంపద విస్తారంగా ఉండేది. ఇంటిల్లిపాది పెరుగు, పాలను తీసుకునేవారు. అకాల వర్షాలు, కరువు కాటకాలు రావడంతో పశువులను సాకలేక కబేళాలకు తరలిస్తున్నారు. డిమాండ్కు తగిన పాలు లభించకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. కల్తీపాల దం దాకు తెరలేపారు. గుట్టుగా తమ వ్యాపారం సాగించడానికి ఊరికి దూరంగా ఉన్న భవనాలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బావులను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో తరలింపు.. ఇలా తయారు చేసిన పాలను స్థానికంగా విక్రయిస్తే అనుమానిస్తారని గుట్టుచప్పుడుగా ఆటోల్లో నగరానికి తరలిస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, బేకరీలు, మిఠాయి షాపులకు విక్రయిస్తుంటారు. అసలు పాలు లీటర్కు రూ. 50 నుంచి రూ.70 ఉండగా వీటిని రూ.40కే విక్రయిస్తుంటారు. ఇలా ఆవులు, గేదెలు లేకుండానే పాలను సృష్టిస్తూ తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు గడిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు... వీటిని తాగినవారు తీవ్రమైన జీర్ణకోశవ్యాధుల బారినపడుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. బాల్యంలోనే స్థూలకాయం, మందబుద్ధి ఏర్పడతాయి. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగినవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణుల్లో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ, క్యాన్సర్, కాలేయ సమస్యలు వస్తాయి. కరువైన నిఘా.. అడపాదడపా అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు బనాయించినా బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరిగి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మండలంలోని అంకుశాపూర్, ఏదులబాద్ గ్రామాల్లో రెండు సార్లు కల్తీపాల తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. ఆ రెం డు సంఘటనల్లో నిందితుడు ఒకడే కావడం గమనార్హం. తయారీ ఇలా... 10 లీటర్ల పాలు తయారు చేయడానికి కిలో పాల పౌడర్, లీటరు నూనె, 40 శాతం యూరియా, 10శాతం సర్ఫ్ వాడతారు. అందులో అవసరమైన నీళ్లను పోస్తారు. ఆ తర్వాత వాటిని కర్ర సాయంతో బాగా కలుపుతారు. అవసరమైతే మిక్సీని వాడతారు. బాగా కలిసిన తర్వాత వాటికి స్వచ్ఛమైన కొన్ని పాలు కలుపుతారు. పాలలో వెన్న శాతాన్ని సరిచూస్తారు. దానిని బట్టి నూనె కలపాల్సిన పరిమాణాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. తెల్లదనం నురగ, పొంగు రావడానికి యూరియా, సర్ఫ్ కలుపుతారు. సాధారణ పాలు, కల్తీపాలకు ఏ మాత్రం తేడా కనిపించకుండా చూస్తారు. ఇలా సొమ్ము చేసుకుంటూ.. కిలో పాల పౌడరుకు రూ.150, నూనె ప్యాకెటుకు రూ.80, యూరియాకు రూ.12, సర్ఫ్కు రూ.4 ఖర్చు చేస్తారు. 10 లీటర్లపాల తయారీకి దాదాపు రూ.250 ఖర్చవుతుంది. లీటరు పాలను రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. 10 లీటర్ల పాలు విక్రయిస్తే రూ.450 నుంచి రూ.500 వరకు వస్తాయి. ఖర్చులు పోను 10లీటర్లకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లీటర్ల పాలను సరఫరా చేస్తారు. ఈ చొప్పున రోజుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అక్రమార్జన చేస్తున్నారు. కల్తీ పాలతో తీవ్ర అనారోగ్యం .. కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై సత్వర ప్రభావం కనిపిస్తుంది. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయం, హెపటైటిస్ బీ వంటి వ్యాధుల సోకే అవకాశం ఉంది. ఇతర అవయవాలు దెబ్బతీనే ప్రమాదం ఉంది. పాలను తీసుకునే ముందు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది గమనించాలి. -డాక్టర్ సతీష్, ప్రాథమిక వైద్య కేంద్రం, ఘట్కేసర్ -
అన్నదాతపై ‘అనుబంధ’ దాడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో యూరియాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని యూరియా కంపెనీలు రైతును దగా చేస్తున్నాయి. తమ కంపెనీ యూరియా కావాలంటే తప్పనిసరిగా అనుబంధ ఉత్పత్తులను రైతులకు విక్రయించాల్సిందేనని డీలర్లకు హుకుం జారీచేస్తున్నాయి. పెద్దఎత్తున లాభాలు ఉండటంతో డీలర్లు కూడా యూరియా కంపెనీల అనుబంధ ఉత్పత్తులను రైతులకు అంటగడుతున్నారు. వాటిని తీసుకోని రైతులను యూరియా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇలా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా వ్యవసాయశాఖ మాత్రం చోద్యం చూస్తోంది. జిల్లాల్లో రైతులకు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు కంపెనీల నుంచి ముడుపులు పుచ్చుకొని రైతులకు హానిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. యూరియాకు మూడింతల లాభం... కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ కోసం రాష్ట్రానికి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఆ ప్రకారం కంపెనీలు అమ్మకాలు చేయాలి. దేశవ్యాప్తంగా పేరున్న అనేక కంపెనీలు యూరియాతోపాటు సూక్ష్మపోషక విలువలు కలిగిన అనుబంధ ఎరువుల ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. వాటిల్లో అనేక ఎరువులకు అనుమతి కూడా లేదని సమాచారం. రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు సరిసమాన విలువైన 2 లక్షల టన్నుల అనుబంధ ఉత్పత్తులను డీలర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు వ్యవసాయశాఖ అంచనా. కొన్ని కంపెనీలు యూరియా ద్వారా కంటే అనుబంధ ఉత్పత్తుల ద్వారానే పెద్దఎత్తున ఆర్జిస్తున్నాయని, ఇది మూడింతలకుపైగా ఉంటుందని వ్యవసాయ అధికారి ఒకరు చెప్పారు. అదనపు ధరకు యూరియా... రాష్ట్రంలో యూరియా బస్తా ధర రూ. 284 ఉండాలి. కానీ రూ. 350-380 వరకు రైతులకు అంటగడుతున్నారు. డీలర్ల వద్దకు చేర్చకుండానే యూరియా కంపెనీలు రేక్ పాయింట్ వద్దే ఎంఆర్పీకి అమ్ముతున్నారు. దీంతో రవాణా ధర వేసుకొని డీలర్లు రైతులకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఇది రైతుపై అదనపు భారంగా పడుతోంది. ఏమాత్రం అవసరం లేకపోయినా... యూరియా కంపెనీలు ప్రధానంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, జింక్ తదితర సూక్ష్మ పోషకాలతో కూడిన ఎరువుల ఉత్పత్తులను అదనంగా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అత్యధిక ధర ఉన్నవే. శాస్త్రవేత్తలు మాత్రం వీటి అవసరమే ఉండదంటున్నారు. వీటి ద్వారా పంటలకు కలిగే ప్రయోజనం కేవలం 10 నుంచి 15 శాతమే అని చెబుతున్నారు. కానీ వాటి ధర మాత్రం యూరియాకు అనేక రెట్లు ఉంటోంది. యూరియా ధరలు పెరగడానికి అనుబంధ ఉత్పత్తులు ప్రధాన కారణమని అంటున్నారు. పైగా అనుబంధ ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్పై తెలుగు, ఇంగ్లిషుల్లో సమాచారాన్ని ముద్రించాల్సి ఉన్నా రైతులకు అర్థంకాకుండా కేవలం ఆంగ్లంలోనే ముద్రిస్తున్నారు. -
ఎరువుల దుకాణం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
చిట్యాల (నల్లగొండ) : తనకు అవసరమైన యూరియా స్టాక్ లేదని చెప్పినందుకు ఆగ్రహించిన ఓ రైతు ఫెర్టిలైజర్ దుకాణం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జడల మల్లేశం స్థానిక రఘురామా ఫెర్టిలైజర్స్ వద్దకు వెళ్లాడు. ఒక బస్తా యూరియా కావాలని దుకాణం యజమానిని అడగగా అతడు స్టాక్ లేదని బదులిచ్చాడు. కాగా స్టాకున్నా లేదని చెబుతున్నాడంటూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోయాడు. అక్కడే ఉన్న రైతులు అతనిని వారించి, అక్కడి నుంచి పంపేశారు. ఈ విషయమై దుకాణ యజమాని మాట్లాడుతూ...తనను యూరియా బస్తా అప్పుగా ఇవ్వాలని అడగ్గా, తాను నిరాకరించటంతో పురుగుల మందు తాగేస్తానని బెదిరించాడని చెప్పాడు. -
యూరియా కోసం పోలీస్ స్టేషన్ ముట్టడి
ఆదిలాబాద్(నార్నూర్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. సరఫరా సరిగా లేకపోవడంతో ఆదిలాబాద్ జిలా నార్నూర్ మండల కేంద్రంలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో రైతులు ఆగ్రహించి అధికారుల తీరుకు నిరసనగా పోలీస్స్టేషన్ను ముట్టడించారు. మండలంలో పత్తి, సోయా పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు ప్రస్తుతం సీజన్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంది. అయితే అందుకు సరిపడా సరఫరా చేసేందుకు వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
యూరియా.. ఏ‘దయా’..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. రవాణాల్లో జాప్యం ఒకవైపు.. వ్యాపారుల కృత్రిమ కొరత మరోవైపు.. వెరసి యూరియా నిల్వలు అందుబాటులో లేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీల వద్ద, ఎరువులు పంపిణీ చేస్తున్న సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండు బస్తాల యూరియా కోసం పనులన్నీ మానుకుని రోజంతా వరుసలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది. వచ్చిన అరకొర ఎరువులు ఏమాత్రం సరిపోకపోవడంతో అన్నదాతలు ఏకంగా రోడ్డెక్కాల్సి వస్తోంది. అధిక ధరకు విక్రయాలు.. జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6.40 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు సుమారు 4.79 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. ప్రధానంగా పత్తి, సోయా, వరి పంటలు ఎక్కువగా సాగు చేశారు. అత్యధికంగా పత్తి 3.10 లక్షల హెక్టార్లలో సాైగైంది. పత్తి సాగు చేస్తున్న రైతులు ప్రతి 20 రోజులకోసారి యూరియా వేస్తుంటారు. వారం రోజులుగా అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తుండటంతో యూరియా వేసేందుకు రైతులు ఉపక్రమించారు. దీంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు సహకార సంఘాల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న యూరియా నిల్వలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని ఒక్కో బస్తాపై అదనంగా రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారని విమర్శలున్నాయి. ఇదేమని ప్రశ్నించిన రైతులకు అసలు స్టాకే అందుబాటులో లేదని సమాధానమిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అన్నదాతలు అధిక ధరలు చెల్లించక తప్పడం లేదు. సరఫరాలో జాప్యం.. ఈ ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాకు 1.26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో జూలై నెలాఖరు నాటికి 54,989 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. కానీ.. కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అంటే యూరియా డిమాండ్, సరఫరాలో సుమారు పది వేల మెట్రిక్ టన్నులు తేడా ఉండటంతో కొరత తీవ్రమవుతోంది. జిల్లాలో ఆదిలాబాద్తోపాటు, మంచిర్యాలలో రైల్వేరేక్ పాయింట్లు ఉన్నాయి. కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాల నుంచి వచ్చే ఎరువులు ఈ రేక్పాయింట్ల వద్ద దిగుమతి చేసి, ఇక్కడి నుంచి మండలాలకు రవాణా చేస్తారు. గత నెలలో పుష్కరాల సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో జిల్లాకు రావాల్సిన రేల్వే రేక్ల కేటాయింపుల్లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం సరఫరాపై పడుతోందే తప్ప, ఎక్కడా యూరియా కొరత లేదని పేర్కొంటున్నారు. నిల్వల కేటాయింపుల్లో చేతివాటం..? యూరియా నిల్వల కేటాయింపుల్లోనూ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా బ్రాండ్ యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించి, డిమాండ్ అంతగా లేని బ్రాండ్ల యూరియాను సరకార సంఘాలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. అయితే.. ఏ బ్రాండ్ యూరియా అయినా పనితీరు ఒకేలా ఉంటుందని అధికారులు పేర్కొనడం గమనార్హం. జిల్లాలో వరి నాట్లు పూర్తిస్థాయిలో వేసుకోని ఈ పరిస్థితుల్లోనే కొరత ఈ స్థాయిలో ఉంటే, వరి నాట్లు వేసుకున్న పక్షంలో ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బఫర్ నిల్వల నుంచి సరఫరా చేస్తున్నాం.. యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఏడు వేల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలున్నాయి. వాటి నుంచి ఎరువులు సరఫరా చేస్తున్నాము. రవాణా, లోడింగ్, అన్లోడింగ్కు కొంత సమయం పడుతోంది. ఎక్కడా యూరియా కొరత లేదు. ఇంకా అవసరాల కోసం యూరి యా నిల్వలు వస్తున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - రమేష్, ఇన్చార్జి, జేడీఏ సరిపడా యూరియా ఉండాలి.. రైతులకు సరిపడే యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. మార్కెట్లో యూరియా లభించడం లేదు. మా మండలంలో యూరియా దొరకకపోవడంతో ఇచ్చోడకు వెళ్లి ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి తీసుకొస్తున్నం. సరైన సమయంలో యూరియా లేకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. అధికారులు స్పందించి యూరియా సరఫరా చేయాలి. - తొడసం రాజేశ్వర్, ఉప్పర్ పల్లి -
నాలుగేళ్ల వరకు యూరియా ధరలు పెరగవు
కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ ఆర్మూర్: రానున్న నాలుగేళ్ల వరకు యూరియా ధర పెరగకుండా చూస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం తెలిపారు. యూరియా ఉత్పత్తిని సైతం పెంచుతున్నామన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్లో పుష్కర స్నానం చేశారు. అక్కడి నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తికి వెళ్తూ ఆర్మూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా మేకిన్ ఇండియా నినాదంతో స్థానిక పరిశ్రమ రంగంలో ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలి.. పార్టీలను ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరే ముందు రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి పంపించానని అన్నారని గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటే స్పీకర్ కార్యాలయానికి అతని రాజీనామా ఇప్పటి వరకు అందలేదని స్పష్టమైందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలన్నారు. -
‘ఇ-కర్షక్’తో ఎరువుల కష్టాలకు చెక్!
ఖరీఫ్ సీజన్లో మీ ఊరికి రావాల్సిన యూరియా దారి మళ్లిందా? వ్యవసాయాధికారులకు తెలిసి కూడా మిన్నకుండి పోయారా? మీకు దక్కాల్సిన ఎరువుల్ని నోరున్నోళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అవసరం లేదు, ఇకపై ఆ పరిస్థితి రాదంటున్నారు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ కమిషనర్, డెరైక్టర్ ఎంవీ శేషగిరి బాబు. ‘ఈ-కర్షక్’తో ఎరువుల కష్టాలకు చెక్ పెట్టొచ్చంటున్నారాయన. అంతేకాదు.. ఏ పొలంలో భూసారం ఎంత? ఎంత ఎరువేశారు? వంటి వివరాలూ తెలుసుకోవచ్చని.. ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకూ ఈ- కర్షక్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. కేంద్ర బడ్జెట్ లెక్కల ప్రకారం ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తం సుమారు రూ. 45 వేల కోట్లు. అందులో మన రాష్ట్ర వాటా దాదాపు రూ. పది వేల కోట్లు. అంత పెద్ద మొత్తంలో సబ్సిడీ చెల్లించి ఎరువుల్ని కొంటున్నా ఎరువుల కోసం ప్రతి ఊళ్లో క్యూలే, కొట్లాటలే. మరేమిటీ దీనికి పరిష్కారం? ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘ఎలక్ట్రానిక్-కర్షక్’(ఈ-కర్షక్) విధానం. రైతుల కష్టాలు, కడగండ్లు, లాఠీచార్జీలతో చలించిన శేషగిరిబాబు మానస పుత్రికే ఈ పద్ధతి. ఇదీ ఈ-కర్షక్’ పని తీరు... ఊళ్లల్లో ఉండే ఎరువుల షాపులకు మామూలుగా పరిధంటూ ఉండదు. ఎవరైనా రావొచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఫలితంగా అయిన వాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు మూకుళ్లలో... ఈ గడ్డు పరిస్థితిని నివారించి అందరికీ ఎరువుల్ని అందుబాటులోకి తేవాలంటే ఆ షాపులకు నికర పరిధి ఉండాలి. దుకాణం సైజును బట్టి గ్రామాలను, రైతుల సంఖ్యను కేటాయిస్తారు. ఈ వివరాలన్నింటినీ కంప్యూటర్లో నమోదు చేసి ఆయా డీలర్లు, వ్యవసాయ విస్తరణాధికారుల మొబైల్ ఫోన్లతో అనుసంధానం చేస్తారు. ఆ షాపు పరిధిని అనుసరించి ఎరువుల్ని సరఫరా చేస్తారు. ఇది జరిగిన వెంటనే ఆ వివరాలన్నీ ఎరువుల వ్యవహారాలను చూసే విభాగం అధికారుల వద్దకు చేరతాయి. వ్యవసాయాధికారులిచ్చే సంకేతం ఆధారంగా ఏయే డీలర్ వద్ద ఎంతెంత సరుకు ఉందో గుర్తించవచ్చు. రిటైల్ డీలర్లు, మండల, జిల్లా స్థాయి వ్యవసాయాధికారుల మొబైల్ ఫోన్లతో రైతుల వివరాలున్న కంప్యూటర్ సర్వర్లను అనుసంధానం చేసినందున ఎరువులతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుంది. ఎరువుల వివరాలన్నీ ఒకే చోట.. రైతు వివరాలు నమోదు చేసేటప్పుడే కిసాన్ కార్డు లేదా ఆధార్ కార్డును కంప్యూటర్తో అనుసంధానం చేస్తారు. రైతుకున్న భూమి, నేల స్వరూపం, ఏయే రకం ఎరువులు ఎంతెంత అవసరం, తీసుకున్నారా లేదా? వంటి వివరాలన్నీ తనకు కేటాయించిన షాపుతో పాటు వ్యవసాయాధికారుల వద్ద నమోదై ఉంటాయి. రైతులు దీన్ని బట్టి ఎరువులు కొనుక్కోవచ్చు. మామూలు పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు నాలుగున్నర బస్తాల ఎరువు అవసరమవుతుందని ఒక లెక్క. ఒకవేళ ఎవరైనా తనకున్న పొలానికి మించి ఎరువు కొనుక్కుంటే ఇట్టే పసిగట్టేయవచ్చు. ఎందుకు కొనుక్కున్నారో, ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. ఏదైనా చేలో మోతాదుకు మించి వాడితే దాన్ని కనిపెట్టి రైతుకు అవగాహన కల్పించవచ్చు. తనకు కేటాయించిన దుకాణానికి బదులుగా మరెక్కడైనా రైతు ఎరువు కొనుక్కొని ఉంటే ఆ తర్వాత సరఫరా చేసే సరుకులో సర్దుబాటు చేయవచ్చు. సర్వర్ నుంచి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ వెళుతుంది. అవసరమైన చోటుకు పంపడం, అవసరం లేని చోటుకు ఆపడం చేయవచ్చు. రైతులకేమిటీ ప్రయోజనం?. ఏయే డీలర్ వద్ద ఎంతెంత ఎరువు నిల్వలున్నాయో వ్యవసాయ శాఖకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. డీలర్లు ఎరువుల కోసం ఎదురుచూడకుండా వారికిచ్చిన పరిధి మేరకు సరుకు దానంతటదే వస్తుంది. తనకున్న పొలానికి అనుగుణంగా డీలర్ వద్ద సరుకుంటుంది గనుక రైతులు హడావుడి పడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా దొరుకుతుందన్న భరోసా ఉన్నప్పుడు సమస్యలు ఎదురుకావు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ సాఫ్ట్వేర్తో రూ. వందల కోట్ల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. భూసారం నష్టపోకుండా చూడొచ్చు. భూమి, రైతు, డీలర్లు, షాపులు, ఎరువుల కంపెనీలు, గ్రామాలతో పాటు భూసారం వివరాలన్నీ కూడా ఈ-కర్షక్ వ్యవస్థలో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. కౌల్దార్లకూ ఎరువులివ్వొచ్చు.. రుణ అర్హత పత్రాలు కలిగిన కౌలుదారులకు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతు మిత్ర గ్రూపుల్లో ఉండే వారి వివరాలను కూడా కంప్యూటర్లో నమోదు చేయవచ్చని శేషగిరిబాబు చెప్పారు. వారి వివరాలు, కౌలుకు తీసుకున్న భూమి ఆధారంగా ఆయా గ్రామాల్లో డీలర్లకు అనుసంధానం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ను, చట్టవిరుద్ధంగా దాయడాన్ని నివారించవచ్చు. నాబార్డ్ సాయంతో కేవలం రూ. పది లక్షలతో ‘ఈ-కర్షక్’ వ్యవస్థను రూపొందించినట్టు వివరించారు. పశ్చిమ గోదావరి నుంచి ప్రస్థానం... పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని 18 ఎరువుల దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి సత్ఫలితాలను సాధించారు. ఇప్పుడు ఈ-కర్షక్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. - ఆకుల అమరయ్య, ‘సాక్షి’ ప్రతినిధి ఎంవీ శేషగిరిబాబు -
అదే హైరానా!
గజ్వేల్: యూరియా కోసం జిల్లాలో ఇప్పటినుంచే హైరానా నెలకొన్నది.. ప్రతి ఏటా భారీ క్యూలైన్లు.. చెప్పుల దారులు.. తిండితిప్పలు మాని పిల్లాపాపలతో కలిసి నిరీక్షణ.. ఒక్క బస్తా కోసం రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి. ఇవీ ప్రతి ఖరీఫ్లో యూరియా కోసం రైతన్న పడుతున్న పాట్లు.. విత్తనాల వేయడం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందేమోనన్న భయంతో ముందస్తుగా యూరియాను కొనుగోలు చేస్తున్నారు.. గజ్వేల్లో వ్యాపారి ఓ అడుగు ముందు కేసి యూరియా బస్తా ధర అదనంగా రూ.30 వసూలు చేయడంతో వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఈసారి ఖరీఫ్లో 1.80లక్షల టన్నుల యూరియా, కాంప్లెక్స్, డీఏపీ ఎరువులు అవసరం. ఇందులో భాగంగానే యూరియా 87వేల టన్నుల అవసరమని భావిస్తుండగా ఇప్పటివరకు 31వేల టన్నుల యూరియా విడుదలైంది. మూడేళ్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికలోపం కారణంగా యూరియా కొరత ఏర్పడి ఒకటిరెండు సంచులకోసం రైతులు పోలీస్స్టేషన్ల వద్ద తిండి తిప్పలు మాని ఉదయ నుంచి రాత్రివరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా దొరక్క నిత్యం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో యూరియా వేయలేక భారీగా పంట నష్టానికి గురయ్యారు. ప్రస్తుతం గతం తాలూకు చేదు అనుభవాలు రైతులను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వారంతా ముందస్తు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. గజ్వేల్ పట్టణంలో నిత్యం యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువుల వందలాది క్వింటాళ్ల విక్రయాలు సాగుతున్నాయి. ఇక్కడికి స్థానిక రైతులే కాకుండా దౌల్తాబాద్, తొగుట, చేగుంట, వరంగల్ జిల్లా చేర్యాల, నల్గొండ జిల్లా రాజపేట మండలాలకు చెందిన రైతులు ఇక్కడ ఎరువుల కొనుగోలు చేస్తున్నారు. రైతు ఫిర్యాదుతో వెలుగులోకి.. గజ్వేల్లో యూరియా బ్లాక్ మార్కెట్ అప్పుడే మొదలైంది. మంగళవారం ఓ రైతు ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లికి చెందిన రైతు నరేందర్రెడ్డికి పట్టణంలోని వెంకటరమణ ట్రేడర్స్కు చెందిన యజామాని యూరియా రూ.298కి విక్రయించాల్సిందిపోయి అదనంగా రూ.32 ఇస్తేనే యూరియా ఇస్తానని, అంతేకాకుండా 15 కాంప్లెక్స్ 20-20 ఎరువు కొనుగోలు చేస్తే 30 యూరియా బస్తాలు ఇస్తానని లింకు పెట్టాడు. దీంతో బాధిత రైతు ఫిర్యాదు చేయడంతో స్థానిక వ్యవసాయాధికారి ప్రవీణ్ దీనిపై విచారణ చేపట్టి సదరు దుకాణంలో అమ్మకాలను నిలిపివేయడమే కాకుండా నోటీసులు జారీ చేశారు. బ్లాక్మార్కెట్ను సహించం.. యూరియా ఎంత అవసరముంటే అంత స్టాకు తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు పాల్పడితే మాత్రం సహించేది లేదు. కఠిన చర్యలు తప్పవు. -హుక్యానాయక్, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్. -
యూరియా.. బ్లాక్..!
యూరియా లేదు.. జిల్లాలో చాలా వరకు ఎరువుల దుకాణాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఖరీఫ్ మిగిల్చిన అప్పుల నుంచి బయట పడేందుకు ఎంతో ఆశగా రబీలోకి అడుగుపెట్టిన రైతన్నకు ఇప్పుడు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియాకు కొదవలేదని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించి అందినకాడికి దండుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో బస్తా యూరియా ధర ప్రస్తుతం రూ.370 పలుకుతుంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు నోరు మొదపకపోవడం గమనార్హం. హాలియా : జిల్లాలో రబీలో రైతులు లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందులో నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు, బోరు బావుల కింద ఇప్పటి వరకు 85 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా మరో 15 వేల హెక్టార్లలో ఆరుతడి పంటలు వేశారు. ఈ నెలాఖరు నాటికి వరి మరో 30 నుంచి 50 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉంది. అందుకు గాను జిల్లాకు 9నుంచి 10 లక్షల బస్తాల యూరియా అవసరం. అదే విధంగా జిల్లాలో లక్ష ఎకరాల్లో పండ్ల తోటలున్నాయి. వాటికి 20 వేల టన్నుల యూరియా అంటే 4 లక్షల బస్తాల యూరియా అవసరం. ఇదే అదునుగా భావించిన హోల్సేల్ డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్తా యూరియా రూ. 282 ఉండగా ప్రస్తుతం రూ.370కు విక్రయిస్తున్నారు. రూ. 295 ఎమ్మార్పీ ఉన్న నీమ్ యూరియా రూ.385 కు అమ్ముతున్నారు. ఫర్టిలైజర్ దుకాణ వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోల్సేల్ డీలర్లదే హవా..! జిల్లాలో ఆరుగురు హోల్సెల్ డీలర్లు ఉన్నారు. యూరియా అమ్మకంలో జిల్లాలో వీరిదే హవా. కంపెనీ నుంచి రైల్ ర్యాక్ రాగానే వ్యవసాయశాఖ అధికారులు హోల్సెల్స్ డీలర్ల ద్వారా రిటైల్డ్ డీలర్కు యూరియా విక్రయించాల్సి ఉంది. కానీ హోల్సేల్ డీలర్లు కంపెనీ సేల్స్ ఆఫీసర్ను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను మేనేజ్ చేసి రిటైల్డ్ డీలర్లకు విక్రయిస్తున్నట్లు చూపించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బస్తాకు రూ.10 నుంచి రూ.20 పైన లాభం చూసుకొని మధ్య దళారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వారు తమ లాభం తాము చూసుకొని రిటైల్డ్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. రిటైల్డ్ వ్యాపారులు ర్యాక్ పాయింట్ నుంచి తమ దుకాణానికి రవాణా, హమాలీ ఖర్చు, లాభం చూసుకొని యూరియా విక్రయిస్తుండటంతో బస్తా యూరియా రూ.370 పలుకుతుంది. సహకార సంఘాల ద్వారా విక్రయించాలని రైతుల డిమాండ్ బహిరంగ మార్కెట్లో యూరియా ధరకు రెక్కలు రావడంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సహకార సంఘాల ద్వారా విక్రయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫర్టిలైజర్ల ద్వారా విక్రయిస్తే వ్యాపారులు హోల్సెల్ ట్రేడర్లు, మద్యదళారీ, ఎగుమతి, దిగుమతి, హమాలీ, ట్రాన్స్పోర్ట్ ఇతరత్ర లాభం చూసుకొని విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అదే సహకార సంఘాల ద్వారా విక్రయిస్తే ఎమ్మార్పీ రేట్కు విక్రయించవచ్చని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారు - అలుగుల రమణారెడ్డి, రైతు, కొత్తపల్లి హాలియాలో యూరియాను వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. నాగార్జున యూరియా బస్తాకు రూ. 350 పైమాలే. బిల్లులో మాత్రం ఎమ్మార్పీ రేట్ రాస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మా వద్ద యూరియా లేదంటూ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మార్పీ ధరలకు యూరియా అమ్మేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా సహకార సంఘాల ద్వారా యూరియా విక్రయిస్తే రైతులకు ప్రయోజనంగా ఉంటుంది. -
ప్రతి రైతుకు యూరియా అందించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో యూ రియా కొరతను అరికట్టి ప్రతి రైతుకు అందేలా చూడాలని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ వి.శ్రీధర్ను కోరారు. పలు సొసైటీల అధ్యక్షులు, రైతులతో కలిసి శుక్రవారం ఆయన జేడీని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరతలేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ వారికి చెందిన సొసైటీలకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని సొసైటీలకు సరఫరా చేసి రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. జేడీఏ శ్రీధర్ మాట్లాడుతూ అన్ని సొసైటీలకు యూరియాను సరఫరా చేస్తామని చెప్పారు. యూరియాను అధిక ధరలకు అమ్మే సొసైటీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
యూరియా.. ఎమ్మార్పీకి ఇస్తే ఒట్టు
నంద్యాల: మహో ప్రభో యూరియా లభించడం లేదు.. వ్యాపారులు బ్లాక్లో విక్రయిస్తున్నారు చర్యలు తీసుకోండి అంటూ.. రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు చలించడం లేదు. నంద్యాల పరిధిలో యూరియా డీలర్లు, వ్యాపారులు యథేచ్ఛగా బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె, నంద్యాల పట్టణంలో దాదాపు 20కి పైగా ఎరువుల దుకాణాల్లో యూరియాను విక్రయిస్తున్నారు. రబీలో వరిసాగును చేయరాదని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు జారిచేసింది. దీంతో రైతులు కూడా ఆవాలు, కొర్ర, మినుము, రాగి, మొక్కజొన్న తదతర పంటలను సాగు చేస్తున్నారు. నంద్యాల ఏడీఏ పరిధిలోని నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, గడివేముల, పాణ్యం, బనగానపల్లె మండలాల్లో దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. అత్యవసరంగా ఒక్కొక్క ఎకరాకు కనీసం 3,4 బస్తాల యూరియాను అత్యవసరంగా సరఫరా చేస్తేతప్ప రబీ సీజన్ను గట్టెక్కలేమని రైతులు పేర్కొంటున్నారు. కేటాయింపు ఎంత.. అమ్మేది ఎంత ఏ సొసైటీకి ఎంత యూరియా కేటాయించింది వ్యవసాయాధికారులు ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారు. ఈ విషయం బయటికి పొక్కితే సంబంధిత గ్రామాలకు చెందిన రైతులు సొసైటీ దగ్గరికి వెళ్లి నిలదీసే అవకాశం ఉంటుందని భావిస్తూ నంద్యాల ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన సొసైటీ సభ్యులు అధికారుల నోరును నొక్కినట్లు తెలుస్తుంది. గతంలో అక్రమార్కులపై నమోదు అయిన కేసుల పట్ల అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో అక్రమార్కులకు ఎలాంటి భయం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు మాత్రం ఆరు దుకాణాల్లో యూరియ అక్రమ వ్యాపారంపై తీవ్రస్థాయిలో స్పందించి శాశ్వతంగా వాటిని రద్దుచేయాలని సిఫారసు చేసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అనుమానాలకు దారితీస్తోంది. తూతూ మంత్రంగా దాడులు: యూరియా 50 కేజీల బస్తాను రూ.284కు విక్రయించాలని కంపెనీలు నిర్ణయించాయి. ఈ ధరకు ఏ ఒక్క వ్యాపారి విక్రయించడం లేదు. అధికారులు కూడా దుకాణాలకు యూరియాను కేటాయించలేదు. కేవలం సహకార సంఘాలకు మాత్రమే కేటాయించారు. రెండు, మూడు సహకార సంఘాలు మినహాయిస్తే మిగిలిన సహకార సంఘాలు తమకు కేటాయించిన 40 టన్నుల యూరియాను నంద్యాల పట్టణంలోని ఎరువుల దుకాణాల యజమానులకు రూ.40 నుంచి రూ.50ల మధ్యన అధిక ధరలను తీసుకొని విక్రయించారు. దీనిపై వ్యాపారి మరో రూ.50లు అదనంగా చేర్చడంతో మొత్తం రూ.100కు పైగా అధిక ధర చేరుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావుకు స్థానిక బీజేపీ నాయకుడు తూము శివారెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు కూడా చేశారు. అధిక దరలకు యూరియాను విక్రయిస్తున్నారని గతంలో జేడీఏకు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల్లో స్పందన లేదు. మంగళవారం తహశీల్దార్ శివరామిరెడ్డి, ఏడీఏ సుధాకర్, ఏఓ చెన్నయ్య ఆధ్వర్యంలో దాడులను నిర్వహించారు. అయితే విక్రయాలు జరిగే దుకాణాలు కాకుండా లేని దుకాణాలను తనిఖీ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక ఏడీఏ సుధాకర్ను ప్రశ్నించగా యూరియా అక్రమ అధిక ధరలను నివారించడానికి దాడులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
యూరియా కోసం రాస్తారోకో
తెనాలి టౌన్ : తెనాలిలో రైతులు రోడ్డెక్కారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా అందడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. గుంటూరు-తెనాలి రహదారిపై రాస్తారోకో చేశారు. రబీలో మొక్కజొన్న, తెల్లజొన్న పైర్లకు అవసరమైన యూరియా కోసం సోమవారం తెనాలి మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు ఒక్కసారిగా రాస్తారోకోకు దిగారు. ఈ కారణంగా రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలావుంటే, మార్కెట్ కమిటీ ఆవరణలోని ఎరువుల విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి సందర్శించారు. యూరియా కొరతపై వ్యవసాయాధికారులను మంత్రి నిలదీశారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలికి ఒక ర్యాక్ యూరియా సోమవారం తెప్పిస్తున్నామని, నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే మంత్రి చెప్పినట్టు సోమవారం ఒక బస్తా యూరియా కూడా మార్కెట్యార్డుకు రాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులంతా రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. పరిస్థితిని తెలుసుకున్న వ్యవసాయ సహాయ సంచాలకులు కె.జ్యోతిరమణి, మండలపరిషత్ అధ్యక్షుడు సూర్యదేవర వెంకట్రావులు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం జ్యోతిరమణి విలేకరులతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఠా కూలీలు రాకపోవడం వల్ల యూరియా రాలేదని చెప్పారు. 120 టన్నుల ఎలాంట్మెంట్ ఉందని, 40 టన్నులు తెనాలిలో విక్రయ కేంద్రానికి, మిగిలిన 80 టన్నుల యూరియాను గ్రామాల్లో సొసైటీలకు పంపనున్నట్టు చెప్పారు. మంగళవారం ఉదయానికి యూరియా వస్తుందని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా యార్డులో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి సరఫరా చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో డీడీఏ వెంకటేశ్వరరావు, వ్యవసాయాధికారి కె.అమలకుమారి కూడా ఉన్నారు. -
ఇదేమి పద్ధతి
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా అవసరాలకు సంబంధించి మంజూరైన యూరియాను ఇక్కడి రైతుల పొట్టకొట్టి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించుకుపోవడం ఏమిటని ఎంపీ అవినాష్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షాభావంతో పంటలు ఎండుతున్న నేపధ్యంలో వాటిని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడుతూనే మరోపక్క యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్న వైఎస్సార్ జిల్లా రైతులను విస్మరించి ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. వ్యవసాయ పంటలకు సంబంధించి యూరియా అవసరం చాలా ఉందని...ప్రభుత్వం మాత్రం యూరియా కొరత లేదని ప్రకటనలు గుప్పిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వెంటనే జిల్లాకు యూరియాను పంపించి ఎటువంటి కొరత రైతులకు రాకుండా చూడాలన్నారు. ఆదివారం కడపలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్రావు, జిల్లా జాయింట్ డెరైక్టర్ జ్ఞానశేఖర్లతో టెలిఫోన్లో సంభాషించారు. ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని...వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో రబీలో సాగు చేసిన పంటలకు సంబంధించి రైతులకు యూరియా కొరత వేధిస్తోందని, ప్రభుత్వం సక్రమంగా సరఫరాచేయకపోవడంతో రైతన్న సతమతమవుతున్నాడన్నారు. అధికారులు యూరియాపై పెద్దగా పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలమవుతోందని....వేలాది మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, పదుల సంఖ్యలో కూడా రాకపోవడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బ్లాక్ మార్కెట్కు తరలకుండా చర్యలు తీసుకోండి ప్రస్తుతం యూరియా ఎక్కడా లభించకపోవడంతో కొంతమంది డీలర్లు బ్లాక్ మార్కెట్లో రైతన్నలను నిలువుదోపిడీ చేస్తున్నారని....రూ. 283 విలువ చేసే యూరియా బస్తాను రూ. 350 నుంచి రూ. 400 వరకు వెచ్చించి కొనుగోలుచేయాల్సి వస్తోందని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఇదంతా ప్రభుత్వం సక్రమంగా యూరియా సరఫరాచేయకపోవడం వల్లనే సమస్య ఎదురవుతోందని ఆయన తెలియజేశారు. బ్లాక్ మార్కెట్కు తరలకుండా చర్యలు తీసుకోవడంతోపాటు వెంటనే యూరియా కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, కమలాపురం, కడప తదితర ప్రాంతాలలో వరి పంటలు సాగులోఉన్నాయని..అక్కడికి లారీల్లో నుంచి సరుకు దించుతుండగానే అయిపోతుందంటే యూరియాకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఒకటి,రెండు రోజుల్లో జిల్లాకు యూరియా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి జిల్లాలో యూరియా కొరత నివారించాలని, వెంటనే వేలాది మెట్రిక్ టన్నుల యూరియాను పంపించాలని కమిషనర్, జేడీలను కోరిన నేపధ్యంలో వారు సానుకూలంగా స్పందించారు. కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే జిల్లాకు అవసరమైన యూరియాను సరఫరాచేస్తామని వైఎస్ అవినాష్కు హామీ ఇచ్చారు. -
యూరియా పక్కదారి
వెంకటాచలం: రైతులందరికీ సక్రమంగా అందాల్సిన యూరియాను అధికారపార్టీ అండతో కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులు రోజులకొద్దీ క్యూలలో నిల బడిన బస్తా కూడా యూరియా దొరకని పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొంది. కానీ కొందరు అధికారపార్టీకి చెందిన వారికి మాత్రం లారీల కొద్దీ యూరియా సునాయసంగా ఇళ్లకు చేరుతోంది. ఈ దారుణాన్ని వెంకటాచలం మండలంలో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు శనివారం వెలుగులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. లారీలో యూరియాను తరలిస్తుండగా వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య అనుమానంతో మండల కేంద్రంలోని కసుమూరు రోడ్డు వద్ద అడ్డుకున్నారు. లారీ డైవర్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదుచేశారు. లారీని అడ్డుకోవాలని, అక్కడకు తమ సిబ్బందిని పంపుతున్నట్లు ఏడీ సత్యవాణి తెలిపారు. ఈలోపే సంఘటనా స్థలానికి కనుపూరు, వడ్డిపాళెం గ్రామానికి చెందిన కొందరు వచ్చి లారీలోని యూరియా తమేదేనని, వెంటనే లారీని పంపించాలని వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలిసి స్థానిక ఎస్ఐ రహమతుల్లా తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా రైతులు తమ వద్ద ఉన్న బిల్లులు చూపారు. ఆ బిల్లులు పక్కనే ఉన్న మనుబోలు మండలంలోని సింహపురి కోఆపరేటివ్ సొసైటీవని గుర్తించారు. వ్యవసాయాధికారి రమణ పరిశీలించి రైతులు ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేయవచ్చునని వారికే వంతపాడారు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సొసైటీ కింద రైతులకు అవసరం లేదా? బడా రైతులు లారీలకు లారీలు తీసుకెళ్తే చిన్నకారు రైతుల పరిస్థితి ఎమిటని నిలదీశారు. దీంతో అక్కడకు చేరిన మిగతా చిన్నకారు రైతులు ఏఓ రమణతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఏడీతో మాట్లాడిన ఏఓ ఎరువులు అమ్మిన సొసైటీ నిర్వహకులపైన చర్యలకు సిపార్సు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల బిల్లులను పరిశీలించిన తర్వాత పంపిణీ చేస్తామని సర్దిచెప్పారు. అనంతరం లారీలో యూరియాను కనుపూరు గ్రామానికి తరలించారు. ఇదేవిధంగా మండలంలోని కసుమూరు, పాలిచెర్లపాడు, చవటపాళెం, గుడ్లూరివారంపాళెంలకు లారీల్లో యూరియా వెళ్లినట్లు స్థానిక రైతులు తెలిపారు. రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదు గ్రామాల్లోని చిన్నకారు రైతులకు ప్రభుత్వం సొసైటీ ద్వారా అందజేస్తున్న యూరియాను పక్కదారిన మళ్లించి బడారైతులకు అధికారులు సహకరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య విమర్శించారు. రైతులు సొసైటీల వద్ద యూరియా కోసం రాత్రి, పగలు వేచి ఉంటే వారి భాధలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పలుగ్రామాలకు వేరే మండలాల నుంచి యూరియాను లారీల్లో బడా రైతుల కోసం తరలిస్తున్నరని కానీ చిన్నకారు రైతులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పొలాలు లేని రైతుల పేరుతో దొంగబిల్లులు సృష్టించి యారియాను బడా రైతులకు అందజేస్తున్నట్లు ఆరోపించారు. చిన్నకారు రైతులకు న్యాయం జరగకపోతే వైకాపా ఆధ్వర్యంలో సొసైటీల వద్ద ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
యూరియూ కొరతకు అధికారులే కారణం
నెల్లూరు(అగ్రికల్చర్): వ్యవసాయ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే జిల్లాలో యూరియూ కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. మినీబైపాసురోడ్డులోని వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయంలో జేడీ సుబ్బారావుతో మంగళవారం ఆయన యూరియూ సమస్యపై చర్చించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జిల్లాకు 96వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. ఈ ఏడాది అధికారులు సరిగా అంచనా వేయకపోవడంతో కేవలం 67వేల మెట్రిక్ టన్నులే వచ్చిందని వివరించారు. ఇది సరిపోదని, సీజన్ దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గత ఏడాది డిమాండ్ను దృష్టిలో వుంచుకొని అధికారులు సకాలంలో ప్రభుత్యానికి నివేదిక పంపివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారన్నారు. సొసైటీలకు కేటాయించిన ఎరువులను అధికార పార్టీ సిఫార్సు కలిగిన వారికే ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ మండల అధికారులు ఆసక్తి కనబరచడం తగదన్నారు. ఆయకట్టు ఆధారంగా సొసైటీలకు ఎరువులు కేటాయించాలని సూచించారు. పాస్ బుక్లేని రైతులకు వీఆర్వో సర్టిఫికెట్ ఆధారంగా పంపిణీ చేయాలన్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యూరియూకు కృత్రిమ కొరత సృష్టిస్తూ రూ.284కి అమ్మాల్సిన బస్తాను రూ.450 వరకు విక్రరుుస్తున్నారని చెప్పారు. బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించేలా వ్యవహరించడం అధికారులకు తగదన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకుంటే జేడీఏ కార్యాలయానికి తాళానికి తాళం వేస్తామని హెచ్చరించారు. స్పందించిన జేడీఏ సుబ్బారావు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావుతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి ఎరువుల సమస్యను వివరించారు. కార్యక్రమంలో కలివెలపాళెం సొసైటీ అధ్యక్షుడు పార్లపల్లి వీరరాఘవరెడ్డి, ఉపాధ్యక్షుడు సుమంత్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్, జిల్లా కార్యదర్శులు మనుబోలు సికింధర్రెడ్డి, రాంప్రసాద్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కారుదుంప దశరథరామయ్య యాదవ్, మల్లినేని వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా...లేదయ్యా..!
తెనాలిటౌన్: తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. పైరుకు సకాలంలో ఎరువు వేయలేక పంటను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక అల్లాడుతున్నారు. యూరియాకు కృతిమ కొరత ఏర్పడటంతో రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి దశలో ఎరువులు వేయాల్సిన సమయం రావడంతో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతు లు పలు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని విక్రయ కేంద్రం చుట్టూ రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, వేమూరు మండలాల్లో మొక్కజొన్న పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఉంది. కొన్నిచోట్ల 25 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఈ దశలో మొదటి దఫా ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. డీఏపీతోపాటు యూరియా కూడా వేస్తారు. తెనాలి మండలంలో 8,750 ఎకరాలు, దుగ్గిరాలలో 8వేల ఎకరాలు, కొల్లిపరలో 8,500 ఎకరాలు, కొల్లూరులో 7,500 ఎకరాలు, వేమూరులో 7వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టినట్టు వ్యవసాయ సహాయ సంచాలకులు కె.జ్యోతిరమణి తెలిపారు. తెనాలి మార్కెట్యార్డు ఆవరణలో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 కిలోల యూరియా బస్తా రూ. 298.50లకు విక్రయిస్తున్నారు. డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు చుండూరు, చేబ్రోలు, అమృతలూరు రైతులు కూడా ఇక్కడకు వచ్చి యూరియా కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగింది. రైతులు ఆటోలు, ట్రక్కు ఆటోల ద్వారా తీసుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు విక్రయ కేంద్రంలో నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 9,140 బస్తాలు, జనవరిలో ఇప్పటి వరకు 1600 బస్తాలు విక్రయించినట్టు ఇన్చార్జి ఇన్నయ్య తెలిపారు. అలాంట్మెంట్ తక్కువగా ఉండటం, రవాణా సక్రమంగా జరగకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. మండల కేంద్రాల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా యూరియాను సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అక్కడ లేకపోవడంతో తెనాలి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రానికి రావాల్సి వస్తుందని, ఐతానగర్కు చెందిన సురేష్ అనే రైతు తెలిపారు. పైరుకు నీరు పెట్టాల్సిన సమ యం వచ్చిందని, ఎరువు వేసి నీరు పెడదామంటే యూరియా అందుబాటులో లేదని తెలిపారు. ముందస్తు నిల్వలు.. ఇదిలావుంటే , ప్రస్తుతం యూరియా కొరతగా ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది ఎదురుకావచ్చనే ఉద్దేశంతో కొందరు రైతులు ఇప్పుడే కొని నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైతు 20 నుంచి 50 బస్తాల వరకు కొనుగోలు చేయడంతో మిగతావారికి అందడం లేదని ఇన్నయ్య తెలిపారు. రైతులందరూ ఒకేసారి అడుగుతున్నందున కొరత ఏర్పడిందని చెప్పారు. రైతులకు మొదటి దఫా ఎంతమేరకు అవసరమో అంతవరకే కొనుగోలు చేసి మిగతా రైతులకు అందేలా సహకరించాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. ఇదిలావుండగా, బయట మార్కెట్లో యూరి యాను అధిక ధరకు విక్రయించినట్లయితే చర్యలు తప్పవని వ్యవసాయాధికారులు తెలిపారు. 30 వేల బస్తాల యూరియా అవసరం ... సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో సాగవుతున్న మొక్కజొన్న, జొన్న పైర్లకు మరో 30 వేల బస్తాల యూరియా అవసరం కానుంది. ఇప్పటివరకు 10వేల బస్తాలకు పైగా విక్రయించారు. ఈ మ ండలాలతో పాటు పక్కన ఉన్న అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, చేబ్రోలు రైతులు యూరియా కోసం ఇక్కడకు రావడంతో కొరత ఏర్పడింది. అధికారులు చర్యలు తీసుకుని రైతులందరికీ సకాలంలో యూరియా అందే విధంగా చూడాలని కోరుతున్నారు. -
యూరియా కోసం యుద్ధం
ఆత్మకూరురూరల్ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగు ఆలస్యమై ఆవేదన చెందుతున్న రైతును యూరియా కృత్రిమ కొరత వేధిస్తుంది. బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలు విక్రయిస్తుండటం, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఎమ్మార్పీకే యూరియా లభిస్తుండటంతో రైతులు ఎగబడుతున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరులోని గ్రోమోర్ ఎరువుల దుకాణం, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఎమ్మార్పీ ధరలకే యూరియా లభ్యమవుతోంది. ఈక్రమంలో వారం రోజు లుగా రైతులు ఈ రెండు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం మూడు లోడ్ల యూరియా గ్రోమోర్ దుకాణానికి చేరడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కార్యాలయ సిబ్బందికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒక కార్యాలయ ఉద్యోగి యూరియా కావాల్సిన రైతుల పేర్లు ఓ జాబితాలో నమోదు చేశాడు. గ్రోమోర్ కేంద్ర కార్యాలయం నుంచి యూరియా పంపిణీ చేయాలని సకాలంలో ఉత్తర్వులు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా చేయలేదు. ఓ తరుణంలో మేనేజరు ఈశ్వర్రెడ్డితో రైతులు తగాదాకు దిగారు. దీంతో రైతులకు సమాధానం చెప్పలేక సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆత్మకూరు ఎస్సై వేణుగోపాల్రెడ్డి తన సిబ్బందితో గ్రోమోర్ కార్యాలయానికి చేరుకుని జాబితాలో ఉన్న ప్రకారం ప్రతి రైతుకు నాలుగు బస్తాల వంతన స్టాకు ఉన్నంత వరకు అందజేస్తారని క్యూలో నిలబడాలని సర్దుబాటు చేసి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
సిటీ గ్యాస్కు ప్రాధాన్యత!
కొత్త గ్యాస్ కేటాయింపుల విధానంపై చమురు శాఖ కసరత్తు న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూ సహజ వాయువు కేటాయింపుల విధానాన్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం సీజీడీ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అటు పైన ఆటమిక్ ఎనర్జీ.. స్పేస్ రీసెర్చ్కి అవసరమయ్యేవి సరఫరా చేసే వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చమురు శాఖ భావిస్తోంది. ఇక పెట్రోకెమికల్స్ మొదలైనవి వెలికితీసే ప్రాజెక్టులకు రోజుకి 1.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎస్ఎండీ) గ్యాస్ను ఇవ్వాలని, నాలుగో ప్రాధాన్యత కింద గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు కేటాయించాలని యోచిస్తోంది. నియంత్రిత టారిఫ్ల కింద విద్యుత్ను సరఫరా చేసే షరతుపై పవర్ ప్లాంట్లకు తర్వాత స్థానం దక్కుతుంది. ఇక దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేం దుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కనుంది. ఈ మేరకు ప్రతిపాదనను చమురు శాఖ.. కేంద్ర క్యాబినెట్ ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ కేటాయింపుల్లో ప్రస్తుతం యూరియా తయారీ ప్లాంట్లకు మొదటి ప్రాధాన్యత లభిస్తోంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, వాహనాలు.. గృహాలకు గ్యాస్ సరఫరా చేసే సీజీడీ ప్రాజెక్టులు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
తెల్లనివన్నీ పాలు కావు..!
మీకు పాలలా కనిపిస్తున్న ఆ ద్రవం పాలు కాకపోవచ్చు. సంపూర్ణాహారంగా భావించి మీరు తాగుతున్న ఆ పానీయం విషాహారం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాలనూ కల్తీ చేసి, లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. సింథటిక్ పాలుగా పేర్కొంటున్న ఇవి ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా... బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. సింథటిక్ పాలలో వాడే పదార్థాలు, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మనదేశం ఒకటి. కానీ ఇందులో దాదాపు 70 శాతం పాలు కల్తీవే అన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు. కల్తీ మాత్రమే కాదు... అవి కృత్రిమపాలు. ఈ పాలనే ఇంగ్లిష్లో సింథటిక్ మిల్క్ అంటారు. సింథటిక్ మిల్క్ అంటే...? ఆవు లేదా గేదె పొదుగునుంచి పితికిన పాలు స్వాభావికమైన పాలు అనీ, కృత్రిమ పదార్థాలతో, కృత్రిమమైన రసాయనాలతో పాల రూపు వచ్చేలా తయారు చేసిన ద్రవాన్ని ‘సింథటిక్ మిల్క్’ అనీ అంటారు. సింథటిక్ పాలలో ఏమేం వాడతారు... సింథటిక్ పాల తయారీలో నీరు, కాస్టిక్ సోడా, యూరియా, గ్లూకోజ్, గంజి పొడి, చవకరకం వంటనూనె/రిఫైన్డ్ ఆయిల్, స్టార్చ్ ఆయిల్, డిటర్జెంట్, కుంకుళ్లు, షాంపూ, తెల్లరంగు, బంక, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి పదార్థాలు వాడతారు. ఇందులో పాలను పైనుంచి ధారగా పోస్తున్నప్పుడు నురగ వచ్చేందుకు డిటర్జెంట్/కుంకుడుకాయలు వాడతారు. ఇక అందులో వాడే ఆమ్ల పదార్థాలను నిర్వీర్యం చేయడానికి కాస్టిక్ సోడాను ఉపయోగిస్తారు. రవాణా ప్రక్రియలో పాలు చెడిపోయి/విరిగిపోయి పుల్లబారిపోకుండా ఉండేందుకూ కాస్టిక్సోడా ఉపయోగపడుతుంది. చవకరకం వంటనూనెను పాలలోని సహజ కొవ్వుపదార్థంలా అనిపించేందుకు వాడతారు. స్వాభావికమైన పాలరుచి రావడానికి యూరియానూ, తెల్లరంగు రావడానికీ, చిక్కగా అనిపించడానికి తెల్ల పెయింట్నూ ఉపయోగిస్తారు. గమ్ అకేషియా, గమ్ లెగ్యూమినస్ తరహాలకు చెందిన బంకను సైతం పాలను చిక్కగా అనిపించేలా చేయడానికి వాడతారు. దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచేలా చూసేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ను వాడతారు. ఇలా తయారు చేసిన సింథటిక్ పాలు పూర్తిగా స్వాభావికమైన పాలలాగే కనిపిస్తాయి. అయితే స్వాభావికమైన పాలలో ఉండే పోషక విలువలేవీ ఈ పాలలో ఉండవు. ఇలా తయారు చేసిన పాలను గ్రామాల్లోని ‘డైరీ కో-ఆపరేటివ్ సొసైటీ’ల ఆధ్వర్యంలో నడిచే పాల సేకరణ కేంద్రాలలో ఉంచే పాలలో కలిపేస్తారు. అందులో అవి తేలిగ్గా కలిసిపోతాయి కూడా. లాభార్జన కోసమే ఈ అక్రమ మార్గం ఒక లీటరు సింథటిక్ పాలను తయారుచేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 5 మాత్రమే. మార్కెట్లో లీటరు పాల ధర దాదాపు 40 వరకు ఉంటుంది. స్వాభావిక పాలను విక్రయిస్తే వచ్చే లాభం కేవలం రూ. 10 నుంచి రూ.15 మాత్రమే. కానీ సింథటిక్ పాలను విక్రయిస్తే వచ్చే లాభం రూ. 35. అందుకే అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనకు పాల్పడేవారు తోటివారి ఆరోగ్యాలనూ, ప్రాణాలను లెక్కచేయకుండా తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యానికి ఎంత నష్టం... ఈ సింథటిక్ పాల వల్ల అన్ని విధాలా ఆరోగ్యానికి నష్టమే. ముఖ్యంగా గర్భవతులైన మహిళల ఆరోగ్యంతో పాటు లోపలి పిండానికీ ఇది నష్టమే. ఇక గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి ఇవి మరింత నష్టం చేస్తాయి. పైగా అనేక రకాల క్యాన్సర్లకు మూలకారణం కూడా. పిల్లల ఆరోగ్యం బాగుండాలని తల్లులు పట్టుబట్టి ఈ పాలు తాగిస్తుంటారు. కానీ తమ పిల్లలకు తామే విషాన్ని పడుతున్నామన్న సంగతే వారికి తెలియదు. ఈ పాలను తాగడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి క్రమంగా సన్నగిల్లి చిన్నవయసులోనే ఎన్నో వ్యాధులకు గురవుతారు. సింథటిక్ పాల వల్ల కళ్లకూ, కాలేయానికీ ప్రమాదం. రసాయన పరీక్షలతో సింథటిక్ పాలను గుర్తించే ప్రక్రియలు ⇒పాలలో యూరియా కలిసి ఉంటే 5 ఎమ్ఎల్ శాంపిల్ను తీసుకుని దానికి 5 ఎమ్ఎల్. పారాడైమిథైల్ అమైనో బెంజాల్డిహైడ్ కలిపితే ఆ ద్రావణం పసుపురంగుకు మారితే ఆ పాలలో యూరియా ఉన్నట్లు అర్థం. ⇒ఐదు ఎమ్ఎల్ పాల శాంపిల్ను తీసుకుని, దానికి 0.1 ఎమ్ఎల్ బ్రోమోక్రెజాల్ పర్పుల్ ద్రావణాన్ని కలపాలి... ఒకవేళ ఆ మిశ్రమం వంకాయ రంగుకు మారితే అందులో డిటర్జెంట్ ఉన్నట్లు అర్థం. ఒకవేళ అందులో డిటర్జెంట్ లేకపోయినా ఆ ద్రావణం వయొలెట్ రంగుకు మారుతుంది కానీ అది చాలా లేత వంకాయ రంగులో ఉంటుంది. ⇒రసాయన పరీక్షలు ఇంట్లో సాధ్యం కాకపోయినా ఇలా స్వాభావిక లక్షణాలను కొంతకాలం పాటు నిశితంగా గమనిస్తూ పై లక్షణాలను బట్టి మీ పాలు స్వాభావికమైనవో, సింథటిక్ పాలో తెలుసుకోండి. దానికి అనుగుణంగా ఆ పాలను కొనసాగించడమా లేదా బ్రాండ్ మార్చడమా అన్నది నిర్ణయించుకోండి. సింథటిక్ పాలలోని కాస్టిక్సోడాతో ప్రమాదాలివి... ⇒ హైబీపీ, గుండెజబ్బులు ఉన్నవారికి ఇందులో ఉండే సోడియమ్ స్లోపాయిజన్లా పని చేస్తుంది. ⇒నోరు, గొంతు, ఈసోఫేగస్, కడుపు వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఉండే మ్యూకస్ను దెబ్బతీస్తుంది. ⇒గాలి గొట్టాలను దెబ్బతీసి... ఊపిరి పీల్చే ప్రక్రియపై అవాంఛిత ప్రభావాలు చూపుతుంది. ⇒కొందరిలో ఈ సింథటిక్ పాలు తాగగానే గొంతు వాపు వచ్చే అవకాశం ఉంది. ⇒నీళ్ల విరేచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంది. యూరియాతో అనర్థాలివి... ⇒కిడ్నీలపై యూరియా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపి వాటిని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆ యూరియాను తొలగించడానికి కిడ్నీలు చాలా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దాంతో నెఫ్రాన్లు దెబ్బతింటాయి. ⇒గుండె, కాలేయాలను దెబ్బతీస్తుంది. డిటర్జెంట్లతో హాని ఇలా... ⇒స్వల్పంగా లేదా తీవ్రంగానూ కడుపునొప్పి రావచ్చు. ⇒ఇందులోని క్షారగుణం వల్ల మనం తీసుకునే ప్రోటీన్లు దెబ్బతింటాయి. -
వేపసాయం!
వేప పిండిలో 2-3శాతం నత్రజని, 1శాతం భాస్వరం, 1.4 పొటాష్ పోషకాలుంటాయి. బాగా మాగి నేల రాలిన పండ్లను సేకరించి గింజల్ని వేరుచేసి ఎండబెట్టి నిల్వ చేసుకుని కషాయం తీసిన తర్వాత, శుద్ధి చేసిన వేప నూనె, బూజులేని వేప పిండిని సస్యరక్షణలో వాడుకోవచ్చు. వర్షాధార ప్రాంతాల్లోని వేప గింజల్లో అజాడిరాక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల చీడపీడల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. గింజలతో కషాయం తయారీ మంచి వేపకాయలను సేకరించి, కాయలపై పొట్టు, తీసి, గింజలను ఎండబెట్టి దాచుకోవాలి. అవసరమైనప్పుడు వీటిని నలగగొట్టి నీటిలో 1,2 రో జులు నానబెట్టి వడబోసి పైర్లపై స్ప్రే చేసుకోవాలి. ఉదాహరణకు 10కిలోల వేప గింజలను నలగ గొట్టి లేదా గ్రైండర్లో రుబ్బి 5, 6 లీటర్ల నీటిలో 1, 2రోజులు నానబెట్టి గుడ్డతో వడబోసి 200లీటర్ల నీటిలో కలిపి ద్రావకాన్ని తయారుచేసుకుని ఎకరం చేనుపై స్ప్రే చేస్తే చీడపీడలను నివారించవచ్చు. ఒకవేళ కాయల నుంచి గింజలను తీయడం కుదరనపుడు 20కిలోల వేప వేపకాయలను వాడుకొని పైన పేర్కొన్న విధంగా ద్రావణాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. లాభాలు... సాగులో వేప పిండిని వాడటం వల్ల వేరు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. 150 నుంచి 200కిలోల వేప పిండిని ఎకరం విస్తీర్ణంలో దమ్ములో వేస్తే వరిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడును అరికట్టవచ్చు. వేప మందును చల్లితే పురుగులు ఆహారాన్ని తీసుకోలేవు. ఆకలితో శుష్కించి మరణిస్తాయి. వేప మందులు వికర్షకాలుగా పనిచేస్తాయి. పురుగుల్లో గుడ్లు పెట్టే శక్తి సన్నగిల్లుతుంది. గుడ్లు పొదగవు. లార్వా దశ ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది. పురుగు సంతతి పెరగదు. మేలు చేసే సహజక్రిమి శత్రువులు, పరాన్న జీవులకు ఎలాంటి హానీ ఉండదు. ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లుకోవచ్చు. వేప ఉత్పత్తులను ఎప్పుడు చల్లాలి..? పైరు విత్తిన 15, 30, 40 రోజుల్లో చల్లుకోవాలి. రెక్కల పురుగు దశ, గుడ్డు దశ, మొదటి లార్వా దశల్లో చల్లితేనే వేప నూనె సమర్థవంతంగా పురుగులను నివారిస్తుంది. పెరిగిన పురుగులపై వేప నూనె ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. సాయంత్రం పూట పొలంలో ఎగిరే రెక్కల పురుగులు కనిపించినపుడు, ఆకులపై గుడ్ల సముదాయాన్ని గమనించినపుడు మరోసారి, పిల్ల లార్వా దశలో ఉన్నపుడు ఇంకోసారి.. ఇలా మూడుసార్లు వేప నూనె చల్లితే పురుగులను నివారించవచ్చు. వేప నూనెను చల్లితే పురుగు చావదు కానీ పైరును ఆశించదు. ఇతర ప్రయోజనాలు... వేప పిండిని యూరియాలో కలిపి వాడితే 50శాతం యూరియాను ఆదా చేయవచ్చు. 2-3 కిలోల వేప నూనెను 50కిలోల యూరియాలో బాగా కలిపి 12గంటల తర్వాత పైరుపై చల్లితే యూరియా త్వరగా కరిగిపోకుండా చాలా రోజులపాటు చేనుకు అందుతుంది. చేపలు, రొయ్యల చెరువుల్లో వేపపిండి, వేపనూనె వాడితే వాటికి వచ్చే వ్యాధులు తగ్గుతాయి. నాచు పెరగదు. వారానికోసారి వేపనూనె చల్లి ఇంట్లో, దొడ్డిలో, కోళ్లఫారాల్లో దోమలు, గోమార్లు, నల్లుల బెడదలను నివారించుకోవచ్చు. నకిలీలపై దృష్టి పెట్టండి... ఎంపిక చేసిన చెట్టు నుంచి నాణ్యమైన వేప కాయలను సేకరించుకొని, గింజలు తీసేసి ఎండబెట్టి రైతులే నిల్వ చేసుకొని అవసరమున్నప్పుడు పైర్లపై వాడుకోవడం ఉత్తమం. ఇప్పటికే వాణిజ్యపరంగా ఎన్నో రకాల వేప సంబంధ ఉత్పత్తులు అనేక పేర్లతో మార్కెట్లోకి వచ్చాయి. నకిలీలపై దృష్టిసారించి నాణ్యతను గమనించి వాడుకోవాలి. -
ఎరువు..బరువు
దర్శి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు తక్కువ ధరలకు పంపిణీ చేయాల్సిన ఎరువులను ఎక్కువ మొత్తాలకు అమ్ముకుని లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే సొసైటీ అధ్యక్షులు కావడంతో వారి ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నారు. తూర్పువెంకటాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ఇప్పటి వరకు 700 టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. వీటిలో కొద్దో గొప్పో మాత్రమే రైతులకివ్వగా.. మిగతా మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలించారు. 50 కిలోల యూరియా బస్తా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం రూ. 298లకే అమ్మాలి. అయితే తూర్పువెంకటాపురం సొసైటీలో బిల్లు మాత్రం రూ.298లు రాసి రూ.320 తీసుకుంటున్నారు. మరో రూ.4 కూలి ఖర్చుల కింద తీసుకుంటున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే ఇష్టమైతే తీసుకోండి..లేకుంటే వెళ్లిపోండి అని తెగేసి చెబుతున్నారు. లేదంటే సొసైటీలో స్టాక్ లేదని..బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచుతున్నారు. బ్లాక్ మార్కెట్లో బస్తాకు రూ.100 నుంచి రూ.150 వరకు అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయలేక..సొసైటీలో ఎరువులు సరిగా అందించక రైతులు విలవిల్లాడుతున్నారు. కొందరు రైతులు తిరగబడి ఎరువులు ఎందుకు ఇవ్వరని సొసైటీ అధ్యక్షురాలి భర్త పణిదపు వెంకటరామయ్యను మంగళవారం నిలదీయగా..ఆయన మౌనం వహిం చారు. వెంకట రామయ్య టీడీపీ నాయకుడు కావడంతో అధికారులు కూడా ఆయనకే మద్దతు తెలుపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఏడీ మాలకొండారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ఎరువులు నిల్వ చేసుకునేందుకు దర్శిలో ఎక్కువ అద్దె చెల్లించి గోడౌన్ తీసుకోవడంతో పది రూపాయలు ఎక్కువ అమ్ముకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చింద ని, ఇక్కడకు వచ్చాక రూ.22 ఎక్కువ అమ్ముతున్నట్లు రైతులు తెలిపారని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిందిగా సొసైటీ అధ్యక్షురాలి భర్త పణిదపు వెంకట్రామయ్యను ఆదేశించామన్నారు. -
‘అనగాని' ఇదేందయ్యా !
ఓ వైపు ప్రకృతి..మరో వైపు టీడీపీ పాలకులు రైతులను కష్టాల పాలుజేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు లేక ఆలస్యంగా సాగు చేపట్టిన రైతు అడుగడుగునా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. తీరా పంట పక్వానికి చేరుతున్న దశలో యూరియా లభ్యంకాక ఆందోళనకు గురవుతున్నాడు. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన సహకార పరపతి సంఘాలు సైతం ప్రజాప్రతినిధుల పంచన చేరి రైతులను వంచన చేస్తున్నాయి. రైతులకు అందించాల్సిన యూరియా బస్తాలను దాచేస్తున్నాయి. ఎరువు కోసం వెళ్లిన రైతులకు ఒట్టి చేతులు చూపుతున్నాయి. ఓ చోటైతే ఏకంగా.. ఎమ్మెల్యేగారి కోసమే లోడు తెచ్చాం... మీరిక వెళ్లండంటూ యూరి యా కోసం క్యూలో నిలుచున్న రైతులను సొసైటీ అధ్యక్షుడు కసురుకున్న సంఘటన బుధవారం ఇసుకపల్లిలో చోటు చేసుకుంది. రైతులను కాదని యూరియా బస్తాలను ఏం చేసుకుంటారో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమాధానం చెప్పాలి..! - రేపల్లె రేపల్లె: టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రేపల్లె. ఇసుకపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కూడా పట్టణ పరిధిలోనే ఉంటుంది. బుధవారం ఉదయం యూరియా వచ్చిందన్న కబురు అందడంతో రైతులంతా సొసైటీ వద్దకు చేరుకున్నారు. అయితే సొసైటీ అధ్యక్షుడు దాసరి నాగరాజు మాటలు రైతులను బాధించాయి.‘ఎమ్మెల్యేగారికి ఒక లోడు, రైతులకు ఒక లోడు అందిస్తున్నాం. ప్రస్తుతం ఒక్క బస్తా కూడా యూరియా లేదు. మీరు గొడవ చేస్తే యూరియా తెప్పించను’ ఇలా రైతులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి యూరియా కేటాయించటం ఏంటి, ఇంతకు ముందు ఇలా జరగలేదుగదా, ఎరువుల విషయంలో రాజకీయాలేంటి, ఉన్న లోడు(400 బస్తాలు) అందించాలని రైతులు ఎంత కోరినా సొసైటీ అధ్యక్షుడు అంగీకరించకపోగా ‘యూరియా తెప్పించను’ అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నా ఫలితం లేకపోవటంతో ‘అనగాని ఇదేందయ్యా’ అనుకుంటూ రైతులు వెనుతిరిగారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా యూరియాను ట్రాక్టర్లపై తరలించారు. డిమాండ్తో అధిక ధరలకు... యూరియాకు డిమాండ్ ఏర్పడటంతో బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జోరందుకున్నాయి. సొసైటీల నుంచి వచ్చిన యూరియానే బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పంట పక్వానికి చేరుతూ చివరి దశలో ఉన్న తరుణంలో యూరియా అందించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న రైతులు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తున్నారు. సొసైటీలలో రూ. 290కు లభించే యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో రూ. 330 నుంచి రూ. 360 వరకు చెపుతున్నారు. రైతుల కోసం సొసైటీలు తీసుకువస్తున్న యూరియాను ఎమ్మెల్యే పేరు చెప్పి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియాను రైతులకు సక్రమంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. యూరియూ పంపిణీలోనూ రాజకీయూలా..? ఎన్నడూ లేనివిధంగా యూరియా అందించడంలో రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేయడం సరైన విధానం కాదు. ఎమ్మెల్యేకి లోడు కేటాయిస్తున్నామని చెబుతూ యూరియాను తరలించడం ఏమిటి? రైతులకు యూరియా అందించడంలో ఇప్పటికైనా రాజకీయాలు మానుకుని సక్రమంగా పంపిణీ చేయాలి. - జి.శ్రీనివాస్, సొసైటీ డెరైక్టర్ 400 బస్తాలున్నా.. లేదంటారేం..? నాలుగు రోజులుగా యూరియా కోసం రావడం...ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడం... పంట చివరి దశలో యూరియా అందించకపోతే దిగుబడి తగ్గింది. సొసైటీలో 400 బస్తాలు ఉన్నా ఒక్క రైతుకు కూడా అందించకుండా యూరియాను ఎక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటికైనా యూరియా సక్రమంగా అందించాలి. - శ్రీను, రైతు, ఇసుకపల్లి -
యూరియా....అంతా మాయ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారింది. సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయినా యూరియా మాత్రం రైతుల దరికి చేరడం లేదు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు స్వామి భక్తి ప్రదర్శిస్తూ తెలుగుదేశం ఆధీనంలో ఉన్న సైటీలకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. దీంతో అవసరమైన రైతులకు యూరియా అందే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయ సాగు అంతంత మాత్రంగా ఉన్న సీజన్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాగు వర్షాభావ పరిస్థితుల వల్ల సగానికి పడిపోయిన సంగతి తెలిసిందే. వ్యవసాయ శాఖ అంచనాలతో చూసినా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అలాంటప్పుడు ఎరువులు అందుబాటులో ఉండటం సహజం. కానీ జిల్లాలో ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. పంటల సాగు తగ్గినా, రైతులకు అదనులో యూరియా దొరకడం లేదు. గత వారం రోజులుగా వరుణుడు కరుణిస్తున్నాడు. గత రెండు రోజులుగా జిల్లాలో సగటున 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. దీంతో పంటలను కాపాడుకోవడం కోసం రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ అవినీతి, ఎరువుల వ్యాపారుల దోపిడీతో రైతులకు అందని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు తొమ్మిది కంపెనీల నుంచి ఎరువులు సరఫరా అవుతాయి. రైల్వే ర్యాకుల ద్వారా వచ్చే ఎరువులు మాత్రమే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వెళ్తుండగా, రోడ్డు మార్గం గుండా వచ్చే ఎరువులకు లెక్క ఉండటం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు అడిటింగ్ చేసిన తర్వాతే రైతులకు ఎరువులు సరఫరా చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా జరుగుతోంది. ఒంగోలులో డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 25 నుంచి 30 రూపాయలు ఎక్కువకు డీలర్లకు ఇవ్వడంతో దానిపై 50 రూపాయల వరకూ వేసుకుని అమ్ముతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఒక్కో బస్తాపై 50 నుంచి వంద రూపాయల వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. మామూళ్ల మత్తులో కూరుకుపోయిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మరోవైపు అధికారులు తమ స్వామిభక్తిని ప్రదర్శిస్తూ సొసైటీలకు ఎరువుల కేటాయింపుల్లో పక్షపాతం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధ్యక్షులుగా ఉన్న సొసైటీలకు యూరియా కేటాయించకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్న సొసైటీలకు కేటాయిస్తున్నారు. దీనిపై నిరసన వెల్లువెత్తుతోంది. సహకార సంఘాలకు ప్రాధాన్యమిస్తూ ఎరువుల విక్రయాల కేటాయింపులు జరపాల్సిన వ్యవసాయ శాఖకు ఇవేమీ పట్టడం లేదు. జిల్లా వ్యవసాయ అధికారులను సంతృప్తి పరిచిన డీలర్లకు, అధికార పక్షానికి చెందిన డీలర్లకు మాత్రమే ఎరువులు అధికంగా కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీకి రెండు వేల రూపాయల వరకూ డీలర్లు చెల్లించుకోవాల్సి వస్తోందని సమాచారం. నవంబర్లో 16,786 బస్తాల యూరియా అవసరం కాగా అసలు ఎంత స్టాక్ ఉందో వ్యవసాయ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి. మరోవైపు యూరియా అక్రమాలపై డీలర్లు అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అయన వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులో మాట్లాడుతూ పద్దతి మార్చుకోకపోతే రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కురిచేడులో రైతుల పాట్లు గత నెల రోజులుగా యూరియా జిల్లాకు రాకపోవటంతో రైతులు తల్లడిల్లిపోయారు. సోమవారం మండలంలోని కురిచేడు సొసైటీకి ఒక్క లారీ నాగార్జున యూరియా రావటంతో రైతులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయటం అధికారులకు తలకుమించిన భారమైంది. మండలంలో 17 ఎరువుల కొట్లు,ఒక గ్రోమోర్ ఉన్నా మండల రైతులకు యూరియా అందించటంలో పూర్తిగా విఫలమయ్యాయి.దీంతో లారీ వచ్చిన సమయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేయాల్సి వచ్చింది. -
యూరియా ధరలకు రెక్కలు
అసలు ధర రూ.283.. రూ.400కు విక్రయాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు జిల్లాలో రైతులపై రూ.4 కోట్ల భారం చోద్యం చూస్తున్న అధికారులు మచిలీపట్నం/ చల్లపల్లి : హుదూద్ తుపాను దెబ్బకు యూరియా ధరలకు రెక్కలొచ్చాయి. యూరియాకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో బహిరంగంగానే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వ్యవసాయాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బస్తాకు రూ.100 అదనం ఈ ఏడాది జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో చెరుకు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఆరువేల ఎకరాల్లో పసుపు సాగును రైతులు చేపట్టారు. ఈ పంటలకు ఎరువుగా వాడేందుకు 1.20 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అధికారుల లెక్కల ప్రకారం వరికి ఎకరాకు 75 కిలోలు మాత్రమే వాడాల్సి ఉండగా, రైతులు 150 కిలోల వరకు వాడుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో వరి పంటకు 1.85 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుంది. ప్రస్తుతం మూడో కోటా, చిగురు కోటా వేసే పనిలో ఉన్నారు. ఈ రెండుసార్లు యూరియా చల్లేందుకు జిల్లా వ్యాప్తంగా 65 వేల టన్నుల యూరియా కావాల్సి ఉండగా ప్రస్తుతం కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీ ధర ప్రకారం యూరియా రూ.283కు, వేపనూనె కలిపిన యూరియా రూ.298కి అమ్మాల్సి ఉంది. హుదూద్ తుపాను వల్ల విశాఖపట్నంలో నిల్వ ఉంచిన సుమారు రెండు లక్షల టన్నుల యూరియా నీటిపాలవడంతో యూరియా కొరత ఏర్పడింది. దీనికితోడు అధికారులు సూచించిన దానికంటే రెంటింపు స్థాయిలో యూరియా వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్ల దివిసీమతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రూ.283కు అమ్మాల్సిన 50 కిలోల యూరియా బస్తాను రూ.400 వరకు వ్యాపారులు అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. యూరియాకు డిమాండ్ పెరగడం, కొరత ఏర్పడటంతో హోల్సేల్ వర్తకుల నుంచి రూ.283 విలువ గల 50 కిలోల యూరియా బస్తాను రూ.360కి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు. రవాణా చార్జీలు, ఎత్తుడు, దింపుడు కూలి, లాభాలు కలుపుకొని అంత రేటుకు అమ్మాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. ఏదేమైనా బస్తాకు రూ.100 అదనంగా చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారింది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా రైతులపై రూ.4 కోట్ల అదనపు భారం పడనుంది. బ్లాక్ మార్కెట్కు పీఏసీఎస్ ఎరువులు జిల్లాలో 425 పీఏసీఎస్లు ఉండగా వీటిలో 280 చోట్ల మాత్రమే ఎరువుల అమ్మకాలు సాగుతున్నాయి. వీటిలో చాలా పీఏసీఎస్లు రెండుసార్లకు సరిపడా మాత్రమే ఎరువులను నిల్వ ఉంచుకున్నాయి. మిగిలిన రెండు కోటాల ఎరువులను కొద్దిరోజుల నుంచి పీఏసీఎస్లకు రప్పించుకుంటున్నారు. దివిసీమలోని ఓ మండలంలో రెండురోజుల క్రితం రెండు సొసైటీలకు రెండేసి చొప్పున యూరియా లోళ్లు రాగా, యూరియాకు ఉన్న డిమాండ్తో వాటిని బస్తా రూ.320 చొప్పున రహస్యంగా బయట ఎరువుల షాపులకు అమ్ముకున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం యూరియాకు బాగా డిమాండ్ పెరగడం, కొరత ఉండటంతో చాలాచోట్ల పీఏసీఎస్లలో ఇదే తరహా వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి యూరియాను ఎమ్మార్పీ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొరత లేదు జిల్లాలో ఇటీవలే 3,400 టన్నుల యూరి యాను సరఫరా చే శాం. మరికొద్ది రోజుల్లో యూరియా ర్యాక్లు జిల్లాకు రానున్నాయి. ఎవరైనా యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఆయా మండలాల ఏవోలతో ఎప్పటికప్పుడు ఎరువుల విక్రయాలపై సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నాం. - నరసింహులు, వ్యవసాయ శాఖ జేడీ -
రబీ..రెడీ
సాక్షి, సంగారెడ్డి: ఖరీఫ్ సీజన్ ముగియటంతో వ్యవసాయశాఖ రబీకి సిద్ధమవుతోంది. రబీ సీజన్లో పంటలకు సాగుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించింది. అలాగే రబీలో అవసరమయ్యే విత్తనాలు, యూరియా సేకరణపై వ్యవసాయశాఖ యంత్రాంగం దృష్టి సారించింది. రైతులకు సకాలంలో యూరియా, విత్తనాలు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు చేపడుతోంది. మరోవైపు బ్యాంకర్లు కూ డా రబీలో రూ.573 కోట్ల రుణాలు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు రబీ రుణాల పంపిణీకి సంబంధించి నవంబర్ మొదటివారంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. పెరగనున్న సాగు విస్తీర్ణం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ రైతన్నలకు కలిసిరాలేదు. దీంతో రైతులు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత రబీ సీజన్లోజిల్లాలో 1.27 వేల హెక్టార్లలో రైతులు పంట సాగు చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో 1,30,962 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దీనికితోడు మరో 21,612 హెక్టార్లలో చెరుకు పంటను సాగయ్యే అవకాశం ఉంది. అలాగే 47 వేల హెక్టార్లలో వరి, 13 వేల హెక్టార్లలో జొన్న, 12 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 31 వేల హెక్టార్లలో శెనగ, 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు, మరో 20 వేల హెక్టార్లలో వేరుశెనగ, నువ్వులు, మిరప, ఉల్లిగడ్డ, గోధుమ పంటలను రైతులు సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రబీలో ప్రధానంగా రైతులు శెనగ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు శెనగ రైతులకు అవసరమైన విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించారు. విత్తనాలు, యూరియా సేకరణపై దృష్టి విత్తనాలు, యూరియా పంపిణీకి సంబంధించి ప్రణాళికను కూడా వ్యవసాయాధికారులు సిద్ధం చేశారు. సబ్సిడీపై విత్తనాల పంపిణీ, రైతులకు అవసరమైన యూరియా కోసం రాష్ట్ర అధికారులకు నివేదికలను అందజేశారు. రబీలో ప్రధానంగా శెనగ, వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు ఆయా పంటలకు సంబంధించి 48 వేల క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు సరఫరా చేయాల్సిందిగా రాష్ర్ట అధికారులను కోరారు. అలాగే రబీలో 81,444 టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రణాళికలో వెల్లడించారు. ఇదిలావుంటే రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈ దఫా పంటల సాగు కొంత ఆలస్యం కావచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వర్షాభావంతో ఖరీఫ్లో పంటల సాగు ఆలస్యమైనందున ప్రస్తుతం పొలాల్లో ఖరీఫ్ పంటలు అలాగే ఉన్నాయి. కోతలు పూరయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. దీనికితోడు వర్షాలు జాడలేకపోవడంంతో ఈ సారి రబీ సాగు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
పెట్టుబడి కొంత..లాభం కొండంత
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోయాయి. విత్తనాలు, క్రిమిసంహారక మందుల్లో ఏది మంచిదో, ఏది నకిలీదో తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. విచక్షణారహితంగా పురుగుమందులు వాడటం వల్ల ఆర్థికంగా భారమే తప్ప పెద్దగా ఫలితం ఉండని పరిస్థితి. ఆదీగాక దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది. మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యం తెలిసీ తెలియని విత్తనాలు వేయడం, అవి మొలకెత్తకపోవడం, ఒక వేళ మొలకెత్తినా కాపు సరిగా రాకపోవడం లాంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సాగు ఖర్చులు తగ్గించడానికి వివిధ రకాల రాయితీలను అందుబాటులో ఉంచింది. వాటిని సద్వినియోగం చేసుకుంటే రైతులు లాభాలు పొందవచ్చు. విత్తన శుద్ధి తప్పని సరి భూ సంరక్షణ, వ్యాధుల నివారణ చర్యలు తప్పకుండా పాటించాలి. సూటి ఎరువులు(యూరియా, దుక్కిలో సూపర్, విత్తిన తర్వాత పొటాష్) వాడాలి. సూక్ష్మధాతు లోపాలను కచ్చితంగా సవరించాలి. మూస పద్ధతి ఖర్చులకు స్వస్తి చెప్పి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగు మందులు వాడాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. ఖర్చు తగ్గించుకునే మార్గాలు రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులను వాటి మోతాదు మేరకే వాడాలి. భాస్వరం.. మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీన్ని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం లేకపోగా ఖర్చు పెరుగుతుంది. పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. వేపపిండి, యూరియా కలిపి వాడితే పోషకాలు వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందుతాయి. నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది. వ్యవసాయ భూముల్లో ఎక్కువగా జింక్, ఐరన్, బోరాన్, మెగ్నీషియం లోపాలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మిగిలిన ఎరువులను తరచుగా వాడటం వల్ల భూముల్లో ఎక్కువ మోతాదులో నిల్వ ఉన్నాయి. సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను అధిగమించేందుకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా సస్యరక్షణ మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిపార్సు చేసిన మందును, సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి. ఇవి చేయకండి కాంప్లెక్స్ ఎరువులు వాడితే మన భూముల్లో అంతగా ఫలితం ఉండదు. పైగా వాటి ధరలు కూడా ఎక్కువ. పిచికారీ చేసే మందులు మోతాదుకు మించి వాడటం మానుకోవాలి. ఒక ఎకరాకు సిఫార్సు చేసిన మందుకు ఇష్టారీతిగా నీటిని కలపకూడదు. 200 లీటర్ల నీటిని వాడటం మంచిది. పురుగుమందులు, వ్యాధి మందులు కలిపి (ఉదా : ప్రాఫినోపాస్-ఎక్సాకొనగోట)వాడకూడదు. ఒకేసారి రెండు మూడు మందులను మిశ్రమంగా వాడరాదు(ఉదా : ఇమిడాక్లోఫిడ్, అసిటేట్ను వరి, వేరుశనగలో కలిపి వాడుతుంటారు). ఇలా కలిపి వినియోగిస్తే రైతుకు ఖర్చు పెరగడమేకాక మందులు సరిగా పనిచేయవు. ఒక్కోసారి పంటను నాశనం చేస్తాయి. -
గట్లపై విత్తు.. ‘శత్రు’ చిత్తు
చేలల్లో గట్ల వెంబడి కంది నాటితే వరికి హాని కల్గించే శత్రు పురుగులైన ఆకుముడత, కాండం తొలుచు పురుగులు, సుడిదోమను నివారించవచ్చు. రైతుకు మిత్రులైన సాలీడు, తూనీగ, అక్షింతల పురుగులు కంది మొక్కలపై నివాసం ఉంటాయి. ఇవి శత్రు పురుగులను నాశనం చేసి పంటను రక్షించేందుకు ఉపయోగపడతాయి. వరికి తీవ్ర నష్టం కలిగించే అగ్గితెగులు, పొడతెగులు, ఆకుముడత ఎండు తెగుళ్లకు కారణమైన సిద్ద బీజాలు (వ్యాధి కారకాలు) ఒక చోట నుంచి మరోచోటకు గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా కంది నిరోధిస్తుంది. చేలగట్ల వెంట కంది నాటడం వల్ల ప్రధాన పంటకు అవసరమైన నీరు, ఎరువుల విషయంలో ఎటువంటి నష్టం ఉండదు. గాలి వానలకు ప్రధాన పంటను కాపాడే కవచంలా కంది మొక్కలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పొలం గట్లపై మొలిచే గడ్ది ద్వారా పంటకు నష్టం కల్గించే కీటకాల నివారణకు కూడా కింది మొక్కలు పనికొస్తాయి. దీంతో పాటు గట్లను పటిష్టంగా ఉంచి ఎలుకలు కన్నాలు పెట్టకుండా వీటి వే రు వ్యవస్థ నివారిస్తుంది. కంది పంట పక్షి స్థావరాలకు ఆవాసంగా ఉండటం వల్ల పంటను పాడు చేసే క్రిములను పక్షులు తినేస్తాయి. దీని వల్ల పంటకు రక్షణ కలుగుతుంది. ఎకరం వరి చేలోని గట్లపై విత్తడానికి 100గ్రాముల కంది విత్తనం సరిపోతుంది. దీనిపై సుమారు 10 నుంచి 15కేజీల వరకు కంది దిగుబడి వస్తుంది. ఇది రైతు కుటుంబ అవసరాలకు సరిపోతుంది. అమ్ముకుంటే మార్కెట్ ధరను బట్టి ఎంతోకొంత ఆదాయం వస్తుంది. ప్రస్తుతం భూచేతన పథకంలో భాగంగా ఎంపికి చేసిన గ్రామాల్లో ఎకరానికి 100 గ్రాముల చొప్పున కంది విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందజేస్తున్నాం. 40 శాతం యూరియా ఆదా.. వరి చేలగట్ల వెంబడి కందిని సాగు చేయడం వల్ల 32నుంచి 40శాతం వరకు నత్రజని ఎరువును ఆదాచేయవచ్చు. కందిని ఏక పంటగా వేయడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. భూమిలో కంది వేరు బుడిపెలపై ‘రైజోబియం’అనే బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టిరియా గాలి నుంచి నత్రజనిని గ్రహించి భూమికి అందిస్తుంది. దీనివల్ల భూమిలో న త్రజని స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా భూ భౌతిక రసాయన స్థితిగతులు మెరుగుపడతాయి. తద్వారా నత్రజని (యూరియా) వినియోగం తగ్గించుకోవచ్చు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే 88866 13853 సంప్రదించవచ్చు. అంతర పంటతోనూ లాభాలు.. కందిని తోటలు, ఇతర పంటల్లో అంతర పంటగా సాగుచేయడం ద్వారా అధిక ఆదాయం పొందవ చ్చు. 1:7 నిష్పత్తిలో కంది, వేరుశెనగ, పెసర, మినుము, సోయా, సాగు చేయవచ్చు.1:2 నిష్పత్తిలో కంది మొక్కజొన్న, జొన్న కూడా సాగు చేయవచ్చు. ఈ విధంగా అంతరపంటగా కంది వేస్తే భూసారం పెరుగుతుంది. -
యూరియా...మాఫియా
సాక్షి, ఒంగోలు: ఎరువుల విక్రయాల బ్లాక్మార్కెట్ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. యూరియా బస్తాలను అక్రమంగా నిల్వ చేస్తూ దొంగచాటు విక్రయాలకు కొందరు పాల్పడటంపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బ్లాక్మార్కెట్లో ఎరువుల విక్రయాల్ని అరికట్టేందుకు వ్యవసాయ శాఖకు చెందిన యంత్రాంగం, ప్రత్యేక తనిఖీ బృందాలు, విజిలెన్స్ అధికారులు వరుస దాడులకు సిద్ధపడ్డాయి. దీంతో డీలర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. ఎమ్మార్పీ ధరకే యూరియా బస్తాలను అమ్ముకోలేని కొందరు డీలర్లు అసలు నిల్వల్నే తెప్పించకుండా మిన్నకుంటున్నారు. మరికొందరేమో తమకు పరిచయమున్న రైతులకే విక్రయిస్తున్నారు. కంపెనీలు రవాణా చార్జీలను రిటైల్ డీలర్లపైనే మోపడంతో, లింకు ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే యూరియా సరఫరా చేస్తామనడంతో డీలర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలో ఎరువుల కొరతను నివారించి రైతులందరికీ సకాలంలో వాటిని అందించాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా బఫర్స్టాక్ను మార్క్ఫెడ్ గోడౌన్లో నిల్వచేశారు. ఇప్పటికే జిల్లాలో రైతులకు అవసరమైన 9 వేల క్వింటాళ్ల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటిని సకాలంలో సొసైటీలకు పంపి రైతులకు అందజేయడంలో ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో ఎరువులు వినియోగానికి పనికిరాకుండా వృథా అవుతున్నాయి. ఇటీవల విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో విభిన్న ప్రాంతాల్లో 46 బస్తాల యూరియా పొడిగా మారినట్లు గుర్తించారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే.. గత ఏడాది నిల్వలు పాడయ్యాయని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఎరువులు కొరత లేకుండా చూడాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎరువుల విక్రయాల్లో సొసైటీలు సైతం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం రైతులకు శాపంగా మారింది. సొసైటీలు సక్రమంగా పనిచేస్తే జిల్లాలోని అన్ని మండలాల్లో కేంద్రాలు ఏర్పాటుచేసి ఎరువులు విక్రయిస్తే, ప్రయివేటు డీలర్ల హవాకు అడ్డుకట్ట పడేది. వీటితోపాటు సొసైటీలు లేని మండలాలు, పెద ్ద గ్రామాల్లో డీసీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు అందిస్తే కొరత నివారించవచ్చునని పలువురు రైతులు సూచిస్తున్నారు. అనధికార అమ్మకాలపై నిఘా శూన్యం జిల్లాలో రీటైల్ ఎరువుల డీలర్లు ఎమ్మార్పీకి యూరియాను విక్రయిస్తే నష్టాలు వస్తాయని, అదే సమయంలో ఎమ్మార్పీకంటే అదనంగా అమ్మితే దాడుల్లో పట్టుబడతామని భావించి కొత్తమార్గాల్ని అన్వేషిస్తున్నారు. కంపెనీ ఎమ్మార్పీ ధర ఒక్కో బస్తా రూ.285కు అందజేయాల్సి ఉంది. అయితే, రిటైల్ డీలర్ వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తమకు తెలిసిన రైతులకే ఒక్కొక్కరి పేరుతో 20 నుంచి 30 బస్తాల యూరియాకు బిల్లులు రాసి గోప్యంగా నిల్వలు దాచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల ఇళ్లల్లోనే బస్తాలను నిల్వ పెడుతున్నారు. కొత్తవారు యూరియా కొనుగోలుకు వస్తే స్టాక్ లేదంటూ వెనక్కితిప్పి పంపుతున్నారు. రెగ్యులర్గా వచ్చే రైతులు, ముఖ పరిచయం ఉన్నవారికి మాత్రమే బస్తా రూ.350 నుంచి రూ.370 వరకు విక్రయించి రైతుల ఇళ్లనుంచి సరఫరా చేస్తున్నారు. అద్దంకిలో ఒక డీలర్ 450 బస్తాల యూరియాను తొమ్మిదిమంది రైతుల పేర్లతో బిల్లులు రాసి గోడౌన్లో నిల్వచేశారు. దీనిపై సమాచారమున్న అధికారులు దాడులకు సిద్ధపడగా, స్థానిక అధికారపార్టీ నేతల వత్తిళ్ల నేపథ్యంలో వెనుకంజవేసినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగతాచోట్ల డీలర్లు జాగ్రత్తపడ్డారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో జిల్లాలో రెండుప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలు వెలుగులోకొచ్చాయి. గిట్టుబాటు లేకనే అధిక దరలు.. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా ఎమ్మార్పీకి అమ్మితే నష్టపోవాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో సహకార సంఘాలు క్రియాశీలకంగా నడవకపోవడం, ప్రయివేటు డీలర్లు యూరియాను తెప్పించకపోవడంతో రైతులు ఇతరప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో కొందరు వ్యాపారులు అనుమతులు లేకుండానే ఎరువులు విక్రయిస్తున్నారు. కనిగిరి, మార్కాపురంలోని తొమ్మిది దుకాణాల యాజమాన్యాలు అనుమతిలేకుండానే పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో దుకాణాలకు ఎరువులు సొసైటీల నుంచి వచ్చినట్లు తేలిపోయింది. దాడుల్లో పట్టుబడుతున్న ఎరువుల్లో అత్యధికశాతం డీసీఎంఎస్ నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. సొసైటీలకు రవాణా చేసిన ఎరువులు అనుమతిలేని డీలర్ల వద్దకు ఎలా వచ్చాయనేది వ్యవసాయాధికారులు దృష్టిపెడితే..అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఎరువులు చేతులు మారడం వెనుక కొందరు అధికారులతోపాటు దళారులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులకు సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారన్న ఫిర్యాదులు విజిలెన్స్ అధికారులకు అందడమే పరిస్థితికి నిదర్శనం. ప్రభుత్వజోక్యంతో ఎమ్మార్పీ అమలు జిల్లాలో ప్రయివేటు డీలర్లకు ఎరువులు సరఫరా చేస్తున్న కంపెనీలు రవాణాచార్జీలను డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ డీలర్లపై భారం మోపుతున్నాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యరగొండపాలెం, దర్శి తదితర ప్రాంతాలకు బస్తాకు రూ.20వరకు రవాణాచార్జీ అవుతుంది. దీనికి తోడు లింకు ఉత్పత్తులు అంటగట్టడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో డీలర్లు బస్తాకు రూ.50 నుంచి రూ.70వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధిక ధరకు అమ్మలేని డీలర్లు యూరియా తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారు. లింకు ఉత్పత్తులు లేకుండా యూరియా సరఫరా చేయాలంటే డిస్ట్రిబ్యూటర్కు బస్తా రూ.10 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ జోక్యం చేసుకుని రవాణా చార్జీలను కంపెనీలే చెల్లించేలా వత్తిడి తెచ్చి, లింకు ఉత్పత్తులు అంటగట్టనప్పుడే జిల్లాలో ఎమ్మార్పీ అమలవుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
యూరియా.. మాఫియా
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వ్యవసాయ సాగు అంతంతమాత్రంగా ఉన్న సీజన్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.03 లక్షల హెక్టార్లు కాగా... సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 4.08 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. వ్యవసాయ శాఖ అంచనాలతో పోల్చితే... సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్లు తగ్గిందన్న మాట. ఇలాంటప్పుడు రైతులకు ఎరువులు అందుబాటులో ఉండడం సహజం. కానీ... జిల్లాలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పంటల సాగు తగ్గినా.... రైతులకు అదనులో యూరియా దొరకడంలేదు. మూడు వారాలుగా వరుణుడు కరుణిస్తున్నాడు. వేసిన పంటలు ఎండిపోకుండా వర్షాలు కురుస్తున్నాయి. పంట కీలక దశలో కురుస్తున్న వర్షాలు కావడంతో యూరియా వేసి పంటలను కాపాడుకోవాలని రైతులు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ అవినీతి, ఎరువుల వ్యాపారుల దోపిడీతో రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొంది. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని వ్యాపారులు ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీన్ని నివారించి రైతులకు అండగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారు. మొత్తంగా రైతు భారీగా దోపీడీకి గురవుతున్నాడు. కంపెనీలు అధికారికంగా ప్రకటించిన ధరల ప్రకారం సాధారణ యూరి యా బస్తాకు రూ.284 ఉంది. వేపనూనె కోటింగ్తో ఉండే ప్రత్యేకమైన యూరియా బస్తా రూ.298 పలుకుతోంది. వ్యవసాయ శాఖ అధికారుల మద్దతు తో వ్యాపారులు ఒక్కో యూరియా బస్తాను రూ.340పైనే విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యవసాయ అధికారుల సహకారం ఎక్కువగా ఉన్న మండలాల్లో యూరియా బస్తా ధర రూ.360 వరకు ఉంటోంది. ఇదేమని ఎవరైనా అడిగితే... ఎవరికి చెప్పుకుంటా వో చెప్పుకో అని వ్యాపారులు వారిని బెదిరిస్తున్నారు. దోపిడీని భరించలేని కొందరు రైతులు ధైర్యం చేసి వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే... వారు సదరు రైతు వివరాలను వ్యాపారులకు అందజేస్తున్నారు. దీంతో వ్యాపారులు ఆ రైతులకు ఎరువులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అదనులో యూరియా అవసరం కావడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధిక ధరలకు సంబంధించిన డబ్బులను పలువురు వ్యాపారులు, వ్యవసాయ శాఖ అధికారులు వాటాలుగా పంచుకుంటున్నారు. వ్యవసాయ శాఖపై విమర్శలు కంపెనీల నుంచి వచ్చే యూరియాకు సంబంధించి డీలర్లకు కేటాయింపు, సరఫరా, రవాణా... ఇలా అన్నింట్లోనూ వ్యవసాయ శాఖ అధికారుల అవినీతి వల్ల జిల్లాలో రైతులకు సమస్యలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ వ్యాపారులు, సహకార సంఘాలు కలిపి జిల్లాలో 920 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎరువుల విక్రయ కేటాయింపులు జరపాల్సిన వ్యవసాయ శాఖకు ఇదేమీ పట్టడం లేదు. జిల్లాలో ఎరువుల కేటాయింపు పూర్తిగా అక్రమాలమయంగా మారిందని డీలర్లే ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులను సంతృప్తి పరిచిన డీలర్లకే ఎరువులు అధికంగా కేటాయిస్తున్నారని వీరు చెబుతున్నారు. లారీకి రూ.2 వేల వరకు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. అసలే ఎరువుల కంపెనీలు రవాణా చార్జీలు ఇవ్వడంలేదని, అధికారులకు అదనంగా ఇవ్వాల్సి రావడంతో రైతులకు ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తోం దని అంటున్నారు. డీలర్ల వాదన ఎలా ఉన్నా... రైతులు మాత్రం సాధారణ పరిస్థితుల్లోనే ఒక్కో బస్తాకు రూ.320కి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అండర్బ్రిడ్జ్ ప్రాంతంలోని ఆరుగురు బడా డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి జిల్లా లో యూరియా మాఫియాగా తయారైనట్లు గ్రామీణ డీలర్లు ఆరోపిస్తున్నారు. కాగా, కంపెనీల నుంచి వచ్చే యూరియాను బడా డీలర్లు నేరుగా తమ పేరిట కాకుండా... తమ పరిధిలో ఉండే గ్రామీణ డీలర్ల పేరిట అన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎమ్మర్పీ కంటే ఎక్కువ ధరతో అదే డీలర్లకు ఇస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని డీలర్లు ఇంకా ధర పెంచుతున్నారు. అలాగే నగరంలో ఉండే డీలర్లు వేర్వేరు పేర్లతో మూడు,నాలుగు డీలర్షిప్లు తీసుకున్నారు. యూరియా లోడ్ రాగానే వాటని రిటేల్ డీలర్లకు ఎక్కువ ధరకు ఇచ్చి రైతులను దోపిడీ చేస్తున్నారు. జిల్లాకు వచ్చే ఎరువులను ముఖ్యంగా యూరియాను ఎక్కువ శాతం సహకార సంఘాలకు కేటాయించి... అధికారుల పర్యవేక్షణ పెంచితేనే రైతులు దోపిడీకి గురికాకుండా ఉంటారు. ఖరీఫ్ సీజన్ ఆఖరులో అయినా కలెక్టర్ జి.కిషన్ దీనిపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. -
తెలంగాణలో యూరియా కొరత వాస్తవమే
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ప్రతి రైతుకు ఉన్న రుణంలో 25 శాతం ప్రభుత్వం... బ్యాంకర్లకు చెల్లిస్తుందన్నారు. తెలంగాణ జిల్లాల్లో యూరియా కొరత ఉన్నమాట వాస్తవమేనని పోచారం అంగీకరించారు. వర్షాలు బాగా పడటం వల్ల యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని....అయినా రైతులు భయపడాల్సిన అవసరం లేదని పోచారం అన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
యూరియా కేటాయింపులో పక్షపాతం
రాయచూరు టౌన్: జిల్లా రైతులకు అవసరమైన యూరియా కేటాయింపులో పాలకులు చూపుతున్న పక్షపాతంపై పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల్లో ఇప్పటి వరకు 55 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే విడుదలైంది. నెలరోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల ఫలితంగా ఉన్నఫళంగా యూరియాకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ఎదుట రైతులు రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. జిల్లాకు వచ్చిన 55 వేల టన్నుల ఎరువుల్లో సగం బీఎస్ఎన్ఎస్ ద్వారాను, మిగిలిన సగం ఎరువుల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లా, తాలూకా, ఫిర్కాకేంద్రాల్లో పక్షం రోజులు గడిచినా రైతులకు యూరియా దొరకడంలేదు. దీంతో దెబ్బతింటున్న తమ పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం 8 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రాగా, మరో రెండు రోజుల్లో 1500 మెట్రిక్ టన్నులు రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ విషయమై జిల్లాధికారి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ మేరకు ఓ లేఖద్వార పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా కొప్పళకు మాత్రం కేటాయించిన 43వేల మెట్రిక్ టన్నులకన్నా అధికంగా ఇప్పటి వరకు 54 వేల టన్నులు విడుదల చేశారు. అంటే ఆ జిల్లాకు కేటాయించిన దానికంటే 11వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఆ జిల్లాకు లభించింది. కేంద్రం, రాష్ట్రంలో వే ర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉండడం వల్లే ఇలా జరుగుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. కొప్పళ జిల్లా ఎంపీ బీజేపీ నాయకుడు కాగా, రాయచూరు ఎంపీ కాంగ్రెస్ అన్న విషయం తెలిసిందే. -
రైతన్నకు ఎరువు కష్టం
-
రైతన్నకు ఎరువు కష్టం
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: కరువు పరిస్థితుల మధ్య కురిసిన వర్షాలతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న తెలంగాణ రైతన్నకు మరో కష్టం వచ్చి పడింది. సరిగ్గా నాట్లు వేసే సమయంలో తీవ్ర ఎరువుల కొరత అన్నదాతను కన్నీరు పెట్టిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, డీలర్ల తెంపరితనం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. డిమాండ్కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచటంలో సర్కారుకు ముందు చూపు కొరవడటం యూరియా కొరతకు కారణమైంది. దీనికితోడు అదనులో ఎరువు తప్పనిసరి కావడాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఒక్కో యూరియా బస్తాపై రూ. 120 వరకు అధికంగా వసూలు చేస్తూ.. పంటలు ఎండిపోయే దశలో వర్షాలు కురవడంతో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యం.. డిమాండ్కు తగ్గ కేటాయింపులు లేకపోవడం.. సీజన్ పూర్తయిపోయిందన్న నిర్లక్ష్యం వెరసి రాష్ట్రంలో యూరియాకు తీవ్ర కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం జిల్లాలకు వచ్చిన యూరియాలో కనీసం 50 శాతాన్ని సహకార సంఘాలకు కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు డీలర్లకు ఎక్కువ మొత్తం యూరియాను ఇస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించి రూ. 284 ఉండాల్సిన యూరియా బస్తా ధర రూ. 350 నుంచి రూ. 400 వరకు పెంచేసి రైతులను దోపిడీ చేస్తున్నారు. రవాణా చార్జీల పేరిట ఒక్కో బస్తాపై రూ. 120 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు. భారీ కొరత.. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెల వినియోగం కోసం 1.68 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటివరకు 1.42 లక్షల టన్నులను మాత్రమే వ్యవసాయశాఖ సరఫరా చేయగలిగింది. ఇంకా 25,820 టన్నుల కొరత ఉంది. ఏ జిల్లాలోనూ అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో లేవు. దీనికితోడు మరింతగా యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ నెలాఖరుకు ఖరీఫ్ ముగుస్తున్న తరుణంలో ఎరువును ఇంకెప్పుడు సరఫరా చేస్తారో తెలియడం లేదు. సరఫరా అయిన యూరియాను కూడా డీలర్లు అక్రమంగా నిల్వ చేసి కొరతను ఇంకా పెంచుతున్నారు. పీఏసీఎస్లకు, హాకా సంస్థలకు కేటాయిస్తున్న ఎరువులను వ్యాపారులు రైతుల పేర్లతో దారి మళ్లిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు అత్యవసరం.. తెలంగాణలో 7.53 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. 16.50 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వరి ప్రస్తుతం పిలక దశ ముగింపులో ఉండడంతో.. ఇప్పుడు యూరియా చల్లితేనే అధిక దిగుబడి వస్తుంది. ఇక పత్తి, మొక్కజొన్న పంటలకూ ప్రస్తుత దశలో యూరియా అవసరం. ప్రైవేటు ‘మార్క్’ఫెడ్! సాధారణంగా మార్క్ఫెడ్ నుంచి ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వ్యవసాయశాఖ యూరియాను రైతులకు సరఫరా చేస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో సహకార సంఘాలు మార్క్ఫెడ్కు బకాయి ఉండటంతో... వాటికి అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయడం లేదు. ప్రైవేటు డీలర్లకు మాత్రం ఎక్కువశాతం యూరియాను ఇస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మార్క్ఫెడ్కు రూ. 8 కోట్లు బకాయిపడ్డాయి. దీంతో అవసరమైన మేరకు యూరియా ఇవ్వడానికి మార్క్ఫెడ్ నిరాకరిస్తోంది. దీంతో ఆ జిల్లాలో బ్లాక్మార్కెట్లో యూరియా బస్తా రూ. 380 వరకు విక్రయిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవలే వరి నాట్లు వేయడంతో.. డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ వ్యవసాయశాఖ ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండటంతో.. రైతులు బ్లాక్మార్కెట్ను ఆశ్రయిస్తున్నారు. నాగర్కర్నూల్లో బస్తా యూరియాను ఏకంగా రూ. 400కు విక్రయిస్తున్నారు. ఇటీవల జడ్చర్ల, వనపర్తి, నాగర్కర్నూల్లలో విజిలెన్స్ దాడులు నిర్వహించింది. జడ్చర్లలో యూరియాను బ్లాక్మార్కెట్లో అమ్ముతున్న 6 షాపులను సీజ్ చేశారు. భారీగా యూరియా కొరత తలెత్తడంతో కల్వకుర్తికి వచ్చిన జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ వాహనంపైనా రైతులు దాడి చేయడానికి ప్రయత్నించారు. యూరియా కొరత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తమ పంటలు కాపాడుకునేందుకు సమీపంలోని మహారాష్ట్రకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేసుకుంటున్నారు. అధికారుల అండదండలు! యూరియా వంటి ఎరువులతో పాటు విత్తనాలు.. పురుగుమందులు... ఇలా రైతులకు సంబంధించి ఏ అవసరాన్నైనా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధిత ప్రభుత్వాధికారులు కూడా వీలయినంతగా తోడ్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల సహకారంతోనే డీలర్లు, వ్యాపారులు ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. లెసైన్స్ లేని కంపెనీల ఉత్పత్తులతో పాటు అనుమతి లేకుండా ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్ముతున్న విషయాలు తనిఖీల్లో వెలుగు చూస్తుం డడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నా యి. ప్రతి ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఉండే నిల్వలు, అమ్మకాలపై సంబంధిత ఏడీఏలకు సమాచారం ఉంటుంది. అయినా ఎరువులు, పురుగుమందులు బ్లాక్ మార్కెట్కు తరలుతూనే ఉన్నాయి. కొరత పెద్దగా లేదు.. రాష్ట్రంలో యూరియా కొరత పెద్దగా లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. రోజుకు 6 నుంచి 7 వేల టన్నుల యూరియా అవసరం అవుతుందని... ఇందులో వరి, పత్తికి యూరియా కావాలని, మొక్కజొన్న చివరి దశకు చేరినందున దానికి అవసరం లేదని చెప్పారు. మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో యూరియాకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. - బి.జనార్దన్రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ ‘బ్లాక్’ చేస్తే లెసైన్స్ రద్దు.. అనివార్య కారణాల వల్ల అక్కడక్కడా యూరియా సరఫరా ఆలస్యమవుతోందని, కొరత లేదని వ్యవసాయ శాఖ (ఎరువుల విభాగం) డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు చెప్పారు. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరకు యూరియాను విక్రయిస్తే సంబంధిత డీలర్ల లెసైన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమంగా దాచిపెట్టినట్లు రుజువైతే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని పేర్కొన్నారు. రైతులు తమకు ఫోన్ ద్వారాగానీ, ఎస్ఎంఎస్ ద్వారాగానీ ఫిర్యాదు చేస్తే దాడులు చేసి చర్య తీసుకుంటామని చెప్పారు. - కె.రాములు, వ్యవసాయశాఖ డిప్యూటీ డెరైక్టర్ (ఎరువుల విభాగం) -
యూరియా బ్లాక్
మిర్యాలగూడ : ఖరీఫ్ సీజన్లో ప్రస్తుతం అత్యవసరమైన యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి యూరియా బస్తాను రూ. 284కు విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని బస్తాను రూ. 360 రూపాయలకు విక్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటం, నాగార్జునసాగర్, ఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేయడంతో జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు వరిసాగు చేపట్టారు. అయితే అవసరం మేరకు యూరియా రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా కోసం నెల రోజుల నుంచి దుకాణాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దిగుమతి అయిన యూరియా 71వేల మెట్రిక్ టన్నులు సెప్టెంబర్ నెలాఖరు వరకు జిల్లాలో 95 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 71 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దిగుమతి చేసుకున్న యూరియాలో 70 శాతం పంపిణీ జరిగింది. మిగతా 30 శాతం యూరియా వ్యాపారుల వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలకు ఈ నెలాఖరులోగానే ఇంకా 24వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాకపోవడంతో వ్యాపారులు తమ వద్ద బ్లాక్ చేసిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పీఏసీఎస్లలో... ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ యూరియా లభించడం లేదు. మార్క్ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ లేకపోవడం వల్ల పీఎసీఎస్లకు పంపిణీ చేయడం లేదని తెలిసింది. జిల్లాలోని ఏ ఒక్క పీఏసీఎస్లో కూడా యూరియా లభిం చడం లేదు. దాంతో రైతులు పూర్తిగా వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తుంది. పీఏసీఎస్లకు యూరియా ఎక్కువ మొత్తంలో కేటాయించాలని డీసీసీబీ అధికారులు, పాలక మండలి కలెక్టర్ను కలిసి విన్నవించడం కూడా జరిగింది. మార్కఫెడ్కు 40 శాతమే.. జిల్లాకు చేరుతున్న యూరియాలో అధికారులు వ్యాపారులకే అదనపు కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. దిగుమతి చేసుకున్న యూరియాలో వ్యాపారులకు 60 శాతం, మార్క్ఫెడ్కు 40 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. పీఏసీఎస్లలో యూరియా బస్తాకు రూ. 284కు లభిస్తున్నందున రైతులు ఎక్కువగా అక్కడే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, పీఏసీఎస్లకు తక్కువ కోటా కేటాయించడం వల్ల రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు. -
మందు పిచికారీ చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటల్లో చీడపీడల బెడద ఎక్కువైంది. వీటి నివారణకు రైతులు మందులు పిచికారీ చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో మందులు పిచికారీ చేస్తూ స్వీయ రక్షణకు విస్మరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి చెందిన యువ రైతు లస్మన్న రక్షణ చర్యలు లేకుండా మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శనివారం నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్) ఝాడే రాజ్కుమార్(25) పత్తి పంటకు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ క్రమంలో మందు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. సూచనల మేరకే పిచికారీ చేయాలి.. పైరును ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన విధంగా పిచికారీ చేస్తే ఉపయోగం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. సూచనల మేరకు పిచికారీ చేయాలి. ఒక పంటకు పిచికారీ చేసిన మందు డబ్బాను మరో పంటకు ఇతర(కలుపు) మందును కలిపి పిచికారీ చేస్తే పంటలో ఏదైనా మార్పు, ఆకులు ముడుచుకుపోవడం కనిపిస్తే వెంటనే 20గ్రాముల యూరియా, 20గ్రాముల చక్కెర కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. మందులు అధికంగా వాడడం మూలంగా పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు తదితర మిత్ర పురుగులు మృత్యువాత పడుతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది. అవసరమైనవే.. పంటలకు పురుగు మందులు వాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన స్ప్రేలను జాగ్రత్తగా వాడాలి. పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్ల కంటే తైవాన్ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది. అవగాహన అవసరం పంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలుంటాయి. పుర్రె గుర్తుతో కూడిన ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని గ్రహించాలి. మందు ప్రభావానికి గురైతే.. పురుగుల మందు ప్రభావానికి గురైన వ్యక్తికి ముందు నోటిలోకి వేలు పెట్టి వాంతి చేయించాలి. మూర్ఛపోయిన సందర్భంలో మూతికి గాయం కాకుండా రెండు దవడల మధ్య గుడ్డను ఉంచాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో నెమ్మదిగా తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకవెళ్లాలి, అనారోగ్యానికి కారణమైన రసాయనాల వివరాలు డాక్టర్కు తెలపాలి. -
యూరియా అతిగా వేయొద్దు
పరిగి: ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో రైతులు పంటలకు ఎరువులు వేయటం ప్రారంభించారు. ఎరువుల వాడకంలో రైతుల అవగాహన లోపంతోనే యూరియా సమస్య తలెత్తుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో యూరియా ఎక్కువగా వాడుతుండటంతో కొరత కూడా ఏర్పడుతోంది. మోతాదు కంటే రెండింతల యూరియాను రైతులు వాడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూరియా అధికంగా వాడటం వల్ల మొక్క ఎక్కువ పచ్చగా, ఎక్కువ మెత్తగా మారుతుంది. దీంతో చీడపీడలు అధికమయ్యే అవకాశముంది. ఖర్చు పెరగటంతో పాటు పురుగుల మందులు కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. తద్వారా పెట్టుబడులు గణనీయంగా పెరిగి దిగుబడులపై, రైతులకు వచ్చే నికర లాభాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పంటలకు యూరియా వాడకంపై వ్యవసాయ శాఖ అధికారి రేణుకా చక్రవర్తిని సూచనలు అందజేశారు. భూముల సారాన్ని బట్టి ఎరువుల మోతాదు ఈ విధంగా ఉండాలని చెప్పారు. ఎంత మోతాదులో.. డీఏపీ ఎరువు ప్రతి ఎకరానికి 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పనిసరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందున ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగం ఉండదు. పత్తి పంటకు విత్తే కంటే ముందు మూడు నుంచి నాలుగు అంగుళాల లోతులో డీఏపీ వేయాలి. మిగతా అన్ని ఖరీప్ పంటలకు కూడా ఎకరానికి 50 కేజీలే వాడాలి. ఒకవేళ మొక్కలకు వేయాలంటే భూమిలో గోతులు తీసి వేయాలి. యూరియా ప్రతి ఎకరానికి వంద కిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందునా యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి విత్తిన 20 రోజుల నుంచి మూడు నుంచి నాలుగుసార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగుసార్లు వాడాలి. కలుపుతీసే సమయంలో తర్వాత 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు యూరియాను వరి పైరుకు వాడాల్సి ఉంటుంది. అయితే రైతులు వేసిన ప్రతిసారి ఎకరానికి రెండు బస్తాల యూరియా అంటే 100 కేజీలు ఒకేసారి వాడుతున్నారు. మొక్కలకు కనీసం ఐదు సెంటీమీటరల దూరంలో యూరియా వేయాల్సి ఉండగా రైతులకు అవగాహన లేమితో మొక్కకు ఆనుకుని వేస్తున్నారు. ఏ ఎరువును ఎందుకు ఉపయోగిస్తారు.. ఏ ఎరువును ఎందుకు ఉపయోగిస్తారనే విషయంలో అవగాహన రైతులకు లేకపోవటంతో అన్ని రకాల అవసరాలకు ధర తక్కువగా ఉన్న ఎరువునే ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడంతో ఆయా ఎరువులు పంటకు మేలు చేయటం అటుంచి కీడే ఎక్కువగా చేస్తున్నాయి. యూరియా వాడటం వల్ల పంట ఏపుగా, పచ్చగా వస్తుంది. మోతాదుకు మించి వాడితే తెగుళ్లు సోకే అవకాశం ఉంది. డీఏపీ వాడటం వల్ల వేర్లు, కొమ్మలు, రెమ్మలు ఎక్కువగా వస్తాయి. భాస్వరం వాడటం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఈ సంవత్స రం కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరగటం తో ఎరువులు సమపాళ్లలో వాడకుండా ధర తక్కువగా ఉన్న యూరియాను ఎక్కువగా వాడుతున్నారు. డీఏపీ ధర పెరగటమూ సమస్యకు కారణమే.. గత సంవత్సరం నుంచి డీఏపీ ధరలు విపరీతంగా పెరగటంతో యూరియాపై ప్రభావం చూపుతోంది. ధరలను తట్టుకోలేక డీఏపీ వేయాల్సిన పొలాలకు కూడా రైతులు యూరియానే వేస్తున్నారు. ఒక్క డీఏపీ బస్తాకు పెట్టే డబ్బులు పెడితే నాలుగు బస్తాల యూరియా వస్తుంది. దీంతో కొందరు రైతులు యూరియా అవసరం లేకున్నా, పొలానికి డీఏపీ అవసరం ఉన్నా యూరి యానే తీసుకెళ్లీ వేస్తుం డటం కూడా సమస్యకు కారణమవుతోంది. -
నో స్టాక్
రైతులను వేధిస్తున్న యూరియా కొరత కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు వరినాట్లు వేసే తరుణంలో స్టాకు లేదంటూ ప్రచారం జిల్లాకు 35.500 టన్నుల యూరియా అవసరం మచిలీపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎరువుల వ్యాపారుల లాభాపేక్ష రైతులకు మరో కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయి. వర్షాభావం, సాగునీటి విడుదలలో జాప్యం వల్ల ఆలస్యంగా అయినా వరినాట్లు పూర్తి చేస్తున్న రైతులను యూరియా కొరత రూపంలో మరో సమస్య వేధిస్తోంది. వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో గ్రామాల్లోని పీఏసీఎస్, పట్టణ ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాల వద్దకు యూరియా కోసం వెళితే స్టాకు లేదనే సమాధానం ఎదురవుతోంది. దీంతో రైతులు కంగుతింటున్నారు. అసలే వరినాట్లు ఆలస్యంగా వేస్తున్నామని, నాటు వేసే సమయంలో ఎకరానికి కనీసం 25 కిలోల యూరియా తప్పనిసరిగా అవసరమని రైతులు చెబుతున్నారు. మొక్కల ఎదుగుదలకు యూరియా కచ్చితంగా అవసరమని, ఈ తరుణంలో అందుబాటులో లేకపోతే నష్టాలు తప్పవని పలువురు వాపోతున్నారు. వ్యాపారుల మాయాజాలం! యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, అధిక ధరకు విక్రయించేందుకు పావులు కదుపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరినాట్లు నెల రోజుల పాటు ఆలస్యం కావడంతో మొక్కల ఎదుగుదల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తామని, కాబట్టి కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు. 35,500 టన్నులు అవసరం ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. సాగునీటి విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబరు నెలలోనూ వరి నాట్లు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4.40 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మరో రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని మండలాల్లో వరి నాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక్కసారిగా అన్ని ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకోవడంతో యూరియా వాడకం పెరిగింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తమ వద్ద యూరియా స్టాకు లేదని రైతులను తిప్పి పంపుతున్నారు. ఒకటి, రెండు రోజుల తర్వాత అధిక ధరకు యూరియా విక్రయాలు జరిపేందుకే వ్యాపారులు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించకుండా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 18వేల టన్నుల సరఫరా ఇప్పటి వరకు జిల్లాలోని పీఎసీఎస్లకు, హోల్సేల్ వ్యాపారులకు, రిటైల్వ్యారులకు 18వేల టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ నరసింహులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 35,500 టన్నుల యూరియా దిగుమతి కావాల్సి ఉందని ఆయన చెప్పారు. కొద్ది రోజుల్లో యూరియా వస్తుందని వివరించారు. -
రామగుండం యూరియా ప్లాంటుకు పూర్వవైభవం
న్యూఢిల్లీ: యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే చర్యలను కేంద్రం చేపట్టింది. మూతపడిన ప్రభుత్వ రంగ యూరియా కర్మాగారాల పునరుద్ధరణకు పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. రామగుండం, తాల్చేర్లలో మూతపడిన యూరియా ప్లాంట్లను రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పునరుద్ధరించే ప్రతిపాదనలను గత వందరోజుల్లో ఆమోదించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. సింద్రిలోని మరో మూతపడిన ప్లాంటు పునరుద్ధరణ యత్నాలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (బీవీఎఫ్సీఎల్) ప్రాంగణంలో యూరియా - అమోనియా ప్లాంటును కొత్తగా నిర్మించే యత్నాల్లో ఉన్నట్లు వివరించారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం గత దశాబ్దంలో ఇదే ప్రథమమని అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఒక్క ఎరువుల ప్లాంటును కూడా నిర్మించలేదని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేసేందుకు జగదీశ్పూర్-హల్దియా గ్యాస్ పైప్లైన్ నిర్మాణంపై పెట్రోలియం మంత్రితో ఇప్పటికే రెండుసార్లు చర్చించానని అనంత్కుమార్ వెల్లడించారు. -
యూరియా కొరత
ఇబ్బందుల్లో రైతులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయాలు సాక్షి, బళ్లారి : జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విస్తారంగా పంటలు సాగు చేయడంతో వ్యాపారులే ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యూరియా కొరత అధికంగా ఉందని చూపుతూ పలువురు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. తుంగభద్ర డ్యాం సకాలంలో నిండటంతో పాటు వర్షాలు బాగా కురవడంతో జిల్లా వ్యాప్తంగా సిరుగుప్ప, కంప్లి, హొస్పేట, హడగలి, హగరిబొమ్మనహళ్లి, సండూరు, బళ్లారి, కూడ్లిగి నియోజకవర్గాల పరిధిలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. ముఖ్యంగా తుంగభద్ర ఆయకట్టు కింద వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, సూర్యకాంతి తదితర పంటలు సాగు చేశారు. వరినాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. వరి నాట్లు వేసే ముందు, వేసిన తర్వాత 15 రోజుల లోపు యూరియా చల్లితే వరిపైరు బాగా ఏపుగా పెరుగుతుందనేది అధికారులు సూచన.. దీంతో యూరియాను కొనడానికి రైతులు ఎగబడుతున్నారు. అయితే యూరియా కొరత ఉందంటూ కొందరు ఫర్టిలైజర్ షాపు యజమానులు చెబుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తమ వద్ద యూరియాను బ్లాక్ మార్కెట్లో రైతులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పేద రైతులు యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా ఎంఆర్పీ ధర బస్తాకు రూ.275 నుంచి రూ.285లుగా ఉంది. డిమాండ్ను సొమ్ముచేసుకోడానికి ఫర్టిలైజర్ షాపు యజమానులు కొందరు సిండికేట్ అయి రూ.375లకు బస్తాను విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు వ్యాపారులు ముందస్తు ప్లాన్ చేసి యూరియాను పలు ప్రాంతాల్లో నిల్వ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారి రామణ్ణను వివరణ కోరగా యూరియా తీసుకునే రైతులు బిల్లులు వేసుకుని తీసుకోవాలన్నారు. ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులు వేయించుకోకుండా ఎరువులు తీసుకుంటే తామేమి చేయలేమన్నారు. యూరియా కొరత ఉన్నట్లు వ్యాపారులు సృష్టిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే తాము వెంటనే ఆయా రైతులకు యూరియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు ఎరువులు కొరత ఉంటే వెంటనే వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. -
ఎరువు.. కాకూడదు బరువు
ఇలా చేయండి లోతు దక్కుల వల్ల నేల గుల్లబారి, తేమను బాగా నిల్వ ఉంచుకుంటుంది. ఇలా చేస్తే వేసిన ఎరువు ఎక్కువ శాతం మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు వేసే ముందు తప్పనిసరిగా కలుపును నిర్మూలించాలి. అంతేగాక పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేయాలి. అన్ని పోషకాల్లో నత్రజని వృథా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరియాను వేపపిండితో లేక పలకలపై వేప నూనెతో కలిపి వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలై వృథా తగ్గుతుంది. యూరియాను కోల్తార్తో కలిపి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక కిలో కోల్తార్ను 2 లీటర్ల కిరోసిన్లో కలిపి.. దానిని రెండు బస్తాల యూరియాకు పట్టించి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. అర బస్తా యూరియాను ఒక బస్తా తడిపొడి మట్టితో కలిపి 24 గంటలు నీడలో ఉంచి, ఆ తర్వాత పొలంలో చల్లితే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎరువు వేసే పద్ధతులు సిఫార్సు మేరకు ఎరువులు వాడటమే కాదు.. సరైన పద్ధతిలో పొలానికి వేయాలి. సాధారణంగా ఎరువులు రెండు పద్ధతుల్లో వేస్తారు. వెదజల్లే పద్ధతి : మొక్కలు పొలం నిండా దగ్గర.. దగ్గరగా ఉండి వరుసల్లో సక్రమంగా లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మాగాణి వరికి ఇది చాలా అనువైన పద్ధతి. మొదళ్ల దగ్గర ఎరువు వేసే పద్ధతి మొదళ్ల వద్ద ఎరువు వేయడం వల్ల పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా చాలా వరకు తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉండి, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు.. గొర్రు, గుంటక లేదంటే చేతితో 2 అంగుళాల లోతులో పడేలా మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేయాలి. చేతితో చిన్నచిన్న గుంటలు తీసి వేసుకునేటప్పుడు ఎరువు వేసిన వెంటనే గుంటను మట్టితో కప్పేయాలి. పైరుపై పోషకాల పిచికారీ ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు నేలలో తగినంత తేమ లేనప్పుడు, సమస్యాత్మక నేలలకు పోషకాలు అందించడానికి, పోషక లోపం కనిపించిన పైర్లకు ఈ పద్ధతి ద్వారా పోషకాలు అందించవచ్చు. ధరలపై అవగాహన ఉండాలి ఎరువులు వేసే పద్ధతులు, వేయాల్సిన మోతాదు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. పోషకాల ధరలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయడం అంతే అవసరం. ప్రతి ఎరువు బస్తా మీద ఆ ఎరువులో ఉన్న పోషక విలువ శాతం స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే బస్తా మీద సూచించిన పోషక విలువల్లో సగం మాత్రమే ఆ బస్తా ఎరువులో ఉందని గమనించాలి. ఎందుకంటే సూచించిన పోషక శాతం 100 కిలోల రసాయన ఎరువుకు సంబంధించినది. -
యూరియా కష్టాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఆలస్యంగానైనా జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో కాల్వలకు నీళ్లు వదిలారు. వర్షాధారంతో పాటు నీటి ఆధారం కింద వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. యూరియా అవసరం బాగా పెరిగింది. ఒకవైపు వరి నాట్లు ముమ్మరంగా పడుతున్నందున రైతులు యూరియా కోసం వస్తున్నారు. మరోవైపు పత్తికి కూడా యూరియా వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. డిమాండ్కు తగిన విధంగా యూరియాను సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలం అవుతోంది. యూరియా కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో ప్రైవేటు డీలర్లు యూరియాను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వరినాట్లు వేసే సమయంలో ఎకరాకు కనీసం 50 కిలోల యూరియా వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలే సూచిస్తున్నారు. ఆగస్టు నెలలో జిల్లాకు 17050 టన్నుల యూరియా రావాల్సి ఉంది. 4 వేల టన్నులు ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలిపోవడంతో 10750 టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. రావాల్సిన దానిలో 6300 టన్నులు రాకపోవడం వల్లనే కొరత ఏర్పడింది. ఇటీవల వచ్చిన యూరియాను జిల్లాలోని ప్రైవేటు డీలర్లందరికి సరఫరా చేశారు. 50 కిలోల బస్తా ధర రూ.285 ఉండగా ప్రైవేటు డీలర్లు రవాణా చార్జీల పేరుతో రూ.350 వరకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొంతమంది డీలర్లు లారీల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నారు. వెల్దుర్తి, డోన్, నంద్యాల, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని తదితర ప్రాంతాల్లో యూరియా అమ్మకాలు బ్లాక్లోనే జరుగుతుండటం గమనార్హం. అడ్డూ అదుపు లేకుండా అధిక ధరలకు యూరియా అమ్ముతున్నా వ్యవసాయ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు మార్క్ఫెడ్ ద్వారా యూరియాతో పాటు ఇతర ఎరువులు కేటాయిస్తారు. వీటి ఎరువుల సరఫరాకు మార్క్ఫెడ్ రవాణా చార్జీలను కూడా భరిస్తుంది. కనుక విధిగా రూ.285 ప్రకారం యూరియా రైతులకు అమ్మాల్సి ఉంది. కానీ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో కూడా అధిక ధరలకు యూరియా విక్రయిస్తుండటం గమనార్హం. ఆగ్రో రైతు సేవ కేంద్రాల్లో బస్తాపై ఎమ్మార్పీ కంటే రూ.50 ఆపైనే ఎక్కువ ధర వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాధికారులు, ఏడీఏలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి యూరియా అమ్మకాలను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ ఆదేశించినా వ్యవసాయాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వ్యవసాయ శాఖ జిల్లాలో యూరియాకు అవసరం లేనప్పుడు భారీగా సరఫరా చేసింది. అవసరం ఉన్నప్పుడు సరఫరా చేయకుండా పక్క జిల్లాలకు మళ్లిస్తోంది. ఇప్పటికైనా డిమాండ్కు తగిన విధంగా యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉంది. -
డీలర్ల గుప్పిట్లో యూరియా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : యూరియా కేటాయింపుల్లో జిల్లా అధికార యంత్రాంగం జిమ్మిక్కులు చేస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేటు డీలర్లకు అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లాకు వచ్చిన యూరియాలో 50 శాతం నిల్వలను సహకార సంఘాలకు కేటాయించి వాటి ద్వారా విక్రయాలు చేపట్టాలి. అలా చేస్తేనే ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా చాలా మట్టుకు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ ప్రైవేటు డీలర్లతో వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా యూరియా నిల్వలను ప్రైవేటు డీలర్లకే కట్టబెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 సహకార సంఘాలున్నాయి. కానీ పాత బకాయిల పేరుతో 20 సహకార సంఘాలకు అధికారులు ఒక్క బస్తా కేటాయించలేదు. పైగా రైతుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్ యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్క్ఫెడ్కు కేటాయించిన నిల్వల నుంచి కూడా అధికారులు కొందరు ప్రైవేటు డీలర్లకే కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. తీవ్రమవుతున్న యూరియా కష్టాలు ఈ ఖరీఫ్ సీజన్లో 89,513 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ.. ప్రభుత్వం కేవలం 62,068 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. ఆగస్టుకు సంబంధించి 35,112 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరమని గుర్తించగా.. ఇప్పటివరకు 9,470 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. ఈ యూరియా నిల్వల్లో అధిక భాగం డీలర్ల గుప్పిట్లోకి చేరడంతో అన్నదాతల ఎరువు కష్టాలు తీవ్ర రూపం దాల్చుతోంది. అదనపు దోపిడీ ఒక్కో బస్తా రూ.284 చొప్పున విక్రయించాల్సి ఉండగా.. అదనంగా రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే స్టాకు లేదని సాకు చెబుతున్నారు. ఇటీవల బేల మండల కేంద్రంలో ఓ డీలరు రూ.350కు తక్కువ విక్రయించేది లేదని తేల్చిచెప్పడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. విచారణ చేపట్టిన అధికారులు సదరు డీలరుకు నోటీసులతో సరిపెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. డిమాండున్నా వేధిస్తున్న కొరత.. జిల్లాలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. రెండు మూడురోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, వరి, కంది, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రైతులు యూరియా వేస్తున్నారు. దీంతో పెరిగిన డిమాండ్ మేరకు జిల్లాలో యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు యూరియా కష్టాలపై అధికారులను నిలదీశారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఈ యూరియా కేటాయింపులపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిల్వ నీటిని తీసివేయాలి
ధారూరు: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి పంటను దెబ్బ తీస్తుందని ధారూరు ఏడీఏ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ పత్తి పొలాల్లో నిల్వ నీటిని వెంటనే తీసివేయాలని సూచించారు. నీరు నిల్వ ఉంటే పత్తికి తెగుళ్లు సోకుతాయని చెప్పారు. ఈ వర్షాల వల్ల ప్యారావిల్ట్, వేరుకుళ్లు తెగుళ్లు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఈ తెగుళ్ల నివారణకు కార్బండిజం, మ్యాంకోజెబ్ కలిపిన పౌడర్ను (స్టాఫ్ లేదా స్ప్రింట్) లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని సూచించారు. ముదురు ఆకులు పసుపు, ఎరుపు రంగుకు మారితే డీఏపీని లీటరు నీటికి 10 గ్రాములు లేదా యూరియాను లీటరు నీటికి 10 గ్రాములు కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న పంట బీమాకు ఈ నెల 30వ తేదీ ఆఖరు ఈ సంవత్సరం ఖరీఫ్లో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకుల తరఫున బీమా చేయలేరని ఏడీఏ చంద్రశేఖర్ తెలిపారు. రైతులంతా గ్రామం యూనిట్గా చేసుకుని మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోవడానికి ప్రతిపాదన ఫారాన్ని వీఆర్ఓ సంతకంతో నేరుగా బ్యాంకులో గానీ పీఏసీఎస్లో చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఆర్థిక సర్వే ఏంచెబుతోందంటే...
‘ఉపాధి’ని ప్రక్షాళన చేయాల్సిందే! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ‘ఉపాధి హామీ’ని వెంటనే ప్రక్షాళన చేయాల్సి ఉందని కేంద్ర ఆర్థిక సర్వే అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘ఉపాధి హామీ’ పథకాన్ని దేశ అభివృద్ధికి తోడ్పడేలా చేయాలని సూచించింది. ఈ పథకం పలుచోట్ల దుర్వినియోగం అవుతోందని, దానిని అరికట్టాల్సి ఉందని పేర్కొంది. ఉపాధి పథకాన్ని గ్రామ పంచాయతీలు కేంద్రంగా నిర్వహించడం వల్ల.. పథకం కింద నిర్వహించే పనుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ సరిగా ఉండట్లేదని వ్యాఖ్యానించింది. గ్రామాల్లో పథకంపై చైతన్యం లేకపోవడం, పనుల ఎంపికలో దురుద్దేశం, సామాజిక తనిఖీలు సరిగా నిర్వహించకపోవడం వంటి వాటివల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయంది. ‘ఉపాధి’ కింద ఇస్తున్న వేతనం తక్కువగా ఉండడం వల్ల మహిళలు మాత్రమే పనిచేస్తున్నారని... దీంతో చిన్నస్థాయి పనులు మాత్రమే జరుగుతున్నాయంది. తక్కువ మందికి లబ్ధి కలిగే పనులను కాకుండా... చాలామందికి ఉపయోగపడే పనులను ‘ఉపాధి’ కింద చేపట్టాలని అభిప్రాయపడింది. ఈ పథకం కింద శాశ్వత ఆస్తుల కల్పన, పర్యాటకాభివృద్ధికి తోడ్పడే పనులు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే పనులను చేపట్టాలని సూచించింది. దీంతోపాటు గ్రామీణ జీవనోపాధి కల్పన పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, సర్వశిక్షా అభియాన్ తదితర పథకాలనూ పునర్వ్యవస్థీకరించడమో, ప్రక్షాళన చేయడమో తప్పనిసరని స్పష్టం చేసింది. యూరియాపై రూ.8,500 కోట్లు వృథా న్యూఢిల్లీ: యూరియాపై భారత ప్రభుత్వం, రైతులు మొత్తం రూ.8,500 కోట్లు వృథా చేస్తున్నారని ఆర్థిక సర్వే 2013-14 వెల్లడించింది. అస్తవ్యస్త విధానాలవల్ల ఎరువుల రంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయని, దీనివల్ల అధికమొత్తంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. ఎరువులకు భారీ సబ్సిడీ ఇవ్వడంవల్ల అవసరంలేకున్నా ఉపయోగిస్తున్నారని, ఆహారపదార్థాల ధరలు, పన్నులు పెరగడానికి ఇది కారణమవుతుందని సర్వేలో తెలిపింది. యూరియాను తక్షణమే పోషకపదార్థాల ఆధారిత సబ్సిడీ పద్ధతిలోకి తీసుకువచ్చి రైతులకు నేరుగా సబ్సిడీని చెల్లించాలని పేర్కొంది. దేశంలో అవసరానికి మించి దాదాపు 50 లక్షల టన్నుల యూరియాను కొనుగోలు చేస్తున్నారని, రైతులు రూ.2,680కోట్లు, ప్రభుత్వం రూ.5,860కోట్లు వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అధిక ధరలు, అధిక పన్నుల రూపంలో అంతిమంగా ఈ భారం విని యోగదారుడిపైనే పడుతోందని పేర్కొంది. ఒక టన్ను యూరియాకు రైతు రూ.5,360 చెల్లిస్తుండగా, సర్కారు రూ.11,760 సబ్సిడీగా చెల్లిస్తోందని తెలిపింది. ‘మధ్యాహ్న భోజనం’ను సంస్కరించాలి న్యూఢిల్లీ: విద్యార్థులను పాఠశాలవైపు మళ్లించాలంటే.. ప్రస్తుతం అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సంస్కరించాలని ‘ఆర్థిక సర్వే ’ పేర్కొంది. అలాగే ప్రాథమిక, మాధ్యమిక విద్యావ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టంచేసింది. సర్వే వివరాల ప్రకారం... ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే బాధ్యతల వల్ల టీచర్ల బోధనపై ప్రభావం పడుతోంది. ఈ పథకం కింద 2013-14లో రూ.10,927 కోట్ల వ్యయంతో సుమారు 10.80 కోట్ల మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. 2012-13 నాటికి దేశంలో 723 యూనివర్సిటీలు, 37,204 కాలేజీలు, 11,356 డిప్లొమా స్థాయి విద్యాసంస్థలున్నాయి. 2013-14లో దేశ జీడీపీలో 3.3 శాతాన్ని విద్యారంగంపై ఖర్చు చేశారు. విద్యారంగంపై వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. 2013-14 వరకూ సర్వశిక్షా అభియాన్ కింద.. 3,57,611 కొత్త ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద 15.06 లక్షల మంది టీచర్లను నియమించారు. -
యూరియా.. మాయా!
గజ్వేల్: ‘మెతుకుసీమ’లో ఈసారి కూడా యూరియా కొరత తప్పదా? గంటల తరబడి నిరీక్షణ.. ఒక్క బస్తా కూడా అందక రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయా? అని ప్రశ్నిస్తే అవుననే అనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూస్తుంటే జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది. యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టడంలో భాగంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి.. ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. ఎమ్మార్పీకి విక్రయిస్తే.. రవాణా చార్జీలు తామే భరించాల్సి వస్తోందని, నష్టానికి వ్యాపారం ఎలా చేస్తామనే వాదనను తెరపైకి తెచ్చిన వ్యాపారులు.. నిల్వలను సమృద్ధిగా మార్కెట్లోకి తేవడంలో విముఖత చూపుతుండటంతో ఈ రకమైన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈసారి వివిధ రకాల పంటలు సుమారు 5.20 లక్షల హెక్టార్లకుపైగా సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మూడేళ్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికాలోపం కారణంగా యూరియా కొరత ఏర్పడి ఒకటిరెండు సంచుల కోసం రైతులు పోలీస్స్టేషన్ల వద్ద తిండితిప్పలు మాని ఉదయం నుంచి రాత్రివరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా దొరక్క నిత్యం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో యూరియా వేయలేక భారీగా పంట నష్టానికి గురయ్యారు. ప్రస్తుతం గతేడాది తాలూకు చేదు అనుభవాలు రైతులను వెంటాడుతున్నాయి. అధికారుల తనిఖీలు, హెచ్చరికలు జిల్లాలో యూరియా కొరత రాకుండా చూడటమే కాకుండా బ్లాక్ మార్కెట్ను పూర్తిగా అరికట్టడానికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికతో ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ జిల్లాలోని పలుచోట్ల సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకించి ఎరువుల మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమించే గజ్వేల్లో జూన్ 13న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీలర్లవారీగా క్షుణ్ణంగా వివరాలను తెలుసుకున్నారు. యూరియా బస్తా రూ.283 ఎమ్మార్పీకి ఒక్క పైసా పెంచి అమ్మినా...క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు చేశారు. ఎమ్మార్పీకి అమ్మితే తమపై రవాణా ఖర్చుల భారం పడి నష్టాల పాలవుతామని ఇన్చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. శరత్ మాత్రం ‘ఇష్టముంటే వ్యాపారం చేయండి..లేదంటే మానేయండి..’ అంటూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అంతేకాకుండా గజ్వేల్లోనే కాదు జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు ముమ్మరం చేయించారు. దీంతో వ్యాపారులంతా డైలామాలో పడ్డారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు యూరియాను విక్రయిస్తే చిక్కులు తప్పవని గుర్తించి లాబీయింగ్ మొదలుపెట్టారు. లారీ కిరాయి, హమాలీల పేరు చెప్పి గతంలో ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేసి దండుకున్న వ్యాపారులకు.. అధికారుల కఠిన నిర్ణయం మింగుడు పడటంలేదు. నిజానికి యూరియా బస్తా కంపెనీ వద్ద రూ.272కు లభ్యమవుతోంంది. (కొన్ని రకాల కంపెనీలకు చెందిన యూరియా బస్తాలు మాత్రం రూ.270కే లభ్యమవుతాయి) దానిని రూ.11 లాభంతో రూ.283లకు విక్రయించాలి. ఉదాహరణకు హైదరాబాద్లోని మూసాపేట రేక్ పాయింట్ నుంచి ఒక్కో లారీ 340 బస్తాలు గజ్వేల్కు తెప్పించాలంటే కిరాయి రూ.7 వేలు వరకు చెల్లిస్తున్నామని, దీనివల్ల ఒక్కో బస్తాకు రూ.20కి పైగా ఖర్చువుతోందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా లోడ్ను దింపుకోవడం, రైతులకు అందజేసే వరకు ఒక్కో బస్తాపై మరో రూ.7 వరకు ఖర్చవుతోందని దీనివల్ల రూ.300కు విక్రయిస్తే.. తమకు నష్టం ఉండదనే వాదనను తీసుకువచ్చారు. నిన్న మొన్నటివరకు బ్లాక్ మార్కెట్ చేసి లక్షలు దండుకున్న అధికారులు నిబంధనలు కఠినతరం చేసేసరికి తాము ఎక్కువ మొత్తంలో నిల్వలు తేలేమని చెబుతూ.. స్టాక్ తేవడానికి వెనుకంజ వేస్తున్నారు. వేల క్వింటాళ్ల యూరియా లోటు.. వ్యాపారులు తీరు కారణంగా జిల్లాకు ఇప్పటివరకు రావాల్సిన వేల క్వింటాళ్ల యూరియా లోటు ఏర్పడింది. ఉదాహరణకు గజ్వేల్ సబ్డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్ మండలాలకు జూన్ నెలాఖరు వరకు 9,144 టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇందులో కేవలం 7 వేల టన్నులు మాత్రమే వచ్చింది. ఇందులో 6,750 టన్నులు అమ్ముడుపోగా మరో 250 క్వింటాళ్లు మాత్రమే దుకాణాల్లో అందుబాటులో ఉన్నది. వర్షం లేకపోతేనే పరిస్థితి ఇలా ఉన్నది. ఆర్థికస్తోమతలేక ఇప్పటివరకు కొన్ని వేల మంది రైతులు యూరియాను ముందస్తుగా కొనుగోలు చేయలేకపోయారు. వర్షం వస్తే వారంతా ఒక్కసారిగా రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని వెంటనే సమీక్షించి...యూరియా కొరత రాకుండా చూడాల్సి ఉంది. బ్లాక్ మార్కెట్ను సహించేదిలేదు యూరియా బ్లాక్ మార్కెట్ను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలను వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. రవాణా చార్జీల సాకుతో డీలర్లు యూరియా స్టాక్ తెప్పించకపోతే...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. వర్షం వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. -హుక్యానాయక్,జిల్లా జాయింట్ డెరైక్టర్, వ్యవసాయ శాఖ -
ఎల్నినో... ఏమి చేయునో
ఎరువుల పరిశ్రమపై రుతుపవనాల ప్రభావం రాబోబ్యాంక్ నివేదిక ముంబై: బలహీనంగా ఉన్న రూపాయి, ఎల్ నినో కారణంగా వర్షాలు ముఖం చాటేసేలా ఉండడం, సబ్సిడీ వ్యవస్థ... వెరసి ఎరువుల రంగంపై మరింత ప్రభావంపడే అవకాశాలున్నాయని బ్యాంకింగ్, ద్రవ్య సేవల సంస్థ రాబోబ్యాంక్ తాజా నివేదికలో పేర్కొన్నారు. ‘ఎరువులకు డిమాండు ఒత్తిడి ఉంది. సబ్సిడీల భారం భరించలేక ఎరువులు, రసాయనాల శాఖ సతమతం అవుతోంది. బలహీనమైన రూపాయి, రుతుపవనాలు ఎరువుల డిమాండుపై ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని ఎరువుల పరిస్థితిపై రూపొందించిన తాజా త్రైమాసిక నివేదికలో తెలిపారు. ఈ రిపోర్టులోని ఇతర ముఖ్యాంశాలు: యూరియా సబ్సిడీల చెల్లింపులకు ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ అష్టకష్టాలు పడుతోంది. మునుపటి యూపీఏ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో ఎరువుల సబ్సిడీలకు 1,100 కోట్ల డాలర్లు కేటాయించింది. గతేడాది కూడా సబ్సిడీలు చెల్లించలేక సదరు మంత్రిత్వ శాఖ ఇక్కట్లను ఎదుర్కొంటున్నపుడు బ్యాంకులు రంగప్రవేశం చేసి రుణాలు సమకూర్చాల్సి వచ్చింది. యూరియాకు డిమాండు జూలై వరకు మందకొడిగానే ఉండవచ్చు. చైనా నుంచి ఎగుమతుల ప్రారంభం కోసం ఇండియా ఎదురుచూస్తోంది. ఏప్రిల్లో దేశంలో 6.75 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. మార్చితో పోలిస్తే ఇది 2 రెట్లు అధికం.ఎరువుల ధరల్లో క్షీణత కన్పిస్తోంది. వచ్చే త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. భారత్లో ఫాస్ఫేట్ ఎరువుల పరిస్థితి ఏమంత బాగాలేదు. రూపాయి మారకం విలువ బలహీనపడితే ఫాస్ఫేట్ దిగుమతుల భారం పెరుగుతుంది. అన్ని రకాల ఎరువులదీ ఇదే పరిస్థితి. -
సాగుకు సన్నద్ధం
5,40,450 హెక్టార్లలో సాగు అంచనా - 14 లక్షల 56వేల ప్యాకెట్ల పత్తి విత్తనాలు సిద్ధం - 34,415 టన్నుల యూరియా నిల్వ - దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు వరంగల్, న్యూస్లైన్: ఖరీఫ్ సాగుకు రైతులతో పాటు వ్యవసాయ శాఖ కూడా సిద్ధమవుతోంది. అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాగు అంచనాలు రూపొందించి దానికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతులు పొడిదుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. భూమిలో బలం పెంచేందుకు పెంట, చెరువు మన్ను పోసే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఈ ఖరీఫ్లో 5,40,450 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఖరీఫ్లో సాగు విస్తీర్ణం 5,29,061 హెక్టార్లుండగా ప్రస్తుతం 10వేల హెక్టార్ల మేరకు పెరుగుతుందని భావిస్తున్నారు.అందుబాటులో విత్తనాలు ప్రధానమైన పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. సకాలంలో మార్కెట్లోకి విత్తనాలు వచ్చే విధంగా విత్తన కంపెనీల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ విత్తనోత్పత్తి సంస్థలతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ సమీక్షించారు. జిల్లాలో 14,56,200 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించారు. ఇక వరిసాగుకు అవసరమైన విత్తనాలు13వేల క్వింటాళ్ళు ఏపీ సీడ్స్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మొక్కజొన్న, వరి, జీలుగు విత్తనాలు సబ్సీడీపై అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కజొన్నకు సంబంధించి 5వేల క్వింటాళ్ళు, జీలుగు 4వేల క్వింటాళ్ళు, వేరుశనగ 3వేల క్వింటాళ్లు, మిరపకు 50వేల ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో విత్తనాల కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎరువుల నిల్వలు ఇలా.. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఇప్పటికే 34,415 టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జేడీఎ జి.రామారావు చెప్పారు. మార్క్ఫెడ్ వద్ద 14,570 టన్నులు, కంపెనీ గోదాంల్లో 7,264 టన్నులు, సహకార సంఘాల వద్ద 6,581 టన్నులు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డీఎపీ 25,655 టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 32,363 టన్నులు, పొటాష్ 2008 టన్నులు నిల్వలున్నట్లు వివరించారు. అదనంగా 5వేల టన్నుల ఎరువుల నిల్వ కోసం యత్నిస్తున్నట్లు చెప్పారు. -
ఖరీఫ్ కలిసొచ్చేనా...!
నాలుగేళ్లుగా వాతావరణంలోని అనిశ్చితి రైతాంగానికి నష్టాలను రుచిచూపించగా, తాజాగా ప్రారంభమయ్యే ఖరీఫ్ వారిని అగ్ని పరీక్షకు గురి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల భూస్వామ్య, సన్నకారు, కౌలు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మొదట్లో నైరుతి రుతుపవ నాలు తక్కువ వర్షపాతం ఇస్తాయని వాతావరణ శాఖ సూచించగా ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఖరీప్ నాట్లపై జిల్లా రైతు దృష్టి సారించేలా చేసింది. కొన్నిచోట్ల దుక్కులు చేయడం, మరికొన్ని చోట్ల సాగుకు సన్నద్ధం కావడం కనిపిస్తోంది. -న్యూస్లైన్,అనకాపల్లి అనకాపల్లి, న్యూస్లైన్ : అతివృష్టి, అనావృష్టి కారణంగా జిల్లాలో మెజారిటీ శాతం సాగు చేసే వరి, చెరకు పంటల పరిస్థితి ఇప్పటికే దయనీయంగా మారింది. దీనికితోడు నానాటికీ పెరిగిపోతున్న ఎరువులు, విత్తనాల ధరలు, మరోవైపు కూలీల సమస్య మరింత జఠిలంగా మారింది. ఇక రానున్న ఖరీఫ్ సీజన్లో సైతం రైతులకు మేలు జరగకుంటే రైతన్న పూర్తిగా సేద్యానికి దూరమయ్యే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్లో కూడా 2.16 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ విభాగం ప్రాథమిక అంచనా వేస్తోంది. పెట్టుబడి కొండంత.. దిగుబడి ఇసుమంత... ప్రకృతి కన్నెర్ర చేయడం, రైతులకు మద్దతు ధర దక్కక పోవడం ఒక సమస్య అయితే నానాటికీ పెరిగిపోతున్న పెట్టుబడి రైతులను కుదేలు చేస్తోంది. మార్కెటింగ్ వ్యవస్థలో దళారీల దోపిడీ, అస్తవ్యస్త ప్రభుత్వ మార్కెటింగ్ విధానాలు ఒకవైపు రైతన్నకు నష్టాన్ని కలిగి స్తుండగా, అసలు దిగుబడే నానాటికీ తీసికట్టు గా మారడంతో సగటు రైతు చతికిలపడుతున్నాడు. గడిచిన నాలుగేళ్లలో కూలీలకు చెల్లిం చే కూలీ వేతనం 2 నుంచి 3 రెట్లు పెరిగింది. యూరియా ధర బ్యాగ్కు నాలుగేళ్లలో 220, పొటాష్ 550, డీఏపీ 650 పెరిగింది. ఇక విత్తనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరి వి త్తనం ధరలు భారీగా పెరుగుతుండగా, చెరకు నాట్ల కోసం అవసరమయ్యే గడలు దొరకడం రైతులకు భారంగా మారింది. ఇక రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సిన రు ణాలు, రీషెడ్యూల్ విషయమై అర్థం కాని ప్ర చారం జరుగుతోంది. ప్రభుత్వ విధి విధానా లు ఎలా ఉన్నా బ్యాంకర్లు కనికరిస్తేనే రైతులు ఈ ఖరీఫ్లో గట్టెక్కగలరు. రైతు కష్టం.... ఏటేటా ప్రకృతికి నైవేద్యం 2010లో జిల్లాలో 26654 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది.చెరకు 1883.6 హెక్టార్లు, రాజ్మా 531హెక్టార్లు, నైజర్ 252 హెక్టార్లు, పత్తి 27 హెక్టార్లు, కంది 30 హెక్టార్లలో దెబ్బతింది. దీనికి నష్టపరిహారం అందించడంలో వ్యవసాయశాఖ పూర్తిగా సఫలం కాలేకపోయింది. వెరసి రైతులకు కోట్లలో నష్టం రాగా, రైతుల పరపతి వడ్డీ వ్యాపారుల వద్ద బాగా పడిపోయింది. 2011లో ఏర్పడ్డ అనావృష్టి ఛాయలు రైతులను ఆత్మహత్యా సదృశ్యంలో పడేశాయి. దొ రకని సాగునీరు, కనికరించని ప్రభుత్వ పాల సీలతో రైతులకు నిర్వేదంలోకి వెళ్లిపోయారు. 2012లో జిల్లాలో 32901.6 హెక్టార్లలో 14 పంటలు నష్టపోయాయి. అందులో వరి 24515. 6 హెక్టార్లలో నష్టపోయింది. అనధికారికంగా గుర్తింపు కాని పంటల విస్తీర్ణం ఇంకా ఉంది. రైతులకు అందాల్సిన నీలం తుపాను నష్టపరిహారంపై నిన్నమొన్నటి వరకు ఆందోళనలు చేసినా బ్యాంకుల ఖాతాల సమస్య అంటూ ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. ఇంతలో విభజన ఉద్యమం, ఎన్నికల హడావుడితో అసలు విషయం పక్కకు పోగా, రెండేళ్ల క్రితం వచ్చిన నష్టాన్ని భర్తీచేయలేని యంత్రాంగం దాపురించినందుకు రైతులు డీలా పడ్డారు. 2013లో రెండు భారీ తుపానులు, భారీ వర్షాలు జిల్లా రైతుల కొంపముంచాయి. సుమారు 53 వేల హెక్టార్లకు పైబడి ఖరీఫ్ పంటలు నీటమునిగినా వాటి లెక్కలు తేల్చే నాధుడే లేకుండా పోయాడు. -
ఏప్రిల్ 1 నుంచే కొత్త గ్యాస్ రేట్ల వర్తింపు..
న్యూఢిల్లీ: తాత్కాలికంగా పాత గ్యాస్ రేట్ల విధానం ప్రకారమే కేజీ-డీ6 గ్యాస్ను విక్రయించేందుకు ఎరువుల ప్లాంట్లతో అంగీకారానికి వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఇప్పుడు కొత్త మెలికపెడుతోంది. ఐదేళ్ల కాంట్రాక్టు గడువు ముగిసిపోయిన తమ కస్టమర్లందరికీ ఈ నెల 1 నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన ఫార్ములా ప్రకారం కొత్త గ్యాస్ రేట్లనే వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. కేజీ-డీ6 క్షేత్రాల నుంచి ఆర్ఐఎల్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్కు ఒక్కో యూనిట్కు(ఎంబీటీయూ) 4.2 డాలర్ల చొప్పున గడచిన ఐదేళ్లపాటు రేటు కొనసాగగా... రంగరాజన్ కమిటీ ఫార్ములా ఆధారంగా దీన్ని రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకిరావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రేటు పెంపు అమలును ఎన్నికలు పూర్తయ్యేదాకా వాయిదా వేయాలని ఈసీ ఆదేశించడం తెలిసిందే. కొత్త కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిబంధనలపై ఎరువుల ప్లాంట్లు, ఆర్ఐఎల్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో... తాత్కాలికంగా పాత రేటు ప్రకారమే గ్యాస్ సరఫరా చేసేందుకు ఆర్ఐఎల్ అంగీకరించింది. అయితే పాత, కొత్త రేట్ల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తానికి చెల్లింపు గ్యారంటీలను సమర్పించాలన్న షరతుపెట్టింది. ఈ మేరకు ఎరువుల సంస్థలకు తాజాగా లేఖ రాసింది. కేజీ-డీ6పై ఆరోపణలు అవాస్తవం: కేంద్రం కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రాలను రిలయన్స్కు ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కుమ్మక్కు జరిగిందన్న ఆరోపణలు నిరాధారమైనవంటూ కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలను పూర్తిచేస్తూ ఈ అంశాన్ని పేర్కొంది. సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్గుప్తా, స్వచ్ఛంద సంస్థ కామన్ కాజ్ ఈ పిటిషన్(పిల్)లను దాఖలు చేశారు. కాగా, జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. కేజీ-డీ6లో అవకతవకలపై కాగ్తో లోతైన ఆడిటింగ్ జరిపించాలని కూడా పిటిషనర్లు సుప్రీంను కోరారు. ఇంకా, ఇక్కడి గ్యాస్ ధరను యూనిట్కు ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి 8.3 డాలర్లకు పెం చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేయాలని కూడా కామన్ కాజ్ సుప్రీంకు విన్నవించింది. -
యూరియా బాదుడు
నరసన్నపేట రూరల్, న్యూస్లైన్ : ఇప్పటికే సవాలక్ష కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతపై మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం యూరియా ధరను టన్నుకు 350 రూపాయల మేర పెంచి నడ్డి విరిచింది. దీంతో జిల్లాలోని రైతులపై ఏటా 2.5 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. జిల్లాలోని వరి సాగు చేస్తున్న రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 70 వేల టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో యూరియాను విరివిగా వాడతారు. ఈ తరుణంలో ధర భారీగా పెరగటం రైతులను కుంగదీసింది. ధర పెంపును ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాం డ్ చేస్తున్నారు. ప్రధానంగా భారమంతా సన్న, చిన్నకారు, కౌలు రైతులపైనే అధికంగా ఉంటుంది. వరుసగా దండెత్తిన తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ వీరంతా పూర్తిగా నష్టపోయారు. దీనినుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేం ద్రం యూరియా ధరను పెంచటం వారికి తీవ్ర ఆందోళన కలిగి స్తోంది. జిల్లాలో 50 కిలోల యూరియా బస్తా ధర ఇప్పటివరకు 284 రూపాయలు ఉండగా ఇకపై 302 రూపాయలకు పెరగనుంది. పెంచిన ధర తగ్గించాలి పెంచిన యూరియా ధరను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయి భారం పడ్డా రైతులు తట్టుకో లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు న్యాయం చేయాలి. - పోలాకి నర్సింహమూర్తి, రైతు, బడ్డవానిపేట -
యూరియా.. భారమయా
సూర్యాపేట మున్సిపాలిటీ / సూర్యాపేటటౌన్, న్యూస్లైన్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న అన్నదాతపై కేంద్రప్రభుత్వం భారం మోపింది. పం టల సాగుకు అవసరమైన యూరియా ధరను పెంచేసింది. యూరియా టన్నుకు *350 పెంచుతూ ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గసమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులపై రూ.2.89 కోట్ల అదనపు భారం పడనుంది. యూరియా ధర పెరగడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చిన్నకారు రైతులు 2.82 లక్షల మంది, సన్నకారు రైతులు 1.45లక్షల మంది, పెద్ద రైతులు 70వేల మంది ఉన్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీసీజన్లకు కలిపి లక్షా 27 వేల మెట్రిక్ టన్నుల యూరి యాను రైతులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో యూరియా ధర టన్నుకు రూ.5684 ఉండేది. కేంద్రప్రభుత్వం దీనికి రూ.350 అదనంగా పెంచింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని రైతులపై రూ. 2.89 కోట్ల అదనపు భారం పడనుంది. 50 కిలోల బస్తాకు అదనంగా రూ17.50 ప్రస్తుతం నీమ్కోటెడ్ యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298, నాగార్జున యూరియా రూ. 283.85, క్రిబ్కో రూ. 284కి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తాజాగా పెరిగిన ధరతో ఒక్కో యూరియా బస్తాపై రూ. 17.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇక నుంచి నీమ్కోటెడ్ యూరియా బస్తాకు రూ. 315.50 చెల్లించాలి. రిటైల్ వ్యాపారులు రవాణా, హమాలీ చార్జీలను కలుపుకొని విక్రయించనున్నందున ఈ ధర ఇంకా పెరగనుంది. ఇక ప్రయివేటు వర్తకుల ధరలు చెప్పనవరం లేదు. ఆందోళనలో రైతులు యారియా ధరను పెంచడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. తమ నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో లోవోల్టేజీ, విద్యుత్ కోతలు, అకాల వర్షాలతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక, కొద్దిపాటి పంటకు మద్దతు ధర లభించక రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రబీలోనైనా ఎక్కువ దిగుబడులు వచ్చి అప్పులు తీర్చవచ్చనుకుంటున్న రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. యూరియా ధర పెంచి భారం మోపిందని అన్నదాతలు మండిపడుతున్నారు. దురదృష్టకరం పెరిగిన విత్తనా లు, ఎరవులు, కూలీల ధరలతో రైతులు అప్పు ల్లో కూరుకుపోతుంటే యూరియా ధర పెంచడం దురదృష్టకరం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సబ్సిడీలిచ్చి రైతులను ప్రోత్సహించాలి. రై తులపై భారం మోపితే వ్యవసాయం ముందుకు సాగదు. - ఏరెడ్ల జగదీశ్వర్రెడ్డి, రైతు -
రైతు నెత్తిన పిడుగు
యూరియా ధర మెట్రిక్ టన్నుకు రూ. 350ల పెంపు ఏటా జిల్లా రైతాంగంపై రూ. 12.24 కోట్ల అదనపు భారం ఆందోళన చెందుతున్న రైతులు, రైతుసంఘాల నాయకులు సత్తెనపల్లి, న్యూస్లైన్: ఎడాపెడా పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇప్పటికే సతమతమవుతున్న రైతులపై మరో పిడుగు పడింది. యూరియా ధరలు పెరగడం రైతులకు భరించలేని భారంగా మారింది. ప్రస్తుతం సాగుకు ఎంతో కీలకమైన యూరియా ఎరువు ధరను గణనీయంగా పెంచుతూ కేంద్ర మంత్రి మండలి సమావేశం మూడు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయారు. యూరియా ధరను ఒక్కసారిగా టన్నుకు రూ. 350ల వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రైతులు తీవ్రఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఏటా ఖరీఫ్,రబీ సీజన్లకు కలిపి 3,49,807 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగిస్తున్నారు. ఈ రబీలో 1,95,476 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖరీఫ్లో 1,54,311 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. {పస్తుతం రబీ సాగు కీలక దశకు చేరుకుంది. ఇలాంటి తరుణంలో యూరియా మెట్రిక్ టన్నుకు రూ. 350ల వరకు పెంచడంతో జిల్లాలోని రైతులపై ఏడాదికి రూ.12.24 కోట్ల వరకు భారం పడనుంది. వ్యవసాయ చేస్తున్నవారిలో అధిక శాతం సన్న, చిన్నకారు రైతులే. వారిలో చాలా మంది ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. మంత్రి మండలి నిర్ణయం ప్రకారం 50 కిలోల బస్తాకు రూ. 17.50 పైసలు పెరిగినట్లయింది. బస్తా ధర ప్రస్తుతం రూ. 280.85 వరకుఉండగా, అది కాస్తా రూ.301.35లకు చేరనుంది. జిల్లాలో పత్తి, మిర్చి, వరి సాగు ఎక్కువగా ఉంది. అన్ని పంటలకు దాదాపుగా యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు, రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. -
యూరియా స్థిర వ్యయం పెంపు!
న్యూఢిల్లీ: యూరియా స్థిర వ్యయాన్ని టన్నుకు రూ.350 పెంచేందుకు కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) సిఫారసు చేసింది. ఈ సిఫారసును కేంద్రమంత్రివర్గం అంగీకరిస్తే.. పెంపు తరువాత టన్ను యూరియా కనీస స్థిరవ్యయం రూ. 2300 కానుంది. అయితే, పెరిగిన ధరను సబ్సీడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది, రైతులపై ఆ భారం పడదు. తాజా పెంపు ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రభుత్వంపై యూరియా సబ్సీడీ భారం రూ. 900 కోట్ల మేర పెరగనుంది. 30 ఏళ్ల పైబడిన సంస్థలు ఉత్పత్తి చేస్తున్న యూరియాకు టన్నుకు రూ. 150, మిగతా అన్ని సంస్థలకు రూ. 350 పెంపును వర్తింపజేయాలని సంబంధిత జీఓఎం సిఫారసు చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి శ్రీకాంత్ జెన గురువారం వెల్లడించారు. యూరియా స్థిర వ్యయాన్ని నిర్ణయించేందుకు ఆధారమైన మూల సంవత్సరాన్ని కూడా 2002-03 నుంచి 2008-09కి మార్చారు. అయితే ఎరువుల కంపెనీలు మాత్రం స్థిరవ్యయాన్ని టన్నుకు రూ. 700 పెంచాలని, మూల సంవత్సరాన్ని 2011-12 చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు, కూలీల ఖర్చు, కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలు మరమ్మతు, నిర్వహణ ఖర్చు, అమ్మకం ఖర్చులు.. వీటి మొత్తం ఆధారంగా యూరియా ప్లాంట్లలో స్థిర వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఎరువుల సబ్సిడీల కింద రూ. 70585 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది. భారత్ ఏటా 22 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. మరో 8 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. -
యూరియా ముప్పు
రబీ సీజన్లో రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేవు. అవసరం మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో లేవు. ప్రస్తుతానికి ఇబ్బంది తలెత్తకపోయినప్పటికీ, రానున్న రోజులలో యూరియా కొరత ఏర్పడే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఈసారి రబీ వరి సాగు ఆశాజనకంగా ఉంది. సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు కురియ డం, ప్రాజెక్టులు నిండుకుండలను తలపించడంతో రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎ రువుల కొరతే రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది రబీ పంటలకు 1.29 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జనవరి నెలాఖరు వరకు 71,330 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తేల్చారు. కాగా ప్రస్తుతం 30,484 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటు లో ఉంది. అంటే, అవసరంలో సగం కూడా యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవన్నమాట. అవసరం మేరకు యూరియా అందుబాటులో లే కపోవడానికి జిల్లాలో స్థలం సమస్యే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గోదాములు ఖాళీ లేకపోవడంతో యూరియా అదనపు నిల్వ లు తెప్పించలేకపోతున్నామంటున్నారు. పీఏసీఎస్లలో చేపట్టిన గోదాముల నిర్మాణం పనులు పూర్తయితే ఈ సమస్యకు కొంత మేరకు పరిష్కారం లభించనుంది. అయితే మరో రెండేళ్లకు గానీ ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా లేవు. ‘కాంప్లెక్స్’ఫుల్ : యూరియా పరిస్థితి ఇలా ఉం టే.. కాంప్లెక్స్ ఎరువుల పరిస్థితి ఇందుకు విరుద్ధం. వీటి నిల్వలు జిల్లాలో భారీగా ఉన్నాయి. ప్రస్తుతానికి 40,769 మెట్రిక్ టన్నులున్నాయి. వీ టి ధరలు చుక్కలనంటుతుండటంతో రైతులెవ్వ రూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి. ఈ సారి 3.25 లక్షల ఎకరాలలో వరి సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ గుర్తించింది. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలలో నాట్లు పడ్డాయి. బోర్లు, కాలువల నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వరి నాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్, మాక్లూర్, ఆర్మూర్, సిరికొండ తదితర మండలాలలో నాట్లు ఊపందుకున్నాయి. ఈ వరికే యూరి యా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతులు వరికి యూరియాను ఎకరానికి రెండు దఫాల్లో నాలుగు నుంచి ఐదు బస్తాలు వరకు వినియోగిస్తుంటారు. నాట్లు వేసుకున్నాక 25 రోజుల తర్వాత ఈ ఎరువును వేస్తారు. అందువల్ల ఇప్పుడిప్పుడే యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. ఎకరానికి రెండున్నర బస్తాలకు మించి యూరియా వాడవద్దని వ్యవసాయాశాఖా అధికారులు పేర్కొంటున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పం టలకు యూరియా అవసరం ఉంటుంది. ఈ రబీ లో 1.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుం దని అంచనా. ఈ పంటకు కూడా రెండుసార్లు యూరియా అవసరం ఉంటుంది. పొద్దుతిరుగు డు పంట 50 వేల ఎకరాలలో సాగవుతుందని భావిస్తున్నారు. కనీసం ఎకరానికి రెండు బస్తాలై నా యూరియా వేయాల్సి ఉంటుంది. -
యూరియా ముప్పు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఈసారి రబీ వరి సాగు ఆశాజనకంగా ఉంది. సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు కురియ డం, ప్రాజెక్టులు నిండుకుండలను తలపించడంతో రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎ రువుల కొరతే రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది రబీ పంటలకు 1.29 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జనవరి నెలాఖరు వరకు 71,330 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తేల్చారు. కాగా ప్రస్తుతం 30,484 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటు లో ఉంది. అంటే, అవసరంలో సగం కూడా యూరి యా నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవన్నమాట. అవసరం మేరకు యూరియా అందుబాటులో లే కపోవడానికి జిల్లాలో స్థలం సమస్యే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గోదాములు ఖాళీ లేకపోవడంతో యూరియా అదనపు నిల్వ లు తెప్పించలేకపోతున్నామంటున్నారు. పీఏసీఎస్లలో చేపట్టిన గోదాముల నిర్మాణం పనులు పూర్తయితే ఈ సమస్యకు కొంత మేరకు పరిష్కారం లభించనుంది. అయితే మరో రెండేళ్లకు గానీ ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా లేవు. ‘కాంప్లెక్స్’ఫుల్ : యూరియా పరిస్థితి ఇలా ఉం టే.. కాంప్లెక్స్ ఎరువుల పరిస్థితి ఇందుకు విరుద్ధం. వీటి నిల్వలు జిల్లాలో భారీగా ఉన్నాయి. ప్రస్తుతానికి 40,769 మెట్రిక్ టన్నులున్నాయి. వీ టి ధరలు చుక్కలనంటుతుండటంతో రైతులెవ్వ రూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి. ఈ సారి 3.25 లక్షల ఎకరాలలో వరి సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ గుర్తించింది. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలలో నాట్లు పడ్డాయి. బోర్లు, కాలువల నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వరి నాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్, మాక్లూర్, ఆర్మూర్, సిరికొండ తదితర మండలాలలో నాట్లు ఊపందుకున్నాయి. ఈ వరికే యూరి యా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతులు వరికి యూరియాను ఎకరానికి రెండు దఫాల్లో నాలుగు నుంచి ఐదు బస్తాలు వరకు వినియోగిస్తుంటారు. నాట్లు వేసుకున్నాక 25 రోజుల తర్వాత ఈ ఎరువును వేస్తారు. అందువల్ల ఇప్పుడిప్పుడే యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. ఎకరానికి రెండున్నర బస్తాలకు మించి యూరియా వాడవద్దని వ్యవసాయాశాఖా అధికారులు పేర్కొంటున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పం టలకు యూరియా అవసరం ఉంటుంది. ఈ రబీ లో 1.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుం దని అంచనా. ఈ పంటకు కూడా రెండుసార్లు యూరియా అవసరం ఉంటుంది. పొద్దుతిరుగు డు పంట 50 వేల ఎకరాలలో సాగవుతుందని భావిస్తున్నారు. కనీసం ఎకరానికి రెండు బస్తాలై నా యూరియా వేయాల్సి ఉంటుంది. -
‘యూరియా’ నిబంధనలపై వెనక్కి!
న్యూఢిల్లీ: యూరియా పెట్టుబడి విధానంలోని ‘తిరిగి కొనుగోలు హామీ నిబంధన’ను తొలగిం చేందుకు ఎరువుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ఒక ప్రతిపాదనను కూడా పంపింది. దీని స్థానంలో కంపెనీలను షార్ట్లిస్ట్ చేసి, బిడ్డింగ్ తరహాలో కొత్త విధానాన్ని అమలుచేయాలని ప్రతిపాదించింది. దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచడానికి, కంపెనీలను ప్రోతహించేందుకు వీలుగా 2012 జనవరిలో ఎరువుల మంత్రిత్వ శాఖ కొత్త పెట్టుబడి విధానాన్ని రూపొందించింది. దీన్ని అదే ఏడాది డిసెంబర్లో కేంద్రం ఆమోదించింది. ఈ విధానం ప్రకారం దేశంలో కంపెనీలు ఉత్పత్తి చేసే యూరియాను కేంద్రం తప్పనిసరిగా ఎనిమిదేళ్లపాటు కొనాలి. దీనికి అనుగుణంగా 13 ఎరువుల సంస్థలు ఉత్పత్తిని భారీగా పెంచేం దుకు, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దశలో ఎరువుల మంత్రిత్వ శాఖ ‘తిరిగి కొనుగోలు హామీ నిబంధన’ను తొలగించాలని ప్రతిపాదనలు పం పింది. అలాగే, దరఖాస్తు చేసుకున్న 13 కంపెనీల నుంచి 3 లేదా 4 కంపెనీలను షార్ట్లిస్ట్ చేసి బిడ్డింగ్కు ఆహ్వానించాలని సూచించింది. -
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
జోగిపేట, న్యూస్లైన్: అందోలు మండలం రాంసానిపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు డీఏపీ ఎరువుల కోసం రోడ్డెక్కారు. ఇద్దరి రైతులకు ఒక బ్యాగు చొప్పున ఎరువులు కేటాయిస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించి శుక్రవారం జాతీయ రహదారిపై బైఠాయించారు. జోగిపేటలోని వ్యవసాయ మార్కె ట్ కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. నారాయణఖేడ్ వైపు నుంచి వచ్చేవాహనాలు ముర్షత్ దర్గా వరకు, జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు వరకు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ బైఠాయించారు. సుమారుగా 45 నిమిషాల సేపు రాస్తారోకో జరిగింది. ఇదిలా ఉండగా విషయం తెలుసుకుని ఏఓ విజయరత్న ఆందోళన చేపడుతున్న రైతుల వద్దకు వచ్చి నిబంధనల ప్రకారం పంపిణీ చేస్తున్నామని, ఎక్కువ పంపిణీ చేయడం తన పరిధిలో లేదని తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఒక్క బస్తాను ఇద్దరు రైతులు ఎలా తీసుకుంటారని, ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని గ్రామ నాయకులు ఆగమయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్లు విజయరత్నను ప్రశ్నించారు. తన వద్ద ఫోన్ నంబరు లేకపోవడంతో చెప్పలేకపోయానన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున పంపిణీ చేయాల్సి ఉందని, త్వరలో అందరికీ ఎరువులు అందేలా చూస్తానని ఏఓ చెప్పడంతో రైతులు శాంతించారు. -
నిండుకున్న ‘యూరియా’
సాక్షి, నిజామాబాద్ : ఎప్పటిలాగే ఈ ఏడాదీ ఎరువుల సమస్య తలెత్తడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత అనుభవాల నుంచైనా సర్కారు గుణపాఠం నేర్చుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూరగాయలు సాగు చేస్తున్నవారు, సన్న రకాల వరిని పండిస్తున్న అన్నదాతలు యూరియా కోసం పీఏసీఎస్లు, ప్రైవేటు ఎరువుల డీలర్ల వద్దకు చక్కర్లు కొడుతున్నారు. పత్తి పంటకు కూడా యూరియా అవసరం ఏర్పడింది. కానీ జిల్లాలో మాత్రం ఈ ఎరువు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చివరి దశలో ఉన్న ఖరీఫ్ పంటలు గట్టెక్కాలంటే ఉన్నపలంగా కనీసం 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అంచనాకొచ్చింది. జిల్లాలో ఉన్న డీలర్ల వద్ద నాలుగు వందల మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియానే నిల్వ ఉంది. ఎరువుల నిల్వలపై జిల్లా వ్యవసాయశాఖ ఎప్పటి కప్పుడు ఆ శాఖ కమిషనరేట్కు నివేదికలు పంపుతుంది. రైతుల అవసరాలు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో యూరియా నిల్వలు నిండుకున్నాయని, వెంటనే ఈ ఎరువును జిల్లాకు పంపాలని కమిషనరేట్కు పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. కానీ స్పందన శూన్యం. బఫర్ నిల్వ నామమాత్రమే.. ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 3.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 1.40 లక్షల హెక్టార్లలో వరి సాగైందని వ్యవసాయశాఖ పేర్కొంటోంది. ఈ శాఖ ప్రణాళిక ప్రకారం ఖరీఫ్లో 1.23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ సర్కారు మాత్రం జిల్లాకు 1.18 లక్షల మెట్రిక్ టన్నులే కేటాయించింది. కేటాయింపుల ప్రకారం కూడా యూరియా సరఫరా చేయలేదు. ఇప్పటి వరకు 99 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఎరువుల సమస్య తీవ్ర రూపం దాల్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో అందించడం కోసం ప్రభుత్వం బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచుతుంది. ప్రభుత్వం వెంటనే యూరియాను జిల్లాకు సరఫరా చేయని పక్షంలో ఈ బఫర్ స్టాక్ను వినియోగించుకోవచ్చు. సుమారు 6,670 మెట్రిక్ టన్నుల యూరియా ఈ బఫర్ స్టాక్లో భాగంగా జిల్లా కేంద్రంలోని గోదాముల్లో ఉంది. కొరత ఉన్న మండలాలివే.. పంట బాగా ఎదగడానికి రైతులు యూరియా ను ఎక్కువగా వినియోగిస్తారు. జిల్లాలో ఆలస్యంగా నాట్లు వేసుకున్న నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్ తదితర మండలాలలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పోచారం ప్రాజెక్టులోకి ఆలస్యం గా నీరు చేరడంతో రైతులు ఆలస్యంగా నాట్లు వేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో యూరి యా అవసరం ఉంది. మాచారెడ్డి, భిక్కనూరు మండలాల్లో కూడా యూరియా కొరత ఉంది. కూరగాయ పంటలు సాగు చేస్తున్న ఆర్మూర్, బాల్కొండ, నందిపేట్, నిజామాబాద్ మండలాల్లో కూడా యూరియా అవసరం ఉంది. పొటాష్ ఎరువులదీ ఇదే పరిస్థితి.. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పొటాష్ వంటి ఎంఓపీ ఎరువులదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో వెయ్యి మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ ఎరువులున్నాయి. అయితే, ఈ ఎరువులకు రైతుల నుంచి డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
శివ్వంపేట, న్యూస్లైన్: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చాలినంత యూరియా లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురియడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అందుకు తగినట్లుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆగ్రోస్, పీఏసీఎస్, గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో విక్రయాలు చేపడతున్నా చాలినంత యూరియా రాకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. గత పదిరోజుల్లో ఐదుసార్లు యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. సోమవారం పీఏసీఎస్కు 20 టన్నుల యూరియా రావడంతో భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. క్యూలో చెప్పులు, రాళ్లు, చెట్ల కొమ్మలు పెట్టారు. కౌంటర్ వద్ద యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. వచ్చిన యూరియా ఏ మాత్రం సరిపోకపోవడంతో రైతులు తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగేశ్వర్రావు ఆందోళన కారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. టోకెన్లు ఉన్నవారికే యూరియా టేక్మాల్: మండల కేంద్రమైన టేక్మాల్లో సోమవారం రైతులు, మహళలు యూరియా కోసం పడిగాపులుగాశారు. స్థానిక వ్యవసాయాధికారి శ్రీకాంత్ రాహుల్ను రైతులు చుట్టూ ముట్టి యూరియా ఎప్పుడిస్తారని నిలదీశారు. ప్రస్తుతం 60టన్నుల యూరియా వచ్చిందన్నారు. ఈ స్టాకును రెండు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చిన రైతులకు పంపిణీ చేశారు. మిగతా వారికి అందకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ అల్లాదుర్గం రూరల్: పొలీసు బందోబస్తు మధ్య యూరియాను విక్రయించిన సంఘటన సోమవారం అల్లాదుర్గం మండలం చిల్వెరలో చోటు చేసుకుంది. గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా యూరియాను విక్రయించారు. రైతులు ఎరువుల కొసం ఎగబడడంతో తోపులాట జరిగింది. ఒక దశలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది రైతులను వరుస క్రమంలో నిలబెట్టి యూరియాను పంపిణీ చేశారు. ముస్లాపూర్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అల్లాదుర్గం మండలానికి 2500 టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటి వరకు 850 టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. రైతులకు మరో 1500 టన్నుల యూరియా అవసరముంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎరువులు దొరకక పొవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటలోపే 10 మెట్రిక్ టన్నులు పంపిణీ మెదక్ రూరల్: కేంద్ర ప్రభుత్వ నిబంధనలవల్ల పీఏసీఎస్లు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చేందుతున్న సిబ్బంది సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆందోళన చేపట్టేందుకు తరలివెళ్లారు. ఇదే సమయంలో ఎరువుల కోసం మండలంలోని నలుమూలలనుంచి రైతులు తరలివచ్చారు. దీంతో డీలర్ల వద్ద ఉన్న 10 మెట్రిక్ టన్నుల యూరియా గంటలోపే అయిపోయింది. సొసైటీ ఆధీనంలో ఉన్న 12 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేద్దామంటే పీఏసీఎస్ అందుబాటులో లేరు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ విజయ్కుమార్ సొసైటీ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు యూరియాను సరఫరా చేయించారు. దీంతో అన్నదాతలు ఆందోళన ను విరమించారు. -
మార్కెట్లోకి కొత్త యూరియా!
కేంద్రం ఆదేశంతో ‘వేపనూనె’ యూరియాను తీసుకొచ్చిన కంపెనీలు సాక్షి, హైదరాబాద్: దేశీయ మార్కెట్లోకి కొత్త రకం యూరియా వచ్చింది. మనదేశంలో తయారవుతున్న యూరియాలో కనీసం 35 శాతం వేపనూనె పూత యూరియా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు ఈ యూరియాను తీసుకొచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా యూరియాను సరఫరాచేసే ‘క్రిషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్’(క్రిభ్కో) ఇప్పటికే 65వేల టన్నుల వేప నూనె పూత ఉన్న యూరియాను మన మార్కెట్లో ఉంచగా, నాగార్జున ఫెర్టిలైజర్స్ మరో 10వేల టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది. యూరియా వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ చర్య వల్ల రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా యూరియా దిగుమతులు తగ్గి ఏడాదికి దాదాపు 99 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,940 కోట్లు) విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న యూరియాలో పైర్లకు 30 శాతం అందుతుండగా.. మిగిలిన 70 శాతం గాలిలో, భూమిలో వృథా అవుతుంది. యూరియాకు వేప నూనె పూత ఉంటే ఈ వృథా గణనీయంగా తగ్గుతుంది. చాలాకాలం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు యూరియాకు వేప నూనె పూత వేయమని రైతులకు సలహా ఇస్తూ ఉన్నారు. అయితే రైతు స్థాయిలో ఇలా చేయడంలో ఉన్న ఇబ్బందుల రీత్యా ఈ సలహాను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో యూరియా ఉత్పత్తి దశలోనే వేప నూనె పూత ఉండేలా చూసేందుకు కేంద్రం నడుంబిగించింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 35 శాతం యూరియాకు వేపనూనె పూత తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. దీంతో సంబంధిత యూరియా కంపెనీలు వారి కర్మాగారాల్లో అందుకు తగిన మార్పులు చేసుకుంటున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో వేప పూత యూరియానే మార్కెట్లో ఉంచేలా చేసేందుకు కసరత్తు జరుగుతోంది. బస్తాకు రూ.14 అదనం... ప్రస్తుతం మామూలు యూరియా 50 కిలోల బస్తా ధర రూ.284 ఉండగా, వేప నూనె పూత పూసిన యూరియా బస్తా ధరను రూ.298గా ప్రభుత్వం నిర్ణయించింది. బస్తాకు రూ.14 అదనంగా చెల్లించినా, ఐదు బస్తాల మామూలు యూరియా వాడాల్సిన చోట వేప నూనె పూత ఉన్న యూరియా నాలుగు బస్తాలు వేస్తే సరిపోతుంది. వేప నూనె పూత యూరియా వాడకం పూర్తిస్థాయిలో అలవాటైతే దేశవ్యాప్తంగా 30 లక్షల టన్నుల యూరియా వాడకం తగ్గే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా 3 కోట్ల టన్నుల యూరియా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షల టన్నుల యూరియా వినియోగంలో ఉంది. వేప నూనె పూత పూసిన యూరియా వాడినట్లయితే కనిష్టంగా 10 శాతం యూరియా వినియోగం తగ్గుతుంది. దీంతో ఆ మేరకు యూరియా దిగుమతులను తగ్గించుకోవచ్చని క్రిభ్కో అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టన్ను యూరియా 330 డాలర్లు పలుకుతోందని, ఈ లెక్కన మనకు దాదాపు 99 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. క్రిభ్కో, నాగార్జున ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఉజ్వల యూరియా)లు మన రాష్ట్రానికి ప్రధానంగా యూరియా సరఫరా చేస్తున్నాయి. -
ఎరువుల కోసం పడిగాపులు
తొగుట, న్యూస్లైన్: తొగుట ప్రాథమిక సహకార కేం ద్రానికి చేరిన యూరియాను శనివారం అధికారులు పోలీస్ పహారాలో పంపిణీ చేశారు. సహకార సంఘం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎరువుల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి సహకార సంఘానికి 440 బస్తాల యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మండల రైతులు ఉదయం 8 గంటకే తొగుట వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. 8.30 గంటలకు అధికారులు మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సహకార సంఘం సీఈఓ రాంరెడ్డి, ఇతర సిబ్బంది 10 గంటల వరకు కార్యాలయానికి రాలేదు. దీంతో రైతులు, వ్యవసాయాధికారులు సహకార సంఘం అధికారుల రాక కోసం గంటల కొద్ది వేచిచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 10.30 గంట లకు సహకార సంఘం అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. యూరి యా పంపిణీని ప్రారంభించారు. అప్పటికే భారీగా రైతులు తరలిరావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు పొందిన రైతులు, టోకెన్లు చిక్కని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ కూరాకుల మల్లేశం అక్కడికి చేరుకొని టోకెన్లు పొందిన రైతులకు ఎరువుల బస్తాలను ఇప్పిస్తామని గొడవలు వద్దని నచ్చజెప్పారు. కొంతమంది రైతులు సహకార పరపతి కేంద్రం వద్ద నెలకొన్న పరిస్థితిని ఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేశారు. స్పందించిన ట్రైనీ ఎస్ఐ రంజిత్ తోపాటు ఏఎస్ఐ హబీబ్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ యూరియా పంపిణీ చేసే చోటికి చేరుకున్నారు. టోకెన్లు పొందిన రైతులకు ఎరువుల బస్తాలను ఇప్పించారు. రెండు గంటల్లో 440 బస్తాల యూరియాను పంపిణీ చేసేశారు. దీంతో ఎరువులు దొరకక కొంతమంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.