breaking news
urea
-
తప్పని యూరియా కష్టాలు
-
యూరియా కోసం తోపులాట
పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని రైతులు యూరియా కోసం మంగళవారం ఉదయం పీఏసీఎస్ వద్దకు అధిక సంఖ్యలో వచ్చి క్యూలో నిల్చున్నారు. ఒకే కౌంటర్ ఉండడంతో ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు క్యూ కట్టారు. రెండువైపుల నుంచి రైతులు కౌంటర్ వద్దకు ఒకేసారి తోసుకోవడంతో శ్వాస ఆడక ముగ్గురు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు, వ్యవసాయ సిబ్బంది వారిని పక్కకు తీసుకొచ్చి ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేయడంతో ఇద్దరు మహిళలు స్పృహలోకి వచ్చి మరలా క్యూలైన్లోకి వెళ్లారు. గేమ్యానాయక్తండాకు చెందిన లక్ష్మి కొంత ఇబ్బంది పడటంతో 108లో పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ చొరవ తీసుకుని పీఏసీఎస్కు పక్కనే ఉన్న పాత సీడీపీఓ కార్యాలయం వద్ద మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయించారు. రైతుపై చేయిచేసుకున్న హోంగార్డు! యూరియా కోసం క్యూలో నిల్చున్న ఓ రైతుపై హోంగార్డు చేయిచేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ పెద్దవూరకు వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. తనను హోంగార్డు ఏమీ కొట్టలేదని, తాను వేకువజామునే వచ్చి క్యూలో నిల్చున్నట్లు మూత్రం రావడంతో బయటకు వెళ్లి వచ్చానని, తిరిగి క్యూలో నిల్చుండగా ఈ క్రమంలో తన వెనకాల ఉన్న రైతులు గొడవ చేశారని, దీంతో హోంగార్డు వచ్చి తనను బయటకు లాగే ప్రయత్నం చేశాడని, తాను ఉన్న విషయాన్ని చెప్పడంతో వెళ్లిపోయాడని చెప్పాడు.» సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్లోని మనగ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో బారులు దీరారు. -
అచ్చెన్నాయుడే ఎరువులు తరలిస్తున్నారు
పొందూరు: రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతుంటే... వచి్చన ఎరువుల్లో మంత్రులు చేతివాటం చూపుతున్నారని సాక్షాత్తూ అధికార పక్షం నాయకులే విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మలకాం గ్రామానికి రావాల్సిన ఎరువులను మంత్రి అచ్చెన్నాయుడే తరలించారంటూ టీడీపీ సర్పంచ్ జాడ శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం మలకాం గ్రామానికి వచి్చన ఎరువుల లారీని బయటకు వెళ్లనీయకుండా సర్పంచ్తో పాటు రైతులు సచివాలయం వద్ద అడ్డుకున్నారు.తమ గ్రామానికి పూర్తి స్థాయిలో ఎరువులు పంపాలని డిమాండ్ చేశారు. తొలివిడతలో 444 యూరియా బస్తాలు రాగా రెండో విడతలో వచి్చన ఎరువులను వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడే పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. తమ గ్రామానికి అధికారులు 330 బస్తాలు కేటాయించారని సర్పంచ్ చెప్పారు. అయితే సోమవారం 110 బస్తాలు మాత్రమే వచ్చాయని, మిగిలిన 220 బస్తాలు మాటేంటని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రావాల్సిన ఎరువులు సరఫరా అయ్యేంత వరకు లారీలోని 110 బస్తాల లోడును దించబోమని, లారీని ఇక్కడ నుంచి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. -
నెలాఖరులోగా మరో 1.17ఎల్ఎంటీ యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అదనపు యూరియా సరఫరా చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఈ మేరకు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా అదనంగా కేటాయించిన యూరియాలో 60,000 మెట్రిక్ టన్నులు రవాణాలో ఉండగా మరో 50,000 మెట్రిక్ టన్నులు వచ్చే వారంలోగా రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈనెలలో ఇప్పటికే 1.44 ఎల్ఎంటీ యూరియా రాష్ట్రానికి ఈ సీజన్లో కేటాయించిన 8.90 ఎల్ఎంటీ యూరియాలో కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రతినెలా కొంత మేర కోత విధిస్తూ సరఫరా చేసింది. దీంతో ఆగస్టు నెలాఖరు నాటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోత పడింది. ఈ ప్రభావం రాష్ట్రంపై పడటంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రతిరోజూ 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేస్తూ వచ్చింది. అయినా చాలా జిల్లాల్లో కొరత తీరకపోవడంతో వ్యవసాయ మంత్రి తుమ్మల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతోపాటు ఎరువుల శాఖ అధికారులను కలిసి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. దీంతో ఇప్పటివరకు ఈ నెలలోనే 1.44 ఎల్ఎంటీ యూరియాను సరఫరా చేసిన కేంద్రం మరో 1.17 ఎల్ఎంటీ విదేశీ యూరియా పంపించేందుకు అంగీకరించింది. ఈ కేటాయింపులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, మంగళూరు, జైగడ్, కృష్ణపట్నం వంటి ప్రధాన నౌకాశ్రయాల ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. ఇందులో కాకినాడ నుంచి 15,900 మెట్రిక్ టన్నులు, విశాఖ నుంచి 37,650 మెట్రిక్ టన్నులు, గంగవరం నుంచి 27,000 మెట్రిక్ టన్నులు, మంగళూరు నుంచి 8,100 మెట్రిక్ టన్నులు, జైగడ్ నుంచి 16,200 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం నుంచి 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా కానున్నాయి. కేంద్రం అదనంగా కేటాయించిన విదేశీ యూరియాలో ప్రస్తుతం 30,000 మెట్రిక్ టన్నులు లోడింగ్లో ఉండగా రాబోయే వారంలో మరో 50,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ పూర్తి కానున్నాయి. అలాగే 30,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే రవాణాలో ఉన్నాయి. త్వరలో రామగుండం కేంద్రం పునరుద్ధరణరాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రధాన వనరుల్లో రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్) కీలకమైనది. గత 90 రోజులుగా ప్లాంట్ షట్డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర రైతులకు యూరియా అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల కేంద్ర రసాయనాల మంత్రి, కార్యదర్శిని కలిసి రామగుండం యూనిట్ను త్వరితగతిన పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయగా దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆర్ఎఫ్సీఎల్ పునరుద్దరణ జరుగనుందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు. -
అధికారులే బాధ్యులు.. మాట మార్చడం చిటికెలో పని!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మాట మార్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేనే లేదని, యూరియాతోపాటు మొత్తం 94,892 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సెప్టెంబరు మూడో తారీఖున ప్రకటించిన బాబుగారు.. పదహారవ తేదీ వచ్చేసరికి యూరియా సరఫరాలో విఫలమయ్యామని, మానవ తప్పిదం జరిగిపోయిందని, అధికారులు తానిచ్చిన ప్రణాళికను అమలు చేయకపోవడంతోనే ఈ విపత్తు అన్నట్టుగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో వాపోయారు! తద్వారా ఏం తేలింది? రాష్ట్రంలో యూరియా నిల్వలు ఉన్నాయనడం తన ఘనతగానూ.. లేమికి కారణం అధికారులదిగానూ తేల్చేసినట్ట అయ్యింది!యూరియా కొరత లేదని దబాయించినప్పుడు... వాస్తవపరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పుడు బాబుగారు ఎంత హడావుడి చేశారని? వైఎస్సార్ కాంగ్రెస్ బుద్ది, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని, దుష్ప్రచారం చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతోందని, వారు మనుషులా, పశువులా అని కూడా పెడబొబ్బలు పెట్టారు. ఇలాంటి ప్రచారాన్ని ఆపకపోతే బొక్కలో పెడతా.. ఖబడ్డార్! అని హెచ్చరించారు కూడా. వైసీపీ రాజకీయంలో భాగం కావద్దని రైతులు, రైతులుగా ప్రవర్తించాలని కూడా ఆయన బెదిరించారు. ఈ హూంకరింపులన్నీ సోషల్మీడియాను బెదిరించేందుకే అన్నది స్పష్టం. టీడీపీకి వంతపాడే ఎల్లో మీడియా కూడా జిల్లా పత్రికలలో యూరియాపై రైతులు పడుతున్న పాట్లను ఫోటోలతో సహా కథనాలు ఇస్తూంటే ఆ విషయం బాబుగారికి తెలియకుండా పోతుందా? స్టేట్ పేజీలలో తన బెదిరింపు ప్రకటనలకే టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇస్తుండడంతో అదే నిజమని జనం నమ్మాలని భావించారా అన్నది తెలియదు. యూరియా సమస్యపై నెల రోజులుగా రైతులు అల్లాడుతున్నారు. కేంద్రాల వద్ద బారులు కడుతున్నారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఏదో బుకాయిస్తే సరిపోదన్న సంగతి అర్థమై ఉండాలి. దాంతో ఇప్పుడు యూరియా సరఫరాపై ప్లాన్ ఇచ్చానని నాలుక మడతేశారు. అదేమిటో చెబితే అధికారులకు తెలిసేది కదా! టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడంతో రైతులకు ఈ కష్టాలొచ్చాయని అంటున్నారు. యూరియా ఎక్కువగా వాడితే ఆ పంటలు వల్ల ప్రజలకు కేన్సర్వస్తుందని భయపెడుతున్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు నిర్వహించ లేదని, రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికార్లు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు.ఇందుకు బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఏ చర్య తీసుకున్నారు? ఉల్లి, టమోటా ధరలు కూడా పడి పోయాయని, ఈ టైమ్లో రైతులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్ లను కోరడం మంచిదే అయినా, కాని వాస్తవంలో రైతులు తమ ఉత్పత్తులను కాల్వలలో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. వారికి జరిగిన నష్టంపై ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడుతుందా అన్నది చెప్పి ఉంటే బాగుండేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. . ఆయన చెబుతున్న సంగతులన్నిటికి కేవలం అధికారులే బాధ్యులా? అంటే కాదనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం పెడుతూ అసలు పనులు చేయనివ్వకుండా ప్రచారానికి వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు చంద్రబాబు ఏదో ఒక చోట టూర్ చేస్తుంటారు.దాంతో అధికారులంతా ఆ ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైగా ప్రభుత్వానికి తరచుగా ఆయా నివేదికలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఏదో రకంగా కాకి లెక్కలతో రిపోర్టులు తయారు చేసి పంపే పనిలో అధికారులు ఉంటున్నారని ఎల్లో మీడియానే ఒక వార్త రాసింది. ఒక ఉదాహరణ చూద్దాం. రాయలసీమలో టమోటా, ఉల్లి పంటలు అధికం.ప్రతి నెల మొదటి తేదీన అదనపు ఫించన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగువేలు ఇవ్వడానికి హెలికాఫ్టర్ వేసుకుని జిల్లాలకు సి.ఎమ్. వెళుతున్నారు.అలాగే ఆయా చోట్ల ఇతర మంత్రులు కూడా ఆ పని చేస్తుంటారు. ఆ సందర్భంలో యూరియా సమస్య వంటివాటిపై ఎందుకు వీరు దృష్టి పెట్టలేదు? లేదా రాజంపేట, కర్నూలు, అనంతపురం వంటి చోట్లకు చంద్రబాబే వెళ్లారు కదా! ఈ మధ్య ఆయన బడ్డి కొట్టు వద్దకు, కుండలు చేసేవారి వద్దకు వెళ్లడం, ఆటో ఎక్కి ప్రయాణం చేయడం వంటివి చేస్తున్నారు కదా! ఆ క్రమంలో ప్రధానంగా ఆ జిల్లాలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని ఆ వర్గాల వారిని కలిసి మాట్లాడితే ముందుగానే యూరియా కొరత గురించి, టమోటా, ఉల్లి, మామిడి వంటి పంటల ధరల గురించి తెలిసేది కదా! యూరియా అవసరమైన మేర వేయకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు యూరియా వాడవద్దని, కాన్సర్ వస్తుందని చెబితే రైతులకు పుండుపై కారం చల్లినట్లు ఉండదా? అందుకే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వేస్తున్నారు. యూరియా వినియోగిస్తే కేన్సర్ వస్తుందని చెబుతున్నారు. మరి మద్యం తాగితే ఎలాంటి జబ్బు రాదా? దానిని ఎందుకు విచ్చలవిడిగా అమ్మిస్తున్నారని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. యూరియా వాడకపోతే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? పైగా అందుకోసం ఇప్పుడు ఉన్న పంటను ఎవరైనా కోల్పోవడానికి సిద్దపడతారా? ఇలాంటి వాటిని ఎప్పుడు చెప్పాలి. సీజన్ రావడానికి నెలల ముందు కదా! అందుకు తగు ప్రత్యామ్నాయాలు ఏమిటో రైతులకు వివరించాలి కదా? అవన్ని వదలివేసి ఇప్పుడే ఏదో తెలిసినట్లు మాట్లాడితే రైతులు విశ్వసిస్తారా? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయల చొప్పున ప్రతీ రైతుకు ఇస్తామని చెప్పి, ఒక ఏడాదిపాటు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఐదువేలు ఇచ్చారు. ఆ అనుభవం రైతులకు గుర్తు ఉండదా? భూసార పరీక్షలు జరగలేదని ఆయనే చెప్పారు.అవి ఎప్పుడు జరగాలి. ఎందుకు జరగడం లేదు? దానికి ఆయన, వ్యవసాయ మంత్రి బాధ్యులు కారా? ఇలాంటి సమస్యలన్నిటిని తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి రైతులకు విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్న అధికార యంత్రాంగం ఏ విధంగా అందుబాటులో ఉండాలో నిర్దేశిస్తూ పని చేయిస్తే, ఆ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నీరు కార్చిందా? లేదా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా అయ్యేవా? కావా? ఆ ఐదేళ్లు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా ఆందోళన చెందారా? రైతుల వద్దకే అవసరమైతే ఎరువులు సరఫరా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారంటే జగన్ ప్రభుత్వం అమలు చేసిన సేవావిధానాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! తప్పులేదు. గతప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తే దానిని కొనసాగించవచ్చు. అలా కాకుండా ద్వేషంతోనో, జగన్కు పేరు వస్తుందనో వ్యవస్థలను ధ్వంసం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పంటల ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సుమారు మూడువేల కోట్లను కేటాయించి ఖర్చు చేసేది. మరి ఇప్పుడు ఆ పని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది? ఏది ఏమైనా ఒక సంగతిని చంద్రబాబు గుర్తించారని అనుకోవచ్చు. పది,పన్నెండు రోజుల కిందట బొక్కలో వేస్తానని సోషల్ మీడియాను బెదిరించిన చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇకనైనా ఇలాంటి అనుచిత మాటలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూపన్ల కోసం రైతుల పోటాపోటీ
కారేపల్లి/అడవిదేవులపల్లి: ఒక్క బస్తా యూరియా దక్కించుకునేలా కూపన్ కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 890 బస్తాల యూరియా రాగా, శుక్రవారం కూపన్లు జారీ చేస్తున్నారనే సమాచారంతో మహిళలు సహా పెద్దసంఖ్యలో రైతులు వచ్చారు. కారేపల్లి ఎస్సై బి.గోపి, ఏఓ భట్టు అశోక్కుమార్ ఆధ్వర్యంలో రైతులను నియంత్రించేందుకు శ్రమ పడాల్సి వచి్చంది. రైతుల ఉరుకులు పరుగులు, తోపులాటలో ఒకరిపై ఒకరు పడగా, కొందరు వాహనాలపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.తొక్కిసలాటలో ఏఓ అశోక్కుమార్ కూడా సొమ్మసిల్లడంతో కారేపల్లి పీహెచ్సీకి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చివరకు కూపన్లను జిన్నింగ్ మిల్లులో ఇస్తామని చెప్పడంతో రైతులు అక్కడికి పరుగులు తీశారు. అక్కడికీ వేలాదిగా చేరడంతో అదే పరిస్థితి ఎదురైంది. కొందరు రైతులు కూపన్ల కోసం ఎగబడటంతో హోంగార్డు శంకర్ ఉక్కిరిబిక్కిరై కారేపల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి తలదాచుకున్నాడు. ఈక్రమంలో 2,152 కూపన్లను రైతులకు అందజేయగా, మరో 1,600 మంది ఆందోళనకు దిగడంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకుని నచ్చచెప్పారు. ఆపై అందరి పేర్లు నమోదు చేసుకుని 1,600 మంది రైతులకు ఇళ్ల వద్దే శనివారం నుంచి కూపన్లు ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. 11న తోపులాటలో గాయపడ్డ మహిళ మృతినల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం జరిగిన తోపులాటలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. గోన్యాతండాకు చెందిన పాతులోతు దసి (52) ఈనెల 11న రైతు వేదిక వద్దకు యూరియా కోసం వచ్చి క్యూలో నిలబడింది. ఈ సందర్భంగా రైతుల మధ్య జరిగిన తోపులాటలో క్యూలో ఉన్న దసి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు ఆమెను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
యూరియా.. యుద్ధం!
సాక్షి, అమరావతి: యూరియా కోసం రైతన్నల ఇక్కట్లు.. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలు, భక్తుల దుర్మరణాలు.. ప్రజల ప్రాణాలను హరిస్తున్న మద్యం, బెల్టు షాపులపై శాసన మండలి సాక్షిగా కూటమి సర్కారు అసమర్థత, నిర్వాకాలను విపక్ష వైఎస్సార్ సీపీ కడిగి పారేసింది. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని కన్నెర్ర చేసింది. రైతుల సమస్యలపై తక్షణమే చర్చించాల్సిందేనని పట్టుబట్టింది. గురువారం మొదలైన మండలి సమావేశాలు తొలిరోజు రైతన్నలు, ప్రజా సమస్యలపై విపక్షం ఎక్కడికక్కడ నిలదీయడంతో వాడిగా సాగాయి. ఒకపక్క తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తుల దుర్మరణానికి తానే బాధ్యుడినని సభ సాక్షిగా ఒప్పుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. మరోపక్క బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి దాడి చేశారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా మాజీ సీఎం పేరును ప్రస్తావించడం ఏమిటని మండిపడ్డారు. సర్కారు తీరుకు నిరసనగా విపక్షం వాకౌట్ చేసింది. మండలి తొలిరోజు పలుమార్లు వాయిదా పడింది. పోడియం చుట్టుముట్టి నినాదాలు.. రైతన్నలు పొలం పనులు వదిలేసి రోజంతా క్యూలైన్లలో నిలబడినా ఒక్క కట్ట కూడా యూరియా దొరకని దుస్థితిని, ఎరువుల సరఫరాలో సర్కారు దారుణ వైఫల్యాలను శాసన మండలి సాక్షిగా విపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు ఎండగట్టారు. అన్నదాతల ఇక్కట్లపై గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించడంతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో శానస మండలి దద్ధరిల్లింది.అదునులో యూరియా ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తామంటే ఏం లాభమని ప్రభుత్వాన్ని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏ ఒక్క రైతైనా రోడ్డెక్కడం చూశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచినీళ్లు దొరకడం లేదు కానీ మద్యం దొరకని ప్రాంతమంటూ లేదని మండిపడ్డారు. బెల్టు షాపుల్లేని గ్రామాలే కాదు.. సందులు కూడా లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం తాగి పెద్దసంఖ్యలో అమాయకులు చనిపోతున్నారని, ఈ విషయం టీడీపీ అనుకూల మీడియాలోనూ వచ్చిoదని గుర్తు చేశారు. వేలం పాటలు పెట్టి మరీ బెల్టు షాపులను కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి చరిత్రలో తొలిసారి తొక్కిసలాట చోటు చేసుకుని భక్తులు దుర్మరణం చెందడం.. సింహాచలంలో గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోవటాన్ని ప్రస్తావిస్తూ ఈ విషాదాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండలిలో వైఎస్సార్సీపీ మండిపడింది. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి ఘటనకు బాధ్యుడిగా బదిలీ చేసిన ఎస్పీనే తిరిగి ఎందుకు నియమించాల్సి వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు గురువారం ఉదయం శాసన మండలి ప్రారంభం కాగానే.. వైఎస్సార్సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, వై.శివరామిరెడ్డి రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా తమ స్థానాల్లో నిలబడి రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. అయితే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెట్టినట్టు చైర్మన్ ప్రకటించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించానని, ఈ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయిద్దామని చైర్మన్ సూచించగా రైతులు సమస్యలపై చర్చించాల్సిందేనని విపక్ష సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ‘రాష్ట్రంలో యూరియా ఎటుపోయింది బాబూ...? యూరియా కోసం రైతులు ఎండల్లో క్యూలైన్లల్లో నిలబడాలా..? సిగ్గు సిగ్గు... రైతులను అవమానపరిచిన మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి..’ అని పోడియం ఎదుట ప్లకార్డులతో నినదించారు. ‘నాడు రైతు సంక్షేమం.. నేడు రైతు సంక్షోభం.. రాజకీయాలతోనే కాలక్షేపం.. పట్టదు రైతన్నల సంక్షేమం.. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోండి.. తక్షణమే గిట్టుబాటు ధరలు కల్పించండి.. పంటలకు ఉచిత బీమా ఏదీ? రైతన్నకు ధీమా ఏది? అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. ధరల స్థిరీకరణ నిధి ఎక్కడా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీఏసీలో నిర్ణయం తీసుకున్నాక చర్చిద్దామని వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించగా, శాంతించని వైఎస్సార్సీపీ సభ్యులు చైర్మన్ కుర్చీని చుట్టుముట్టి నినాదాలు కొనసాగించారు. దీంతో సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. గత ఐదేళ్లలో క్యూలైన్లు ఎప్పుడైనా ఉన్నాయా? తిరిగి 10.31 గంటలకు సభ ప్రారంభమయ్యాక కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిలబడి యూరియా, రైతుల సమస్యలపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. చైర్మన్ ఎప్పుడు సమయం కేటాయించినా సిద్ధమేనని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ... ప్రభుత్వమే చర్చకు సిద్ధమని చెప్పినప్పుడు రేపు, ఎల్లుండి అంటూ వాయిదాలు ఎందుకు? తక్షణమే చర్చ ప్రారంభించాలని కోరారు.‘గత ఐదేళ్లలో ఎక్కడైనా ధర్నాలు జరిగాయా? ఎక్కడైనా క్యూలు ఉన్నాయా? ఎప్పుడైనా యూరియా పంపిణీ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారా?’ అని నిలదీశారు. సీజన్లో అదునులో యూరియా సరఫరా చేస్తేనే పంటలకు ఉపయోగమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దీనిపై రేపు చర్చిద్దామని మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రతిపాదించడంతో వైఎస్సార్సీపీ సభ్యులు శాంతించారు.బెల్టు షాపుల్లేని సందు లేదు..!శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానాల పట్ల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో కల్తీమద్యం తాగి పెద్దసంఖ్యలో అమాయకులు చనిపోతున్నారని, ఈ విషయం మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో కూడా వచి్చందని అధికార పక్షాన్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మంద బలం ఉందని వాస్తవాలు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం సరి కాదన్నారు. మద్యం దుకాణాల కంటే బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయన్నారు. వేలం పాటలు పెట్టి మరీ కేటాయిస్తున్నారన్నారు. తొలిసారి గుర్తించిన బెల్టు షాపులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామన్నారని.. ఇప్పటివరకు ఎన్ని గుర్తించారు? ఎంత పెనాల్టీ విధించారు? అని నిలదీశారు. రాష్ట్రంలో స్పిరిట్, రంగునీళ్లతో తయారు చేసిన మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. వీటిపై ఎన్ని కేసులు పెట్టారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. మండపేట మున్సిపల్ కార్యాలయం పక్కనే మద్యం షాపు ఏర్పాటుతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు తీవ్ర భయ భ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఎక్సైజ్ పాలసీ అధ్వానం.. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ అధ్వానంగా ఉందని వైఎస్సార్సీపీ సభ్యుడు శివరామిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 43 వేల బెల్ట్ షాపులున్నాయని, ప్రతి గ్రామంలో 8–10 వరకు బెల్ట్ షాపులున్నాయని చెప్పారు. మద్యానికి బానిసై అనంతపురంలో రాజన్న అనే యువకుడు ఉరేసుకుని చనిపోగా మరో యువకుడు బాషా పూటుగా మద్యం తాగి చనిపోయాడని తెలిపారు. సర్కారు మద్యం విధానం వల్ల చనిపోతున్న వారి కుటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. ఎన్ని షాపులపై చర్యలు తీసుకున్నారు? ఇంటెలిజెన్స్ విభాగం వద్ద బెల్టుషాపుల సమాచారం ఉందని వైఎస్సార్సీపీ సభ్యుడు పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. వారి లెక్కల ప్రకారం ఎన్ని ఉన్నాయి? ఎన్నింటిపై చర్యలపై తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం ఆదాయం గణనీయంగా పెరిగింది: మంత్రి రవీంద్ర అంతకుముందు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మద్యాన్ని తాము ఆదాయ వనరుగా చూడడం లేదని, అయినా తమ మద్యం విధానం వల్ల రాష్ట్రానికి ఆదాయం భారీగా పెరిగిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం పూర్తిగా ఆగిపోయిందని, పొరుగు రాష్ట్రాల ప్రజలే ఇక్కడకు వస్తున్నారన్నారు. సరిహద్దు జిల్లాల్లో 50–60 శాతం విక్రయాలు పెరగడమే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తొక్కిసలాటలో భక్తుల మృతితిరుపతిలో తొక్కిసలాటతో పాటు సింహాచలంలో గోడ కూలి భక్తుల దుర్మరణం పాలైన ఘటనలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ధ్వజమెత్తింది. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, వరుదు కళ్యాణి, కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ అడిగిన ప్రశ్నలపై సభలో చర్చ జరిగింది. ప్రభుత్వం, టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే భక్తులు మృత్యువాత పడ్డారని వైఎస్సార్సీపీ సభ్యులు మండిపడ్డారు.ఈ సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ‘కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అంటే.. ఆ శాఖ మంత్రిగా నేనే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. మంత్రి తన ప్రసంగంలో తిరుపతి ఘటనకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తీరును విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో విపక్ష సభ్యులు నిలుచుని ఆందోళనకు దిగడంతో కొద్ది సేపు సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన అనంతరం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స మాట్లాడుతూ సున్నితమైన అంశంపై ప్రభుత్వం సూటిగా జవాబివ్వకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేయటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నడూ చూడని ఘటనలురామసుబ్బారెడ్డి, వరుదు కళ్యాణి, భరత్‘తిరుమల చరిత్రలో ఇంత ఘోరమైన ఘటన ఎప్పుడూ జరగలేదు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఇదేమి చిన్న విషయం కాదు. బాధ్యులపై. కఠిన చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అదే సమయంలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందని, టిక్కెట్ జారీ కౌంటర్ల వద్ద తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని, మరి వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నింంచారు. టీటీడీ దేవస్థానం పాలక మండలిపై చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. సింహాచలం ఉత్సవాల నిర్వహణకు ఐదుగురు మంత్రులతో కమిటీ నియమించటాన్ని ప్రస్తావిస్తూ ఆ దుర్ఘటన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. పవిత్ర ఆలయాల వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. తిరుపతి ఘటనకు బాధ్యులుగా కొందరు అధికారులను సస్పెండ్ చేసినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జవాబిచ్చారు. తిరుపతి ఘటన సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పరామర్శల పేరుతో దాడి చేశారంటూ మంత్రి వ్యాఖ్యానించడంపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అనంతరం విపక్ష సభ్యుల ఆందోళన నడుమ సభ కొద్దిసేపు వాయిదా పడింది. బాధ్యత వహిస్తానంటూనే మాజీ సీఎం పేరు ప్రస్తావనా?బొత్స సత్యనారాయణసభ తిరిగి ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రశ్నకు సంబంధం లేని విషయాలను మంత్రి ప్రస్తావించటాన్ని తప్పుబట్టారు. రెండు దుర్ఘటనల్లో ‘11 మంది భక్తులు చనిపోవటానికి తానే బాధ్యత వహిస్తానని మంత్రి ఒప్పుకుంటూనే.. మాజీ సీఎం పేరును చర్చలోకి ఎందుకు తెస్తున్నారని నిలదీశారు. ‘మంత్రి మాట్లాడిన ప్రతీ మాటను పూర్తిగా ఖండిస్తున్నాం. ఘటనకు మంత్రి బాధ్యత వహించాలి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని ప్రకటించారు. విపక్ష సభ్యుల వాకౌట్ అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ అలిపిరి వద్ద శనీశ్వర విగ్రహం విషయంలో మాజీ టీటీడీ చైర్మన్ రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. ఘటనపై భూమనపై కేసు నమోదు చేస్తామన్నారు. రెండు రోజుల వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని 10 రోజులు కొనసాగించడంపై పునః సమీక్షిస్తామన్నారు. -
యూరియా కోసం రేయింబవళ్లూ పడిగాపులు
సంతకవిటి: ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ కడుతూనే ఉన్నారు. నిద్రకూడా మానుకుని రాత్రుళ్లూ షాపుల వద్దే పడిగాపులు పడుతున్నారు. వేకువనే అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. యూరియా కోసం ఇన్ని కష్టాలు ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటిలో ఓ ప్రైవేటు దుకాణం వద్ద బుధవారం రాత్రి 9 గంటల వరకు యూరియా కోసం క్యూకట్టిన రైతులు సరుకు అందకపోవడంతో నిరాశచెందారు. గురువారం మళ్లీ పంపిణీ చేస్తామని దుకాణం యజమాని చెప్పడంతో రాత్రంతా రైతులు అక్కడే ఉండిపోయారు. దోమలతో జాగారం చేశారు. గురువారం వేకువనే ఇలా బారులుతీరారు. భారీగా బారులు తీరిన రైతులను చూసి యజమాని దుకాణం తెరిచేందుకు భయపడ్డారు. ఏఓ సి.బి.యశ్వంతరావు, పోలీసుల సమక్షంలో దుకాణం తెరిచి యూరియా పంపిణీ ప్రారంభించారు. ఆధార్కార్డు, వన్–బి తెచ్చిన వారికే యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి దోమల్లో కాపలా ఉంటే ఇప్పుడు నిబంధనలు పెట్టడంపై వాగ్వాదానికి దిగారు. టోకెన్లు ఉన్న రైతులకు 444 బస్తాలు పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వ్యవసాయం మానేయాలా బాబూ..నేను దివ్యాంగుడిని. క్యూలైన్లో నిల్చోగలనా? నేను వ్యవసాయం మానేయాలా బాబూ.. నేనేమి చేయాలి చెప్పండి. గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాలకే యూరియా వచ్చేది. ఇప్పుడు బస్తా యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీసం ఒక బస్తా యూరియా కూడా అందలేదు. – గడే సీతారాం, దివ్యాంగుడు, రైతు, ముకుందపురం -
రిసెప్షన్ చేయం.. యూరియాకు సాయం
మిర్యాలగూడ: తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రూ.2 కోట్ల విరాళాన్ని గురు వారం సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. ఇటీవల తన కుమారుడు వివాహం జరగగా.. రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రూ.2 కోట్లను రైతుల సంక్షేమం కోసం అందజేశారు. నియోజకవర్గంలో లక్ష మంది రైతులకు ఒక బస్తా యూరియాను ఉచితంగా అందించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడు, కోడలు సాయిప్రసన్న, వెన్నెల వివాహం గత నెలలో జరిగింది.రిసెప్షన్ ఈ నెల 12న ఘనంగా చేయాలని భావించారు. అయితే తమకు వేడుక వద్దని.. ఆ డబ్బును రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కొడుకు, కోడలు కోరారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్రెడ్డికి చెక్కు అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన సతీమణి మాధవి, పెద్ద కుమారుడు, కోడలుతో పాటు చిన్న కుమారుడు సాయిఈశ్వర్రెడ్డి తదితరులు నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డితో కలిసి హైదరాబాద్లోని సీఎం నివాసానికి వెళ్లి చెక్కు అందజేశారు. -
Warangal: యూరియా కోసం రైతుల అవస్థలు
-
Garam garam varthalu: యూరియా చోరీ
-
Urea Shortage: చంద్రబాబు పాలనా వైఫల్యాలు బట్టబయలు
-
యూరియా కొరతపై తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
-
మేం చెప్పిన వారికే ఇవ్వాలి
‘యూరియా మేం చెప్పిన వారికే ఇవ్వాలి. లేదా గతంలో చేసినట్టు మా ఇంటి దగ్గర టోకెన్లు రాసి రైతులకు ఇవ్వాలి. లేదంటే అమ్మకాలు ఆపేయాలి’ అంటూ శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవెల్లిలో ఓ టీడీపీ నాయకుడు అధికారులకు హుకుం జారీ చేశాడు. ఆదివారం బూరవిల్లి రైతు సేవా కేంద్రానికి 313 యూరియా బస్తాలు వచ్చాయి. ఇదే ఆర్ఎస్కే పరిధిలో అంబళ్లవలస గ్రామం ఉంది. ఆ రైతులకు సచివాలయం దగ్గర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు టోకెన్లు మెయిన్రోడ్డులోని పాల కేంద్రం దగ్గర ఇస్తారనే సమాచారంతో రైతులంతా అక్కడకు చేరుకున్నారు.కొందరు రైతులకు టోకెన్లు ఇస్తుండగా, స్థానిక టీడీపీ నాయకుడు మళ్ల అబ్బాయినాయుడు అక్కడకు చేరుకొని ఇక్కడ యూరియా ఇవ్వడానికి వీల్లేదని, టీడీపీ కార్యకర్తలకే యూరియా ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగా రు. అధికారులు టోకెన్లు పంపిణీ నిలిపేశారు. ఎస్ఐ సీహెచ్ గంగరాజు టోకెన్లు ఇచ్చే పాలకేంద్రం వద్దకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయమై ఏఓ డి.పద్మావతిని వివరణ కోరగా యూరియా పంపిణీ మంగళవారం సచివాలయం వద్ద జరుగుతుందని చెప్పారు. -
యూరియా కోసం యాతన
సాక్షి, నెట్వర్క్: యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుసేవా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఘర్షణలు, తోపులాటలు చోటుచేసుకోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టంచుకోవడం లేదు. పైగా కూటమి నేతలు, వారి అనుయాయులకు యూరియా బస్తాలను అడ్డదారిలో అందిస్తోంది. ఫలితంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర ఘటనలు ప్రభుత్వ కఠినత్వానికి, తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ⇒ విజయనగరం జిల్లా గజపతినగరం మండలం లోగీశ గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు సోమవారం బారులు తీరారు. క్యూలో ఉన్నవారికి కాకుండా టీడీపీ అనుచరులకు అడ్డదారిలో యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఓ రైతు కిందపడిపోయాడు. దీంతో కర్షకులు ఆందోళన చేయడంతో అధికారులు యూరియా పంపిణీని నిలిపివేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం హెచ్ఎన్ పేట, వడ్డితాండ్ర సచివాలయ పరిధిలోని రైతులు యూరియా కోసం సోమవారం బారులు తీరారు. ఎండలోనే గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. సగం మందికే యూరియా బస్తాలు అందాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళిలోనూ రైతులు యూరియా కోసం గ్రోమోర్ సెంటర్ వద్ద పడిగాపులు పడ్డారు. ⇒ చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. బస్తాలు తీసుకునే క్రమంలో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక, తోటపల్లి రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో ఉంచి మండుటెండలో పడిగాపులు పడ్డారు. సాయంత్రం సమయంలో వర్షం పడటంతో తోటపల్లిలో వానలోనే తడిసిముద్దయ్యారు. ⇒ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం నాగాపురం సచివాలయం వద్ద రైతులు యూరి యా కోసం సోమవారం ఆందోళన చేశారు. కేవలం 40 బస్తాలు పంపిణీ చేసి ఆపేయడంతో మిగతా రైతులు సిబ్బందిని నిలదీశారు. ⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిశింగిలో సోమవారం అరకొరగా యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. క్యూలైన్లో నిరీక్షించినా యూరియా దొరక్క రైతులు నిరాశతో వెనుదిరిగారు. ⇒ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం తహసీల్దార్ కార్యాయలం వద్ద ధర్నా చేపట్టారు. టోకెన్ల జారీలోనూ అధికారులు చేతివాటం చూపుతున్నారని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారిణి గీతాకుమారి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. -
AP: ‘యూరియా’పై హ్యాండ్సప్!
కొరతలేదు.. న్యూసెన్స్ చేస్తే బొక్కలో పెట్టి పనిష్ చేస్తాఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడైనా ఎరువులు లేవంటే నేనే అక్కడకు వెళ్తా! కావాలని న్యూసెన్స్ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టి పనిష్ చేస్తా.. మీరు రాజకీయాల్లో భాగస్వాములు కావద్దు.. రైతులు రైతులుగా ప్రవర్తించండి! డ్రామాలు ఆడితే ఈ ప్రభుత్వమంటే ఏమిటో చూపిస్తాం.. – ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఔను.. యూరియా పంపిణీలో విఫలమయ్యాం.. రైతులకు యూరియా సరఫరాలో వైఫల్యం చెందాం.. ఇది మానవ తప్పిదమే. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి. భూసార పరీక్షలు నిర్వహించ లేదు.. రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదు.. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.. ఇప్పుడు ఉల్లి, టమాటా ధరలు పడిపోయాయి.. ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలి. – కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం చెందామని, ఇది మానవ తప్పిదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని సీఎం అంగీకరించారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో రైతుల పడిగాపులు ఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని, ఎక్కడైనా ఎరువులు లేవంటే తానే స్వయంగా అక్కడకు వెళ్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు తాజాగా యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఎట్టకేలకు కలెక్టర్ల సదస్సు సాక్షిగా ఒప్పుకోవడం గమనార్హం. సాగు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలుపుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో వృద్ధి లక్ష్యాలపై ప్రజెంటేషన్ అనంతరం కలెక్టర్లు వివిధ సమస్యలను ప్రస్తావించిన సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.అల్లూరి సీతారామరాజు జిల్లా తోటపల్లిలో క్యూలైన్లో చెప్పులు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు..యూరియా సరఫరాలో వైఫల్యం మానవ తప్పిదమే అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడేవి కావని, కరెంట్ ఉండేది కాదని, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసుకుని పోయేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని, అయితే రైతులకు యూరియా సరఫరా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. యూరియా సరఫరా విషయంలో ప్రణాళిక సరిగా అమలు చేయలేదన్నారు. ఈ విషయంలో వైఫల్యం చెందామన్నారు. ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. భూసార పరీక్షలు.. పోషకాల పంపిణీ లేదు ఈ ఏడాది భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నుంచి ముందుగా భూసార పరీక్షలు చేసి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇవ్వాలని సూచించారు. యూరియాను ఎక్కువగా వినియోగిస్తే కేన్సర్ జబ్బుల్లో తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మొదటి స్థానానికి వెళ్తుందని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పంజాబ్ను కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఆ దిశగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం వినియోగిస్తున్న యూరియాలో ఒక బస్తా తగ్గించే రైతులకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని, ఆ మొత్తాన్ని యూరియా వాడకం తగ్గించే రైతులకు ఇస్తామని చెప్పారు. త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఉల్లి, టమాటా రైతులు రోడ్డెక్కకుండా చూడాలి..రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. యూరప్ దేశాల్లో మన ఉత్పత్తులకు ధర తగ్గిస్తున్నారన్నారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్నారు. ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, లేదంటే ఉత్పత్తులను కొనేవారు ఉండరన్నారు. డిమాండ్, సరఫరాకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్యపరచడంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. పొగాకు కొనుగోలు చేశామని, ఈ ఏడాది పంట హాలిడే ఇచ్చామన్నారు. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా ధరలు పడిపోయాయని, ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా వారి ఇబ్బందులను తగ్గించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కడప నుంచి రైతులు టమోటా తీసుకురావాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతుందని వదిలేస్తున్నారని, అలా కాకుండా రవాణా చార్జీలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. పట్టణ నియోజకవర్గాలను మినహాయించి మిగతా 157 చోట్ల పశువుల హాస్టళ్లను చేపట్టాలని సూచించారు. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటర్న్∙గిఫ్ట్ ఇస్తుందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో పశు సంపద పాత్ర కీలకమన్నారు. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేయాలని సూచించారు.రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ కట్సాగు వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలిపేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికి 30 శాతం మందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా వారు కూడా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే యూనిట్ విద్యుత్ రూ.1.50 సరఫరాను నిలుపుదల చేస్తామన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతుల్లో క్రమశిక్షణ అవసరమన్నారు. కాలుష్యం పెరిగి ఆక్వా ఉత్పత్తులు దెబ్బ తింటే కొనేవారు ఉండరని సీఎం పేర్కొన్నారు.కోనసీమ కంటే ‘అనంత’ తలసరి ఆదాయం అధికం..కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. ఇందుకు ఉద్యాన పంటలే కారణమన్నారు. వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయిల్ పామ్ ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్ ఛేంజర్గా మారిందన్నారు. ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయన్నారు. ఫెయిల్.. పాస్ మంత్రులకూ వర్తిస్తుంది ఈ ఆర్థిక ఏడాది వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఎవరు ఫెయిల్? ఎవరు పాస్? అనేది డేటా ప్రకారం తేలుతుందని, ఇది కలెక్టర్లతోపాటు మంత్రులకూ వర్తిస్తుందని సీఎం స్పష్టంచేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి సాధించాలన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారి నుంచి మంత్రులు, కలెక్టర్లు గ్రామ కార్యదర్శి వరకు వృద్ధి సాధనలో పాత్ర పోషించాలన్నారు. విమానాశ్రయాలు, పోర్టులు, పర్యాటక ప్రాజెక్టుల వద్ద ఎకో సిస్టం రూపొందించాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. -
శ్రీకాకుళం జిల్లా బూరవెల్లి లో యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
-
Urea: మనం ఫెయిల్.. ఒప్పేసుకున్న చంద్రబాబు
-
గజపతినగరంలో ఉద్రిక్తత.. యూరియా కోసం రైతుల కొట్లాట
విజయనగరం: గజపతినగరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతుల ఆందోళనకు దిగారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో రైతుల కొట్లాటకు దిగారు. కుర్చీలు విరిగేలా టీడీపీ నేతలు, రైతులు కొట్టుకున్నారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై రైతులు తిరగబడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పడనిరాని పాట్లు పడుతున్నారు.అనకాపల్లి: హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో యూరియా కోసం రైతుల పాట్లు పడుతున్నారు. ఎస్. రాయవరం మండలం కొరుప్రోలు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా సక్రమంగా పంపిణీ చేయలేదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని రైతులు డిమాండ్ చేశారు.కాగా, కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత బొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. -
యూరియా కోసం యుద్ధం
సంతబొమ్మాళి/బుచ్చెయ్యపేట/చౌడేపల్లె/సంతకవిటి/సామర్లకోట/ఎచ్చెర్ల/పిఠాపురం: కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. వారం రోజుల కిందట వచ్చిన 110 యూరియా బస్తాలను అధికారులు పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎప్పుడు పంపిణీ చేస్తారని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను రైతులు అడుగగా సరిపడా యూరియా ఇంకా రాలేదని, పెట్టిన ఇండెంట్ మొత్తం వస్తే పంపిణీ చేస్తామని వాయిదా వేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా రావాల్సిన యూరియా రాలేదు. దీంతో ఇదివరకు వచ్చిన 110 బస్తాల యూరియా కోసం శనివారం రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద కాపు కాశారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను గ్రామంలో ఉన్న అసిరమ్మ గుడి వద్దకు రహస్యంగా రప్పించి తమ అనుకూలమైన వారితో వేలి ముద్రలు వేయించి స్లిప్పులను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కప్ప ఎర్రయ్య రైతులను బూతులు తిట్టడంతో కర్షకులు తిరగబడ్డారు. ఎర్రయ్యను చితకబాదారు. » అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో యూరియా కోసం రైతులు శనివారం తోపులాటకు దిగారు. రాజాం రైతు సేవా కేంద్రానికి 260 బస్తాల యూరియా రావడంతో రాజాం, నీలకంఠాపురం గ్రామాలకు చెందిన 500 మందికి పైగా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. చివరకు కొద్దిమందికే యూరియా అందడంతో మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.» చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో శనివారం యూరియా కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద, గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు క్యూకట్టారు. రెండురోజులుగా ఎరువుల షాపుల వద్ద, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా కొందరికే ఎరువులు అందాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. » విజయనగరం జిల్లా సంతకవిటిలోని కోరమాండల్ దుకాణం వద్ద శనివారం గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటలకే దుకాణం వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. పొందూరు–సంతకవిటి ప్రధానరోడ్డు వరకు రైతులు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. » కాకినాడ జిల్లా నవర గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లలో నిలబడలేని వారు కూలీలకు రూ.600 ఇచ్చి లైన్లలో నిలబెట్టారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎండలో నిరీక్షించారు. » యూరియా లేక రైతులు గగ్గోలు పెడుతుంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ యూరియా కొరత లేదనడంపై రైతులు మండిపడ్డారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంగొల్లప్రోలు మండలం చేబ్రోలు మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ‘ఎక్కడున్నావ్ వర్మా.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి యూరియా ఇప్పించు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఏడీఏ చేతిలోని టోకెన్లను స్థానిక టీడీపీ నేత లాక్కుని కొందరు రైతులకు అందజేయడంతో మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ నాగలోవరాజు వచ్చి రైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. టోకెన్లు అందరికీ ఇచ్చేశామని ఏడీఏ బదులివ్వడంతో జెడ్పీటీసీ రైతులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. జెడ్పీటీసీ, మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఠాణాలో టోకెన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా పంపిణీ పోలీసుల చేతుల్లోకి వెళ్తోంది. పంటల అదును దాటిపోతోందన్న బాధతో రైతు వేదికల ముందు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు.. ఎలాగైనా యూరియా దక్కించుకోవాలన్న ఆశతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల రైతులను అదుపు చేసేందుకు సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. వ్యవసాయ సహకార సొసైటీలకు వస్తున్న యూరియా తక్కువగా ఉండటం, రైతులు అధిక సంఖ్యలో లైన్లలో వేచిచూస్తుండటంతో అధికారులు టోకెన్ల పంపిణీకి జంకుతున్నారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తున్నారు. తరుముతున్న కాలం.. రాష్ట్రంలో వానాకాలం వరి పంట చాలా జిల్లాల్లో పొట్టదశకు వచ్చింది. గింజ గట్టి పడేందుకు, మొక్కకు బలాన్నిచ్చేందుకు ఇప్పుడు యూరియా వాడకం అత్యవసరం. అదును తప్పితే యూరియా వేసినా ఉపయోగం ఉండదు. దీంతో రైతులు సొసైటీ ఆఫీసులు, యూరియా దుకాణాల ముందు రాత్రి పగలు పడిగాపులు పడుతున్నారు. రాష్ట్రంలోని 500 రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ జరుపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. దీంతో ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల ప్రజలంతా ఉదయాన్నే రైతు వేదికల వద్దకు వచ్చి లైన్లల్లో నిలబడుతున్న దృశ్యాలు దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరినాట్లు ముందుగా పడే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మలిదశ యూరియా వాడకం కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ‘అదును తప్పుతోంది.. ఒక్క బస్తా అయినా ఇప్పించండి’అని కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల మొదలైన జిల్లాల రైతులు అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూరియా కొరత లేకుండా కేంద్రంతో మాట్లాడి తెప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రోజూ ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్నది 23 వేల మెట్రిక్ టన్నులే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న యూరియా ఏ రోజుకు ఆరోజే అన్నట్లుగా అయిపోతోంది. నిల్వ లేకుండా డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ అధికారులు యూరియాను ఆయా జిల్లాల్లో డిమాండ్ అధికంగా ఉన్న మండలాలకు పంపిస్తున్నారు. రైల్వే వ్యాగన్ల ద్వారా ప్రతిరోజు 5 వేల టన్నులకు తగ్గకుండా యూరియాను కేంద్రం నుంచి తెప్పిస్తున్నా.. అది ఏమూలకు సరిపోవడం లేదు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందులో సొసైటీల వద్ద 6 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే టోకెన్ల ప్రకారం ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఈ నిల్వల్లో 70 శాతం వరకు పంపిణీ చేసి, మిగతా నిల్వను మరుసటి రోజు కోసం దాచిపెడుతున్నారు. మార్క్ఫెడ్ గోదాముల్లో ఉన్న 10 వేల మెట్రిక్ టన్నులను ఆచితూచి పంపిస్తున్నారు. వీటికి తోడు ఆ రోజు వచ్చే రైల్వే వ్యాగన్ల లోడ్ మీదనే వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ ఆధారపడుతోంది. సరఫరా చేసింది 7 లక్షల టన్నులు.. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో ఇప్పటివరకు సరఫరా చేసిన యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఈ సీజన్లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఒక లక్ష ఎకరాలు తక్కువగా అంచనాలో 98 శాతం మేర సాగయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం ఉన్నది ఈ సీజన్లోనే. ఇందులో యూరియా అత్యధికంగా వినియోగించే వరి ఏకంగా వ్యవసాయ శాఖ అంచనాలకు మించి 104 శాతం సాగైంది. 65.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 122 శాతం.. అంటే 6.36 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 45.76 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా యూరియా వినియోగం అధికంగా ఉండడంతో రైతులకు ఈ పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం కన్నా దాదాపు 10 లక్షల ఎకరాలు పంటల విస్తీర్ణం పెరగ్గా, యూరియా కేటాయింపులు మాత్రం తగ్గాయి. ఈ నెలాఖరు వరకు 9.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 7 లక్షల మెట్రిక్ టన్నులే. కనీసం మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు వెంటనే వస్తే తప్ప రైతులకు బాధలు తప్పవు. అదును తప్పిపోయిన తరువాత యూరియా వచ్చినా ఉపయోగం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచే యూరియా విక్రయంలో రేషన్ పద్ధతి పాటించేలా చేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. దీంతో సామాన్య చిన్న, సన్నకారు రైతులు ఒక్కో యూరియా బస్తా కోసం పడిగాపులు పడుతున్నారు. -
బస్తా కోసం భారంగా..
కామారెడ్డి టౌన్ /కామేపల్లి/అర్వపల్లి/దేవరకద్ర /మఠంపల్లి/కేసముద్రం/ఖానాపురం: యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. టోకెన్ల కోసం, యూరియా లారీల కోసం ఎదురుచూపులు నిత్యకృత్యం అయ్యాయి. » కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లోని పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్లో నిలుచున్న రైతులు ఒక్కసారిగా సిరిసిల్ల రోడ్లో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, సీఎంకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. » ఖమ్మం జిల్లా కామేపల్లి రైతు వేదికలో కూపన్లు ఇస్తున్నారని తెలిసి రైతులు వెళ్లారు. వారంరోజులుగా తిరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించగా జాస్తిపల్లి ఏఈఓ రవికుమార్, కామేపల్లి ఏఈఓ శ్రీకన్య తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని రైతులు వాపోయారు. అంతేకాక ఇది తమ ఆఫీస్ అని ఎక్కువ మాట్లాడితే కేసు పెడతామని బెదిరించారన్నారు. » సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు పీఏసీఎస్ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు. » మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పీఏసీఎస్ కేంద్రం వద్ద టోకెన్లు ఉన్న రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, టోకెన్లు లేని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహిళా రైతుల అరుపులు, కేకలతో తోసుకున్నారు. ఈ తరుణంలో నార్లోనికుంట్ల సత్యమ్మ, డోకూర్ బాలకిష్టమ్మ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సత్యమ్మ చెవికి తీవ్ర గాయమైంది. » సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీఏసీఎస్కు చెందిన నలుగురు డైరెక్టర్లు యూరియా కొరతకు నిరసనగా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతులకు యూరియా అందజేయలేకపోతున్నామన్న మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు డైరెక్టర్లు గోలి చంద్రం, పట్టేటి ఆంథోని, వల్లపుదాస్ చినలింగయ్యగౌడ్, పశ్యా రామనరసమ్మ చెప్పారు. » మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి, కల్వల గ్రామాల్లో సొసైటీ పాయింట్ వద్ద రైతులు గురువారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకే యూరియా లోడ్ లారీ రావాల్సి ఉండగా 11 గంటలైనా రాలేదు. కేసముద్రం విలేజ్ దర్గా వద్ద ఆ డ్రైవర్ యూరియా లోడ్ లారీ తీసుకొచ్చి నిలిపాడని పోలీసులు తెలుసుకున్నారు. దర్గా నుంచి ఉప్పరపల్లి వరకు లారీని తీసుకెళ్లి 220 బస్తాలను సెంటర్లో దింపించారు. ఆ తర్వాత కల్వల సెంటర్కు లారీని తీసుకెళ్లాల్సి ఉండగా, అప్పటికే లారీడ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఎండీ అలీమ్ ఆ లారీని తానే డ్రైవింగ్ చేసి కల్వలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 220 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన తేజావత్ శ్రీను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సరిపోను యూరియా లభించకపోవడంతో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వదిలేశాడు. దీంతో పంటను గురువారం గొర్రెల కాపరులకు అప్పగించడంతో అవి మేశాయి. -
ఎంతకీ ఎదగదు!
సాక్షి ప్రతినిధి, వరంగల్/నెట్వర్క్ : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. వానాకాలంలో పంటలు వేసిన మెజారిటీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో యూరియా అందకపోవడంతో మొక్కజొన్న కంకులు ఎదగడం లేదు. పత్తి చేలల్లో పూత కన్పించడం లేదు. వరి ఎర్రబారిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం తప్పదని, పెట్టుబడి సైతం దక్కకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల ఎదుగుదల సమయంలో యూరియా కొరత దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా పంటల ఎదుగుదల నుంచి దిగుబడి వరకు అన్నింటిపై యూరియా కొరత ప్రభావం ఉంటుందని చెబుతుండటం గమనార్హం. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి వానాకాలం ఆరంభం నుంచే మొదలైన యూరియా కొరత.. ఇప్పుడు ప్రధాన పంటలైన పత్తి, వరి, మొక్కజొన్నలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి నెట్వర్క్’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అంశాలు వెలుగుచూశాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మెదక్, మహబూబ్నగర్, అదిలాబాద్ తదితర జిల్లాల్లో రైతులు ఎదుగూ బొదుగు లేని పంటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఆకుపచ్చగా ఉండాల్సిన పంటలు ఎర్రబారి, పసుపుపచ్చగా కన్పిస్తున్నాయి. యూరియా సరైన సమయంలో అంది ఉంటే.. పంటలు పచ్చగా ఉండి ఏపుగా పెరిగేవని రైతులు అంటున్నారు. కానీ సకాలంలో వేయకపోవడంతో వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయని, వరి పైరులో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదని, పచ్చదనం కూడా కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మున్ముందు చీడపీడలు సైతం ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని రైతులతో పాటు అధికారులుచెబుతున్నారు. వరి.. ఎదిగితే ఒట్టు!సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతు ఇస్తారిగల్ల ఆశోక్ 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. ఆగస్టు 8న వరి నాట్లు వేయగా అప్పటి నుంచి యూరియా లభించక పోవడంతో చల్లలేదు. దీంతో ఈ సమయానికి ఏపుగా పెరగాల్సిన వరి.. నాట్లు వేసినప్పుడు 8 అంగుళాల ఎత్తు ఉండగా.. నెల రోజుల తర్వాత కూడా అదే విధంగా ఉంది. ఎదుగు లేదు.. బొదుగు లేదు. యూరియా కోసం 10 సార్లు క్యూలో నిల్చున్నా దొరకలేదు. దీంతోరూ. 950 చొప్పున 13 అమ్మోనియా బస్తాలు కొని చల్లినట్టు చెప్పాడు. ఇప్పటికే రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని.. మొత్తం నష్టపోయే పరిస్థితి ఉందని వాపోతున్నాడు. పత్తి చేను దున్నేస్తా.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు ఇడంపాక స్వామికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. పంట ఎదుగుదల సమయంలో సరిపడా యూరియా దొరకడం లేదు. యూరియా కోసం నెక్కొండ.. రెడ్లవాడ పీఏసీఎస్ల వద్ద వెళ్లినా దొరకలేదు. మరో వారం రోజులు చూసి పత్తి చేను దున్ని మొక్కజొన్న సాగు చేస్తానని అంటున్నాడు. ఇప్పటివరకు ఎకరా పత్తికి రూ.20 వేల చొప్పున చేసిన రూ.40 వేలు ఖర్చు వృధా అయినట్టేనని వాపోతున్నాడు. మూడు పంటలకు ఒక్క బస్తా దొరికింది నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఒకఎకరంలో వరి, ఒక ఎకరంలో పత్తి, మరోఎకరంలో మిరప వేశా. వీటికి అవసరమైన యూరియా కోసం 15 రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగా. కేవలం ఒకే ఒక బస్తా యూరియా దొరికింది. దీంతో వరి పంటఎదుగుదల లేక గిడస బారింది. మిరప పంట వేసి 40 రోజులైంది. ఇప్పటికి కనీసం రెండు అడుగుల ఎత్తు ఎదగాలి. కానీ ఒక్క అడుగు కూడా ఎదగలేదు. – పులిచింత మల్లేష్ , రైతు,దేవబండ గ్రామం, అయిజ, జోగుళాంబ గద్వాల పంటలకు అన్నివిధాలా మేలు చేస్తుంది యూరియా అనేది పంటలకు నత్రజనిని అందించే ఎరువు. అన్ని రకాల నేలలకు, వివిధ పంటలకు ఇది అనుకూలంగా ఉంటుంది. త్వరగా నీటిలో కరిగిపోతుంది కాబట్టి మొక్కలకు నత్రజని వేగంగా అందుతుంది. దీనివల్ల ఎక్కువ సంఖ్యలో పిలకలు ఏర్పడతాయి. మొక్కలు, కాండాలు బలంగా, వేగంగా పెరుగుతాయి. తద్వారా పంటలు దృఢంగా ఉంటాయి. అలాగే మొక్కలు ఆకుపచ్చగా మారేందుకు, వాటి ఎదుగుదలకు యూరియా ఉపకరిస్తుంది. వెన్నులు బాగా రావడానికి సహాయ పడుతుంది. వీటన్నిటి వల్ల అధిక దిగుబడి వస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా యూరియా వినియోగానికి మొగ్గు చూపుతారు. – డాక్టర్ అనిల్కుమార్,భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త దిగుబడిపై తీవ్ర ప్రభావం తొలి దశలో యూరియా కొరత వల్ల వరి సాధారణ దిగుబడితో పోల్చితే 25–35 శాతం తగ్గే అవకాశం ఉంటుందని అంచనా. కాగా ఈ కొరత ఇలాగే కొనసాగితే మరో 10 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది. ‘వానాకాలంలో సీజన్లో వరికి సాధారణంగా మూడు దఫాల్లో యూరియా చల్లుతాం.. ఇప్పటికి ఒక్కసారే వేశాం. కొద్దిమంది ఇప్పుడిప్పుడే రెండుసార్తు వేస్తున్నారు. కానీ మెజార్టీగా రైతులకు యూరియా పాట్లు తప్పడం లేదు..’ అని వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల పేటకు చెందిన రైతు యాళ్ల సుధాకర్రెడ్డి చెప్పారు. వరినాట్లు వేసిన 20–25 రోజుల్లో ఒకసారి, 45 రోజుల్లో రెండోసారి, 65–70 రోజుల్లో మూడోసారి యూరియా చల్లాల్సి ఉండగా.. గత రెండు మాసాలుగా యూరియాకు తీవ్ర కొరత నెలకొందని రైతులు చెబుతున్నారు. -
ఎరువుల్లేవ్.. యాతన భరించలేకున్నాం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చేయడం చూశాం... కానీ, ఎరువుల కొరత కారణంగా తాము నరకం చూస్తున్నామంటూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ) ఏకంగా కలెక్టరేట్ను ముట్టడించారు. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో కావడం గమనార్హం. గురువారం పగటి వేళ విధులు నిర్వహించిన వీరు... రాత్రి కలెక్టరేట్కు వచ్చి ఆందోళన చేశారు. రాత్రి 10 దాటే వరకు నిరసన కొనసాగగా.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారితో చర్చలు జరిపారు. కాగా, అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు రణస్థలం వరకు, అటు భామిని నుంచి ఇటు శ్రీకాకుళం వరకు జిల్లావ్యాప్తంగా 400 మంది వ్యవసాయ, ఉద్యాన సహాయకులు తరలివచ్చారు.వీరిలో సగంపైగా మహిళా ఉద్యోగులే. ‘‘నరసన్నపేటలో ఓ టీడీపీ నేత డబ్బులివ్వకుండా 50 బస్తాలు పక్కనపెట్టాలని డిమాండ్ చేశాడు. కుదరదని చెబితే చంటి పాప ఉన్న నన్ను సుదూర ప్రాంతానికి డిప్యూటేషన్పై వేశారు’’ అని లావణ్య వాపోయారు. ఎరువుల కొరతకు తోడు, రాజకీయ ఒత్తిళ్లతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నామని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. యూరియా లేక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నామని, నానా దుర్భాషలాడుతున్నారని, భౌతిక దాడులకు దిగే పరిస్థితులున్నాయని వాపోయారు.కార్యాలయంలోనే ఉన్న కలెక్టర్కు... సంబంధిత యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ బయటకు వచ్చి ఉద్యోగులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించి, శాఖ విధులు అప్పగించేలా చూడాలని వీఏఏలు కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో వ్యవసాయ, ఉద్యానవన అసిస్టెంట్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100 బస్తాల యూరియాకు 150 ఫోన్లు100 బస్తాల యూరియా వస్తే 150 పర్యవేక్షక ఫోన్లు, తమకంటే తమకు ఇవ్వాలని 150 మంది ఒత్తిడి చేస్తున్నారని వీఏఏలు వాపోయారు. నాయకుల సూచనల మేరకు తప్పులు జరిగితే చిరుద్యోగులైన తాము బలి అవుతున్నామని తెలిపారు. ఇలాంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో అనేకం ఉన్నాయని, అధికారులకు తెలిసినా, పరిష్కారం చూపడం లేదని తెలిపారు. వ్యవసాయ సహాయకుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పలుచోట్ల యూరియా ఇతర ఎరువులను రాజకీయ నాయకులు పట్టుకెళ్లగా, ఆ ఆర్థిక భారం వీఏఏలపై పడిందని తెలిపారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలుసని, క్షేత్రస్థాయి ఉద్యోగులపై భారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, అ«ధికార ఒత్తిళ్లతో ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారని, నిబంధనల ప్రకారం వీఏఏలకు సంబంధం లేని పనులు అప్పజెప్పి టార్గెట్లు విధించి మనస్తాపానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. -
యూరియా దొరక్కపోతే చచ్చిపోతా
వజ్రపుకొత్తూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలకు అవసరమైన సమయంలో యూరియా కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. యూరియా కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన ఓ రైతు సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నారు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం గణపతి అనే రైతు ఆవేదన ఇలా ఉంది. ‘గణపతి అనే నేను ఆటో నడపలేక నాలుగు ఆవులను కొనుక్కున్నా. మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ఓ వైపు నీరు సరిపడా లేకపోయినా ఇంజిన్లు పెట్టుకొని బాధలు పడుతున్నాం.మరో వైపు యూరియా దొరకడం లేదు. గోల్మాల్ చేసేస్తున్నారు. ఎరువు కావాలంటే 1బి కావాలంటున్నారు. కౌలు రైతులకు 1బి, పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. సచివాలయాల్లో సిబ్బంది ఉండటం లేదు. రైతులకు దొరకని యూరియా బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.700 పైచిలుకుతో దొరుకుతోంది. మొన్నే మా ఫ్రెండ్ బ్లాక్ మార్కెట్లో రూ.750తో కొనుక్కొచ్చాడు. ఆర్బీకేల్లో యూరియా ఎందుకు దొరకడం లేదు? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. కూటమి పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నాం.ఆటో వాళ్ల బతుకులు బాగో లేవు. రైతుల బతుకులూ అంతే. చదువుకున్న పిల్లలకు బతుకుదెరువు లేదు. డాక్టర్ కోర్సు చదవాలనుకున్న విద్యార్థులకు బతుకులు లేవు.. ఇలాగైతే ఎలా? ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఏమైనా అడిగితే అరెస్టులు.. తన్నండ్రా అని కూటమి నాయకులు అంటున్నారు. యూరియా దొరక్క.. ఎరువులు దొరక్క రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే.. ఏం చేయాలో చెప్పండి సార్.. ఎలా వ్యవసాయం చేయాలి.. బతకాలా, ఎండ్రీను తాగి సావాలా.. పరిష్కారం చెప్పండి సార్. యూరియా దొరక్కపోతే వారంలో చచ్చిపోవాలనుకుంటున్నా..’ అని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పురుగుల మందు డబ్బా చూపిస్తూ ఈ రైతు వ్యక్తం చేసిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
యూరియా దొరక్కపోతే చచ్చిపోవాలనుకుంటున్నాను..
-
కృష్ణ జిల్లా జడ్పీటీసీ సమావేశంలో యూరియా కోతరపై రగడ
-
ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్
గిట్టుబాటు ధరలు, ఇంకా మరేదైనా సమస్య అయినా సరే తొలుత అసలు ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా అంటే ఉన్నాయంటాడు. అంతా భేషుగ్గా ఉందని వాదిస్తాడు. రైతులు కేరింతలు కొడుతున్నారని గొప్పలకు పోతాడు. చివరకు సమస్య ఉందని ఒప్పుకోక తప్పదని నిర్ధారించుకున్నాక మోసం చేసేందుకు తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా.. చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు.. ఆదేశాలిచ్చేశాడంటూ ఆకాశానికెత్తేస్తాయి. తాటికాయంత అక్షరాలతో రాసేస్తారు. ఇదంతా ఓ బూటకం. ఏ రైతుకూ సమస్యలు తీరవు. మిర్చి, పొగాకు, మామిడి, చివరకు ఉల్లి విషయంలోనూ అదే జరిగింది.రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈృక్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ధరల స్థిరీకరణ నిధి లేదు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఈ క్రాప్ను నిర్వీర్యం చేశారు. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీకి మంగళం పాడేశారు. సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఖరీఫ్లో ఇప్పటికే రైతులకు 6.65 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశామని, గతేడాది కంటే 97 వేల టన్నులు అధికంగా అందించామని మీరు గొప్పగా ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం అవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించి ఉంటే రాష్ట్రంలో ఏ రైతూ రోడ్డెక్కడు కదా?’ అని సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటన చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. రైతులకు అందించాల్సిన ఎరువులు, యూరియాను దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ అధికార పార్టీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని దునుమాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర దక్కక రైతులు పడుతున్న ఇబ్బందులను ఆధారాలతో ఎత్తిచూపుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం తెచి్చన విప్లవాత్మక పథకాలను గుర్తు చేస్తూ చంద్రబాబు సర్కార్ తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ఇంకా ఏమన్నారంటే.. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా? రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అన్న సందేహాలు సామాన్యుల్లోనూ తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నొక్కేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా తిరోగమనం పట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ప్రస్తుతం మన కళ్ల ఎదుటే ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయి. అసలు రాష్ట్రంలో పాలన ప్రజల కోసం సాగుతోందా? లేక దోపిడీదారుల కోసం సాగుతోందా? రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలి పోవడంతో కుంభకోణాలు కనిపిస్తున్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీ రైతుల పక్షాన మంగళవారం ‘అన్నదాత పోరు’ చేపడితే కేసులు పెడతామంటూ బెదిరించి నోటీసులు ఇచ్చారు. వారంతా ఏం తప్పు చేశారు? రైతుల పక్షాన నిలబడితే తప్పా? రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యానికి ఇవన్నీ నిదర్శనాలు. చంద్రబాబు బావిలో దూకితే మేలు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం సరిపడా ఎరువులు అందించి ఉంటే అసలీ పరిస్థితే ఉండేది కాదు కదా.. మీరు ఎరువుల విషయంలో కుంభకోణాలు చేయకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. రెండు నెలలుగా కనిపిస్తోంది. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎరువులు దొరక్క కృష్ణా జిల్లా ఘంటశాల మండలం లంకపల్లి పీఏసీఎస్, పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లా ఎస్ కోటలో బారులు తీరిన రైతులు, రాజాంలో ఎరువుల కోసం కొట్లాట, అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాట్లు, తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో, ఏలూరు జిల్లా నూజివీడులో, ఎన్టీఆర్ జిల్లా గొళ్లపూడిలో ఎరువుల కోసం పాదరక్షలను క్యూలో పెట్టిన రైతులు.. గుంటూరు జిల్లా రేపల్లె గోడౌన్ వద్ద రైతుల ఆందోళన.. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు కళ్లకు కట్టాయి. ప్రకాశం జిల్లా పామూరు మండలం కురమద్దాలి, సత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రైతులు బారులు తీరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కూడా ఎరువులు దొరకని పరిస్థితి. సొంత నియోజకవర్గంలోనూ ఎరువులు సక్రమంగా పంపిణీ చేయలేని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు ఏదైనా బావి చూసుకుని దూకితే మేలు. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి మా ఐదేళ్ల పాలనలో రైతులకు ఈ కష్టాలు లేవు. ఇప్పుడు రైతులకు అందించే ఎరువుల్లో కూడా కుంభకోణాలు చేసి, డబ్బు ఎత్తాలన్న ఆలోచన చేస్తున్నారు కాబట్టే దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారని లెక్క కడతారు కదా? దాని ఆధారంగా ఎంత ఎరువులు కావాలని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అంచనాకు వస్తుంది. ఆ లెక్కలన్నీ మనదగ్గర కూడా ఉంటాయి కదా? మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకొచ్చింది? ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు » రాష్ట్రంలో రైతులు పండించే వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు, మామిడి, ఉల్లి, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోరు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. » ఉల్లి విషయంలో ఆగస్టు 29న క్వింటా రూ.1200కు కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్టు ఈనాడు రాసింది. మళ్లీ సెప్లెంబర్ 7న అంటే 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే క్వింటా రూ.201, 300, 400, 600 ఇలా రకరకాలుగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రాస్తుంది. అంటే.. దాని అర్థం రూ.1,200కు కొనుగోలు చేశారంటే ఒట్టిమాటే కదా? అన్నీ తూతూ మంత్రాలే.. అబద్ధాలు, మోసాలు. » ఈ రోజు ఉల్లి.. క్వింటా రూ.200 నుంచి రూ.400. అదే ఉల్లి బహిరంగ మార్కెట్లో (బిగ్ బాస్కెట్) కేజీ రూ.34. అంటే క్వింటా 3,400. రైతులకు క్వింటా రూ.300–400 వస్తున్నట్టు ఈనాడు రాస్తోంది. రేటు పడిపోయినా పట్టించుకునే నాథుడే లేడు. మా పాలనలో కేజీ ఉల్లి రూ.40 నుంచి రూ.125 వరకు పలికింది. ఒకసారి మధ్యలో ఒడిదుడుకులు వస్తే రూ.9 వేల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కోవిడ్ లాంటి సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. చినీ ధర ఈ రోజు టన్ను రూ.7–8 వేలు..బాగా వస్తే రూ.12–14 వేలు. అదే మా హయాంలో కనిష్ట ధర రూ.30 వేలు. గరిష్ట ధర రూ.లక్ష. నాడు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి వైఎస్సార్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీని పెంచాం. రైతులకు తోడుగా నిలబడేందుకు రూ.7,802 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ పెట్టాం. అక్కడే ఈ క్రాప్ జరిగేది. దాంతో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వివరాలను ఆ యాప్లో అప్లోడ్ చేసేవారు. ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అగ్రికల్చరల్ ప్రాసెస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ (సీఎంయాప్) ద్వారా కచ్చితంగా పని చేసేది. ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధరలు తెలిసేలా బోర్డులో పెట్టేవారు. ఆ ధరల కంటే ఎక్కడన్నా పంట ధర పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఈ రోజు ఆర్బీకేలను గాలికొదిలేశారు. ఈ క్రాప్ను నిర్వీర్యం చేశారు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఇన్ పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారానికి మంగళం పాడేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవాళ్లం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందేది.. ఇవన్నీ ఎత్తేశారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది రూ.5 వేలు ఇచ్చారు. అంటే రూ.40 వేలకు గాను రూ.5 వేలు ఇచ్చారు. అది కూడా సుమారు 7 లక్షల రైతు కుటుంబాలకు అర్హత జాబితా నుంచి తీసేశారు. ఇవాళ ప్రతిదీ స్కామే. ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే కనిపిస్తోంది. ఇది రూ.250 కోట్ల కుంభకోణం » అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈ–క్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. » ఉదాహరణకు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారి మళ్లిన యూరియా.. పల్నాడు జిల్లా దాచేపల్లిలో 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు.. నంద్యాల జిల్లా డోన్లో 70 టన్నుల యూరియా మాయం.. ఒకవైపు ప్రభుత్వం నుంచి వెళ్లిన యూరియా, ఎరువులను టీడీపీ నేతలు దారి మళ్లించి అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటుకు అధికంగా కేటాయించిన ఎరువులను బ్లాక్ చేసి కొరత సృష్టించడం ద్వారా బస్తా యూరియా ధర రూ.267 ఉంటే దానికంటే రూ.200 నుంచి 250 అధికంగా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. » ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను చంద్రబాబు ప్రొత్సహించడం, నేరుగా భాగస్వామి కావడంతో దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల కుంభకోణం జరిగింది. రైతులను పీడించి కుంభకోణాలు చేసి, కింది నుంచి పైదాక అందరూ పంచుకున్నారు. » మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు, ఎస్పీలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే వాడిని. ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ కనిపిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎస్పీలు, కలెక్టర్లకు బలంగా హెచ్చరికలు ఉండేవి. ఈ రోజు అది లేకుండా పోయింది. ఎవరి మీదా చర్యలు ఉండవు. నికింత– నాకింత అని.. దోచుకో పంచుకో తినుకో విధానంలో సిస్టమేటిక్ పద్ధతుల్లో వెళుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కుంభకోణాలు చేస్తున్న వాళ్లు అసలు మనుషులేనా? -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట బుధవారం యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రైతు వేదికలోకి చొచ్చుకెళ్లి ఫరి్నచర్ ధ్వంసం చేశారు.హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో రైతులు బుధవారం యూరియా కోసం భిక్షాటన చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు సాయిల్ల రాజమల్లు యూరియా బస్తా కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే రాజమల్లును ఆసుపత్రికి తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ వద్ద రైతులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి యూరియా పంపిణీ చేశారు. రెండో విడతలో పంటకు యూరియా ఎంత మోతాదులో వేయాలనే దానిపై అధికారులు అవగాహన కూడా కల్పించారు.యూరియా బారులు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సుమారు 400 ఫీట్ల వరకు రైతులు పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులు లైన్లో ఉంచి నిరీక్షించారు. ఈ కేంద్రానికి 666 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ సూర్యాపేట -
రైతులతో పెట్టుకోకు స్కామ్ సీఎంకు జగన్ వార్నింగ్..
-
యూరియా పంపిణీలో TDP కోట్ల స్కామ్
-
యూరియా కోసం చెప్పులతో కొట్లాట
గజ్వేల్రూరల్/గరిడేపల్లి/దుబ్బాక/బీబీపేట: ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు ఇస్తారో తెలియక యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు. » సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మంగళవారం యూరియా టోకెన్ల కోసం బారులు తీరిన మహిళా రైతులు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. » వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. రాయపర్తి మండలం పెర్కవేడులో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెల్లవారుజాము నుంచే రైతువేదిక వద్ద మహిళా రైతులు బారులుతీరారు. » మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాల్లో పీఏసీఎస్ కేంద్రాల వద్ద కూడా బారులుతీరారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. » కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి మంగళవారం యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అలసిపోయి, నీరసించిన తర్వాత రైతులు క్యూ లైన్లో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు పెట్టారు. » సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్కు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు. కేవలం 15 నుంచి 20 మందికి మాత్రమే రెండు బస్తాలు ఇచ్చి స్టాక్ అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
మీకు సిగ్గుంటే యూరియా ఇవ్వండి.. బాబుపై శైలజానాథ్ ఫైర్
-
భగ్గుమన్న రైతన్న
సాక్షి నెట్వర్క్: వన్ బీ, ఆధార్, పాసు పుస్తకాలను క్యూలైన్లలో పెట్టి అన్నదాతల పడిగాపులు.. స్లిప్పుల కోసం ఆరాటం.. పొలం పనులు వదిలేసి కార్యాలయాల వద్ద అగచాట్లు.. బస్తాపై అదనంగా బాదుడు.. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలిక.. పోలీసు పహారా నడుమ అరకొరగా పంపిణీ.. అజమాయిషీ అంతా అధికార పార్టీ నేతల చేతుల్లోనే.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అన్నదాతల ఆగ్రహావేశాలు.. భగ్గుమన్న నిరసనలు.. ! ఇదీ రాష్ట్రవ్యాప్తంగా యూరియా విక్రయ కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితి!! సోమవారం పలుచోట్ల మధ్యాహ్నానికే స్టాక్ అయిపోవడంతో అన్నదాతలు ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు.ప్రభుత్వం అవసరం మేరకు సరఫరా చేయకుండా యూరియా ఎక్కువగా వాడరాదంటూ గ్రామ సభలు నిర్వహించడం ఏమిటని మండిపడుతున్నారు. పంటలకు యూరియా ఎంతో అవసరమైన ప్రస్తుత తరుణంలో అందుకు తగినట్లుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పది ఎకరాలు సాగు చేసే రైతుకు సైతం ఒక్కటంటే ఒక్కటే యూరియా బస్తా ఇస్తామనడం ఏం న్యాయమని నిలదీస్తున్నారు. రైతులను నిరక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. అరకులోయ తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులైతే ఏకంగా ఒడిశా వెళ్లి మరీ యూరియాను అధిక ధరకు కొనుగోలు చేసి తెచ్చుకోవడం అన్నదాతల దుస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వీరఘట్టం మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఉదయం 6 గంటల నుంచే స్లిప్పుల కోసం పురుషులు, మహిళా రైతులు పెద్ద ఎత్తున వన్బీలు, ఆధార్ కార్డులతో బారులు తీరారు. సచివాలయం తలుపులను బలవంతంగా మూసివేయడంతో వీరఘట్టం గ్రామానికి చెందిన కమ్మవలస సన్యాసిరావు చేతి వేళ్లకు గాయాలయ్యాయి. రైతులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. చివరకు ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మొదటి దఫాకే దిక్కు లేదు.. రెండు ఎకరాలు సాగు చేస్తున్నా. మొదటి విడత యూరియా వేద్దామంటే ఏ సొసైటీలోనూ నిల్వ లేదని చెబుతున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టి కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. – గుడాల సురేష్, రైతు, పెనుమర్రు, యలమంచిలి మండలం, ప.గోదావరి జిల్లా రైతుల కష్టాలు పట్టవా..? గతంలో ఎప్పుడూ యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. బయట కొందామంటే అధిక ధరలు చెబుతున్నారు. ఇక్కడకు వస్తే దొరకడం లేదు. రైతులు ఎక్కడికి పోవాలి? – జల్లు తిరుపతిరావు, జల్లవానిపేట, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా రోజుల తరబడి తిరుగుతున్నా కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎరువుల ధరలు పెరిగిపోయాయి. యూరియా అందుబాటులో లేకుండా పోయింది. మొక్కజొన్న, టమాట సాగు చేశా. రెండు నెలలుగా యూరియా కోసం కళ్యాణదుర్గంలో నేను తిరగని ఎరువుల దుకాణం లేదు. – రవి, దొడగట్ట గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా ఒక్క బస్తాతో ఏం చేసుకోవాలి? పది ఎకరాలు సాగు చేస్తున్నా. నెల రోజులుగా యూరియా రాలేదు. ప్రస్తుతం వరి పంట పిలకలు వేస్తున్నాయి. ఈ తరుణంలో యూరియా వేయాలి. 10 బస్తాల యూరియా అవసరం కాగా ఒక్క బస్తాతో ఏం చేసుకోవాలి? – ఇంటి రమేష్, రైతు, వీకే రాయపురం, కాకినాడ జిల్లాఒడిశా వెళ్లి కొంటున్నాంఅరకులోయ, డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల వ్యాపారుల వద్ద యూరియా దొరకపోవడంతో ఒడిశా వెళ్లి 50 కిలోల బస్తా యూరియాకు రూ.600 చెల్లించి కొంత మంది రైతులతో కలిసి 40 బస్తాలు తెచ్చుకున్నాం. తప్పనిసరి పరిస్థితిలో బస్తాకు ఆటో కిరాయి రూ.100 చెల్లించాం. రైతులను నిర్లక్షం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. –పాంగి తిలక్, గిరిరైతు, గుంటసీమ గ్రామం, అరకు -
Annadata Poru: నేడే రైతన్న రణభేరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆర్డీవోలకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేయనున్నారు.ఎమ్మార్పీపై బస్తాకు రూ.200 అధికంకూటమి ప్రభుత్వంలో యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. వ్యవసాయ సీజన్లో ఒక్క యూరియా కట్ట కోసం గంటల తరబడి ప్రైవేట్ దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్ల ముందు పడిగాపులు కాస్తున్న దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. నల్ల బజార్లో కనీసం రూ.200 అధికంగా చెల్లిస్తే గానీ బస్తా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగు మందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు.కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన నేతలు నల్లబజార్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క యూరియా రూపంలోనే దాదాపు రూ.200 కోట్ల మేర రైతులపై భారం మోపి కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పలుచోట్ల అక్రమంగా తరలిపోతున్న యూరియాను రైతులే పట్టుకుని పోలీసులకు అప్పగించినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దీన్ని బలపరుస్తోంది. కృష్ణా జిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాలకు అద్దం పడుతున్నాయి. సర్కారు కళ్లు తెరిపించేలా ’అన్నదాత పోరు’.. రైతాంగం డిమాండ్లపై కూటమి సర్కారు దిగి వచ్చేలా అన్నదాత పోరును వైఎస్సార్సీపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ కోసం శ్రేణులు కదం తొక్కనున్నాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలనే డిమాండ్ను గట్టిగా వినిపించనుంది. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేయనుంది. వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు మార్కెట్లో పోటీ పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గళమెత్తనుంది.ప్రైవేట్ వ్యాపారులతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఒప్పించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేయనుంది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అన్నదాత పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, 8న మండల కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదుకోవాల్సింది పోయి బెదిరిస్తున్న బాబు.. ఒకవైపు యూరియా సమస్యతో అన్నదాతలు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు వారిని బెదిరిస్తూ మాట్లాడటం, అసలు సమస్యే లేదని కొట్టిపారేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు కనిపిస్తున్నా మభ్యపుచ్చేలా, బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల ఇక్కట్లను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సీజన్కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల అవసరంపై ప్రణాళికలు లేకపోవడం, సమీక్షలు నిర్వహించకపోవడం కూటమి సర్కారు బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయి.అన్నదాత కన్నెర్రతో కలవరం..అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే విఫల ప్రభుత్వం, పాలన చేతగాని సర్కారుగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంతో కూటమి సర్కారు పాలనను రైతన్నలు పోల్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే ఆర్బీకేలు, పీఎసీఎస్ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం, అప్పుల పాలు కాకుండా అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం, సీఎం యాప్ ద్వారా నిరంతరం ధరలను పర్యవేక్షించడం లాంటి చర్యల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో ధరలు పతనమైతే కూటమి సర్కారు రైతుల గోడు పట్టించుకోకుండా వదిలేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు అసమర్థ పాలనపై వైఎస్సార్సీపీతో కలిసి భారీ ఎత్తున కదం తొక్కేందుకు సిద్ధమమయ్యారు. -
కాడి వదిలి రోడ్డెక్కి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగానే ‘వ్యవసాయాన్ని దండగ’గా మార్చేస్తున్నారు! పొలం పనుల్లో కోలాహలంగా కనిపించాల్సిన రైతన్నలు రోడ్డెక్కి ఆక్రోశిస్తున్నారు! పంట కాపాడుకునేందుకు నోరు విప్పి ఎరువులు అడుగుతుంటే సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు! టీడీపీ కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులు పండించిన పంటలకు భద్రత లేకుండా చేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. విత్తు నుంచి విక్రయం వరకు ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో కోత పెట్టి అందకుండా చేశారు. అదునులో యూరియా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక్క కట్ట కోసం తిండి తిప్పలు మానుకుని క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి కలి్పంచారు. ధాన్యం నుంచి టమాటా వరకు, మిరప నుంచి మామిడి, బత్తాయి వరకు కనీసం మద్దతు ధర దక్కకపోవడంతో అన్నదాతలు హతాశులయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కొనేవారు లేక.. అప్పులు తీర్చే దారి లేక.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కావాలనే నాటకాలు ఆడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో.. యూరియా దొరక్క, మద్దతు ధర కరువై అల్లాడుతున్న అన్నదాతలకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తోంది. రైతన్నలతో కలసి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్నదాత పోరు’లో పెద్ద ఎత్తున పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమైయింది. ఆంక్షలతో ‘కట్ట’డి.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు దారి మళ్లించడంతో ప్రస్తుతం యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. అదునులో యూరియా అందక వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్ట.. అరకట్ట అంటూ రేషన్ సరుకుల మాదిరిగా విదిలిస్తుండటంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడికీ గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కొరడా ఝళిపించాల్సిన సర్కారు కళ్లుమూసుకుంది.ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదు..గడిచిన ఏడాదిగా ధాన్యం మొదలు టమాటా వరకు, మిర్చి నుంచి పొగాకు దాకా ఏ పంట చూసినా మార్కెట్లో గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా దక్కక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్తో వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మద్దతు ధర దక్కక పోవడంతో గడిచిన ఏడాదిలో రైతులకు రూ.50 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన 15 నెలల్లో దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. వరి, మిరప, మామిడి రైతులను ముంచినట్లే ఉల్లి రైతులనూ కూటమి ప్రభుత్వం మంచేస్తోంది. ధర లేక మిరప రైతులు గగ్గోలు పెడితే క్వింటా రూ.11,781 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి మొండిచేయి చూపింది. తోతాపురి మామిడిని కిలో రూ.12 చొప్పున తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరికి రూ.4 సబ్సిడీ రూపంలో అందిస్తామని నమ్మబలికి మోసం చేసింది. అదే రీతిలో ఉల్లి క్వింటాల్ రూ.1,200 చొప్పున కొంటామని మభ్యపుచ్చి కొనుగోళ్ల ప్రక్రియను మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసింది. తాజాగా మార్కెట్–మద్దతు ధరలకు మధ్య వ్యత్యాసం మొత్తాన్ని జమ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో మూడో వంతు సరుకును నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తుండగా మిగిలిన ఉల్లిని క్వింటా రూ.100–600కి మించి వ్యాపారులు కొనడం లేదు. ఏలూరు డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు ఎటుచూసినా రైతుల ఆందోళనలు, ఆక్రందనలే..గిట్టుబాటు ధర లేక బత్తాయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు పలికిన బత్తాయి ప్రస్తుతం అధఃపాతాళానికి పడిపోయింది. పులివెందుల మార్కెట్లో గిట్టుబాటు ధర లేక సోమవారం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వాలిటీ ఉన్న బత్తాయికి వేలం పాట నిర్వహించగా, గరిష్టంగా 5 శాతం కాయలకు టన్ను రూ.14,200 పలుకగా, నాణ్యత లేని కాయను రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య మాత్రమే కొనుగోలు చేశారు. అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాస్త క్వాలిటీ బాగున్న 5–10 శాతం కాయలకు టన్ను రూ.16,500 లభించగా నాణ్యత లేదనే సాకుతో మిగిలిన పంటకు సగటున రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య లభించింది. గతంలో ఎప్పుడూ ఇంత కనిష్ట స్థాయికి ధరలు పడిపోలేదని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బత్తాయి రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు టమాటా రైతులు సైతం మద్దతు ధర లేక పంటను చేలల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.కృష్ణా జిల్లా కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు 15 నెలల్లో రూ.23,584 కోట్లు ఎగ్గొట్టారు..! అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవంగా ఏటా రూ.10,716 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.21,432 కోట్లు జమ చేయాల్సి ఉండగా, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. పీఎం కిసాన్తో కలిపి రూ.26 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది తొలివిడతగా రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లతో సరిపెట్టారు. మరొక పక్క 2023–24 సీజన్కు సంబంధించి రూ.930 కోట్ల మేర రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో.. ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. ఇక 2024–25 ఖరీఫ్లో 833.92 కోట్లు, రబీలో రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయకపోవడంతో రైతులకు రూ.2 వేల కోట్లకుపైగా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులు ఇంకోవైపు కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద 4.50 లక్షల మంది రైతులకు మరో రూ.650 కోట్లు ఎగ్టొట్టారు. ఇలా ఏడాదిలో అన్నదాతా సుఖీభవ, పంటలబీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీ బకాయిలు వెరసి మొత్తం దాదాపు రూ.23,584 కోట్లకుపైగా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది! అయితే.. మద్దతు ధర లేక రైతులు నష్టపోయిన మొత్తానికి అంతే లేదు. -
రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్/సాక్షినెట్వర్క్: రైతు వేదికల వద్ద కూడా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ఈపాస్ మెన్లు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులకు టోకెన్లు జారీ చేసి 500 రైతు వేదికల వద్ద సోమవారం యూరియా పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి పర్యవేక్షిస్తున్నారు. ఇంకా తప్పని కష్టాలుమహబూబాబాద్ జిల్లా కురవి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులుతీరారు. దంతాలపల్లి మండలంలో గంటల తరబడి రైతులు క్యూలో నిల్చున్నారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డకు చెందిన రైతులు మండల కేంద్రానికి ఆదివారం రాత్రి 1 గంటకు వచ్చి బారులుతీరారు. ఖానాపురంలో ఆయా గ్రామాలకు ఇవ్వడం లేదని, కొత్తూరు, మనుబోతులగడ్డ సొసైటీ గోదాంకు వస్తుందని తెలియడంతో అక్కడకు వెళ్లి లైన్లో నిల్చున్నారు. ఈ క్రమంలో క్యూలో నిల్చున్న రైతు లావుడ్య యాకూబ్ ఫిట్స్తో కిందపడిపోయాడు. » హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. » ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోజురోజు యూరియా కష్టాలు ఎక్కువవుతున్నాయి. దేవరకద్రలో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. హన్వాడలో తెల్లవారుజాము 3 గంటల నుంచి క్యూలైన్లో ఉంటే యూరియా లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఒక్కసారిగా పోలీసులను తోసుకుంటూ బారికేడ్లను ధ్వంసం చేశారు. అనంతరం చించోళీ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మహమ్మదాబాద్ మండలం వెంకట్రెడ్డి పల్లి గేట్ వద్ద జాతీయ రహదారిపై ఉదయం 6 గంటల నుంచి రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. » వనపర్తి జిల్లాలో ఖిల్లాఘనపురంలో రైతులు వనపర్తి–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. » నారాయణపేట జిల్లాలోని ధన్వాడ పీఏసీఎస్కు రైతులు తెల్లవారుజామునే చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. పీఏసీఎస్ గేటు తెరిచే సమయంలో రైతులందరూ ఒక్కసారిగా లోపలికి చొచ్చుకురావడంతో పోలీసులు కిందపడ్డారు. -
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత: మంత్రి పొన్నం
-
Jogi Ramesh: అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవడం చేతకాక పనికిరాని మాటలు
-
AP వ్యాప్తంగా తీవ్రస్థాయికి చేరుకున్న యూరియా కష్టాలు
-
కన్నీరుమున్నీ రైతుండే!
చల్లపల్లి/కొయ్యలగూడెం/చెరుకుపల్లి: యూరియా కొరత రైతులను వెన్నాడుతూనే ఉంది. డిమాండ్కు సరిపడా అందడం లేదు. ఫలితంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద అన్నదాతలు క్యూ కడుతున్నారు. అయినా యూరియా దొరక్కపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా టీడీపీ తీరు మారడం లేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. తమ దుకాణాలకు యూరియా నిల్వలను తరలించుకుపోతున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా కోసం వచ్చిన రైతు వేముల నాగేశ్వరరావు ఆదివారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సహకార సంఘానికి ఆదివారం ఉదయం యూరియా లోడు రావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. అయితే జిల్లా ట్రైనీ కలెక్టర్ పర్హీన్ జాహిద్ వస్తున్నారని అధికారులు యూరియా పంపిణీ ప్రారంభించలేదు. ఉదయం ఏడుగంటలకే బారులు తీరిన రైతులు దాదాపు రెండుగంటలపాటు వేచిచూశారు. ఈ సమయంలో నాగేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి రైతులు సపర్యలు చేశారు. నాగేశ్వరరావు ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ తీరు వల్ల యూరియా దొరక్క అల్లాడుతున్నారు. ఎట్టకేలకు 10.30 గంటలకు యూరియా పంపిణీ చేపట్టినా ఓటీపీ చెప్పాలని అధికారులు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఫోన్లు తెచ్చుకోలేదని, ఓటీపీ అడగడమేమిటని కన్నెర్ర చేశారు. దీంతో అధికారులు ఓటీపీ లేకుండానే యూరియా పంపిణీ చేపట్టారు. – యూరియా కొరతపై ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వరిచేలో నిలబడి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో గవరవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు పలివెల దుర్గారావు, గ్రామ రైతు అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, రైతులు నరాల రామారావు, వేమ నాయుడు, యాకోబు మోషే, శ్రీను, చిన్న తాతారావు, మహేష్, కోనాల దివాకర్ తదితరులు పాల్గొన్నారు.టీడీపీ నేత దుకాణానికి దర్జాగా తరలింపు 07ఆర్పిఎల్77–ట్రాక్టర్లో యూరియా తరలించుకుపోతున్న టీడీపీ నాయకులు ఓవైపు యూరియా అందక పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు యూరియా నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెం గ్రామంలో ఆదివారం రైతులు చూస్తుండగానే ఓ టీడీపీ నాయకుడు ట్రాక్టర్లో 50 యూరియా బస్తాలు తన దుకాణానికి తరలించుకున్నాడు. బలుసులపాలెం రైతు సేవా కేంద్రం వద్ద శనివారం యూరియా పంపిణీ జరిగింది. అయితే రైతులకు ఒక్కొక్కరికి ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇచ్చిన అధికారులు ఆదివారం రైతులంతా చూస్తుండగానే అదే గ్రామంలోని ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడికి మాత్రం ఏకంగా 50 బస్తాలు ఇచ్చారు. అతను ట్రాక్టర్లో వాటిని తన దుకాణానికి తరలించాడు. రూ.270 ధర ఉన్న యూరియా బస్తాను ఏకంగా అతను రూ.450కి విక్రయిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏవో ఫరూక్ను వివరణ కోరగా తనకు ఆరోగ్యం సరిగా లేనందున రాలేదని, యూరియా పంపిణీ విషయం తెలియదని చెప్పారు. -
బాబుకు కొత్త హెలికాఫ్టర్ కావాలి కానీ.. రైతు సమస్యలు పట్టవా..
-
యూరియా కోసం మండుటెండలో.. అన్నదాతల నరకయాతన
సాక్షి, అమరావతి,మాడుగుల రూరల్, బుచ్చెయ్యపేట/దెందులూరు,రామభద్రపురం/పలాస: బస్తా యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. అనకాపల్లి జిల్లా కేజే పురం శివారు తెలకలదీపం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శనివారం యూరియా పంపిణీ చేపడుతున్నట్టు తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆధార్, భూమి పాసుపుస్తకం, 1బీ జెరాక్స్ కాపీలను కేంద్రం వద్ద లైన్లో పెట్టారు. ఎండ మండుతున్నా క్యూలైన్లో వేచి ఉన్నారు. యూరియా పంపిణీ ప్రారంభమవుతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకి వచ్చారు. ఈ క్రమంలో రైతులు తమకు 2 బస్తాలు కావాలని పట్టుబట్టారు. అయితే ప్రతి రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మాకుమ్మడిగా కేంద్రంలోకి చొరబడి ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. యూరియా అందరికీ అందకపోవడంతో రైతులు మండిపడ్డారు. 800 రైతులకు 150 బస్తాలే.. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం లో 800కి పైగా రైతులు ఉండగా 150 యూరియా బస్తాలే వచ్చాయి. దీంతో యూరియా దొరకదేమోననే ఆందోళనతో రైతు సేవా కేంద్రం వద్దకు అన్నదాతలు పరుగులు తీశారు. పేర్లు నమోదు కోసం రైతులంతా ఎగబడటంతో గందరగోళం తలెత్తింది. తహశీల్దార్ లక్ష్మి గ్రామానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. వచి్చన యూరియా కట్టలను కొంతమందికే ఇవ్వగలమని, మిగిలిన వారికి 2,3 రోజుల్లో ఇస్తామని చెప్పగా రైతులు నిరసన తెలిపారు. 112 మందికే ఇస్తే మిగిలినవారి సంగతేంటి? యూరియా నిల్వలకు ఎటువంటి ఇబ్బందీ లేదని, సరిపడా ఉన్నాయని అంటూనే తమకు చుక్కలు చూపిస్తున్నారని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి రైతులు నిరసన తెలిపారు. శనివారం కొవ్వలి కో–ఆపరేటివ్ సొసైటీకి 12.30 టన్నుల కట్టల యూరియా వచ్చింది. వాటిలో 112 మందికి ఒక కట్ట,2 కట్టలు చొప్పున పంపిణీ చేశారు. 2.5 టన్నుల యూరియా కట్టలు సొసైటీలో నిల్వ ఉంచారు. అప్పటికే 200 మందికి పైగా రైతులు సొసైటీకి వచ్చి యూరియా కావాలని అడిగితే జిల్లా అధికారులు బఫర్ స్టాక్ కింద సొసైటీలో ఉంచాలని ఆదేశాలిచ్చారని, ఇది అలాగే ఉంచాలని, వీటిని ఇవ్వడం కుదరదని చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యూరియా వస్తుందని, అది మిగిలిన రైతులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. యూరియా..ఇవ్వండయ్యా! ఒక్క బస్తా యూరియా కోసం విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు శనివారం రోజంతా క్యూలో నిలుచున్నారు. టోకెన్లు ఉన్నవారికే ఆర్ఎస్కే సిబ్బంది ఒక్కో బస్తా యూరియా ఇచ్చారు. మిగిలినవారంతా ఉసూరుమంటూ వెనుదిరిగారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. టోకెన్లు ఒక చోట, ఎరువులు ఒక చోట పెట్టి కావాల్సిన రైతులకు మాత్రమే యూరియాను ఇస్తున్నారని మిగిలిన రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రైతు సేవా కేంద్రం ఉన్నా అక్కడ పంపిణీ పెట్టకుండా సచివాలయం వద్దనే టోకెన్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. ఎకరా పొలానికి కనీసం 3 బస్తాలు యూరియా కావాలని రైతులు డిమాండ్ చేస్తుండగా ఒక్క బస్తాతోనే సరిపెటే్టస్తుండటంపై అన్నదాతలు మండిపడుతున్నారు.యూరియా దారి మళ్లింపుపై సమగ్ర విచారణ జరపాలి ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి యూరియా దారిమళ్లుతున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న వార్తలు వస్తున్నాయని విమర్శించారు. జూన్ నాటికి 10 శాతం పంటలు సాగైతే.. 32 శాతం యూరియా అమ్మకాలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. పంటలు వెయ్యక ముందే ఈ యూరియా ఎవరు కొన్నారో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్నకు మాత్రమే యూరియా అవసరం ఉందని, వీటికీ డిమాండ్కు సరిపడా యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. -
యూరియాపైనా బాబు మార్కు డ్రామా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే చిట్కాలు చిత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎరువులకు కొరత ఉంది అన్నామనుకోండి.. వెంటనే వాడకం తగ్గించుకోమంటారు. ధాన్యం కొనుగోళ్లు ఇష్టం లేకపోతే... వరి వేయడం వేస్ట్ అనేస్తారు. పోనీ ఈ సలహాలేమైనా సకాలంలో ఇస్తారా? ఊహూ. అన్ని అయిపోయాక ఉచిత సలహాలు పారేస్తూంటారంతే. రాజకీయంగానూ అంతే. తన అసమర్థత బయటపడుతుందన్న అనుమానం వస్తే చాలు.. రాజకీయం మొదలుపెడతారు. నెపం ప్రత్యర్థి పార్టీలపై తోసేసే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత విషయంలోనూ జరిగింది ఇదే. సమస్యను తీర్చే ప్రయత్నం చేయకపోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దూషణలకు పరిమితమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా వ్యవహరించడం కూడా చంద్రబాబుకున్న నైపుణ్యం!ఏపీ, తెలంగాణల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా యూరియా కొరతపై కొన్ని వార్తలైనా ఇవ్వక తప్పలేదంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది. ఈ కష్టం రైతులకు మాత్రమే తెలుస్తుంది. ఏసీ రూములో కూర్చుని ఉండే మంత్రికి, ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుంది? బఫే డిన్నర్లో మాదిరిగానే యూరియా కోసమూ నిలబడమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య రైతులు అవమానించడమే అవుతుంది. తెలంగాణలో యూరియా కొరత ఉన్నా కాంగ్రెస్ మంత్రులు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతులపై నోరు పారేసుకోవడం లేదు.ఏపీలో చంద్రబాబు అటు కేంద్రాన్ని అనలేరు. ఇటు ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేరు. అందుకే రైతులు, సోషల్ మీడియా, సాక్షిలపై ఆయన తన అక్కసు తీర్చుకుంటున్నారేమో! యూరియా కొరత సమస్యపై చంద్రబాబు మాట్లాడుతూ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబడ్దార్ అని అన్నారట యూరియా అందుబాటులో ఉందని ఆయన చెబుతున్నారు. రైతులకు ఒక క్రమపద్దతిలో ఒక టైమ్ ప్రకారం యూరియాను పంపిణీ చేస్తే ఇబ్బంది ఉండదు. అలాకాకుండా యూరియా దొరుకుతుందో ,లేదో తెలియని అయోమయ స్థితిలో రైతులను ఎందుకు ఉంచుతున్నారు? ఎరువుల కొరతపై తప్పుడు పోస్టులు పెడితే చర్యలే అని ఆయన రైతులను, సోషల్ మీడియా వారిని బెదిరిస్తున్నారు. ఏపీలో అచ్చంగా పోలీసు యంత్రాంగంపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు ఉంది తప్ప, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్లు కనబడదు. ఇది అత్యయిక స్థితిని తలపిస్తుంది తప్ప, ప్రజాస్వామ్య యుతంగా ఉండదు. ఒకవైపు టీడీపీ తరపున పచ్చి అబద్దాలను తమ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుంటారు. అదే టైమ్ లో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టిస్తుంటారు. ఇలా తయారైంది ఏపీలో పరిస్థితి అని పలువురు చెబుతున్నారు. వైసీపీ చేసే రాజకీయాలలో రైతులు భాగస్వాములు కావద్దని, ఎరువు లేదని ఎవరైనా చెబితే తానే అక్కడకు వెళ్లి చూస్తా.. తప్పు ఉంటే చర్య తీసుకుంటా.. లేకుంటే సోషల్ మీడియా సంగతి చూస్తా అని చంద్రబాబు అనడం ఏ పార్టి విజ్ఞత అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. అంటే సీఎం స్వయంగా వెళితే తప్ప సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదని ఆయనే ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. ఇన్నాళ్లుగా ఎన్నిసార్లు ఎన్ని చోట్ల యూరియా కోసం నిలబడిన రైతుల క్యూల వద్దకు ఆయన వెళ్లారు. నిత్యం ఏదో ఒక చోటకు హెలికాప్టర్ వేసుకుని టూర్ చేస్తుంటారు కదా? ఎక్కడా ఆయనకు ఈ క్యూలు కనిపించలేదా? వీటి గురించి మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులపై ఒత్తిడి లేదట. ఆత్మహత్యలు లేవట. అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇది ఏ మేరకు నిజమో ఆయనకు తెలుసు. రైతులకు తెలుసు. జగన్ టైమ్ లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి,రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర అవసరాలను తీర్చడానికి కృషి చేసినమాట అవాస్తవమా?అప్పట్లో ప్రతి ఏటా 13500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందించారా? లేదా?అయినా రైతులపై ఒత్తిడి ఉందా? తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వలేదా? దానిని ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారా? లేదా? ఈ ఏడాది కేంద్రం ఇచ్చేదానితో కలిసి ఏడువేలే ఇచ్చారే? వరి, మిర్చి, మామిడి, ఉల్లి, తదితర పంటలకు సరైన ధరలు లేక వారంతా ఆందోళనకు దిగుతున్న మాట నిజం కాదా ? అయినా రైతులపై ఇప్పుడు ఒత్తిడి లేదని చంద్రబాబు అనడం చూస్తే, ఎంత ధైర్యంగా అబద్దాలు చెప్పగలుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ టైమ్ లో రైతులు ఎక్కడైనా రోడ్డెక్కవలసిన అవసరం వచ్చిందా? అలాంటి దృశ్యాలు కనిపించాయా అని వైసీపీ వారు అడుగుతున్నారు. సరిపడా యూరియా సరఫరా నిజంగా ఉంటే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రోడ్డు ఎక్కవలసి వస్తోందన్న ప్రశ్న వస్తోంది.అంటే వ్యాపారులు పక్కదారి పట్టించి బ్లాక్ లో అమ్ముకుంటున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల అరకొరగా ఇస్తున్న యూరియా ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల సిఫారసులుంటే తప్ప ఇవ్వడం లేదు. మరికొన్ని ప్రాంతాలలో యూరియా పొందాలంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని షరతులు పెడుతున్నారట. సాక్షి మీడియాలోనే కాకుండా ఎల్లో మీడియాలో కూడా అప్పుడప్పుడు యూరియా కొరత సమస్యల వార్తలు వస్తున్నాయి. జనంలో ఎల్లో మీడియా క్రెడిబిలిటి పోయిందనుకున్నారో, ఏమో కాని, సాక్షి మీడియాపైనే చంద్రబాబు విరుచుకుపడుతుండడం అలవాటుగా చేసుకున్నారు.దీనిని బట్టి సాక్షి మీడియానే జనం నమ్ముతున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. అందుకే ఆయన ఎక్కువ కంగారు పడుతున్నారనుకోవాలి. జనంలో ఎవరైనా నిలదీస్తే వారికి వైసీపీ ముద్ర వేసి సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారు. యూరియా గందరగోళంపై చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి జగన్ గట్టిగా ప్రశ్నించారు.తనకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని జగన్ ఎద్దేవ చేశారు. రైతులకు తమ ప్రభుత్వంలో జరిగిన మేలు , ప్రస్తుతం రైతులు పడుతున్న పాట్లను జగన్ వివరించారు. ప్రతిపక్షంగా ఆయన చేసిన విమర్శలను పరిగణనలోకి తీసుకుంటారా లేదా?అన్నది చంద్రబాబు ఇష్టం. కాని రాష్ట్రంలో రైతులు యూరియా కోసం, గిట్టుబాటు ధరల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నది గమనించి చర్య తీసుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ష్యూరిటీ అంటే భవిష్యత్తుకు మోసం గ్యారంటీ అని జగన్ , ఇతర వైసీపీ నేతలు ఎద్దేవ చేస్తున్నారు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
యూరియా దారిమళ్లింది.. నిజమే
సాక్షి, అమరావతి: యూరియా దారిమళ్లటం నిజమేనని తేలింది. విజిలెన్స్ అధికారులు సోదాలు చేసి అక్రమ నిల్వ, అధిక ధరలకు విక్రయం తదితర కారణాలతో రూ. 3.27 కోట్ల విలువైన 1,410 టన్నుల యూరియాను సీజ్ చేశారు. దీన్లో తెలంగాణకు తరలిపోయిన 400 టన్నులకు పైగా యూరియా కూడా ఉంది. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు కూడా దారిమళ్లిస్తున్న విషయం విజిలెన్స్ సోదాల్లో బట్టబయలైంది. వాస్తవానికి విజిలెన్స్ అధికారులు స్వా«దీనం చేసుకున్నదానికన్నా పదిరెట్లకుపైగా యూరియా అక్రమంగా తరలిపోయినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు 4,862 చోట్ల సోదాలు చేసి అవకతవకలకు పాల్పడిన 67 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. యూరియాను పెద్ద ఎత్తున దారిమళ్లించిన నేరానికి తొమ్మిదిమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అత్యధికంగా ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో 11 చొప్పున, కర్నూలులో తొమ్మిది, నంద్యాలలో ఆరు, ఏలూరులో ఐదు, అనకాపల్లిలో నాలుగు కేసులు నమోదుచేశారు. మిగిలిన జిల్లాల్లో 2–3 కేసులు నమోదయ్యాయి. దారిమళ్లింపుతో పాటు ఎమ్మార్పికి మించి విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్, ట్యాగింగ్ వంటి అవకతవకలకు పాల్పడినందుకు 20 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు, పల్నాడు జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి యూరియా అక్రమంగా తరలి పోయినట్టుగా గుర్తించారు. కర్నూలు జిల్లా సహా పలు జిల్లాల్లో యూరియాను టీడీపీ నేతలే దారిమళ్లించినట్టు వార్తలొచ్చాయి. కానీ టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఈ దాడులన్నీ మొక్కుబడి తంతుగానే సాగాయి. బీర్ల తయారీ ప్లాంట్లు, పెయింట్లు, వారి్నష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువులు, కోళ్లు, ఆక్వాదాణా, కల్తీపాల తయారీలో యూరియా విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ విజిలెన్స్ బృందాలు వీటిజోలికి వెళ్లలేదు. ఈ పరిశ్రమలతోపాటు టీడీపీ నేతల గోదాముల్లో తనిఖీలు నిర్వహించి ఉంటే వేలాది టన్నుల యూరియా బయటపడేదని చెబుతున్నారు. అందుబాటులో ఉన్నది 63,874 టన్నులే సెపె్టంబర్ నెలకు సంబంధించి 1.55 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రస్తుతం 63,874 టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 10 రోజుల్లో మరో 41,040 టన్నుల యూరియా వస్తుందని ప్రభుత్వం వారం రోజులుగా చెబుతూనే ఉంది. కాగా సీజన్లో 6.22 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, పాత నిల్వలు, కేంద్రం నుంచి వచ్చిన నిల్వలు కలిపి 6.71 లక్షల టన్నులు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 5.90 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. -
‘రైతుల ఇబ్బందులు.. సీఎం మాట్లాడే బాష ఇదేనా?’
అనకాపల్లి: ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈనెల తొమ్మిదో తేదీన వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.అనకాపల్లి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుడూ..‘సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు విత్తనం, ఎరువులు అందలేదనే మాట ఎప్పుడూ లేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. 15వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నాడు. ఎవరైనా రైతుల కోసం మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉన్న వారికైనా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. సీజన్కి సిద్ధంగా ఉండాలి. సీజన్ అయ్యాక యూరియా ఇస్తానంటే ఎవరికీ కావాలి. ఎవరైనా మాట్లాడితే జైలులో వేస్తానని సీఎం అంటున్నారు. సీఎం మాట్లాడే బాష ఇదేనా?. గతంలో అన్నీ అందుబాటులో పెట్టాం కాబట్టి గతేడాది ఇలాంటి సమస్య రాలేదు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
తలారి ప్రభుత్వం..యూరియా కుతంత్రం
సాక్షి, అమరావతి: ‘వరి పంట వేయొద్దు.. వరి పంట వల్ల ఆదాయం లేదు.. ఈ పంట సాగువల్ల రైతులకేమీ మిగలదు..’ ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో వరి సాగుచేస్తున్న రైతులను కలవరపెడుతున్నాయి. ఇదే లక్ష్యంతో వరిసాగును నిర్వీర్యం చేసేదిశగా క్షేత్రస్థాయిలో కుట్రలకు పాల్పడుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. దీన్లో భాగంగానే.. యూరియా కొరత సృష్టిస్తూ అదునులో అందకుండా చేస్తున్నారని రైతుసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు జాతీయస్థాయిలో వరిసాగు పెరుగుతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లోనే సాధారణ సాగువిస్తీర్ణం కంటే మిన్నగా (107 శాతంలో) వరి సాగయింది. ఏపీలో గత ఏడాది నుంచి వరిసాగు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గిపోతున్నాయి. బియ్యం ఉత్పత్తిలో ఒకప్పుడు టాప్–5లో ఉన్న ఏపీ నేడు 9వ స్థానానికి దిగజారిపోయింది. టాప్–10లో ఉన్న తెలంగాణ నేడు టాప్–2కి ఎగబాకింది. 2024–25 మూడో ముందస్తు దిగుబడి అంచనాలపై కేంద్ర వ్యవసాయశాఖ జారీచేసిన గణాంకాలేæ ఇందుకు నిదర్శనం. అన్నపూర్ణ పరిస్థితి.. అధోగతి ఏపీలో ఖరీఫ్ సాధారణ సాగువిస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు. దీంట్లో 36.37 లక్షల ఎకరాల్లో (దాదాపు 54 శాతం విస్తీర్ణంలో) వరి సాగవుతుంది. ఈ సీజన్లో సాగులక్ష్యం 86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 55 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీన్లో 30 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. ఖరీఫ్లో కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లోనే అత్యధికంగా వరి సాగవుతుంది. అందుకే ఈ బెల్ట్ను దేశానికే అన్నపూర్ణగా పిలుస్తుంటారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు విజయనగరం, రాయలసీమ జిల్లాల్లో సైతం ఈసారి యూరియా కొరత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం చిరుపొట్ట దశలో ఉన్న వరికి అవసరమైన నత్రజని (యూరియా) అందని పరిస్థితి నెలకొంది. ఈ అదునులో పైరుకు నత్రజని ఇవ్వకపోతే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. 2024–25 సీజన్లో 80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు రాగా, ఈసారి వరుస వైపరీత్యాలకుతోడు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏర్పడిన యూరియా కృత్రిమ కొరతతో దిగుబడులు మరింత తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. అదునులో రైతును దెబ్బకొడుతున్న కూటమి సర్కారు ఖరీఫ్ సీజన్లో 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 13.52 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక యూరియా వరకు చూస్తే ఈ సీజన్లో 6.22 లక్షల టన్నులు అవసరం కాగా.. ఇప్పటికే 5.80 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయంటోంది. సెప్టెంబర్ నెలకు 1.55 లక్షల టన్నుల యూరియా కావాల్సి ఉండగా.. 90 వేలటన్నులు అందుబాటులో ఉన్నట్లు పాలకులు చెబుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో సన్న, చిన్నకారు రైతులకు కట్ట యూరియా కూడా దొరకడంలేదు. యూరియాకు ప్రత్యామ్నాయం లేదని తెలిసినా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ మాదిరిగా ఎకరాకు అరకట్టే పరిమితం చేయడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. యూరియా కట్ట ధర రూ.266.50 కాగా, బహిరంగ మార్కెట్లో రూ.500 నుంచి రూ.600 వరకు వసూలు చేçస్తున్నారు. ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్తే యూరియా కట్ట కావాలంటే రూ.1,400కు పైగా పలికే కాంప్లెక్స్ ఎరువులను అంటగడుతున్నారు. మరికొందరు రూ.800 నుంచి రూ.900 మధ్య ఉండే పురుగుమందులు కొంటేనే యూరియా విక్రయిస్తామంటూ మెలిక పెడుతున్నారు. దీంతో యూరియా కోసం రైతులు అవసరం లేని కాంప్లెక్స్ ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని రైతులు చెబుతున్నారు.అధికంగా వినియోగం అంటూ ప్రచారంఓవైపు గత సీజన్తో పోల్చుకుంటే అదనంగా దాదాపు లక్షటన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు వరిసాగులో యూరియా మితిమీరి వినియోగించడం వలన ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారంటూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగు తగ్గింది. ఉన్నంతలో కాస్త మెరుగ్గా వరి, మొక్కజొన్న పంటలే సాగయ్యాయి. ఖరీఫ్లో మొత్తం సాగువిస్తీర్ణంలో 54 శాతానికిపైగా సాగయ్యే వరికి ప్రత్యామ్నాయం లేదు. కానీ ప్రభుత్వ నిర్వాకం వలన వరిసాగు కూడా తగ్గితే వ్యవసాయ కూలీలతోపాటు రైతులు కూడా పెద్ద ఎత్తున వలసబాట పట్టే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అరకొర ఎరువులు రైతులకు రిక్తహస్తాలు!ముదినేపల్లి రూరల్, సరుబుజ్జిలి, శృంగవరపుకోట: రాష్ట్రంలో యూరియా దొరక్క కర్షకుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్కారు సక్రమంగా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతన్నలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండంలోని వడాలి సొసైటీకి గురువారం యూరియా లోడ్ వచ్చింది. వచ్చిన ఎరువులు ఏ మూలకీ చాలలేదు. కొద్దిసేపటికే యూరియా అమ్ముడైపోయింది. దీంతో రైతులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొత్తకోట రైతు సేవా కేంద్రానికి సుమారు 1200 ఎకరాల రైతులకు కేవలం 100 ఎరువుల బస్తాలు వచ్చాయి. దీంతో ‘మీరిచ్చే ఒక్క బస్తా ఎందుకూ పనికి రాదు. అలాంటప్పుడు మిగిలిన ఎరువును మీరే బ్లాకులో అమ్ముకోండి’ అంటూ రైతులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులను అడుగుతుంటే ‘ఎరువులు తక్కువ వేసుకోండి. వృథా చేయవద్దు’ అంటున్నారని, అవసరం ఉంది కాబట్టేగా అడుగుతున్నాం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలోని జె.కి.అగ్రి ఇండియా ట్రేడర్స్ దుకాణంలో యూరియా అమ్ముతున్నారన్న సమాచారంతో పలు గ్రామాల రైతులు ఉదయం నుంచి దుకాణం ముందు బారులు తీరారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా రైతుల మధ్య తోపులాట, స్వల్ప వాదనలు జరగడంతో ఎస్.కోట పోలీసులు బందోబస్తు కోసం వచ్చారు. ఎవరికి ఇస్తున్నారు యూరియా.. ఉదయం నుంచి ఎన్ని కట్టలు ఇచ్చారంటూ ఓ రైతు నిలదీయడంతో పోలీసులు ‘నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నిన్ను ఎవడ్రా రమ్మన్నాడు. ఎక్కువ మాట్లాడకు’ అంటూ ఆయనపై దుర్భాషలకు దిగారు. ఇది చూసిన రైతులు ‘ఏం కర్మ పట్టిందిరా.. కూటమి ప్రభుత్వంలో రైతుకి దక్కిన గౌరవంఇదీ’ అంటూ నిట్టూర్చారు.రాష్ట్రంలో యూరియా సరిపడా ఉంది: సీఎస్ రాష్ట్రంలో యూరియా సరిపడా అందుబాటులో ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరతలేదన్నారు. అన్ని రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్లలో రోజువారీ ప్రారంభ, ముగింపు నిల్వలు ప్రదర్శించాలన్నారు. ఉల్లి, పొగాకు పంటల ఉత్పత్తి, కొనుగోలు.. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర తోడ్పాటుపై కూడా సీఎస్ సమీక్షించారు.వరిసాగు తగ్గితే ఆహార భద్రతకు పెనుముప్పు దేశవ్యాప్తంగా వరిసాగు పెరుగుతుంటే.. ఏపీలో తగ్గించాలని చెప్పటం ఆందోళన కలిగిస్తోంది. ఒక మోస్తరు వర్షానికే నీరు నిలువ ఉండే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా, శ్రీకాకుళం జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు? వరిసాగు తగ్గితే భవిష్యత్లో ఆహారభద్రతకు పెనుముప్పుగా మారుతుంది. ఖరీఫ్లో 54 శాతానికి పైగా విస్తీర్ణంలో సాగయ్యే వరికి ప్రత్యామ్నాయం లేదు. వరిసాగు తగ్గితే వ్యవసాయ కూలీలతో పాటు కౌలురైతులు కూడా వలస బాటపడతారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు (ఇ2+50%) పెట్టుబడులకు కనీసం 50 శాతం తక్కువ కాకుండా కనీస మద్దతు ధర నిర్ణయించడమే కాదు.. ఆ మేరకు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
అటు సిగపట్లు.. ఇటు లూటీకి యత్నం
మహబూబాబాద్ రూరల్ : ఒకచోట యూరియా కోసం కొందరు మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకోగా, మరోచోట కార్యాలయంపై రైతులు రాళ్ల దాడి చేశారు. ఆపై కట్టెలు కాల బెట్టి నిరసన తెలిపారు. దీంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్లోని వివేకానంద సెంటర్ వద్ద ఉన్న ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో గురువారం యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారని తెలిసి వందల సంఖ్యలో రైతులు అక్కడకు చేరుకున్నారు. రైతుల క్యూలైన్ భారీగా ఉండటంతో టౌన్ సీఐ గట్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన రైతులు.. యూరియా పంపిణీ ఆలస్యం కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తోపులాట పెరిగి ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లి బస్తాలు తీసుకునే క్రమంలో ఘర్షణ పడ్డారు. ఇందులో కొందరు మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. దీంతో కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. మరికొంతమంది మహిళలు నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రైతు సేవాకేంద్రం నిర్వాహకులు కొంతమంది రైతులకు యూరియా బస్తాల పంపిణీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మన గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్లతో దాడిచేశారు. గ్రోమోర్ బోర్డును చించివేసి పాత కర్రలు వేసి నిప్పిపెట్టి నిరసన తెలిపారు. అనంతరం గ్రోమోర్ సెంటర్ గోదాంపై దాడిచేసి అందులోకి చొచ్చుకెళ్లారు. గోదాము తలుపులు పగులగొట్టి యూరియా బస్తాలు తీసుకొని పోతుండగా పోలీసులు భారీగా చేరుకొని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అదనపు బలగాలు వజ్ర ట్యాంకర్తో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గోదాంలో ఉన్న యూరియా బస్తాల వరకు పంపిణీ చేస్తామని రైతులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సు«దీర్ ఆర్ కేకన్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకున్నాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. తహసీల్దార్ చంద్రరాజేశ్వర్రావు రైతులను క్యూలైన్లలో నిలబెట్టి ఒక్కో రైతుకు ఒక బస్తా పంపిణీ చేశారు. దొరుకుతుందో.. లేదోఅయినా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో రైతులు సాక్షి, నెట్వర్క్ : కనీసం ఒక బస్తా యూ రియా అయినా దొరు కుతుందో లేదో తెలి యకపోయినా తెల్లవారుజాము నుంచే రైతు లు క్యూలైన్లో నిల్చుంటున్నారు. యూరియా దొరికిన రైతులు ఆనందంతో, దొరకని రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్నిచోట్ల అసలు యూరియా లారీలు రావడం లేదంటూ ఆందోళనలకు దిగి రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ సింగిల్విండో సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వృద్ధులు మణెమ్మ, కుర్మన్న స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే పక్కన ఉన్న రైతులు నీళ్లు తాగించి 108లో ఆస్పత్రికి తరలించారు. టోకెన్లు తీసుకున్న రైతులే మళ్లీమళ్లీ వస్తుండడంతో మరికల్ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐ రాము ఎన్నికల పోలింగ్ తరహాలో తీలేర్ సొసైటీకి వచి్చన ప్రతి రైతు చేతి బొటవేలుకు సిరా(ఇంకు) గుర్తు వేసి.. టోకెన్ ఇచ్చారు. వీరికి ఈ నెల 6వ తేదీన యూరియా ఇవ్వనున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సింగిల్ విండో కార్యాలయానికి ఉదయాన్నే చేరుకున్నారు. ఇక్కడకు వచ్చిన యూరియా లారీని అధికారులు అక్కన్నపేటకు పంపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేట్ రహదారిపై బైఠాయించారు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న మంత్రి కార్యాలయానికి పరుగులు పెట్టారు. పోలీసులు వారించినా రైతులు వినకుండా మంత్రి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. తెల్లవారుజామునే కామారెడ్డి జిల్లా బీబీపేటలోని సింగిల్ విండో సొసైటీ కార్యాలయానికి రైతులు తరలివచ్చి క్యూలో ఉన్నారు. కొందరికే యూరియా పంపిణీ చేయడంతో రైతులు తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు, సొసైటీ సిబ్బంది సర్దిచెప్పారు. యూరియా అందక తన పొలం ఎర్రబడిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు మానుక లక్ష్మణ్ ఆగ్రహంతో రగలిపోయాడు. ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసిన పాపానికి చెప్పుతో కొట్టుకోవాలంటూ లక్ష్మణ్ తన చెప్పుతో కొట్టుకున్నాడు. యూరియా కోసం అన్నదాతలు బాధ పడుతున్నారంటూ సీఎం రేవంత్రెడ్డిని దూషించాడు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వరంగల్ గూడ్స్ షెడ్కు వివిధ కంపెనీలకు దాదాపు 2,912 మెట్రిక్ టన్నుల యూరియా వచి్చంది. దీనిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారి రవీందర్ చెప్పారు. -
శృంగవరపుకోటలో యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులపై నోరు పారేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్ళు
-
మహబూబాబాద్లో ఉద్రిక్తత.. యూరియా కేంద్రంపై రాళ్ల దాడి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సూర్య థియేటర్ ఎదురుగా ఉన్న యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ‘మన గ్రోమోర్’ దుకాణం బోర్డు చించేసిన రైతులు.. దుకాణం ముందు కర్రలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. గోడౌన్ తాళం పగలగొట్టిన రైతులు.. యూరియా బస్తాలను బయటకు తెచ్చారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యూరియా ఇవ్వాలంటూ రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.సూర్యాపేట జిల్లా: హుజుర్నగర్లో యూరియా కోసం క్యూలైన్లో నిలబడిన మహిళ.. స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం నుంచి లైన్ లో నిలబడటంతో మహిళా రైతు దాసరి రాములమ్మ అస్వస్థతకు గురయ్యారు.రాజన్న సిరిసిల్ల జిల్లా: వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
‘రైతులు వెళ్ళి అడిగితే బెదిరిస్తున్నారు’
తాడేపల్లి : యూరియా గురించి రైతులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ కైలే అనిల్కుమార్. కృష్ణాజిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందిని, పీఏసీఎస్ల దగ్గర రైతులు బారులు తీరుతున్నారన్నారు. యూరియాని కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని, చైతులు వెళ్లి అడిగితే బెదిరిస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా పేర్లు మార్చారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పామర్రు నియోజకవర్గంలో బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న యూరియాని రైతులు అడ్డుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత లోపల ఉన్న యూరియా రంగు కూడా మారిపోయిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు పట్టుకున్న యూరియా లారీ వ్యవహారం తేల్చాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. -
ఏపీ కేబినెట్కు యూరియా సెగ
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై చర్చ జరిగింది. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ కేబినెట్లో చర్చ నడిచింది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్సార్సీపీని తిట్టాలని సీఎం ఆదేశించారు.కాగా, యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది.యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. -
KSR Live Show: రైతుల కష్టాలపై రాజకీయ రాకాసులు..!
-
ఏపీని వేధిస్తున్న యూరియా సమస్య..! కృష్ణా జిల్లాలో రైతులు పడిగాపులు
-
యూరియా ‘కట్ట’డిపై ముట్టడి!
సాక్షి, అమరావతి /సాక్షి నెట్వర్క్: యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తోంది. సొసైటీల ద్వారా సరఫరా చేయకుండా పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతల ఆగడాలకు రైతన్నలే చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ రైతన్నలే విజిలెన్స్ అధికారుల అవతారమెత్తి అడ్డుకుంటున్నారు. చరిత్రలోఎన్నడూ లేనివిధంగా డిమాండ్ మేరకు యూరియా సరఫరా కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లాలో యూరియా కోసం నిరసనలు భగ్గుమంటున్నాయి. దారి మళ్లుతున్న యూరియా.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సీజన్లో 6.22 లక్షల టన్నుల యూరియా అవసరం. ఈ ఏడాది 5.70 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయని చెబుతోంది. అదే నిజమైతే మరి రైతన్నలు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తోందన్న ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం కరువైంది. రైతులకు అందాల్సిన యూరియా పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నట్లు స్పష్టమవుతోంది. పలు జిల్లాల్లో టీడీపీ నేతలే యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నా వారిని కాపాడే యత్నం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు గుడివాడలో గంటల కొద్దీ పడిగాపులు.. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో యూరియా సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించడంతో పీఏసీఎస్ల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. విన్నకోట, నందివాడ, రామనపూడి పీఎసీఎస్ వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడితే అరకొరగా మాత్రమే యూరియా అందజేశారని రైతులు మండిపడ్డారు. అధికార పార్టీ నేతల సిఫార్సులు ఉన్న వారికి మాత్రమే ఎరువులు దక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో భారీ క్యూలైన్లో బారులు తీరిన అన్నదాతలు ఘంటశాలలో గందరగోళం కృష్ణా జిల్లా ఘంటశాల మండలంలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మండలంలోని లంకపల్లి పీఏసీఏస్కు 445 యూరియా కట్టలు రాగా ఘంటశాల గ్రోమోర్కు 555 యూరియా కట్టలు వచ్చాయి. లంకపల్లి పీఏసీఏస్ వద్దకు రైతులు భారీగా చేరుకోగా అధికారులు గేట్లు మూసి వేయడంతో ఎండలో బారులు తీరారు. రైతులను అదుపు చేయలేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వలేదు. రైతుల ఆధార్, పాస్ బుక్ జిరాక్సులు తీసుకుని స్లిప్లు పంపిణీ చేశారు. పలుకుబడి ఉన్న వారికే యూరియా ఇస్తున్నారని క్యూలో నిలబడ్డ వారు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రోమోర్, లంకపల్లి పీఏసీఏస్ల వద్ద రైతులు కనీసం సేదతీరడానికి కూడా అవకాశం లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఘంటశాలలో అరుగులపై తమ వంతు వచ్చే వరకు కూలబడిపోయారు. యూరియా దొరకని రైతులు ప్రభుత్వ అసమర్థతను తిట్టుకుంటూ వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా గజ్జరంలో యూరియా కోసం రైతుల పాట్లు చిత్తూరులో రైతుల నిరసన టోకెన్లు ఉన్నా యూరియా పంపిణీ చేయడం లేదని చిత్తూరు జిల్లా సదుం మండలంలో రైతులు నిరసన తెలిపారు. మూడు రోజులుగా దుకాణం వద్దకు టోకెన్లతో వచ్చినా యూరియా ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్టాకు లేదంటూ దుకాణం మూసి వేశారని, నాయకులు ఫోన్ చేస్తే పదుల సంఖ్యలో బస్తాలను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె యార్డులో ఆందోళన యూరియా కోసం రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా మార్కెట్ యార్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా యూరియా అందించే నాథుడు లేడని వాపోయారు. స్టాక్ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని, గంటల కొద్దీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరిలో తిరుగుముఖం.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని గజ్జరం, అన్నదేవరపేట సొసైటీల వద్ద బుధవారం యూరియా విక్రయాల వద్ద గందరగోళం నెలకొంది. ఈ సొసైటీలకు 1,600 బస్తాల యూరియా వచ్చింది. 500 మంది రైతులకు యూరియా అందజేశారు. మరో 50 మంది రైతులకు అందకపోవడంతో వెనుదిరిగారు. తాళ్లపూడి, వీరభద్రపురం, కుకునూరు, పైడిమెట్ట గ్రామాల రైతులకు యూరియా అందకపోవడంతో తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా సదుంలో నిరసన తెలుపుతున్న కర్షకులు అనకాపల్లిలో కిక్కిరిసిన కేంద్రం.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో యూరియా పంపిణీ గురించి తెలియడంతో ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో చేరుకున్నారు. యూరియా నిల్వల కంటే రెట్టింపు సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షించి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని, ఆధార్, 1 బీ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయశాఖ సిబ్బంది చెప్పడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలో పడిగాపులు.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. బుధవారం సొసైటీ కార్యాలయం వద్దకు స్టాక్ రావడంతో రైతులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఒక బస్తా మాత్రమే సరఫరా చేస్తుండటంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికే యూరియా ఖాళీ కావడంతో రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా..! ఏలూరు డీసీఎంఎస్ డిపోకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు అధిక సంఖ్యలో రావడంతో చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. డీసీఎంఎస్ డిపోకు 18 టన్నుల యూరియా వచ్చినా పంపిణీ చేయకుండా అధికారులు మోకాలడ్డారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని డిపో నిర్వాహకులు మెలిక పెట్టారు. కాంప్లెక్స్ ఎరువులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, అంత డబ్బు తమ వద్ద లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారపార్టీ నాయకుల సిఫార్సు ఉన్న వారికి ఎన్ని కట్టలైనా ఇస్తున్నారంటూ వాపోయారు. గుంటూరు జిల్లా రేపల్లె మార్కెట్యార్డు వద్ద రైతుల ఆందోళన అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపంఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 55.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం వరి చిరు పొట్ట దశకు చేరుకుంది. ఈ సమయంలో నత్రజని (యూరియా) చాలా అవసరం. యూరియాకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇలాంటి తరుణంలో సెప్టెంబర్లో అంచనా డిమాండ్ 1.55 లక్షల టన్నులైతే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా కేవలం 94 వేల టన్నులు మాత్రమే. యూరియా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోంది.. అంటూ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఊరిస్తున్నా రాష్ట్రానికి వారు చెబుతున్నట్లుగా నిల్వలు రావడం లేదు. దీంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతులకు సరఫరా చేయాల్సిన యూరియా పక్కదారి పడుతుంటే గుడ్లప్పగించి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. అసలు తమకు కట్ట కూడా దొరకడం లేదంటూ ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే మితిమీరి వాడేస్తున్నారంటూ వారిని నిందిస్తోంది. అర్ధరాత్రి రోడ్డెక్కి లారీని అడ్డుకున్న రైతులు..కొరత తీవ్రంగా ఉండడంతో కృష్ణా జిల్లా చినముత్తేవి గ్రామ రైతులు మంగళవారం అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీని అడ్డుకున్నారు. అందులో ఉన్న సరుకు తమకు పంపిణీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎరువులతో వచ్చిన లారీ (ఏపీ 29 టీబీ 3974) డోకిపర్రులో కొన్ని బస్తాలు, చినముత్తేవిలోని ఓ ఎరువుల దుకాణంలో మరికొన్ని బస్తాలను దింపింది. చినముత్తేవి రైతులు దీన్ని గమనించి లారీని అడ్డుకున్నారు. ఏలూరు డీసీఎంఎస్ ఎరువుల కౌంటర్ వద్ద తోపులాట లారీ డ్రైవర్ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవటంతో ఆగ్రహించిన రైతన్నలు యూరియా కోసం అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. అక్కడకు చేరుకున్న కూచిపూడి ఎస్సై రైతులతో మాట్లాడి లారీని పోలీస్స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి బుధవారం కూచిపూడి పోలీస్స్టేషన్కు వచ్చి లారీలోని ఎరువులకు బిల్లులు ఉన్నాయని చెప్పారు. ఆ లోడ్ను నిడుమోలులోని గంగా ఫెర్టిలైజర్స్కు పంపించి ఎకరాకు అరకట్ట వంతున ఏవో ఆధ్వర్యంలో పంపిణీ చేయించారు. గుడివాడలోని వ్యాగన్ నుంచి యూరియా 325 బస్తాలు, ఎంవోపీ (పొటాష్) 200 బస్తాలు, 16–16–16 రకం 80 బస్తాలు పంపామని, నిడుమోలు వెళుతుండగా రైతులు లారీని అడ్డుకుని ఆందోళన చేపట్టారని జేడీఏ పేర్కొన్నారు. -
బస్తా కోసం.. బారులేబారులు
సాక్షి, నెట్వర్క్: గంటల తరబడి బారులు తీరినా...రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం గగనమైంది. రోజురోజుకూ యూరియా కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. » ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే...యూరియా కోసం జడ్చర్లలో 167 జాతీయ రహదారిపై సిగ్నల్గడ్డ వద్ద రైతులు ధర్నా చేశారు. మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాజాపూర్, బాలానగర్, చిన్నచింతకుంట, మిడ్జిల్ మండలాల్లోని పలు కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. నవాబ్పేటలో వేలాది మంది రైతులు రావడంతో పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. » నాగర్కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల పీఏసీఎస్ వద్ద జప్తీ సదగోడుకు చెందిన మొగిలి అనిత క్యూలో నిల్చొని స్పృహతప్పి పడిపోయింది. వనపర్తి జిల్లా గోపాల్పేటలో రైతులు ధర్నా చేశారు. » భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పీఏసీఎస్కు రైతులు భారీగా పోటెత్తారు. » మెదక్ జిల్లా శివ్వంపేట పీఏసీఎస్కు తెల్లవారు జా ము నుంచే రైతులు పెద్దఎత్తున బారులు తీరారు. » నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆగ్రో ఏజెన్సీ వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు కూడా క్యూ లైన్లో నిల్చున్నారు. » కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని సొసైటీకి యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో ఉదయం 4 గంటల నుంచే రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి ఉండడం ఇబ్బందిగా మారడంతో వరుసలో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు ఉంచారు. రాత్రి 7 గంటల వరకు నిరీక్షించినా లారీ రాకపోవడంతో నిరాశతో తిరుగుముఖం పట్టారు. » ఉమ్మడి వరంగల్జిల్లాలో యూరియా కష్టాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సొసైటీ వద్ద రైతులు తెల్లవారుజామునుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. చివరకు యూరియా లారీ రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. నర్సింహులపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఎదుట కూపన్ల కోసం ఉదయం నుంచే రైతులు చెప్పులను క్యూలో పెట్టారు. డోర్నకల్ మండలం గొల్లచర్ల సమీపంలోని పీఏసీఎస్ ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. దంతాలపల్లి రైతు వేదిక వద్ద కూపన్ల కోసం కిలోమీటర్ మేర లైన్ కట్టి గంటల కొద్ది వేచి చూశారు. మరిపెడ పీఏసీఎస్లో మహిళా రైతులు యూరియా టోకెన్ల కోసం గేటు దూకి మరి కార్యాలయంలోకి వెళ్లారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రామలింగాయపల్లి పీఏసీఎస్కు రాత్రి యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు అక్కడే పడుకునేందుకు బుధవారం రాత్రి చద్దర్లు, గొడుగులతో వచ్చారు. జనగామ జిల్లా కేంద్రంతోపాటు తరిగొప్పుల, స్టేషన్ఘన్పూర్లో యూరియా కోసం బారులుతీరారు. » జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ఆగ్రోస్–1, చిట్యాల ఓడీఎంఎస్ దుకాణం వద్ద పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేశారు. » ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజారాంపేట సొసైటీ వద్ద ఒకే బస్తా ఇవ్వడంపై రైతులు మండిపడ్డారు. కేంద్రం ఇన్చార్జ్, ఎంపీఓ శివ రైతులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి దీసింది. కోర్టుకు వెళ్లాలంటూ రైతులను ఆయన బయటకు తోసేసే ప్రయత్నం చేయగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యూరియా రైతుల కష్టాలు
-
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
Warangal : అన్నదాతను రోడ్డెక్కేలా చేసిన యూరియా సమస్య
-
యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్కు తరలించారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:రూ.200 కోట్ల అవినీతి:రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాంరైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:డిమాండ్కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:డిమాండ్కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.ఈనెల 9న నిరసన కార్యక్రమం:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదుఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. -
రోడ్డెక్కిన రైతన్నలు
సాక్షి, అమరావతి/ఉదయగిరి రూరల్/గంగవరం/సదుం/మదనపల్లె రూరల్: రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని బండగానపల్లె పంచాయతీ బిజ్జంపల్లిలో యూరియా కోసం రైతులు మంగళవారం రోడ్డుపై నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా గంగవరం, సదుం మండలాల్లో యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు. గంగవరంలోని పీఏసీఎస్ కార్యాలయానికి చేరిన 450 బస్తాలు యూరియా కోసం 2వేలమందికిపైగా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు గాశారు. దీంతో ఉన్న 450 బస్తాలను ఇంతమందికి ఎలా పంచాలా అని అధికారులు తలలు పట్టుకున్నారు. పీఏసీఎస్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకూ రైతులు ఎండలో క్యూకట్టారు. వీరిలో వృద్దులు, మహిళలూ ఉన్నారు. అలాగే, సదుంలోని ఓ ప్రైవేటు దుకాణానికి 14 క్వింటాళ్ల యూరియా రావడంతో అక్కడ కూడా రైతులు బారులు తీరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మండల వ్యవసాయశాఖాధికారి(ఏవో) కార్యాలయంలో యూరియా కూపన్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. కూపన్లు ఇస్తున్న క్రమంలో అక్కడ తోపులాటలు, అరుపులు, కేకలతో పరిస్థితి గందరగోళంగా మారింది. గంటలసేపు నిల్చుని, తోపులాటకు గురై ఇబ్బందులు పడుతూ లోనికి వెళితే ఒకరికి ఒక బస్తా యూరియానే ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్కు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్లో ఇప్పటివరకు 22.12 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, దాంట్లో సగానికి పైగా వరి సాగైందని చెప్పారు. అదునుకు పంటకు యూరియా అందించకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెపె్టంబర్లో వరి చిరుపొట్టదశలో తప్పనిసరిగా యూరియా వేయాలని, దీనికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభంలోనే వరి సాగు ఏరియాలో యూరియా కొరత వచ్చిందని, ఆగస్ట్ 8 నుంచి కురిసిన అధిక వర్షాలతో ముంపునకు గురైన వరితోపాటు మొక్కజొన్న, పత్తి ఇతర పంటలకూ యూరియా అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ సరిపడా యూరియాను ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి కెళ్లినా యూరియా కోసం రైతులు బారులు తీరి కన్పిస్తున్నారన్నారు.రెండో పంటకు యూరియా కొనవద్దని ప్రకటనలు ఇవ్వడం తగదన్నారు. రూ.266.5 ఉన్న యూరియా కట్టను కొనాలంటే ప్రైవేటు వ్యాపారులు రూ.1,400పైగా ఉన్న కాంప్లెక్స్ కట్ట లేదా రూ.800– 900 పలికే పురుగు మందును బలవంతంగా అంటకడుతున్నారని నాగిరెడ్డి చెప్పారు. -
నిరీక్షించి...నీరసించి
సాక్షి నెట్వర్క్ : యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలబడుతున్న వారు అనారోగ్యం పాలవుతున్నారు. » మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని వ్యవసాయ మార్కెట్ చెక్పోస్ట్ వద్ద ఇల్లెందు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద మంగళవారం కూడా రైతులు బారులుతీరారు. కురవి సొసైటీ వద్ద కూపన్ల కోసం క్యూలో నిలబడి రైతులు నానా అవస్థలు పడ్డారు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్ వద్దకు సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు వేల మంది రైతులు యూరియా కోసం వచ్చారు. క్యూలో ఉన్న గాంధీనగర్కు చెందిన ఆవుల నారాయణ అనే రైతుకు ఫిట్స్ వచ్చింది. నర్సింహులపేటలో కూపన్లు ఇవ్వకపోవడంతో రైతులు పట్టాపాస్ బుక్కుల జిరాక్స్ కాపీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. » వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. » మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరు«ధ్రెడ్డి తన కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆగ్రో సేవా కేంద్రం దుకాణం వద్దకు వెళ్లారు. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు ఒక్కసారిగా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను సముదాయించి మాట్లాడిన ఎమ్మెల్యే అనిరు«ధ్రెడ్డి వెంటనే కలెక్టర్ విజయేందిరకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సాయంత్రంలోగా యూరియాను అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. » దేవరకద్రలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినా టోకెన్లు ఇచ్చి వెనక్కి పంపుతున్నారని, యూరియా మా త్రం ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. ఉదయం 6 గంటలకే రాయచూర్ జాతీయరహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాయచూర్–మహబూబ్నగర్ వైపు వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. » వనపర్తి జిల్లావ్యాప్తంగా యూరియా ఆందోళనలు కొనసాగాయి. ఖిల్లాఘనపురంలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. » నాగర్కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. » గద్వాల సింగిల్విండో కార్యాలయానికి దాదాపు 400 మంది రైతులు మంగళవారం ఉదయం 8 గంటల వరకే చేరుకున్నారు. యూరియా లేదని అధికారులు చెప్పడంతో అంబేడ్కర్ చౌక్లో రోడ్డుపై బైఠాయించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా లేకపోవడంతో రైతులు రాస్తారోకో చేశారు. » కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ వద్ద లారీ లోడ్ వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు అక్కడకు వెళ్లారు. సోమవారం టోకెన్లు ఇచ్చామని చెప్పడంతో రైతులు రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు.రైతు సమస్యలపై అదే నిర్లక్ష్యం ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని, ప్రధాని మోదీ హామీలు జుమ్లాలుగానే మిగిలిపోతున్నాయని ఏఐసీసీ ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రైతులకు జుమ్లాలు అవసరం లేదని.. వారికి కావలసింది సమయానికి ఎరువులేనన్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ఏటా సుమారు 24–25 ఎల్ఎంటీ యూరియా అవసరం ఉంటుందని ఠాగూర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రతి విత్తన సీజన్లో.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎరువు కొరత తలెత్తుతోందని చెప్పారు. రైతులు గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎస్సీవో వంటి అంతర్జాతీయ వేదికల్లో ఫొటోలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రైతుల కోసం దీర్ఘకాలిక ఎరువుల సరఫరా ఒప్పందాలు కుదుర్చేందుకు ఈ వేదికలను ఉపయోగించే ఆలోచన ఆయనకు ఉందా? అని ఠాగూర్ ప్రశ్నించారు.ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తాంమరో వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడానికి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సోమవారం, 9,000 మెట్రిక్ టన్నులు, మంగళవారం మరో 5,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన సనత్నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. వచ్చే వారంరోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్కు అనుగుణంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. వరదలతో నష్టపోయిన రైతులకు అన్యాయం జరగకుండా, సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లోపు పంటనష్టంపై పూర్తి నివేదికను పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. -
6న జరగాల్సిన వైఎస్సార్సీపీ కార్యక్రమం 9కి వాయిదా
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 6న జరగాల్సిన వైఎస్సార్సీపీ కార్యక్రమం 9కి వాయిదా పడింది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై 6న ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ తొలుత నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమాన్ని 9కి వాయిదా వేసినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.కాగా, యూరియా దారిమళ్లుతోందని ‘సాక్షి’ చెప్పింది నిజమైంది. రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాతో సహా ఇతర ఎరువులను టీడీపీ నేతలు బరితెగించి పెద్దఎత్తున పక్కదారి పట్టించి బ్లాక్మార్కెట్కు మళ్లిస్తున్నారంటూ ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై విజిలెన్స్ విభాగం స్పందించి వారం రోజులపాటు దాడులు నిర్వహించింది.దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. దాడుల్లో యూరియా పెద్దఎత్తున బ్లాక్మార్కెట్కు తరలిపోయినట్లు గుర్తించామని.. 2,845 మెట్రిక్ టన్నుల ఎరువులు స్వా«దీనం చేసుకుని 191 కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు. టీడీపీ నేతలు దారి మళ్లించిన యూరియా, ఇతర ఎరువులు వివిధ జిల్లాల్లోని 598 ప్రాంతాల్లో ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నట్లు విజిలెన్స్ బృందాలు గుర్తించాయి. స్టాక్ రికార్డుల్లో లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్చేసి 67 కేసులు నమోదు చేశారు.మరోవైపు.. అక్రమంగా నిల్వ ఉంచిన మరో రూ.4.30 కోట్ల విలువైన 1,911 టన్నుల ఎరువులనూ స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 124 కేసులు నమోదుచేశారు. నిబంధనలు అతిక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న మరో ఎనిమిది దుకాణదారులపైనా క్రిమినల్ కేసులు నమోదుచేశారు. -
కుప్పంలోనూ యూరియా కష్టాలు.. రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న అన్నదాతలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రైతులు సోమవారం ఆందోళన చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలంలోని వంగలపూడి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అలాగే కర్నూలులో ఉల్లి రైతులు తమకు మద్దతు ధర ఇవ్వాలని మంత్రి భరత్ను నిలదీశారు. విజయవాడలో కౌలు రైతులు తమకు రుణాలు మంజూరు చేయాలని ఎస్ఎల్బీసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. – సాక్షి నెట్వర్క్ యూరియా కోసం తిప్పలు... తప్పని పడిగాపులుపుంగనూరు/సీతానగరం/గుడుపల్లె: ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సరైన సమయంలో అందించకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని జిల్లాల్లో రైతులు ఉదయమే ఎరువుల పంపిణీ కేంద్రాలవద్ద క్యూలో చెప్పులు ఉంచి, ఆనక వచ్చి యూరియా తీసుకెళుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో యూరియా వచి్చందని తెలియడంతో రైతులు మార్కెట్ యార్డు, శుభారాం డిగ్రీ కళాశాల వద్ద గల ప్రైవేటు షాపుల వద్దకు సోమవారం ఉదయం 6 గంటలకు చేరుకున్నారు.10 గంటలు గడిచినా నిర్వాహకులు యూరియా ఇవ్వలేదు. 10గంటల అనంతరం తమకు ఇష్టమైన వారికే పంపిణీ చేయడంతో రైతులు ఒక్కసారిగా గుమిగూడారు. ఆ సమయంలో పలువురు కిందపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు వచ్చి వారిని నియంత్రించారు. 10వేల మందికి 720 బస్తాలా? పుంగనూరు మండలంలోని 23 పంచాయతీల్లో సుమారు పదివేల మంది రైతులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం కేవలం 720 బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేయడంతో మిగతా రైతుల పరిస్థితేంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎస్కేల్లో కాకుండా, రైతులను పట్టణానికి పిలిపించడం, ప్రైవేటు వ్యక్తుల ద్వారా పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై ఏడీ శివకుమార్ స్పందించారు. అందరికీ యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు. క్యూలో చెప్పులు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి సొసైటీ వద్ద మునుపెన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలో ఉంచారు. సొసైటీకి ఆదివారం 10 టన్నుల యూరియా వచి్చందని సమాచారం తెలుసుకున్న రైతులు సోమవారం ఉదయం 5 గంటలకు పీఏసీఎస్కు చేరుకుని తమ చెప్పులను క్యూలో ఉంచి, తిరిగి ఇళ్లకు వెళ్లారు. అనంతరం ఉదయం 10 గంటలకు సొసైటీ సిబ్బంది రాగానే క్యూలో నిలబడ్డారు. పీఏసీఎస్ సీఈవో పంతం సూర్యనారాయణ రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున అందించారు. 200మంది రైతులు యూరియా లేకుండానే ఇంటిముఖం పట్టారు. చిత్తూరులో రైతుల ఆందోళన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, గుడుపల్లె మండలం కేంద్రంలో సోమవారం యూరియా కోసం రైతు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో సోమవారం గుడుపల్లెకు ఒక లోడు యూరియా రావడంతో వందలాది రైతులు ఓ ప్రైవేట్ దుకాణం వద్ద బారులు తీరారు. ఒక రైతుకు ఒక కట్టమాత్రమే ఇస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్యూలో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఇది గొడవలకు దారితీయడంతో పోలీసులు వచ్చి సర్దుబాటు చేశారు. చాలా మంది రైతులకు సాయంత్రమైనా యూరియా అందకపోవడంతో తిరుముఖం పట్టారు.మంత్రి ఎదుట ఉల్లి రైతుల కన్నీరుమున్నీరురూ.1200 ఏ మాత్రం గిట్టుబాటు కాదంటున్న రైతులుకర్నూలు(అగ్రికల్చర్): ‘ఉల్లి సాగు కోసం రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టా. తీరా పంటను మార్కెట్కు తీసుకొస్తే అధికారులు క్వింటా రూ.1,200కి కొంటున్నారుక్రిభుత్వమే ఇంత తక్కువ ధర ఇస్తే ఎలా బతికేది. ఈ ధర మాకు గిట్టుబాటు కాదు. భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది’ అంటూ ఓ ఉల్లి రైతు మంత్రి ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు.కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 ధరతో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన పలువురు ఉల్లి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 39 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. అన్ని లాట్లకు వ్యాపారులు టెండర్ వేశారు. మార్క్ఫెడ్ ఒక్కలాట్ మినహా 38 లాట్లకు రూ.1,200 ధర కోట్ చేసింది. ఇందులో ఒక లాట్కు రూ.1,329 ధర లభించింది. మరో లాట్కు రూ.517 ధర లభించింది. మిగిలిన లాట్లు మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. రూ.517 ధర లభించిన లాట్కు రీ టెండరు వేసి మార్క్ఫెడ్ ద్వారా రూ.1,200కు కొనిపించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.80వేలు నష్టపోయా ఎకరాలో ఉల్లి సాగు చేశా. దిగుబడులు పెంచాలనే లక్ష్యంతో రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు నిలువునా ముంచాయి. 100 ప్యాకెట్ల ఉల్లి పొలంలోనే కుళ్లిపోయింది. కేవలం 34 ప్యాకెట్లు (18 క్వింటాళ్లు) మాత్రమే మిగిలింది. ఈ పంటను సోమవారం మార్కెట్ యార్డుకు తీసుకెళితే, మార్క్ఫెడ్ అధికారులు క్వింటా రూ.1200కి కొన్నారు. ఈ ధరతో రూ.80 వేల వరకు నష్టం వచ్చింది. – ఎ.పెద్దయ్య, ఉల్లి రైతు, పి.కోటకొండ గ్రామం, కర్నూలు జిల్లా తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి పీఏసీఎస్ వద్ద రైతులు క్యూలో ఉంచిన చెప్పులు కౌలు రైతులకు హామీ లేని రుణాలివ్వాలిరైతు సంఘాల డిమాండ్సాక్షి, అమరావతి: కౌలు రైతులకు ఎలాంటి హామీ లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.2 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలివ్వాలని ఏపీ రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడలోని రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) కార్యాలయం ఎదుట రుణాల కోసం కౌలు రైతుల రాయబారం పేరిట సోమవారం ఆందోళన జరిగింది. రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని సాగు భూమిలో 70 శాతం కౌలు రైతులే సాగు చేస్తున్నారని.. పెట్టుబడి దొరక్క వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.కనీసం అన్నదాత సుఖీభవ సాయం కూడా కౌలు రైతులకు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వడ్డీ రాయితీలు కౌలు రైతులకు అందడం లేదన్నారు. ఆందోళన అనంతరం ఎస్ఎల్బీసీ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇస్తామని, సీసీఆర్సీ కార్డుల్లేని ఈ క్రాప్ నమోదు ప్రాతిపదికన జేఎల్జీ గ్రూపుల ద్వారా రూ.2 లక్షలకు తక్కువ లేకుండా పంట రుణాలిచ్చేందుకు కృషి చేస్తామని ఎస్ఎల్బీసీ మేనేజర్ హామీ ఇచ్చారు. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ రెడీ
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. యూరియా కొరతపై ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారి సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు అన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితులు ఉంటే, ఇప్పుడు యూరియా కొరతతో పాటు పలు సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా విత్తనాలు, ఎరువులతో సహా అన్నీ సమస్యల మాదిరిగానే ఉన్నాయి. యూరియాను రైతులకు అందించకుండా టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు వినతి పత్రాలు స్వీకరించి ఆర్డీవోలకు అందజేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయనుంది వైఎస్సార్సీపీ. -
రైతులకు ఎరువులు అందేవరకు మా పోరాటం ఆగదు
-
కొందరికే యూరియా
చిన్నశంకరంపేట/మిరుదొడ్డి/దోమకొండ/కేసముద్రం: యూరియా కష్టాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. యూరియా పంపిణీ సందర్భంగా ఒక బస్తా నాదంటే నాదని ఇద్దరు రైతులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరికొందరు రైతులు వారిని సముదాయించారు. చివరకు కొట్టుకున్న ఇద్దరు రైతులకు యూరియా దొరకలేదు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతువేదిక వద్దకు చుట్టు పక్క గ్రామాలకు చెందిన రైతులు శనివారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టి ఆదివారం తెల్లవారుజాము వరకు జాగారం చేశారు. అయితే యూరియా లారీ రాలేదని అధికారులు చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ⇒ కామారెడ్డి జిల్లా దోమకొండలోని సింగిల్విండో కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. కొందరికి యూరియా దొరకపోవడంతోవ్యవసాయాధికారులు, సింగిల్విండో కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ⇒ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద ఆదివారం అర్ధరాత్రి యూరియా టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. సోమవారం యూరియా బస్తాలు పంపిణీ చేయనుండగా, అధికారులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. -
రైతులతో నేరుగా మాట్లాడిన గణపయ్య..!
(వరంగల్ డెస్క్): చవితి రోజు ఘనంగా పూజలందుకున్నాడు వినాయకుడు. రైతులు ప్రేమగా తెచ్చిన పత్రి, పూలు ఒంటినిండా ధరించాడు. పండ్లు, ఉండ్రాళ్లు బొజ్జ నిండా తిన్నాడు. కుటుంబ సమేతంగా వచ్చిన రైతు దంపతులను చూసి మురిసిపోయాడు. తెల్లవారి సైతం అదే రీతిన ప్రసాదాలు, పండ్లు అందాయి. కానీ.. మనసులో ఏదో వెలితి. అప్పుడు వినాయకుడు మూషిక రాజు చెవిని మెలిపెడుతూ..‘మూషికా.. నిన్న భక్తజన సందోహంతో నిండిన మండపాల్ని చూసి మురిసిపోయా.. ఇలా తెల్లారిందో లేదో పల్లెల్లోని మండపాలన్నీ వెలవెలబోతున్నాయి. రైతులు, అమ్మలు, అక్కలంతా ఎటుపోయారు? ఒక్కరూ కనిపించరేం..? రైతన్నలెందుకు పూజకు రాలేదో చూసి రాపో’ అన్నాడు. (గంట తరువాత) ‘స్వామీ.. రైతులు కుటుంబంతో సహా యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద ఉంటున్నారు.. అయినా దొరకట్లేదట.. ఆందోళనలు చేస్తున్నారు.. అని బాధపడుతూ సమాధానమిచ్చాడు. ‘నా రైతులు ఇంతగనం కష్టాలు పడుతున్నారా.. వారి కష్టాలు తెలుసుకుందాం పద’ అన్నాడు. ‘నా భుజంపై ఎక్కండి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల దగ్గరికి తీసుకెళ్తా’ అంటూ సమాధానమిచ్చాడు మూషిక రాజు. సరే పదా.. అంటూ జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నుంచి వారి ప్రయాణం మొదలైంది.రైతుల పంటలను చూసుకుంటూ వెళ్తున్నారు. జిట్టెగూడెం గ్రామంలో ఓ రైతు కనిపించాడు. అక్కడే ఆగిన వినాయకుడు.. ఆ రైతును పలకరించాడు. ఏమయ్యా.. నీ పేరేమిటీ?స్వామి.. నాపేరు లకావత్ సురేందర్వినాయకుడు: పొలం ఎట్లుంది? యూరియా దొరకట్లే..సురేందర్: స్వామి నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఐదెకరాలు వరి, ఒక ఎకరం పత్తి సాగు చేస్తున్నా. యూరియా బస్తాల కోసం పదిరోజుల నుంచి పనులు వదులుకుని రోజూ ఘన్పూర్కు వస్తున్నా. ఘన్పూర్ ఆగ్రోస్ సెంటర్లో శుక్రవారం స్టాక్ వచ్చిందని తెలుసుకుని ఉదయం వెళ్లా. మధ్యాహ్నం వరకు ఎండలో లైన్లో ఉన్నా యూరియా దొరకలేదు. లాభం లేదని ఇంటికి వచ్చా. ‘అయ్యో.. సురేందర్.. ఇన్ని కష్టాలా’.. అని అనుకుంటూ వినాయకుడు తన మూషికాన్ని కదిలిస్తూ మరో ఊరికి బయల్దేరాడు.చల్వాయినుంచి పోదాం అంటూ బయలుదేరిన వినాయకుడికి మార్గమధ్యలో హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో ఓ రైతును పలకరించాడు. వినాయక : రైతన్నా నీపేరేంది?..రైతు : ఓదెల కొమురయ్య స్వామి..వినాయక : దిగులుగా ఉన్నావు ఏమైంది.. పొలానికి వెళ్లలే..కొమురయ్య : యూరియా దొరకడం లేదయ్యా.. వారం రోజుల క్రితం పరకాల పీఎసీఎస్లో ఇచ్చారు. ఇప్పుడు అడిగితే మాదారం సొసైటీ వారు సంబంధిత గ్రామాల రైతులకు ఇస్తున్నారు. పరకాల సొసైటీకి ఎప్పుడు వస్తదని అడిగితే ఆర్డర్ పెట్టినం అంటున్నారే తప్ప రావడం లేదు. బజార్లో వ్యాపారస్తులు అమ్ముకోవడానికి యూరియా ఉంటుంది కానీ వారు లింక్లు పెట్టి అమ్ముతున్నారు. వినాయక :అవునా.. ఏమిటీ మూషికా.. ఏ రైతన్నను పలకరించినా ఒకటే సమస్య.. వీరి కష్టాలు త్వరగా తీరాలి.. ముఖంలో నవ్వు రావాలి అంటూ తన మండపానికి వెళ్లారు.మహబూబాద్ జిల్లా కురవి మండలం ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం వద్ద చేతిలో చిట్టీ పట్టుకుని తిరుగుతున్న మోద్గులగూడేనికి చెందిన రైతు కొత్త వెంకన్నగౌడ్ను ఆపి ‘ఎందుకలా తిరుగుతున్నావ్. ఏంటి సమస్య’ అని ప్రశ్నించాడు వినాయకుడువెంకన్నగౌడ్: స్వామీ.. నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. పంట కోసం ఆరు బస్తాల యూరియా కావాలి. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా. కష్టపడి కూపన్ సంపాదించా. కూపన్ చేతికొచ్చినా యూరియా అందలేదు. మరో రెండు రోజుల్లో లారీ వస్తుందని చెబుతున్నారు. అప్పుడైనా దొరుకుతుందో లేదో’ అని నిట్టూరుస్తూ సమాధానమిచ్చాడు. ‘దేశానికి అన్నంపెట్టే రైతుకే ఇన్ని కష్టాలా?’ అనుకుంటూ ముందుకు సాగారు మూషికరాజు, వినాయకుడు. నేరుగా.. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామానికి చేరుకున్నారు.అరుగుపై దిగాలుగా కూర్చున్న కృష్ణారెడ్డిని పలకరిస్తూ..వినాయకుడు : ఎందుకిలా దిగాలుగా కూర్చున్నావు? కృష్ణారెడ్డి: 16 ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజుల క్రితమే పంటకు యూరియా వేయాలి. కొరత కారణంగా ఇప్పటి వరకు వేయలేదు. అదిగో, ఇదిగో బస్తాలు వస్తున్నాయంటూ అధికారులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు క్యూలైన్లో నిల్చుంటే ప్రతీసారి ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పంటలకు సరిపడా యూరియా ఇవ్వట్లేదు. అధికారులు సరిపడా యూరియా పంపిణీ చేస్తారనే ఆశ కూడా రైతుల్లో లేదు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. అని చెప్పగానే. ఇంతదారుణమా అంటూ అక్కడినుంచి వినాయక స్వామి పరకాల మీదుగా వెళ్దామని బయలుదేరారు.భళా.. ఏమిటీ ఇక్కడి రైతులంతా ఆనందంగా ఉన్నట్టున్నారే.. అన్ని చోట్లా కనిపించినట్లు. ఇక్కడ క్యూలైన్ లేదు. తోపులాట లేదు. పోలీసుల హడావిడి లేదు అంటూ.. నల్లబెల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట నుంచి వెళ్లిపోబోయాడు వినాయకుడు. అప్పుడే ఒక రైతు కాళ్లీడుస్తూ.. పీఏసీఎస్ వైపు రావడం గమనించారు.‘ఏంటయ్యా.. ఇక్కడ యూరియా కొరత లేనట్టుంది. నువ్వెటు వెళ్తున్నావ్’ అని నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారు ఎర్రచెరువు తండాకు చెందిన పాడ్యా బాలును అడిగాడు వినాయకుడు.బాలు: ఈ సీజన్లో మూడెకరాల్లో వరి, మరో మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. యూరియా కోసం 12 రోజులుగా తిరుగుతున్నా. మండలంలో ఏషాపునకు వెళ్లినా యూరియా లేదు. అయిపోయిందని చెబుతున్నారు. స్టాక్ లేదని చెబుతున్నా.. ఒక్క బస్తా అయినా దొరుకుతుందేమోనని రోజూ పీఏసీఎస్కు వచ్చి పోతున్నా.’ అని సమాధానమిచ్చాడు. .. రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో అంటూ ముందుకు కదిలాడు వినాయకుడు.సూర్యుడు నడినెత్తిమీదికొచ్చేసరికి వినాయకుడు గూడూరు మండల కేంద్రానికి చేరుకున్నాడు. పీఏసీఎస్ గోదాం వద్ద లైన్లో నిల్చున్న మర్రిమిట్టలోని బందాలగడ్డ తండాకు చెందిన భూక్య హేమ్లానాయక్ను పలకరించాడు.వినాయకుడు: ఏమిటీ హుషారుగా ఉండేవాడివి.. నిస్సత్తువగా కనిపిస్తున్నావ్. హేమ్లానాయక్: ఏం చెప్పాలి స్వామి. ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజులవుతోంది. ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా యూరియా దొరకలేదు. 10 రోజులుగా నిత్యం నా భార్య, నేనూ యూరియా కోసం వస్తున్నాం. తీసుకున్న వాళ్లే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. మా లాంటి వాళ్లను పట్టించుకునేటోళ్లు లేరు. కనీసం ఎకరానికి ఒక బస్తా చొప్పున 6 బస్తాలు కావాలి. ఏం చేయాలో తోచట్లేదు. లైన్లో నిలబడి, రాత్రి, పగలు తిరుగుతూ ఉంటే జ్వరం వచ్చింది. ‘అయ్యో.. హేమ్లా. ఒంట్లో జ్వరమున్నా.. పంటను కాపాడుకోవాలన్న నీ తాపత్రయం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. అంటూ వినాయకుడు అక్కడి నుంచి బయల్దేరాడు.అయ్యో.. ఇన్ని కష్టాలా.. మానుకోట,వరంగల్ జిల్లాల్లో రైతుల బారులు, ఆందోళనలు చూసి చలించిపోయాడు వినాయకుడు. నర్సంపేట, చెన్నారావుపేట, కేసముద్రం మండలం కల్వల రైతు వేదిక వద్ద రైతుల తోపులాట, నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద రైతులు చేస్తున్న రాస్తారోకో, గూడూరు మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సెంటర్ జాతీయ రహదారి 365పై ఆందోళన, కురవి, కొత్తగూడలో యూరియా కోసం వచ్చిన మహిళలు çస్పృహతప్పి కిందపడిపోవడం చూసి నా రైతన్నలకు ఇన్ని కష్టాలా.. పాలకులేమి చేస్తున్నరు అంటూ లోలోన మదన పడుతూ ముందుకు సాగాడు. -
గణపతి బప్పా మోరియా.. యూరియా కావాలయ్యా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజున రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో నిరసన గళం వినిపించింది. శనివారం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం యూరియా కొరతపై అసెంబ్లీ బయట గులాబీ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమర వీరుల స్తూపానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఖాళీ యూరియా సంచులు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ‘గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా’, ‘రేవంత్ ద్రోహం.. రైతన్నకు మోసం’ అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ కార్యాలయంలో ధర్నాఅసెంబ్లీ వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ కాలినడకన ఎల్బీ స్టేడియంకు ఎదురుగా ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. యూరియా, ఇతర ఎరువుల లభ్యతపై సమీక్ష జరిపి వెంటనే సరఫరా చేయాలని కోరుతూ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. సమస్యకు పరిష్కారం చూపేంత వరకు కదిలేది లేదని ధర్నాకు దిగారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు.సచివాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నంబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెలంగాణ భవన్కు తరలించే క్రమంలో సచివాలయం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆగడంతో అందులో నుంచి దిగిన మాజీమంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్కుమార్రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు ధర్నాకు దిగారు. బారికేడ్లు దూకి సచివాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్లు మూసివేశారు. అయితే పోలీసులు వారిని తిరిగి అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్రావు మాట్లాడారు.సభను అనుకూలంగా నడుపుకునే ప్రయత్నం: కేటీఆర్‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని తమకు అనుకూలంగా నడుపుకునే ప్రయత్నం చేస్తూ రైతుల సమస్యలు, ఎరువుల కొరత తదితరాలపై మాట్లాడటం లేదు. ప్రభుత్వం కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెడితే వ్యవసాయ రంగం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు సిద్ధం. కాళేశ్వరంపై కాంగ్రెస్ వేసిన ‘పీసీసీ ఘోష్ కమిషన్’ పైనా చర్చించేందుకు సిద్ధం. వ్యవసాయ రంగం కోసం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పండుగ రోజు, వర్షాల్లోనూ తమ చెప్పులు, ఆధార్ కార్డులను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాల మూలంగా జరిగిన నష్టం, రైతుల ఆత్మహత్యలు, రైతాంగానికి కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపై చర్చ జరగాలి. కానీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది..’ అని కేటీఆర్ విమర్శించారు. రైతుల చెంప చెళ్లుమనిపిస్తారా..? : హరీశ్రావు‘యూరియా అడిగినందుకు రైతుల చెంప చెళ్లుమనిపించడమేనా కాంగ్రెస్ సోకాల్డ్ పాలన. మూటలు మోయడం, మాటలు మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్కు తెలిసిన విద్య. రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ ‘ఏఐ ఫోటోల’తో ప్రచారం చేశారు. లైన్లలో నిల్చున్నది రైతులే కాదని బీఆర్ఎస్ కార్యకర్తలని తొండి కూతలు కూశారు. చివరకు యూరియా కొరత నిజమేనని ఒప్పుకుని కేంద్ర ప్రభుత్వం కారణమన్నారు. కాంగ్రెస్ వల్లే యూరియా సంక్షోభం తలెత్తిందని రైతులకు అర్థమైంది. రేవంత్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి..’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
యూరియా ‘బస్తా’మే సవాల్!
ఆళ్లగడ్డ/కోరుకొండ: రాష్ట్రంలో యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా పంపిణీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడి (వీఏఏ)పై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరికి (ఒక్కో పాసు పుస్తకానికి) రెండు బస్తాల చొప్పున వీఏఏ ప్రవీణ్కుమార్రెడ్డి రసీదు రాసిస్తున్నారు.ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వారు సచివాలయం వద్దకు చేరుకుని ‘ఒక్కో రైతుకు రెండు బస్తాల ఇస్తున్నామన్నారు కదా. ఇందులో ఓ రైతుకు 10 బస్తాలు ఎలా రాసిచ్చావ్’ అంటూ వాగ్వాదానికి దిగారు. అతను ఐదు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఒకే రసీదు రాయించుకున్నారని, పైగా అతను కూడా టీడీపీకి చెందిన వారేనని వీఏఏ తెలిపారు. దీంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వీఏఏపై దాడి చేసి బయటకు ఈడ్చుకొచ్చి పిడిగుద్దులు కురిపించారు. విషయం తెలుసుకున్న మండల వీఏఏలు అక్కడకు చేరుకుని ఇలా అయితే యూరియా పంపిణీ చేసేది లేదని నిరసన వ్యక్తం చేశారు.అంతలో వీఏఏ బంధువులు కూడా అక్కడకు చేరుకోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఎస్ఐ రామిరెడ్డి, తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీవో సావిత్రి, ఏవో ప్రమీల అక్కడకు చేరుకుని రెండు వర్గాలకు సర్దిచెప్పడంతో సమస్య సర్దుమణిగింది. కాగా దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని వీఏఏల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. కోరుకొండలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద శనివారం జరిగిన యూరియా బస్తాల పంపిణీ రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది. కోరుకొండ సొసైటీకి యూరియా ఎరువులు వచ్చాయని తెలుసుకున్న ఆ సొసైటీ పరిధిలోని 10 గ్రామాల రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో తోపులాట జరిగింది. రైతులు ఘర్షణ పడ్డారు. నలుగురు రైతులకు స్వల్పంగా గాయాలవగా, సొసైటీ తలుపులు, కిటికీలు, అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయమై సీఈఓ వర్మను వివరణ కోరగా.. వాస్తవానికి 180 టన్నుల యూరియా అవసరం కాగా, 80 టన్నులే వచి్చందని పేర్కొన్నారు. -
తెలంగాణ పాలిటిక్స్లో ‘యూరియా’ వార్
సాక్షి, హైదరాబాద్: యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. రైతుల కష్టాలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకు? అంటూ హరీష్రావు ప్రశ్నించారు.‘‘వరద నష్టంపై చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎప్పటిలోగా ఎరువులు అందిస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతుల కష్టాలు వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా?. రైతుల ఇబ్బందులపై సీఎం సమీక్ష కూడా చేయరా?. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం’’ అని హరీష్రావు హెచ్చరించారు.మరో వైపు, బీఆర్ఎస్ యూరియా కార్యక్రమం పట నాటకమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం.. రాష్ట్ర ప్రభుత్వమా? లేక కేంద్ర ప్రభుత్వమా మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా?. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా?. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం?’ అంటూ తుమ్మల దుయ్బయట్టారు.‘‘జియో పాలిటిక్స్ వల్ల, దేశీయ ఉత్పత్తి డిమాండ్కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు?. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు?. రేవంత్రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా?. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్పై మీ శాపనార్థాలు ఏమిటి?. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరు’’ అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సరిహద్దు దాటుతున్న యూరియా పట్టివేత
దాచేపల్లి: యూరియా బస్తాలు అందక ఓ వైపు అన్నదాతలు అల్లాడిపోతుంటే మరోవైపు టీడీపీ నేతలు అక్రమంగా సరిహద్దు దాటిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 165 యూరియా బస్తాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను కూడా సీజ్ చేశారు. యూరియా అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా గుంటూరు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, దాచేపల్లి పోలీసులు, వ్యవసాయ అధికారి సంయుక్తంగా పొందుగల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దాచేపల్లి మండలం నుంచి రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.43,972 విలువ చేసే 165 బస్తాల యూరియాని పట్టుకున్నారు. కారంపూడిలోని నీరజ లక్ష్మీ వెంకట సత్యనారాయణ కమర్షియల్ షాపులో కొనుగోలు చేసి, స్థానిక రైతుల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి తెలంగాణకు తరలిస్తున్నట్టు గుర్తించారు. టీడీపీ నేతలు సకినాల సురేష్, బొలగన సుధీర్, యూరియా కొనుగోలుకు సహకరించిన నంద్యాల నాగరాజు, నీరజ లక్ష్మీ వెంకట సత్యనారాయణ కమర్షియల్ షాపు యజమాని ఆతుకూరి నరసింహరావులపై కేసు నమోదు చేశారు. -
వానలోనూ క్యూ కట్టిన రైతులు
మిరుదొడ్డి/నంగునూరు/చెన్నూర్రూరల్, మహబూబ్నగర్నెట్వర్క్: జోరువానలోనూ యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందని తెలియడంతో వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసి ముద్దవుతూనే గొడుగులు పట్టుకొని టోకెన్ల కోసం క్యూ కట్టారు. » నంగునూరు ఆగ్రోసేవా కేంద్రానికి యూరియా వస్తుందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు తెల్లవారు జామునే వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రాత్రి వరకు నిరీక్షించారు. » మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నేపల్లి గ్రామంలో రైతు బొంబురపు రాజిరెడ్డి యూరియా కోసం వరుసలో నిలబడి ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. » ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. జడ్చర్లలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. దేవరకద్ర, మూసాపేట, చిన్నచింతకుంట మండలాల్లోనూ ఇదే పరిస్థితి. నారాయణపేట జిల్లా మద్దూరు పీఏసీఎస్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు. » నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, కల్వకుర్తిలో పీఏసీఎస్, తిమ్మాజిపేటలోని ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి ఎదురుచూశారు. లింగాల మండల కేంద్రంలోని పీఏసీఎస్కు రెండు లారీల యూరియా రావడంతో రైతుల సంఖ్య పెరిగి తోపులాటకు దారి తీసింది. » జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో తోపులాట, ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గట్టులోనూ రైతులు భారీగా తరలిరావడంతో పోలీసుల సమ క్షంలో యూరియా పంపిణీ చేశారు. వడ్డేపల్లిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు కడుపు మాడ్చుకొని క్యూలైన్లలో నిల్చున్నారు. -
మట్టి చేతుల క్యూ!
అతను అదనపు భూమినోఅర్ధ సామ్రాజ్యాన్నో అడగడం లేదు పొలం తరఫున పంట కోసం ఎరువును అడుగుతున్నాడు అరువుకు కాదు ఖరీదుకే!ఇంట్లోనో పొలం దగ్గరో ఉండిఅతను హుకుం జారీ చేయడం లేదు క్యూలో నిల్చుని మట్టి చేతులు మోడ్చిమరీ అడుగుతున్నాడుపోలింగ్ బూత్ క్యూలనైతే మీరు ప్రేమతో పట్టించుకుంటారు కదా! పొలం వచ్చి క్యూలో నిల్చుంటే అసలు పట్టనట్లుంటే ఎట్లా? ఇది అన్న మూలమన్న సంగతి మరిస్తే ఎట్లా?తెలుసుకోండి: అతను ఎరువు కోసం క్యూలో నిల్చున్నాడంటేదేశం అన్నం కోసం క్యూలో నిల్చున్నట్లే!– దర్భశయనం శ్రీనివాసాచార్య94404 19039 -
యూరియా కోసం అన్నదాత అగచాట్లు
సాక్షి, నెట్వర్క్ : యూరియా కోసం అన్నదాతల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. సోమవారం పీఏసీఎస్లు, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. అయినా అందరికీ అందని దుస్థితి. మరికొన్ని చోట్ల రైతులు ఆందోళనలు నిర్వహించారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలో రైతులు ఎండనక, వాననక వేచి చూస్తున్నా బస్తా యూరియా దొరకడం లేదు.టెక్కలిలో ఉదయం 7 గంటల నుంచి రైతులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షిస్తూ కనిపించారు. వానలో తడుస్తూ, కాళ్లు నొప్పులు పుట్టేలా నిలబడాల్సి వచ్చింది. నరసన్నపేటలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. బూర్జ మండలంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేయడంతో రైతు సేవా కేంద్రాల వద్ద చాంతాడంత క్యూ కనిపించింది.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న గొల్లప్రోలు మండల రైతులు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత తమను వేధిస్తోందని అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మెయిన్ రోడ్డుపై రైతులు రకేంద్రం అదనపు యూరియా కేటాయించాలి: ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్సాక్షి,అమరావతి: రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరతను పరిష్కరించేందుకు తక్షణం కేంద్ర ప్రభుత్వం అదనపు కేటాయింపులు జరపాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ స్టేట్ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు.ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. ‘‘యూరియా కొరత అవాస్తవమనీ, ఎవరైనా ఇలాంటి ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో ఏ పీఏసీఎస్, ఆర్బీకేల వద్దకు వెళ్ళి చూసినా, యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో వేచి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రైవేటు వ్యాపారులు తమ వద్ద ఉన్న నానో యూరియా, పురుగుమందులు కొంటేనే యూరియా అమ్ముతామంటూ రైతులను వేధిస్తున్నారు. కొరతను ముందుగానే గమనించి కేంద్రం నుంచి అదనపు కేటాయింపులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.’’ అని నాగిరెడ్డి విమర్శించారు. -
సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ
యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్లో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్ఫెడ్–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్ డోస్ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మార్క్ఫెడ్ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్ఎస్కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్ఫోర్స్ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్లు, ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్కార్డు, పట్టాదారు పాస్బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్ షట్టర్ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) లేకుండానే దౌర్జన్యంగా ఆర్ఎస్కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్ఎస్కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్ఎస్కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్, యూరియా చాలా అవసరం. పొటాష్ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట -
యూరియాపై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: యూరియా సరఫరా ను పెంచేందుకు మా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురి కావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై మంత్రులు ఆరా తీశారు.ఈ సీజన్లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్ను మంత్రులు ప్రశ్నించారు. ‘మిమ్మల్ని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదు. రాష్ట్రాభివృద్ధిలో మాతో కలిసి నడిచే భాగస్వామిగా చూస్తున్నాం’అని స్పష్టం చేశారు. ప్లాంట్ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ను సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దన్నారు. రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్ఎఫ్సీఎల్ మాతృసంస్థ ఎన్ఎఫ్ఎల్కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతీరోజు ఒక రేకు యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో మీకేమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సమీక్షలో స్పెషల్ సీఎస్ సంజయ్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆర్ఎఫ్సీఎల్ యూనిట్ హెడ్, జీఎం రాజీవ్ పాల్గొన్నారు. -
తెల్లవారకముందే లైన్లోకి..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతు న్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్కు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు శనివారం కార్యాలయం తీయకముందే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి ఉన్నారు. డోర్నకల్ మండలం కస్నాతండా సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు క్యూ కట్టారు. రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. గూ డూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఎదుట తెల్లవారు జామున 4 గంటలకే క్యూ లో నిలబడ్డారు. మహబూబాబాద్లో రైతులు మధ్యా హ్నం సమయంలో తమకు బస్తాలు వస్తాయో రావో అనే దిగులుతో ఏఓ తిరుపతి రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లాలో...కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు వచ్చాయి. 500 మందికి పైగా గోదాం వద్దకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నీరసించారు. సహకార సిబ్బంది ఒక్కరికి ఒక బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాంకు లారీ యూరియా వచ్చింది. 15 రోజుల క్రితం ఆధార్ కార్డు ఇచ్చిన వారికే టోకెన్లు ఇవ్వడంతో ఓ రైతు యూరియా ఇవ్వకుంటే షట్టర్ మూసివేస్తానని సిబ్బందితో వాదనకు దిగాడు.పోలీసు బందోబస్తుతో 450 బస్తాలను రైతులకు అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి శనివారం యూరియా లోడ్ వచ్చింది. ఆదివారం పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తమ చెప్పులను క్యూలో విడిచి వెళ్లారు.300 బస్తాలు వచ్చాయి.. 102 మందికి పంపిణీశనివారం ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3:30 గంటలకు 300 బస్తాలతో లోడ్ కావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసుల భద్రత మధ్య సాయంత్రం వరకు 102 మందికి పంపిణీ చేశారు.యూరియా కోసం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చున్నారు. శుక్రవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచి్చందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. గోదాము తెరవకముందే వచ్చి వరుసలో నిలబడి నిరీక్షించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియాను పంపిణీ చేశారు. -
ఇష్టానుసారం ఇచ్చేసి... ఇక్కట్ల పాల్జేసి..
సాక్షి, హైదరాబాద్: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. 7.28 ఎల్ఎంటీలు సరఫరా: కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది. ఇందులో ప్రస్తుతం మార్క్ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్ టన్నులు. అంటే ఈ సీజన్లో ఇప్పటివరకు 6.87 ఎల్ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు. అంటే గత సీజన్తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత విక్రయించారు? రాష్ట్రంలో ఖరీఫ్ కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు. ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్ఫెడ్కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం కూడా... రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్ సీజన్ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా... ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్కు 9.80 ఎల్ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా 1.60 ఎల్ఎంటీకి తగ్గకుండా పంపించాలి. ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్ పాయింట్ల ద్వారా మార్క్ఫెడ్కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్ స్టాక్తో కలిపితే మొత్తం 3.61 ఎల్ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన వాడకం రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు. ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్లో యూరియా డిమాండ్ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్లో పత్తి లేకపోవడంతో డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు. -
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ.. ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు. దీంతో పోలీసులు, తమ్మినేని సీతారాం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.కాగా, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు.ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
యూరియా పక్కదారిపై బదులివ్వాలి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణకు పంపుతున్న యూరియా పక్కదారి ఎలా పడుతోందో, ఎలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తోందో సమాధానం చెప్పాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క బస్తా కూడా అధిక ధరలకు అమ్మకుండా చూడాలని.. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియా సరఫరా విషయంలో కేంద్రాన్ని బద్నాం చేసే దురుద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.రైతులకు సక్రమంగా యూరియా సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో 2.04 లక్షల టన్నుల యూరియా ఖరీఫ్ సీజన్ కోసం ఓపెనింగ్ స్టాక్గా ఉందని కిషన్రెడ్డి చెప్పారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు విత్తనాలు వేయక ముందే రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం యూరియా సరఫరా చేయడం లేదని ప్రకటించి భయానక వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ఇతర దేశాల్లో ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ కేంద్రం 11 ఏళ్లుగా రైతులపై భారం వేయకుండా రాష్ట్రానికి సుమారు రూ. 80 వేల కోట్ల ఎరువుల సబ్సిడీని భరించిందన్నారు.రూ. 2,650 విలువైన ఒక్కో యూరియా బస్తాను రూ. 265 సబ్సిడీ ధరకే రైతులకు అందిస్తుంటే దాన్ని రూ. 400కి వారు కొనాల్సిన పరిస్థితి ఎందుకొస్తోందని కిషన్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. అసలు కుట్ర ఎవరిదో బదులివ్వాలని నిలదీశారు. పెద్ద రైతులు వారి దగ్గర ఎక్కువ యూరియా ఉంచుకోవద్దని.. అవసరమైన యూరియాను అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. సచివాలయం వద్ద నిరసనలకు భయమెందుకు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏటా సెపె్టంబర్ 17న ‘తెలంగాణ లిబరేషన్ డే’ను హైదరాబాద్లో నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఈ ఏడాది కూడా తెలంగాణ విముక్తి దినాన్ని కేంద్రం తరఫున ఘనంగా నిర్వహిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజాసమస్యలు, నగరాభివృద్ధి అంశాలపై బీజేపీ ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉలికిపాటు, భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడం, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.హైదరాబాద్లో మౌలిక సమస్యల పరిష్కారానికి జైలుకెళ్లేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల మేరకు ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సెపె్టంబర్ 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేసే పోరాటానికి బీజేపీ రాష్ట్రశాఖ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల లోపు సిపార్సులను అన్నీ అమలు చేస్తామని ఇచి్చన హామీ అటకెక్కిందని విమర్శించారు.ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేవిధంగా హెల్త్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ప్రస్తుతం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీ అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ మొత్తాల విత్డ్రాపైనా మారిటోరియం విధించడం దారుణమన్నారు. -
టోకెన్ల వారీగా యూరియా
సాక్షి, హైదరాబాద్: రైతులకు టోకెన్లు జారీచేసి యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. యూరియా డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు నిల్వలున్న జిల్లాల నుంచి తక్షణమే తరలించి రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.పట్టాదార్ పాస్ పుస్తకాలను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేంద్రం 50 వేల మెట్రిక్ టన్నులు ఈ నెలలో సరఫరా చేస్తామని చెప్పినా, 28,600 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించి, అందులో 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందన్నారు. ఎర్ర సముద్రం నౌకాయానంలో ఇబ్బందులతో మన దేశానికి దిగుమతి కావాల్సిన యూరియా సకాలంలో అందుబాటులోకి రాకపోవడానికితోడు, రామగుండం ఎరువుల కార్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు, సరఫరా పూర్తిగా కేంద్రానిదని, కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతుల ప్రయోజనాలకంటే రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడం, క్యూలైన్లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండటంపై తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లైన్లు లేకుండా చూడాలని, టోకెన్ పద్ధతిలో స్టాక్ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని అధికారులకు సూచించారు.ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ఆగిపోయి..రాష్ట్రానికి కేటాయించిన స్వదేశి యూరియాలో ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి ఆగిపోయి, దాదాపు 63 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయలేదని తుమ్మల చెప్పారు. ఈ 63 వేల మెట్రిక్ టన్నుల యూరి యా వెంటనే సరఫరా చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఫోన్లో తుమ్మల కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫ రాపై కేంద్రమంత్రి కిషన్రెడ్డితోనూ ఫోన్లో మాట్లాడారు.దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఆర్ఎఫ్సీఎల్ లో తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల ని పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ను తుమ్మల ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్రమోహన్, మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కష్టాలు వరుస కట్టాయి..
సాక్షి, మహబూబాబాద్ / మిరుదొడ్డి / ఆత్మకూర్: యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా స్టాక్ ఉందని అధికారులు చెబుతుండగా, టోకెన్లు ఇచ్చి వారం దాటినా యూరియా ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కారు. పలుచోట్ల రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాలు, టోకెన్లు ఇచ్చారు. ⇒ మహబూబాబాద్లోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్లో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ సత్య వతి రాథోడ్ పాల్గొన్నారు. చివరకు టోకెన్లు ఇచ్చి త్వరలో యూరియా అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆపై బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.⇒ కురవి, సీరోలు మండల కేంద్రాల్లో యూరియా పంపిణీ కేంద్రం వద్దకు పెద్దఎత్తున రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. ⇒ సకాలంలో యూరియా ఇవ్వడం లేదని కేసముద్రం మండలం బేరువాడ, దనసరి, ఇనుగుర్తి, డోర్నకల్ మండలం మన్నెగూడెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పీఏసీఎస్కు శుక్రవారం యూరి యా లారీ వస్తుందని సమాచారం అందుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ కట్టారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైతులు చెప్పుల ను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. ఒకేసారి 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడంతో అధి కారులకు సైతం తిప్పలు తప్పలేదు. మొత్తానికి యూరి యా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ⇒ వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతుల కుటుంబసభ్యులందరూ పడిగాపులు కాస్తు న్నారు. శుక్రవారం సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా.. గురువారం టోకెన్లు తీసుకున్న 72 మంది అందజేశారు. శుక్రవారం మరో 70 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందేమోనని తెల్లవారుజాము నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద చెప్పులను క్యూలైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. ఇంటివద్ద నుంచి భోజనం తెచ్చుకొని అక్కడే తింటున్నారు. అలసిపోయి చెట్టు నీడన నిద్రపోతున్నారు.టోకెన్ ఇచ్చి ఐదురోజులు..నాకున్న ఎకరంతోపాటు మూడు ఎకరాల పొలం మునాబాకు తీసుకు న్నా. పొలం నాటేసిన వెంటనే యూ రియా వేయాలి. నాటేసి నెలరోజు లైనా యూరియా వేయలేదు. యూరియా కోసం వస్తే వారం క్రితం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు బస్తా కూడా ఇవ్వలేదు. – అజ్మీర చక్రు, రోటిబండ తండా, మహబూబాబాద్అదును దాటితే ఇబ్బందే.. వరి, మొక్కజొన్న సాగు చేశా. వర్షా లు పడుతున్నాయి. ఇప్పుడు యూ రియా వేస్తేనే దిగుబడి వస్తుంది. ఐదురోజుల నుంచి ఇద్దరం తిరుగు తున్నా ఒక్క బస్తా దొరకలేదు. అదును దాటిన తర్వాత యూరియా వేసినా లాభం లేదు. పంట దిగుబడి తక్కువ వస్తుంది. – భూక్య హుస్సేన్, సికింద్రాబాద్ తండా, మహబూబాబాద్ -
దారి మళ్లిన యూరియా..
సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొంత మంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించాల్సిన యూరియాను బీర్ల తయారీతో పాటు పెయింట్, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా.. కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీ కోసం దర్జాగా దారిమళ్లించారు. ఇదంతా అధికార కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది.ఈయనో రైతు.. పేరు సిరపురపు రామునాయుడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. ఇప్పుడు యూరియా అవసరం కావడంతో ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం చూస్తుంటే స్టాక్ ఉందని చెబుతోందని, ఇక్కడ చూస్తే నో స్టాక్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని బెణికల్లులో టీడీపీ మండల నేత రమేష్కు చెందిన గోదాములో పెద్ద ఎత్తున యూరియాను అన్లోడ్ చేశారు. వాస్తవానికి ఈ నిల్వలను డీసీఎంఎస్, సొసైటీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఓ పక్క సొసైటీ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్ అని బోర్డులు పెట్టి, మండలానికి కేటాయించే యూరియా నిల్వలను తన గోదాముల్లోకి తరలించుకుపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై సదరు టీడీపీ నేత తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటా‹Ù, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా.. కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు వద్ద ఉన్నది 10 శాతమే 2025– ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల నిల్వలున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద 65 వేల టన్నులు, మార్క్ఫెడ్ గోడౌన్లో 55 వేల టన్నులుండగా, మిగిలిన ఎరువులన్నీ ప్రైవేటు హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు లాబీయింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కామరాజుపేట సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు బహిరంగ మార్కెట్లో యూరియా కట్ట (ప్రభుత్వ ధర 50 కేజీల బస్తా రూ.266.50) రూ.350 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు.. డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70 వేల టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్ మార్కెట్లో డీఏపీ బస్తా (ప్రభుత్వ ధర రూ.1350) రూ.1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. చెప్పేదొకటి.. వాస్తవం మరొకటి అనంతపురం జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్తో పాటు ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకట్రెండు బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల టోకెన్లు ఇచ్చి పంపుతున్నా, మరుసటి రోజు కూడా ఇవ్వడం లేదు. ‘ఈ ఖరీఫ్కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు ఉండగా.. ఇప్పటికే 29 వేల మెట్రిక్ టన్నులకు పైగా సరఫరా అయ్యింది. ఇందులో 28 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ జరిగింది. ఇంకా వేర్హౌస్లో బఫర్ స్టాక్ కింద 1,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది’ అని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ లెక్కన రైతులెందుకు యూరియా కోసం రోడ్డెక్కుతున్నట్లు?ఎరువులను అధికార పార్టీ కార్యకర్తలు దారి మళ్లించడంతో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కనితూరులో రైతుల పాట్లు అన్ని జిల్లాల్లోనూ అవే కష్టాలు ⇒ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే యూరియాతో పాటు ఇతర మందులు కూడా కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. సొసైటీల్లో అధికార పక్ష నేతలు సిఫారసు చేసిన వారికే యూరియా అందుతోంది. పలమనేరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, యూరియాకు సంబంధించిన సమస్యలుంటే 8331057300, 9491940106 నంబర్లలో సంప్రదించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. ⇒ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 2,429 టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రయివేటు డీలర్లు, ఆర్బీకేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో బస్తా కూడా యూరియా లభించడం లేదు. ఆదోని, కౌతాళం, హొళగుంద, పెద్దకడుబూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు యూరియా కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు చెబుతున్న విధంగా యూరియా క్షేత్ర స్థాయిలో ఎక్కడా దొరకడం లేదు. ప్రైవేటు షాపు నిర్వాహకులు మాత్రం యూరియాను అధిక రేట్లకు అమ్మేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పలమనేరులోని ఓ రైతు సమాఖ్య కేంద్రానికి గురువారం ఒక లోడు యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు షాపు తెరవక ముందే భారీగా క్యూ కట్టారు. గంట వ్యవధిలో ఖాళీ అయింది. వందలాది మంది రైతులకు దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో యూరియా ఉందని తెలియడంతో రైతులు క్యూకట్టారు. సొసైటీ వద్ద, ఆర్బీకే వద్ద కాకుండా లారీని రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. గురువారం ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ఒక్క బస్తా ఇచ్చుంటే ఒట్టు మాకు ఎనిమిది ఎకరాలు సొంతభూమి ఉంది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వరి, మిర్చి, పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తున్నాం. వరి నాట్లు వేస్తున్నాం. యూరియా అత్యవసరం అయింది. అన్ని పనులు వదులు కొని ఆర్బీకేలు, ప్రయివేటు డీలర్ల చుట్టూ 25 రోజులుగా తిరుగుతున్నాం. ఒక బస్తా ఇచ్చుంటే ఒట్టు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. – మర్రిస్వామి, రైతు, హొళగుంద, కర్నూలు జిల్లాఅధిక ధరకు అమ్ముతున్నారు పంటలకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. 45 కేజీల బస్తా రూ.266కు అమ్మాల్సిన యూరియా దొరక్కపోవడంతో సుమారు రూ.500 కు పైగా ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఈ ధరలు చూడలేదు. ఈ విధంగా అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయం చేయలేం. – పీ సుధాకర్, రైతు, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లాగత ప్రభుత్వంలో ఎన్ని బస్తాలైనా ఇచ్చేవారునేను ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో దుంపతోట సాగు చేస్తున్నాను. నాకు 50 బస్తాల యూరియా అవసరం. గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎక్కడ చల్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు. మాకు అవసరమైన మేరకు యూరియాను వెంటనే అందించాలి. – రాజమంద్రపు శ్రీను, రైతు, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లా 266 బస్తాల యూరియా లారీ పక్కదారి మంత్రి ఫరూక్ అనుచరుడి ప్రోద్బలంతో వ్యాపారికి విక్రయం సాక్షి, నంద్యాల: యూరియా దొరక్క ఓ వైపు రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అవి వచ్చీరాగానే వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామానికి మార్క్ఫెడ్ ద్వారా 266 బస్తాల యూరియాను అధికారులు గత మంగళవారం రైతు సేవా కేంద్రానికి మంజూరు చేశారు. యూరియా ఈనెల 19న రావాల్సి ఉంది. అయితే, ఆ స్టాకు మొత్తం సంబంధిత రైతుసేవా కేంద్రానికి రాకుండానే మాయమైంది. టీడీపీ నాయకులు ఈ స్టాకు మొత్తాన్ని అమ్ముకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు మార్క్ఫెడ్ కార్యాలయాన్ని సంప్రదించగా 266 బస్తాలు పంపామని తెలిపారు. దీంతో గ్రామ రైతులు విలేజ్ హార్టీకల్చరల్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) శ్రీకాంత్రెడ్డిని అడగ్గా.. ఇంకా రాలేదని ఆయన నిర్లక్ష్యంగా బదులిచ్చారు. అనుమానం వచ్చిన రైతులు గోస్పాడు ఏఓకు ఫిర్యాదుచేశారు. ఇది తెలుసుకున్న శ్రీకాంత్రెడ్డి పత్తాలేకుండాపోయారు. దీంతో.. గ్రామస్తులకు యూరియా అందిందా లేదా అని ఏఓ విచారించి రైతులకు అందలేదని తెలుసుకున్నారు. అనంతరం.. వారి సంతకాలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులే వీహెచ్ఏ శ్రీకాంత్రెడ్డితో కుమ్మక్కై 266 బస్తాల యూరియా లారీని నంద్యాలలోనే ఓ బడా వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మంత్రి ఫరూక్ ముఖ్య అనుచరుడి ప్రోద్బలంతోనే ఎరువు లారీని అమ్మే సాహసం టీడీపీ నాయకులు చేశారని తెలుస్తోంది. -
యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టే రాష్ట్రంలో కొరత నెలకొందని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని, వాస్తవానికి కేంద్రం యూరియా సరఫరాను ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులతో చర్చకు సిద్ధమని తాను గతంలోనే సవాల్ విసిరితే, దానిపై స్పందించడానికి ఆ పార్టీ నాయకులు ధైర్యం చేయలేదన్నారు. కేంద్రం 2025 రబీ సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని చెప్పారు.ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మినది 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని, మిగిలిన 2.04 లక్షల టన్నులు ఖరీఫ్ సీజన్ ఓపెనింగ్ స్టాక్గా ఉందని చెప్పారు. ‘ఈ ఖరీఫ్ సీజన్ (ఆగస్టు 2025 వరకు)లో కావాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం సరఫరా చేసింది. కాబట్టి ఈ రోజు వరకు మొత్తం అందుబాటులో ఉన్న యూరియా 7.22 లక్షల మెట్రిక్ టన్నులు’అని తెలిపారు. తాను తెలిపిన ఈ వివరాలు తప్పని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రాంచందర్రావు సవాల్ విసిరారు.అలా నిరూపించలేకపోతే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాకు సిద్ధం కావాలన్నారు. మంత్రి తుమ్మల ముందుగానే ‘స్టాక్ లేదు’అని అబద్ధాలు చెప్పడం.. ‘మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్’లో భాగమని అన్నారు. ఈ భయంతో రైతులు ఒక్కసారిగా షాపులకు చేరుకోవడం, దళారులు బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు.‘పంట విస్తీర్ణంలో గతేడాదితో పోల్చితే ఏ మార్పూ లేకపోయినా అదనపు యూరియా ఎక్కడికి వెళ్లింది? నిజంగా రైతుల వద్దకు చేరిందా, లేక బ్లాక్ మార్కెట్ మాఫియా చేతికి చేరుతోందా? దీనిపై మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్వహణా లోపంతో కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ఇఫ్కో, క్రిభ్కో, ఆర్సీఎఫ్ నుంచి 7,250 రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని, కరీకల్ పోర్ట్ దిగుమతుల నుంచి పదివేల మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చాయన్నారు.‘మార్వాడీ గోబ్యాక్’ వెనుక అర్బన్ నక్సల్స్..తెలంగాణలో శాంతి–భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని రాంచందర్రావు ధ్వజమెత్తారు. ‘మార్వాడీ గోబ్యాక్’నినాదాల వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని రాంచందర్రావు ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఆత్మప్ర బోధం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వి.హన్మంతరావు పేరును ప్రకటించాల్సింది కదా? అది ఎందుకు జరగలేదు’అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతో బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. కాంగ్రెస్కు కేవలం బీసీల ఓట్లు మాత్రమే అవసరం తప్ప, వారి అభ్యున్నతి అవసరం లేదన్నారు. దీనితో బీసీవర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందన్నారు. కాంగ్రెస్తో పాటు ఇండీ కూటమి ఎంపీలందరూ ఇప్ప టికైనా ఆత్మప్రబోధం మేరకు ఎన్డీఏ ఎంబీసీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కి ఓటేయాలని కోరుతున్నామన్నారు. -
యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన ఎరువుల పరిమాణం, ఎంత పంపిణీ అయ్యిందీ, పక్కదారి పట్టిన ఎరువులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు వారం రోజుల పాటు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరును వివరించాలని ఆదేశించారు. తాము వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి ఎరువుల కొరతపై చర్చించడంతో పాటు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తామని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, పార్టీ తరఫున పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నందినగర్ నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.రైతులు అధికారుల కాళ్ల మీద పడుతున్నారు‘కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ్ధ విధానాలతో రైతులు ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడుతున్నారు. కేసీఆర్ పాలనలో ఆరు నెలల ముందే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేయడం ద్వారా రైతులకు సకాలంలో అందేలా చూశాం. కానీ ప్రస్తుతం వానాకాలం సీజన్ నడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష, సన్నద్ధత, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేకపోవడంతోనే ఎరువుల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత, సోషల్ మీడియా దుష్ప్రచారం అంటూ సీఎం కాలయాపన చేస్తున్నాడు. కానీ కొన్నిచోట్ల కాంగ్రెస్ నాయకులే ఎరువులను బ్లాక్లో అమ్ముతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. దమ్ముంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎరువుల కొరతపై గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి..’ అని కేటీఆర్ సవాల్ చేశారు.కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా‘బీసీ సామాజికవర్గం మీద ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అదే సామాజికవర్గానికి చెందిన వారిని ఎందుకు పోటీ చేయించడం లేదు?. కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా. ఉప రాష్ట్రపతి అభ్యర్థి.. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తే అయితే కచ్చితంగా వ్యతిరేకించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం..’ అని కేటీఆర్ చెప్పారు.‘మార్వాడీ గో బ్యాక్’పై ప్రభుత్వం స్పందించాలి‘‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం శాంతిభద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం స్పందించాలి. విశ్వనగరం హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు, అన్ని మతాల వారు ఉన్నారు. పొట్ట కూటి కోసం వచ్చే వారితో తెలంగాణ ప్రజలకు పేచీ లేదు. పొట్ట కొట్టే వారిపైనే పోరాటం. ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చే వారు ఇక్కడి వారి సంస్కృతి, మనోభావాలను గౌరవించాలి..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మేము ఏ కూటమిలోనూ భాగస్వాములం కాదు‘బీఆర్ఎస్ సర్వ స్వతంత్ర పార్టీ. మాకు ఢిల్లీలో బాస్ ఎవరూ లేరు. ఢిల్లీ పార్టీలేవి మాకు బాసులు కాదు. తెలంగాణ ప్రజలే మాకు బాసులు. మేము ఎన్డీఏ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ భాగస్వాములం కాదు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇప్పటివరకు మమ్మల్ని ఏ కూటమీ సంప్రదించలేదు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో అంతర్గతంగా చర్చించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తాం. సెప్టెంబర్ 9లోపు రాష్ట్ర రైతులకు యూరియా ఇప్పించే పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతాం..’ అని కేటీఆర్ తెలిపారు. -
అవే క్యూలు.. అవే కష్టాలు
సాక్షి, మహబూబాబాద్/సిద్దిపేట/తిప్పర్తి: పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నారు. మహబూబా బాద్లోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు క్యూలైన్లో నిలబడి నిరీక్షించారు. మహబూబాబాద్ మండలం సింగారంలో ఓ దుకాణ యజమాని రైతులకు నేరుగా విక్రయించినట్టు తేలడంతో అతడి లైసెన్స్ సస్పెండ్ చేశారు. చిన్నగూడూరు మండలం విస్సంపల్లిలోనూ ఓ మందుల దుకాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ షాప్ లైసెన్స్ను సస్పెండ్ చేశారు.నెల్లికుదురు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు కుటుంబ సమేతంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షంలోనూ లైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూశారు. తొర్రూరులోని పీఏసీఎస్ ఎదుట రైతులు బారులు తీరారు.ఈ క్రమంలో ఓ రైతు అధికారి కాళ్లు మొక్కి యూరియా బస్తాలు ఇవ్వాలని వేడుకున్నాడు.ఈ ఘటనపై మాజీమంత్రి హరీశ్రావు స్పందించారు.‘కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాతరోజులు వచ్చాయని, రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి దాపురించింది’అని ఎక్స్లో పోస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు పీఏసీఎస్ వద్ద కూడా రైతులు బారులుతీరారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలోని పీఏసీఎస్లోనూ రైతులు క్యూలో నిల్చున్నారు. వెనుక ఉన్నవారికి యూరియా దొరకక నిరుత్సాహంతో వెనుదిరిగారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో యారియా అందించాలని మహిళా రైతులు అధికారుల కాళ్లు మొక్కారు. -
అప్పుడు లేని యూరియా కొరత.. ఇప్పుడే ఎందుకొచ్చింది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన నందినగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులను పెట్టి ఎరువులను అమ్మే పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.‘‘తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. మా పాలనలో యూరియా కష్టాలు రాకుండా సరఫరా చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎరువుల కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?. రేవంత్ ప్రభుత్వానికి పరిపాలనపై అవగాహన లేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.‘‘వర్షంలో తడుచుకుంటూ ఎరువుల కోసం రైతులు లైన్లలో నిల్చుంటున్నారు. రైతులకు మాత్రం ఎరువుల కొరత లేదని సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ చేతకానితనంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రేవంత్కు చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. -
బర్త్డే గిఫ్ట్గా యూరియా బస్తాలు.. ఎక్కడో తెలుసా?
యూరియా కష్టాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్రచర్చ నడుస్తున్న వేళ.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమైంది. పుట్టినరోజు జరుపుకున్న ఓ రైతుకు తోటి స్నేహితులు యూరియా బస్తా కానుకగా ఇచ్చారు. పైగా ఇప్పుడు ఇదే ట్రెండ్గా మారిందనే చర్చా నడుస్తోంది.కథలాపూర్ మండలం తాండ్రియాలలో ముక్కెర మధు అనే రైతు పుట్టినరోజు నాడు.. అతని స్నేహితులు యూరియా బస్తాను బహుకరించారు. రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూసి ఇచ్చామంటున్నారు. ఈ తరుణంలో.. ప్రభుత్వంపై సెటైర్ గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.మొన్నీమధ్యే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు ఆయన మిత్రులు.పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో పడిగాపులు పడలేక చెప్పులను ఉంచుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం చూశాం. అందుకే యూరియా కోసం ప్రభుత్వాన్ని బతిమాలడం చూస్తున్నాం. పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు వాపోతున్నారు.అయితే విమర్శల వేళ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ స్పందించారు. రైతులకు ఎరువులు అందించడంలో కేంద్రం విఫలమైంది. సరిపడా యూరియాను అందించలేకపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం పోరాడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా యూరియా బస్తాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారాయన. -
యూరియా... ఏదయా..!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో..వానాకాలం సీజన్ నాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల కింద నాట్లువేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వరినాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు రైతులు ప్రతి ఎకరాకు ఒక బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను వినియోగిస్తారు. ఆ తర్వాత 45 రోజులకు మరోసారి యూరియాను వాడతారు. మరోవైపు పత్తి, మొక్కజొన్న పంటలకు కూడా యూరియా వినియోగం పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన యూరియా కోసం డిమాండ్ ఎక్కువవుతోంది. సరిపడా యూరియా, మిగతా ఎరువులు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో రోడ్లపై బైఠాయించి నిరసనలు చేస్తున్నారు. ఆలస్యంగా వరి సాగయ్యే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండగా, ఇప్పటికే మెజారిటీ ప్రాంతాల్లో ఒక విడత యూరియాను వినియోగించిన నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల రైతులు రెండోదఫా యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. అయితే గత జూలై నెల నుంచే రైతులకు పొదుపుగా యూరియాను పంపిణీ చేస్తూ వస్తున్న వ్యవసాయ శాఖ దగ్గర ప్రస్తుతం 50 వేల మెట్రిక్ టన్నులు కూడా నిల్వ లేదు. ప్రస్తుతం వచి్చన యూరియాను వచ్చినట్లే రేషన్ విధానంలో రైతులకు టోకెన్లు ఇచ్చి ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా తగ్గడం, మార్క్ఫెడ్ వద్ద తగినంత నిల్వలు లేకపోవడం, ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం వంటివి కారణాలనే చర్చ జరుగుతోంది. అవసరం 10.48 ఎల్ఎంటీ.. కేటాయింపు 9.80 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పంటల విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా యూరియా అధికంగా వినియోగించే ప్రధానమైన వరి, పత్తి, మొక్కజొన్న పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. వీటికి తోడు కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్లో 10.48 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే, గత సీజన్లో ఇచ్చిన విధంగానే 9.80 ఎల్ఎంటీ మాత్రమే కేటాయింపులు జరిపింది. గత యాసంగిలో పంపిణీ చేయగా మిగిలిన 1.92 ఎల్ఎంటీల యూరియాను వినియోగించుకోవాలని సూచించింది. కేటాయించిన యూరియాను ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి ప్రతినెలా రైల్వే రేక్ల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం పంపిస్తుంది. కానీ తెలంగాణకు ఏప్రిల్ నుంచి ఈ ఆగస్టు వరకు ప్రతినెలా పంపే యూరియాలో కోత విధించింది. రాష్ట్రానికి ఇప్పటివరకు 8.30 ఎల్ఎంటీల యూరియా రావలసి ఉండగా, కేవలం 5.32 ఎల్ఎంటీ యూరియా (2.98 ఎల్ఎంటీల లోటు) మాత్రమే పంపింది. ఈ యూరియాకు ఓపెనింగ్ స్టాక్గా ఉన్న మిగులు యూరియా 1.92 ఎల్ఎంటీలు కలిపి సుమారు 7.20 ఎల్ఎంటీలు రాష్ట్రంలోని సొసైటీలు, మార్క్ఫెడ్, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్లో మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల యూరియా రావలసి ఉండగా, ప్రస్తుతం లోటుగా ఉన్న 2.98 ఎల్ఎంటీలను పంపిస్తే తప్ప ఈ నెలలో రైతులకు యూరియా ఇవ్వడం సాధ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. ప్రైవేట్ డీలర్ల ద్వారా పారిశ్రామిక అవసరాలకు! 45 కిలోల యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1,900 సబ్సిడీ భరిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ భారాన్ని భరిస్తూ రైతులకు సరఫరా అవుతున్న యూరియా పక్కదారి పడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 25 శాతం యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నట్లుగా కేంద్రమంత్రి జేపీ నడ్డా చెప్పినట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రానికి సరఫరా అయ్యే సబ్సిడీ యూరియాను 50:50 ప్రాతిపదికన ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు డీలర్లు కూడా విక్రయిస్తారు. ఉదాహరణకు లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం పంపిస్తే అందులో 50 వేల మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు సరఫరా చేస్తారు. అయితే ప్రైవేటు వ్యాపారుల వద్ద నుంచి యూరియా పక్కదారి పడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగుల కంపెనీలు, వార్నీష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమల్లో యూరియాను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. బీరు, గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. 50 వేల మెట్రిక్ టన్నుల సరఫరాకు కేంద్రం హామీ రాష్ట్రంలో యూరియా కొరతపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు రెండు రోజులుగా ఆందోళన నిర్వహించారు. మంగళవారం నాటి ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సంఘీభావం తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం.. కర్ణాటక నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు పంపించనున్నట్లు తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. అయితే ఈ యూరియా రావడానికి మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే 50 వేల మెట్రిక్ టన్నులతో రైతుల యూరియా బాధలు ఏమాత్రం తీరవని చెబుతున్నారు. -
తెలంగాణ రైతాంగానికి ఊరట
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రైతాంగానికి ఊరట లభించింది. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించింది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. మంగళవారం కలిశారు.కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీలు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వారంలో 50 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్రెడ్డి వెల్లడించారు. 14 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి పంపినట్లు కేంద్రం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి 14 వేలు మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది...వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామన్నారు. వారం రోజులుగా యూరియా కోసం ఎంపీలంతా పోరాడుతున్నాం. పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ప్రతిపాదించాం. యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేరుగా కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. ఎంపీలం కూడా పలుమార్లు నడ్డాను కలిశాం. మేము పలుమార్లు మంత్రిని కలవడం వల్లనే యూరియా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది’’ అని చామల కిరణ్రెడ్డి తెలిపారు. -
గజ్వేల్ రేక్ పాయింట్ ఖాళీ!
గజ్వేల్: తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు యూరియా సరఫరా కేంద్రంగా ఉన్న గజ్వేల్ రేక్ పాయింట్ ప్రస్తుతం అత్తెసరు నిల్వలకే పరిమితమవుతోంది. రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉంచడానికి గజ్వేల్లో 2022 జూన్ 27న రేక్ పాయింట్ను ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రేక్ పాయింట్లకు ఇది అదనం. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, ఈ లైన్పై గజ్వేల్ రైల్వేస్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ వద్ద రేక్ పాయింట్ ఏర్పాటు చేశారు. పలు పోర్టుల నుంచి ఇక్కడి రైలు మార్గంలో.... గజ్వేల్ రేక్ పాయింట్కు తమిళనాడు రాష్ట్రంలోని కరిగెకళ్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి రైలుమార్గం ద్వారా కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా నిల్వలు వస్తాయి. ఇలా వచ్చిన నిల్వలను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రితోపాటు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు కేటాయింపుల వారీగా వ్యవసాయశాఖ సరఫరా చేస్తున్నది. గతంలో ఇక్కడకు ఎన్ఎఫ్సీఎల్ (నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్), సీఐఎల్ (కోరమాండల్ ఇంటర్నేషనల్ కెమికల్), ఇఫ్కో తదితర కంపెనీలకు చెందిన యూరియా వచ్చేది. కానీ ప్రస్తుతం ఎన్ఎఫ్సీఎల్ నుంచి యూరియా బంద్ కాగా, మిగిలిన కంపెనీల ఉత్పత్తులు వస్తున్నాయి. గతంలో భారీగా నిల్వలు. రేక్ పాయింట్ను ప్రారంభించిన 2022–23 సంవత్సరంలో 15 నుంచి 20 వరకు రేక్ల నిల్వలు వచ్చాయి. ఒక్కో రేక్ సామర్థ్యం 1,400 మెట్రిక్ టన్నులు. ఇలా ఆ ఏడాది సుమారుగా 21 వేల మెట్రిక్ టన్నుల నుంచి 28 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు వచ్చి...ఆయా జిల్లాలకు సరఫరా అయ్యాయి. 2024–25లో 10 రేక్లకు పైగా వచ్చాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం మూడు రేక్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సీజన్లో కేవలం ఇక్కడకు 4,200 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దీనివల్ల ఆయా జిల్లాలకు సరఫరా అయ్యే యూరియాలో తీవ్రమైన కోత పడింది. వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా యూరియా దిగుమతులు నిలిచిపోవడం వల్ల ఇక్కడకు రావాల్సిన నిల్వల్లో కోత పడింది. యూరియా టోకెన్ల కోసం రైతుల ఆందోళనకేసముద్రం: యూరియా బస్తాల టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి బారులుదీరిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఆదివారం జరిగింది. కేసముద్రం, ధన్నసరి సొసైటీలకు 20 టన్నుల యూరియా వస్తుందనే సమాచారంతో.. ఉదయం 7 గంటలకు రైతులు పీఏసీఎస్ల వద్దకు చేరుకున్నారు. కేసముద్రం రైతు వేదిక భవనంలో యూరియా టోకెన్లు ఇస్తున్నట్లు అధికారులు ఇచ్చిన సమాచారంతో అధిక సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకొని క్యూలో నిల్చున్నారు. 444 బస్తాలకు గాను ఏవో వెంకన్న, పోలీసుల ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. వెయ్యి మందికి పైగా రైతులు మధ్యాహ్నం వరకు క్యూలైన్లో నిల్చొని పడిగాపులు పడినా, 444 బస్తాలకు మాత్రమే టోకెన్ ఇవ్వడంతో మిగిలిన రైతులంతా నిరాశతో వెనుదిరిగారు. ఇదిలా ఉండగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద 222 బస్తాల పంపిణీకి అధికారులు టోకెన్లు ఇచ్చేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో పెద్దసంఖ్యలో చేరుకున్న రైతులు బారులు దీరారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో టోకెన్ల పంపిణీ నిలిపివేశారు. అనంతరం రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు.అవసరానికి మించి యూరియా కొనొద్దుముందస్తు సాగుతో పెరిగిన యూరియా వాడకం రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సరఫరా చేయని కేంద్రం చాలా రాష్ట్రాల్లో యూరియా కొరత ఉందని బీజేపీ అధ్యక్షుడికి తెలియదు వ్యవసాయశాఖ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్న మాటలకు ఆందోళనకు గురై అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన యూరియాను పకడ్బందీగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం సచివాలయంలో మంత్రి తుమ్మల వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూరియా లభ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయకుండా చైతన్యపరచాలని చెప్పారు. వానాకాలం సీజన్కు కేంద్రం కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఈనెల వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటంతో ఏర్పడిన యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆదేశించారు. సీజన్ ముందస్తుగా ప్రారంభం కావడం, మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు చేయడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా అమ్మకాలు కూడా అధికంగా జరిగాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా నల్లగొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిల్లాలలో గత సంవత్సరంతో పోలిస్తే యూరియా అమ్మకాలు అధికంగా జరిగినట్టు తెలిపారు. యూరియాను వ్యవసాయానికి కాకుండా, ఇతర అవసరాల కోసం మళ్లించకుండా టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేసి, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏ రాష్ట్రంలోనూ యూరియా కొరత లేదని, ఇక్కడే ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు అవగాహనరాహిత్య మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాస్తవానికి మన రాష్ట్రంలోనే కాకుండా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, రాజస్తాన్తోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు బి.గోపి మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి సీజన్కు ముందే కేంద్రం ఎరువులను కేటాయిస్తుందని, అందులో భాగంగానే తెలంగాణకు కూడా యూరియాతో కలిపి 5 రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని అన్నారు. ఇందులో యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ కలిపి 13.95 మెట్రిక్ టన్నులుగా ఉన్నట్టు తెలిపారు. అయితే కేటాయించిన యూరియాను నెలవారీగా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం వల్ల సమస్య ఎదురైందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, హాకా ఎండీ చంద్రశేఖర్, మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డి, ఆగ్రోస్ ఎండీ రాములు పాల్గొన్నారు. -
‘కట్ట’ కట!
పోలీసు పహారాలో..కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని పెనుమల్లి సొసైటీ పరిధిలో 10 గ్రామాలున్నాయి. ఇక్కడ 4 వేల ఎకరాలకు పైగా ఆయుకట్టు ఉంది. ఖరీఫ్లో వరి సాగు చేయగా ప్రస్తుతం మొలక దశలో ఉంది. ఇప్పుడు మొదటి డోసు కింద 120 టన్నుల యూరియా అవసరం. కానీ ఇప్పటివరకు 3 విడతల్లో వచ్చింది 70 టన్నులు మాత్రమే. సోమవారం ఎరువుల కోసం రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు.సాక్షి, అమరావతి: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతన్నలను ప్రభుత్వ నిర్వాకం వల్ల తలెత్తిన ఎరువుల కొరత పట్టి పీడిస్తోంది. యూరియా కొరత మరీ దారుణంగా ఉంది. అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదు. రైతు సేవా కేంద్రా లు (పూర్వపు ఆర్బీకేలు) కాదు కదా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) వద్దా నిల్వలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. పొలాలకు చేరాల్సిన యూరియా, డీఏపీ పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో నిలువు దోపిడీ.. ఖరీఫ్ 2025 సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు 20 లక్షల ఎకరాలు దాటింది. ప్రస్తుతం మొలక దశలో ఉన్న పంటకు ఎకరాకు కట్ట యూరియా, కట్ట డీఏపీ తప్పనిసరి. పైరు ఎదుగుదలకు ఎంతగానో దోహదపడే యూరియా ప్రస్తుతం అసలు కానరావడం లేదు.యూరియా ఎమ్మార్పీ రూ.266.50 కాగా బహిరంగ మార్కెట్లో రూ.310 – రూ.440 వరకు విక్రయిస్తున్నారు. డీఏపీ, ఇతర ఎరువులతో పాటు జింకు గుళికలను అంటగడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ అంటూ అందినకాడికి దోచేస్తున్నారు. సొసైటీల్లో ఏ ఒక్క రైతుకూ బస్తాకు మించి ఇవ్వ డం లేదు. ఇదే అదునుగా కృత్రిమ కొరత సృష్టిస్తున్న ప్రైవేటు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. యూరియా కొరత వల్ల డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉండగా, మార్కెట్లో మాత్రం రూ.1,450 నుంచి రూ.1,550 వరకు పెంచి అమ్ముతున్నారు. పక్కదారి పడుతున్నా పట్టని ప్రభుత్వం.. ఖరీఫ్ సీజన్లో 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా 9.74 లక్షల టన్నుల విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. అత్యధికంగా 4.10 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఓపక్క చూస్తే 50 శాతం సాగు కూడా పూర్తి కాలేదు. వర్షాధార ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల పంట భూములు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన 1.65 లక్షల టన్నుల యూరియా ఇప్పటివరకు అందలేదు. యూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేటు వ్యాపారులకే కేటాయిస్తున్నారు.సొసైటీలకు చేరిన కొద్దిపాటి ఎరువులను అధికార పార్టీ సానుభూతిపరులకు పంపిణీ చేసి మిగిలిన నిల్వలను దొడ్డి దారిన ప్రైవేటు డీలర్లుకు తరలిస్తున్నారు. యూరియా దారి మళ్లుతున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వ్యాఖ్యానించడం గమనార్హం. సారా, బీర్ తయారీతోపాటు పెయింట్లు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్ – బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, ఆక్వా మేత, కల్తీ పాల తయారీలో యూరియాను విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీకి కేటాయించిన నిల్వలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి. 2019కి ముందు దుస్థితి పునరావృతం..!గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్విర్యం చేయడంతోపాటు ఎరువుల సరఫరాలో ముందుచూపు లేకపోవడంతో 2019కి ముందు పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీజన్లో కనీసం నాలుగైదు సార్లు తిరిగితే కానీ రైతన్నలకు ఎరువు కట్ట దొరికేది కాదు.మండల స్థాయిలో పంపిణీ వల్ల రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. వ్యయ ప్రయాసలతోపాటు లోడింగ్, అన్లోడింగ్ భారాన్ని భరించాల్సి వచ్చేది. అదనంగా చెల్లిస్తేగానీ కోరిన ఎరువులను డీలర్లు ఇచ్చేవారు కాదు. పైగా అవసరం లేని పురుగు మందులను బలవంతంగా అంటగట్టేవారు. ఎక్కడకెళ్లినా ఎరువుల కోసం చెప్పుల క్యూ లైన్లు కనిపించేవి. ఎండలో నిలబడలేక స్పృహ తప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి మత్యువాత పడిన ఘటనలూ చోటు చేసుకున్నాయి. ఐదేళ్లూ గ్రామంలోనే కోరినన్ని..వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువుల సరఫరా చేపట్టడంతో అన్నదాతలు నిశ్చింతగా సాగు పనుల్లో నిమగ్నమయ్యేవారు. ఏనాడూ ఎరువు కట్టల కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. విత్తనం నుంచి విక్రయం దాకా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదేళ్లలో రవాణా, లోడింగ్, అన్లోడింగ్ రూపంలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. అలాంటిది గడిచిన ఏడాదిగా రైతులు ఎరువుల కోసం నరక యాతన పడుతున్నారు.కట్ట కూడా ఇవ్వలేదు.. రెండెకరాలు కౌలుకు తీసుకొని ఖరీఫ్లో వరి సాగు చేశా. ప్రస్తుతం మొల క దశలో ఉంది. ఎన్నిసార్లు తిరిగినా కట్ట యూరియా కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. –యార్లగడ్డ భార్గవ సాయి, ఎస్వీపల్లి, కృష్ణా జిల్లా సాగు ఎలా చేయాలి? సొంత భూమితో కలిపి 20 ఎకరాల వరకు కౌలుకు చేస్తున్నా. ప్రస్తుతం నాకు పది కట్టలు కావాలి. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఐదు కట్టలు ఇచ్చారు. ఇలా అయితే సాగు ఎలా? –కట్టా వాకలయ్య, లంకల కలవ గుంట, కృష్ణా జిల్లా రోడ్కెక్కిన రైతన్నలు..యూరియా కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కవుతరం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం నిరసనకు దిగారు. పెడన మండలం పెనుమల్లి, మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం సొసైటీల పరిధిలో కూడా ఇదే రీతిలో ఆందోళన నిర్వహించారు. ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్లతో పాటు పలు జిల్లాల్లో సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీస్ పహారాతో ఎరువులు పంపిణీ చేయాల్సి రావడం కూటమి సర్కారు అసమర్థతకు నిదర్శనం. -
యూరియా ఎడాపెడా!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా యూరి యా వినియోగం పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఎరువులు, అందునా యూరియా వాడకం ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలో సైతం అధిక యూరియా వినియో గం నమోదవుతుండగా..దక్షిణాది రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రెండోస్థానంలో ఉండడం గమనార్హం. ఖరీ ఫ్ సీజన్లో యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్పీ వంటి ఎరువులను అత్యధికంగా కర్ణాటక 26.75 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) వినియోగిస్తుండగా, అందులో ఒక్క యూరియా వినియోగమే 11.17 లక్షల మెట్రిక్ టన్ను లుగా ఉంది.ఇక కర్ణాటక తరువాత తెలంగాణలో ఒక సీజన్లో మొత్తం 23.75 ఎల్ఎంటీల మేర ఎరువులు వినియోగిస్తుండగా..అందులో యూరియా 9.80 ఎల్ఎంటీలు ఉండటం గమనార్హం. ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ రాష్ట్రంలో మాత్రమే ఎరువుల వాడకం అతి తక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో ఖరీఫ్లో వినియోగించే యూరియా కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే కావడం కావడం విశేషం. డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్, ఎస్ఎస్పీ ఎరువుల వినియోగం కూడా ఈ రాష్ట్రంలో అతితక్కువగా ఉంది. ఏపీలో 6.22 ఎల్ఎంటీ, తమిళనాడులో 4.37 ఎల్ఎంటీ యూరియాను వినియోగిస్తుండగా, పాండిచ్చేరీలో 6 వేల టన్నులను మాత్రమే వాడుతున్నారు.ఉత్తరప్రదేశ్ టాప్కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి యూరియా కోసం రూ.1.19 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే రూ.30,940 కోట్లు సబ్సిడీ విడుదల చేసింది. దేశంలో యూరియాతో పాటు ఎరువుల వినియోగం ఏయేటికాయేడు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. యూరియాపై ఒకవైపు రూ.లక్షల కోట్లు భరిస్తూనే సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.సేంద్రీయ ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ పరిశోధన సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రైతులు అధిక దిగుబడి లక్ష్యంగా ఎరువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ ఎరువుల వినియోగంలో అగ్రభాగాన ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం ఒక సీజన్కు 40 ఎల్ఎంటీల చొప్పున యూరియా వినియోగిస్తున్నారు. ఇక దేశ పశి్చమ ప్రాంతంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవాల్లో 61.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. గోవాలో అతి తక్కువగా కేవలం వెయ్యి మెట్రిక్ టన్నులే వినియోగిస్తుండడం గమనార్హం. తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో బిహార్లో అత్యధికంగా 10.32 ఎల్ఎంటీ యూరియాను వినియోగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సిక్కిం, నాగాలాండ్లలో అసలు ఎరువులే వినియోగించడం లేదు. -
ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఇది రైతు ప్రభుత్వం కాదని..రాక్షస ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సకాలంలో పంటలకు యూరియా అందించకపోవడంతో 70 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారని సోమవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా పొలంలో ఉండాల్సిన రైతులు ఎరువుల దుకాణాల ముందు ఎదురుచూపులు చూస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఎన్నడూ రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవని చెప్పారు.యూరియాపై ప్రభుత్వ సమీక్షలు లేకపోవడం, కేంద్రం, రాష్ట్రం మధ్య కొరవడిన సమన్వయం మూలంగా రాష్ట్రంలో ఇప్పుడు యూరియా, డీఏపీ కొరత ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం ఎరువుల కొరత రాకుండా ఏప్రిల్, మే నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేని సమయంలోనే నోడల్ ఏజెన్సీ మార్క్ఫెడ్కు ఆర్థిక సహాయం అందించి జూన్ నెల నాటికి 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద మరో 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉండేలా చూసుకునేదని గుర్తు చేశారు. అదే నేడు ప్రభుత్వ సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. -
యూరియా కోత.. రైతన్న వెత
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి రెండు బస్తాలే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా..రాష్ట్రానికి కోటాకు మించి ఎరువులు సరఫరా చేశామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇది రైతులకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని, గ్రామాల్లో యూరియా కోసం ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. చర్చనీయాంశమైన కేంద్రమంత్రి ప్రకటన రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. తెలంగాణకు ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో అవసరమైన 20.30 ఎల్ఎంటీల కన్నా అధికంగా 22.15 ఎల్ఎంటీలు సరఫరా చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దీంతో బిత్తరపోవడం రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల వంతయ్యింది. వాస్తవానికి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి.. యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్పీ ఎరువులు కలిపి 22.15 ఎల్ఎంటీ ఇచ్చినట్లు చెప్పాల్సిన కేంద్ర మంత్రి.. కేవలం యూరియానే 22.15 ఎల్ఎంటీ సరఫరా చేసినట్లుగా చెప్పారని ఓ అధికారి వివరించారు. నిజానికి ఇప్పటివరకు ఇచ్చిన యూరియా 4.50 ఎల్ఎంటీలు మాత్రమేనని చెప్పారు. అసలు లెక్కలేంటి? రాష్ట్రంలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో ఏకంగా 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం ఈ సీజన్కు గాను నెలవారీగా 9.80 ఎల్ఎంటీలు మాత్రమే కేటాయించింది. అదేమంటే యాసంగి సీజన్లో మిగిలిన యూరియా 1.92 ఎల్ఎంటీ గోదాముల్లో ఉందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సమాచారం మేరకు.. ఏప్రిల్ నుంచి జూలై వరకు కేంద్రం 6.60 ఎల్ఎంటీల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4.50 ఎల్ఎంటీలే వచ్చింది. అంటే 2.10 ఎల్ఎంటీ (32 శాతం) తక్కువగా వచ్చిందన్న మాట. దీనికి రాష్ట్రం వద్ద ప్రారంభ నిల్వ కింద ఉన్న యూరియా 1.92 ఎల్ఎంటీలు కలిపితే మొత్తం 6.42 ఎల్ఎంటీలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ఇందులో సుమారు 5.20 ఎల్ఎంటీలు ఇప్పటికే రైతులకు విక్రయించగా.. 1.20 ఎల్ఎంటీల పైచిలుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఎల్ఎంటీలైనా వస్తేనే.. ఈ సీజన్లో రాష్ట్రానికి కేటాయించిన 9.80 ఎల్ఎంటీలకు గాను జూలై వరకు 4.50 ఎల్ఎంటీలు సరఫరా చేసిన నేపథ్యంలో ఇంకా 5.30 ఎల్ఎంటీల యూరియా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో కోత విధించిన 2.10 ఎల్ఎంటీలతో పాటు ఆగస్టు కోటా 1.70 ఎల్ఎంటీలు కలిపి ఈ నెలలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో అధికారులు సమావేశమై యూరియా కొరత పరిస్థితిని సమీక్షించారు. ఆగస్టులో కనీసం 2 ఎల్ఎంటీల యూరియా అయినా వస్తేనే ప్రస్తుతానికి గట్టెక్కే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్కు లేఖ రాశారు. రాష్ట్రానికి యూరియా కేటాయింపులు, ఇప్పటివరకు కేంద్రం నుంచి వాస్తవంగా వచ్చిన యూరియా వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో కొరతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అవసరమైన యూరియాను పంపించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎరువుల్లేక ఎదురుచూపులు..
సాక్షి, వీరఘట్టం, సరుబుజ్జిలి, నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఆర్బీకేల ద్వారా ఎరువులు సకాలంలో అందేవి. నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వంలో రైతులను ఎరువుల కష్టాలు వీడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఉన్న కొద్దిపాటి నిల్వలను సైతం పక్కదారి పట్టించేందుకు అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రైతులకు పంపిణీ చేసే యూరియా కూడా తమకే కావాలంటూ దౌర్జన్యం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలంలోని కిమ్మి రైతు సేవా కేంద్రానికి బుధవారం 440 బస్తాల యూరియా వచ్చింది. ఇదే ఆర్ఎస్కే పరిధిలో ఉన్న కొట్టుగమ్మడకి చెందిన ఉదయ్ అనే టీడీపీ నాయకుడు తన అనుచరులతో ఆర్ఎస్కేకు వచ్చి 200 బస్తాల యూరియాను దౌర్జన్యంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. గోదాంలో ఉన్న యూరియాను రెండు ట్రాక్టర్లలో లోడ్ చేసి తరలించేందుకు పన్నాగం పన్నాడు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యూరియా తరలింపును అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం లారీతో వచ్చిన యూరియాను ఆర్ఎస్కే గోదాంలో అన్లోడ్ చేసి, స్టాక్ వివరాలను రికార్డుల్లో నమోదు చేసి, ఆ తర్వాత రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనలను పక్కన పెట్టి, వచ్చిన యూరియాలో సగం యూరియాను తీసుకువెళ్లిపోతామంటే కుదరదని మండల వ్యవసాయ శాఖ అధికారిణి జె.సౌజన్య తేల్చి చెప్పారు. దీంతో కిమ్మి ఆర్ఎస్కే వద్ద టీడీపీ నేత అనుచరులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి, ఆందోళనను విరమింపజేశారు. సహకార సొసైటీ ముట్టడి..ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, కంది పంటలకు యూరియా వేసేందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని రైతు సేవా కేంద్రాల వద్దకు, సహకార సొసైటీ కార్యాలయాల వద్దకు వెళ్లిన రైతన్నలకు నిరాశ ఎదురు కావడంతో బుధవారం ఆందోళనకు దిగారు. పట్టణంతో పాటు బిజినవేముల, మల్యాల రైతులు యూరియా కోసం తరలివచ్చారు. స్టాక్ లేకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇవాళ, రేపు అంటూ ఎందుకు తిప్పుకుంటున్నారని రైతులు ఉపేంద్రారెడ్డి, మహబూబ్బాషా, స్వాములు అధికారులను నిలదీశారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా కూటమి ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై దాడి..శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయంలో 245 బస్తాల యూరియాను పంపిణీ చేస్తామని ముందస్తుగా చెప్పడంతో రైతులు బుధవారం సచివాలయం వద్దకు చేరుకున్నారు. గంటలపాటు వేచి చూసినా పంపిణీ జరగకపోవడంతో ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ మండల బూత్ కమిటీ కన్వీనర్ ఎం.రమణ అధికారులను ప్రశ్నించగా.. కొందరు అనధికార వ్యక్తులు స్పందిస్తూ తమకు ఇష్టం వచ్చిన సమయంలో పంపిణీ చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు.పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ బూత్ కమిటీ కన్వీనర్ రమణ పట్ల దురుసుగా వ్యవహరించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో యూరియా పంపిణీ నిలిచిపోయింది. -
దేశీయంగా పెరిగిన యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్ సిటీ (రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా మేకింగ్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త యూరియా యూనిట్లను స్థాపించింది. ప్రతీ యూనిట్ ఉత్ప త్తి సామర్థ్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్), ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్లోని హిందుస్థాన్ ఉర్వారక్ రసాయన్ లిమిటెడ్ (హెచ్యూఆర్ఎల్), గోరక్పూర్లోని సింధ్రీ, గ్రీన్ఫీల్డ్ యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 25 గ్యాస్ ఆధారిత యూ రియా యూనిట్లను స్థాపించారు. దీంతో 2014 –15 ఆర్థిక సంవత్సరంలో 225 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి.. 2023–24లో రికార్డుస్థాయిలో 314.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి పెంచడానికి ఇవి దోహదపడ్డాయి. ఏటా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుండడంతో.. దిగుబడి పెంచేందుకు యూ రియా వినియోగం అధికమైంది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలలో యూరియా కొరత ఏర్పడుతోంది. అందుబాటులోకి దేశీయ యూరియా.. 2023–24 ఆర్థిక సర్వే ప్రకారం భారత వ్యవసాయ రంగం.. జనాభాలో దాదాపు 42.3 శాతం మందికి ఉపాధినిస్తోంది. గతంలో వ్యవసాయ రంగానికి అవసరమయ్యే యూరియా తయారీ కోసం వివిధ రసాయనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. దిగుమతి సుంకాలు, రవాణాతో ధరలు అధికంగా ఉండడంతో రైతులపై ఆర్థిక భారం పడేది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విధానంతో సబ్సిడీ పథకాలతో దేశీయంగా యూరియా, డీఏపీ, సేంద్రియ ఎరువులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభానికి నోచుకోని సల్ఫర్ కోటెడ్ యూరియా.. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సల్ఫర్ కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం రూ.150 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. అయితే, సల్ఫర్ కోటెడ్ యూరియాను ఉత్పత్తి చేసేందుకు మరోకొత్త ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంది. నేటివరకు పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ చూపి.. రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో త్వరితగతిన సల్ఫర్ కోటెడ్ యూరియా ఉత్పత్తి ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
యూరియాకు కృత్రిమ డిమాండ్
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో లేకలేక వర్షాలు పడ్డాయి. రైతులు సేద్యపు పనుల్లో బిజీగా మారారు. పంటలకు, పశుగ్రాసానికి యూరియా అవసరం ఎక్కువైంది. ఇదే అదునుగా పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లోని ఎరువుల వ్యాపారులు యూరియాకు కృత్రిమ డిమాండ్ను సృష్టించారు. యూరియా బస్తా కావాలంటే.. కాంపె్లక్స్ ఎరువు బస్తా కొనాల్సిందేనని నిబంధన పెడుతున్నారు. దీంతో రైతులు విధిలేక యూరియా కోసం కాంప్లెక్స్ను కొనాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.1,300 నుంచి రూ.1,700 దాకా పెట్టికొన్న కాంప్లెక్స్ బస్తాలు దుకాణాల్లో అమ్ముడు కాకుండా వ్యాపారులకు భారంగా మారుతుండడం దీనికి కారణం. ప్రధాన డీలర్ల నుంచి స్థానిక వ్యాపారులకు కూడా ‘యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాల్సిందేనన్న’ డిమాండ్ వస్తున్నట్లు సమాచారం. రూ.250 యూరియా.. రూ.295కు విక్రయాలుఎమ్మార్పీ ప్రకారం యూరియా బస్తా ధర రూ.250గా ఉంది. కానీ ఇక్కడి దుకాణాల్లో వీటిని రూ.295 దాకా విక్రయిస్తున్నారు. ఎందుకని రైతులు ప్రశ్నిస్తే తమకు రేణిగుంటనుంచి యూరియా వస్తుందని అక్కడినుంచి ఇక్కడికి రవాణా, అన్లోడింగ్ చార్జీలు తప్పవని చెబుతున్నారు. కృత్రిమ డిమాండ్, అధిక ధరల విషయంలో విజిలెన్స్ అధికారుల హెచ్చరికలనూ వ్యాపారులు బేఖాతరు చేయడం గమనార్హం. ఒకవైపు కృత్రిమ డిమాండ్, మరోవైపు అధిక ధరల నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు కొందరు కర్ణాటకలోని నంగళి, ముళబాగిళు, బేతమంగళలకు వెళ్లి యూరియాను కొనుగోలు చేస్తున్నారు.నిజమే కానీ...యూరియా కావాలంటే.. కాంప్లెక్స్ కొనాల్సిందేనన్న షరతు వార్తలు నిజమే. ధరల విషయానికొస్తే రేణిగుంట నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జీలను ప్రధాన డీలర్లకు ప్రభుత్వం ఇస్తే.. ఆ ప్రయోజనాన్ని రిటైల్ వ్యాపారులకు అందించాల్సి ఉంటుంది. ఈ డబ్బు రానందున కొంత ఇబ్బందిగా మారింది. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎమ్మార్పీకే యూరియాను విక్రయించాలి. ఆయా అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడతాం. – సాక్షితో స్థానిక వ్యవసాయశాఖ ఏడీ గీతాకుమారి -
ఎరువుల కోసం రైతన్న పడిగాపులు
వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తోంది. దేశంలో అధిక జనాభా జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను విస్తరించడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ఈ ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాల్సి ఉంటుంది. లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.ఆర్థిక పరిమితులుయూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. అడపాదడపా బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం నుంచి ఇలాంటి ప్రాజెక్ట్లకు నిధులు వెచ్చించడంలేదు.నిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం.పరిపాలనా, నియంత్రణ అవరోధాలుకొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.దిగుమతులపై ఆధారపడటంస్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి.అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ముడిసరుకు సరఫరాలో హెచ్చుతగ్గులుయూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్స్టాక్గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూప్రత్యామ్నాయాలుప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. -
కోటా పెంచండి.. జేపీ నడ్డాకు సీఎం రేవంత్రెడ్డి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటా పెంచాలని కేంద్ర ఆరోగ్య, సంక్షేమ, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న సీఎం.. మంగళవారం నడ్డాతో పాటు మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో వేర్వేరుగా వారి అధికారిక నివాసాల్లో భేటీ అయ్యారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్రావు ఆయన వెంట ఉన్నారు. కాగా యూరి యా, ఏరో–డిఫెన్స్ కారిడార్, వరంగల్ విమానాశ్రయా నికి ఆర్థిక సహాయం వంటి అంశాలపై ఇద్దరు మంత్రులతో వేర్వేరుగా సీఎం చర్చించారు. రైల్వే రేక్లు పెంచండి.. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు వచ్చి, సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కేంద్ర మంత్రి నడ్డాను రేవంత్ కోరారు. వర్షాకాలం సీజన్కు సంబంధించి ఏప్రిల్–జూన్ మాసాల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని తెలిపారు. జూలైలో దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా 63 వేల టన్నులు, విదేశాల నుంచి దిగుమతి అయిన యూరియా 97 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేయడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాలని కోరారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏరో–డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయండి హైదరాబాద్ ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేక రక్షణ, ఏరోస్పేస్ పార్కును తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ను ఏరో–డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలి. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలి. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలి. హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలి..’అని కోరారు. హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజబిలిటీపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. -
హరిత యూరియా వస్తోంది!
పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేస్తున్న రసాయనిక యూరియా వాడకానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయి. శిలాజ ఇంధనాలు వాడకుండా తయారు చేసే ‘హరిత యూరియా’ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్వీడన్లోని ‘నైట్రోక్యాప్ట్’ అనే స్టార్టప్ పూర్తిగా కాలుష్య రహిత పద్ధతిలో నత్రజని ఎరువును తయారు చేస్తోంది. అది కూడా స్వల్ప ఖర్చుతోనే. కేవలం వాతావరణంలోని నీరు, గాలితో పాటు ఒక యూనిట్ సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనంతో ఏకంగా 40 వేల హెక్టార్లకు సరిపడా హరిత యూరియాను ఉత్పత్తి చేసే అద్భుత సామర్థ్యం తమ వినూత్న సాంకేతికత సొంతమని నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్బెర్గ్ ప్రకటించారు. ఏమిటీ సాంకేతికత విశిష్టత?వాతావరణంలో మెరుపులు సహజంగా నత్రజనిని స్థిరీకరించే విధానాన్ని అనుకరిస్తూ ఈ స్టార్టప్ సరికొత్త సాంకేతికతను రూపొందించింది. గాలిలోని నత్రజని అణువులను విచ్ఛిన్నం చేయడానికి ప్లాస్మా టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా ఎరువులలో కీలకమైన భాగమైన నైట్రేట్ను ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత విశిష్టత. ఈ సాంకేతికత గాలి నుంచి గ్రహించి నేరుగా నత్రజని ఎరువును తయారు చేయటానికి ఆక్సిజన్, నీరు, పునరుత్పాదక శక్తిని మాత్రమే ఉపయోగిస్తుంది. వందేళ్లుగా సంప్రదాయ రసాయనిక ఎరువుల ఉత్పత్తి ప్రక్రియలో మాదిరిగా ఖరీదైన, కాలుష్యకారక ఇంధనాన్ని ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేసే అవసరం ఈ టెక్నాలజీతో తీరిపోనుంది. నైట్రోక్యాప్ట్ రూపొందించిన పద్ధతిలో హరిత యూరియా ఉత్పత్తికి పది రెట్లు తక్కువ శక్తి సరిపోతుంది. దీన్ని సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ సాంకేతిక పురోగతి ఎరువుల తయారీ ప్రక్రియను పర్యావరణహితంగా మారుస్తుంది. ‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్స్వీడన్కు చెందిన భౌతికశాస్త్ర శాస్త్రవేత్త గస్టాఫ్ ఫోర్స్బెర్గ్ తన మిత్రుడు పీటర్ బేలింగ్తో కలసి 2016లో నైట్రోక్యాప్ట్ స్టార్టప్ను నెలకొల్పారు. ‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్ పొందిన గ్రీన్ యూరియా టెక్నాలజీని 20 మంది శాస్త్రవేత్తలతో కూడిన నైట్రోక్యాప్ బృందం ఆవిష్కరించింది. ఇందులో శ్రీలంకలో పుట్టిన యువ శాస్త్రవేత్త శంఖ ననయక్కర కూడా ఉన్నారు. స్వీడన్లోని ఉప్సల పట్టణంలోని గ్రీన్ ఇన్నోవేషన్ పార్క్లో ఏర్పాటైన చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్టర్ ద్వారా హరిత యూరియా ఉత్పత్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. హరిత యూరియాను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే 33 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి 9 సంస్థలు ఆసక్తి చూపాయి. స్వీడన్లోని ‘వివెసియ’ సహకార సంఘం వాణిజ్యపరమైన తొలి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో 9 వేల మంది రైతులు సభ్యులు. హరిత నత్రజని ఎరువుతో 7.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్టాక్హోమ్లో పురస్కార ప్రదానంస్వీడన్కు చెందిన కర్ట్ బెర్గ్ఫోర్స్ ఫౌండేషన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యావరణ పురస్కారం ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్’ను ప్రదానం చేస్తోంది. పర్యావరణహితమైన ఆహారోత్పత్తికి దోహదపడే ఆవిష్కరణలకు ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నైట్రోక్యాప్ట్ గెల్చుకుంది. జ్ఞాపికతో పాటు 20 లక్షల డాలర్ల నగదు బహుమతిని జూన్ 13న స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్బెర్గ్ అందుకున్నారు. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ పొందటంతో ఈ ఆవిష్కరణ ప్రపంచం దృష్టికి వచ్చింది. వికేంద్రీకరణకు అవకాశంయూరియా ఉత్పత్తికి భారీ పరిశ్రమను స్థాపించాల్సిన అవసరం లేదు. కాబట్టి, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల రైతులకు ఈ సాంకేతికత వరప్రసాదంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాక, రసాయనిక ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ఉత్పాదకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అనివార్యత నుంచి ఈ సాంకేతికత విముక్తి కలిగిస్తుందని ఆశిస్తున్నారు. యూరియాను ఎక్కడో ఉత్పత్తి చేసి ఎక్కడికో తరలించాల్సిన అవసరం ఉండదు. దీని ఉత్పత్తిని వికేంద్రీకరించటానికి తగిన మాడ్యులర్ వ్యవస్థ ద్వారా నెలకొల్పే రియాక్టర్ల ద్వారా హరిత నత్రజనిని ఎక్కడికక్కడ తయారు చేసుకునేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందట. అదే జరిగితే, అంతర్జాతీయ జియోపొలిటికల్ ఉద్రిక్తతల ప్రభావం వ్యవసాయంపై పడకుండా జాగ్రత్తపడగలుగుతాం. శిలాజ ఇంధనాలపై ఆధారపడే ఇప్పటి రసాయనిక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమలో ఇది విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వాతావరణంలోకి విడుదలవుతూ భూగోళాన్ని అమితంగా వేడెక్కిస్తున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 2.7 శాతం రసాయనిక ఎరువుల పరిశ్రమ నుంచి వస్తున్నాయి. ఇందులో 50% వాటా యూరియాదే. ఎటువంటి ముడిసరుకును దిగుమతి చేసుకోనవసరం లేనందున యూరియా ఉత్పత్తిలో ఇక ఏ చిన్న దేశమైనా సంపూర్ణ స్వావలంబన సాధించడానికి ఈ ఆవిష్కరణ దోహదం చేయనుంది. ప్రపంచ దేశాల రైతులకు వరం ప్రపంచ నత్రజని ఎరువుల పరిశ్రమను అతలాకు తలం చేసే సామర్థ్యం నైట్రోక్యాప్ట్ ఆవిష్కరణకు ఉందని ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అవార్డు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ జ్యూరీ పేర్కొంది. ‘భూమి, నీరు, ఎరువులను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉపయోగించడం ద్వారా మాత్రమే ప్రపంచంలోని ప్రజలందరికీ తగినంత మొత్తంలో పోషకాహారాన్ని అందించగలం. నత్రజని, భాస్వరం ఎరువులను అధిక మొత్తంలో వినియోగిస్తున్నాం. పెద్ద మొత్తంలో హరితగృహ వాయువులను విడుదల చేసే ప్రక్రియల ద్వారా నత్రజని ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి.నైట్రోక్యాప్ట్ స్టార్టప్ ఆవిష్కరణ ఈ చరిత్రను తిరగరాస్తోంది. హరిత విద్యుత్తు ఆధారిత ప్లాస్మా టెక్నాలజీతో గాలిలోని నత్రజని మూలకా లను విభజించడం ద్వారా నత్రజని ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఇంధన వినియోగాన్ని ఈ సాంకేతికత పది రెట్లు తగ్గిస్తుంది. స్థానికంగా చిన్న యూనిట్లలో హరిత ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. శిలాజ ఇంధనాలను పూర్తిగా నివారిస్తుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచగల, నిశ్చింతగా ఉపయోగించగల నైట్రేట్ ఎరువులను ఈ సాంకేతికత అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులకు ఇది వరం..’ అని జ్యూరీ పేర్కొంది.ఉద్గారాల్లేని యూరియాతో విప్లవాత్మక మార్పు నత్రజని ఎరువుల పరిశ్రమను కర్బన ఉద్గార రహితంగా మార్చటం నైట్రోక్యాప్ట్ లక్ష్యం. ప్రస్తుతం నత్రజని ఎరువు ఉత్పత్తి చేస్తున్న శిలాజ ఇంధన ఆధారిత ప్రక్రియ కథ ముగింపు దశకు చేరుకుంది. యూరియా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆహారోత్పత్తిని పెంచటానికి కూడా హరిత యూరియాతో మనం దోహదపడవచ్చు. పైలట్ ప్రాజెక్టు ద్వారా హరిత యూరియాను ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ పంటలకు వాడుతున్నాం. పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించే తొలి యూనిట్కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం. నత్రజని పరిశ్రమలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టే దశకు మా సాంకేతికతను తీసుకురావడానికి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ మాకు చాలా ఉపయోగపడుతుంది.– గస్టాఫ్ ఫోర్స్బెర్గ్, సీఈవో, వ్యవస్థాపకుడు, నైట్రోక్యాప్ట్, స్వీడన్– పంతంగి రాంబాబు -
విదేశీ దిగుమతి యూరియాలో సగానికి సగం కోత!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నాట్లు..మరోవైపు పత్తి, మక్కల సాగుతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జూలై నెలలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే నిండుకుంటున్న నిల్వలను చూసి వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రానికి ఈ వానాకాలం సీజన్లో కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో సగానికిపైగా విదేశాల నుంచి దిగుమతి అయిన యూరియానే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ కేటాయిస్తుండడం ఇబ్బందిగా మారింది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో జూన్ వరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇందులో విదేశీ దిగుమతి యూరియా 2.60 ఎల్ఎంటీ. ఇందులో 1.36 లక్షల మెట్రిక్ టన్నులు కోత విధించగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల మేర దేశీయ తయారీ యూరియాలో కోత విధించింది. ఈ నేపథ్యంలో జూలై నెలలోనైనా యూరియా కేటాయింపులు సక్రమంగా జరపాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. జూలై నెల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1.60 మెట్రిక్ టన్నుల యూరియాలో 60 శాతం మేర 0.97 లక్షల మెట్రిక్ టన్నులు విదేశీ దిగుమతి యూరియానే ప్రభుత్వం కేటాయించింది. దిగుమతి చేసుకునే యూరియాను నౌకాశ్రయాల ద్వారా వెంటనే సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఆర్ఎఫ్సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కర్మాగారం నుంచి రాష్ట్ర కోటా కింద కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం పంపిస్తోంది. వ్యవసాయ శాఖ ఈ కోటాను అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో జిల్లాలకు పంపించుకునేందుకు వినియోగించుకుంటోంది. కేంద్ర మంత్రి నడ్డాకు తుమ్మల లేఖ రాష్ట్ర కోటా కింద కేటాయించిన యూరియాలో కోతలను అరికట్టి, జూలై నెలలో పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రానికి విదేశీ దిగుమతి యూరియా కాకుండా దేశీయ ఉత్పత్తి ఎరువునే పంపించాలని కోరారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి యూరియా కేటాయింపును 60,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని, ఏప్రిల్–జూన్ మధ్యలో వచ్చిన లోటును పూడ్చడానికి అదనపు సరఫరా ప్రణాళిక మంజూరు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి ఆరోపించారు. -
తెలంగాణలో యూరియా కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటా రాకపోవడంతో కొరత నెలకొంది. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ లో కేంద్రం నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు పేర్కొన్న మంత్రి.. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా వాడకం ఉంటుందని తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తుమ్మల నాగేశ్వరరావు మరోసారి లేఖ రాశారు. నెలవారిగా కేటాయించిన విధంగా రాష్ట్రానికి యూరియా పంపిణీ చేయాలని.. యూరియా లోటు వలన రైతులు రానున్ననెలలో ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. తక్షణమే రాష్ట్రానికి కేటాయించిన యూరియాను పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. -
కావాల్సింది 2.48 లక్షల మెట్రిక్ టన్నులు.. ఉన్నది 1.47 ఎల్ఎంటీనే
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలై నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరి యా కోటా రాకపోవడంతో వచ్చే రెండు నెలల ను తలచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రాష్ట్రానికి జూన్ వరకే 5 లక్షల మెట్రి క్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్ప టి వరకు 2.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్ర మే వచ్చింది. వచ్చిన కోటాలోనూ ఇప్పటికే 1.28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుబా టులో ఉన్న యూరియా కేవలం 1.47 లక్షల మె ట్రిక్ టన్నులే. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఇప్పటికే వరినాట్లు మొదలుకాగా, జూలై మొదటి వారంలో రాష్ట్రమంతటా నాట్లు మొదలవుతాయి. ఇప్పటికే సుమారు 25 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసి యూరియాను ఉపయోగిస్తున్నారు. వచ్చే నెల మొదటివారం కల్లా మరో 25 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వరినాట్లు ఉధృతమైతే యూరియా కష్టాలు మొదలైనట్టే. కేటాయింపుల్లో ఇప్పటికే 2.25 ఎల్ఎంటీ కోతతెలంగాణలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతు న్నా, రాష్ట్రానికి కేటాయించాల్సిన యూరియా కోటాను మాత్రం కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదు. నెలనెలా పంపాల్సిన యూరియాను కూడా పంపించకపోవడంతో నాట్లేసిన తర్వాత రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడు తున్నారు. ఈ సీజన్లో రాష్ట్రానికి పంపాల్సిన కోటాను కోతలు లేకుండా ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి కోరినా ఫలితం లేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.» ఏప్రిల్లో 1.70 ఎల్ఎంటీకి 1.22 ఎల్ఎంటీ యూరియా పంపిన కేంద్రం... మేలో 1.60 ఎల్ఎంటీకి గాను 87 వేల మెట్రిక్ టన్నులే పంపింది. » జూన్లో 1.70 ఎల్ఎంటీకి పంపించింది కేవలం 67వేల మెట్రిక్ టన్నులే. » మూడు నెలల కోటా కేవలం 2.75 లక్షల మెట్రిక్ టన్నులే రాగా, అందులో జూన్ నెలలో 1.28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. » వరి, పత్తి, మొక్కజొన్నకు జూలై నెలలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ఆగస్టులో మరో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. అంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే రెండు నెలల్లో అవసరమవుతుంది. కానీ అందుబాటులో ఉన్న 1.47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే. జూలైలో కేంద్రం పంపించే కోటాను బట్టి రైతు లకు యూరియా అందించాలని వ్యవసాయ శా ఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం పంపించిన యూరియా జూలైతో పాటు ఆగస్టు మొదటి వారానికి సరిపోతుందని మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
యూరియాపై చేతులెత్తేసినట్టేనా..?
సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం అన్నదాతలు దుకాణాల ముందు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. వానకాలం సీజన్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియాను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో యూరియా కేటాయింపులు పెంచాలన్న రాష్ట్ర విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం.. గత సీజన్లో మాదిరిగానే 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. ఈ మేరకు నెలవారీ సరఫరా ప్రణాళికను రాష్ట్రానికి పంపించింది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచే కోటాను పంపించాలి. గత సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందే 5 లక్షల టన్నుల యూరియాను పంపింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా సీజన్ ఆరంభానికి ముందే 5 ఎల్ఎంటీ యూరియాను నిల్వ ఉంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నం ఫలించలేదు. జూన్ నాటికి రాష్ట్రానికి 5 ఎల్ఎంటీ యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 2.19 ఎల్ఎంటీ మాత్రమే. మే, జూన్ నెలల్లో 3.70 ఎల్ఎంటీ రావాలి. కానీ, 1.14 ఎల్ఎంటీ కోత పడుతోందని అధికారులు తెలిపారు. మంత్రి లేఖ రాసినా స్పందన కరువు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశంతో రాష్ట్రంలో యూరియా కొరతపై గత నెల 19న వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడు విజయ్కుమార్ ఢిల్లీకి వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. జూన్లో కంపెనీలవారీ కేటాయింపులు జరిగే సమయంలో మే 26న మరోసారి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపారు. గత రెండు నెలల కేటాయింపులలో ఎక్కువభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా ఉండటం, అది సరైన సమయానికి రాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో జూన్ కోటాలో అయినా స్వదేశీ యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల లేఖల ద్వారా కేంద్రాన్ని కోరారు. కేంద్రం జూన్లో కేటాయించిన 1.70 ఎల్ఎంటీలో 67 శాతం ఇంపోర్టెడ్ యూరియానే కేటాయించింది. గత రెండు నెలల కేటాయింపులలో తక్కువగా సరఫరా చేసిన 1.14 ఎల్ఎంటీపై కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రెండుమూడు రోజుల్లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ఢిల్లీకి పంపిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావటంతో జూన్ వరకు కేటాయించిన మొత్తాన్ని నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని కేంద్రానికి తుమ్మల మూడోసారి లేఖ రాశారు. ఆర్ఎఫ్సీఎల్లో నిలిచిన ఉత్పత్తిరామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో వార్షిక మరమ్మతుల కారణంగా మే 6 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. హీట్ ట్రాన్స్ఫర్ రిఫార్మర్, అమ్మోనియా పైప్లైన్లు, ఇతర యంత్రాల నిర్వహణ కోసం ఈ రిపేర్లు చేపట్టారు. జూన్ రెండో వారంలో ఉత్పత్తి పున:ప్రారంభమయ్యే అవకాశం ఉంది.గత ఏడాది ఆర్ఎఫ్సీఎల్లో 11.94 ఎల్ఎంటీ యూరియా ఉత్పత్తి అయితే, రాష్ట్రానికి 4.68 ఎల్ఎంటీ సరఫరా చేసింది. మిగతాది నేషనల్ పూల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసింది. ఈసారి ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అయ్యే యూరియాను ఎక్కువగా తమకే ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఇంకా స్పందన రాలేదు. -
ఈసారీ యూరియా కొరత తప్పదా?
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే వానాకాలం సాగుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పా ట్లు చేస్తోంది. వరితోపాటు పత్తి, ఇతర ఉద్యానవన పంట ల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు మరోసారి యూరియా కోసం పడిగాపులు పడే పరి స్థితి వస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వానాకాలం పంటలకు ఎరువు బస్తాల కోసం సహకార సంఘం దుకాణాల ముందు రైతులు నిలబడిన దృశ్యాలు పునరావృతం అవుతాయోమే అన్న సందేహం తలెత్తుతోంది. ఈ సీజన్లో వాడకం అధికం రాష్ట్రంలో ఈ వానాకాలంలో 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 5 ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ సాగు విస్తీర్ణమే 131. 80 లక్షల ఎకరాలు. వీటిలో వరి, పత్తి, మొక్కజొన్నకు యూరియా వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఈసారి 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా అవసరమ ని అధికారులు చెపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 9.8 ఎల్ఎంటీ యూరియానే రాష్ట్రానికి కేటాయించింది. గత యాసంగిలో కేటాయించిన 9.8 ఎల్ఎంటీల యూరియానే ఈ సీజన్కూ కేటాయించడం గమనార్హం. యాసంగిలో పత్తి, సోయాబీన్ వంటి పంటలు లేకపోయి నా 9.8 ఎల్ఎంటీ యూరియా సరి పోని పరిస్థితి. కానీ వానాకాలంలోనూ అంతేస్థాయిలో యూరియా కేటాయించడంతో రైతులు ఎరువుల కోసం రోడ్డె క్కే పరిస్థితి తప్పకపోవచ్చునని వ్యవ సాయ రంగ నిపుణులు చెపుతున్నారు. ఇప్పటి వరకు 1.72 ఎల్ఎంటీలే... ఈ వానాకాలంలో కేంద్రం ఏప్రిల్ నుంచి దశల వారీగా యూరియాను రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్లో 1.70 ఎల్ఎంటీలు, మేలో 1.60 ఎల్ఎంటీల చొప్పున 3.30 ఎల్ఎంటీలు రావలసి ఉంది. అయితే కేంద్రం ఏప్రిల్లో 1.20 ఎల్ఎంటీలు, మేలో 0.52 ఎల్ఎంటీలు మాత్రమే ఇచ్చింది. అంటే ఇప్పటివరకు ఇచ్చిన కోటా కేవలం 1.72 ఎల్ఎంటీలే. గత ఏడాది వానాకాలం ప్రారంభానికి ముందే 4 ఎల్ఎంటీల యూరియాను నిల్వ చేసినప్పటికీ, ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈసారి కేవ లం 1.72 ఎల్ఎంటీలే కేంద్రం పంపడంతో రాష్ట్ర ప్రభు త్వం ఆందోళన చెందుతోంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి తక్షణం లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని కోరారు. ఎరువుల వాడకం తగ్గించండి..: డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రాష్ట్రాలు ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలని కోరుతుంది. వానాకాలం వరి, మొక్కజొన్న వంటి పంటలకు యూరియా కీలకమని, తొలిదశలో సరిపడా యూరియా లేకపోతే మొద టి దశ నుంచే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ప్రణాళిక అవసరమని అంటున్నారు. -
రైతన్నల పడిగాపులు
-
యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?
ఫెర్టిలైజర్సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు. రోజుకి 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ నిర్మించారు. 2023 డిసెంబర్ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్ను పర్యవేక్షిస్తుంది. పైప్లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్ స్టీమ్ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్ పైప్లైన్ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్ను పునరుద్ధరించారు. ప్లాంట్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్ స్టీమ్ పైప్లైన్లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్ షట్డౌన్ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో గ్యాస్ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లి మిటెడ్ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది. ప్లాంట్పై ఒత్తిడి మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్ పెరగడంతో రామగుండం ప్లాంట్లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. -
యూరియా సరఫరాలో కోత
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దానివల్ల భూసారం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల సరఫరాలో కోతలు విధించాలని నిర్ణయించింది. యూరియా వినియోగం వీలైనంత మేరకు తగ్గించేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యూరియా ఎంత తగ్గిస్తే, అంతే స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. యూరియా అధిక వాడకం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, పంటలు కూడా విషపూరితమవుతున్నాయి. ఆయా ఆహార పదార్థాలు తింటున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా సహా ఇతరత్రా అన్ని రకాల ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని కేంద్రం సూచించింది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు, పురుగు మందులు వాడాలని తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా వాడకాలను తగ్గించేలా చూస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగు తగ్గినా పెరిగిన యూరియా వాడకం రైతులు పంట పొలాల్లో యూరియాను కుమ్మరిస్తున్నారు. దీని వినియోగం ఏటా పెరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. రైతులు గత ఏడాది వానాకాలం సీజన్లో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంట పొలాల్లో వాడారని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. గత ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే అధికంగా యూరియాను వినియోగించారు. వాస్తవానికి గత వానాకాలం సీజన్లో యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అంతకుముందు వానాకాలం సీజన్ కంటే గత ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. 2022– 23 ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం 1.29 లక్షల మెట్రిక్ టన్నులు పెరగడం గమనార్హం. పలుమార్లు వర్షంతోనూ పెరుగుతున్న వాడకం గత ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల మాత్రం వర్షాలు కురవడంతో రైతులు పత్తి లాంటివి వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడుసార్లు వేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. దీంతో రెండు బస్తాలకు బదులు మూడు, నాలుగు బస్తాల వినియోగం జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. ఈ అదనపు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
యూరియా గుప్పించారు
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో యూరియాను గుప్పిస్తున్నారు. ఇలా ఏడాదికేడాదికి యూరియా వినియోగం పెరుగుతోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. దీనివల్ల భూసారంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు పంట పొలాల్లో వాడారని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. 2021–22 వానాకాలం సీజన్లో 9.50 లక్షల మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల ఎకరాల్లో యూరియా వినియోగించగా, ఈసారి ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. ఆగస్టు నెలలో 3.42 లక్షల మెట్రిక్ టన్నులు, సెపె్టంబర్ నెలలో 3.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారు. సాగు తగ్గినా పెరిగిన యూరియా వినియోగం... వాస్తవానికి ఈ ఏడాది యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవంగా గత ఏడాది వానాకాలం సీజన్ కంటే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం గతేడాది కంటే ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా పెరగడం విశేషం. పలుమార్లు విత్తనాలు విత్తడంతో పెరిగిన వినియోగం ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు పత్తి వంటి వాటిని వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది. దీంతో రెండు బస్తాలు వాడాల్సిన చోట మూడు నాలుగు బస్తాల యూరియా చల్లారని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుకమేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
యూరియా కొరత.. రోడ్డెక్కిన రైతులు
పెన్పహాడ్, హాలియా: ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలోని సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో వాటి ఎదుగుదల లేక.. దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. సరిపడా యూరియాను త్వరితగతిన సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనుముల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. అందరికీ అందక నిరాశతో వెనుదిరిగారు. -
ఆర్ఎఫ్సీఎల్ షట్డౌన్
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
పుడమి తల్లికి తూట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : పుడమి తల్లి నిస్సారంగా మారిపోతోంది. చాలాకాలంగా నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర రసాయన ఎరువులకు తోడు పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల దిగుబడిని పెంచుకోవడానికి, క్రిమిసంహారానికి మోతాదుకు మించి వాడుతున్న రసా యన ఎరువులు, మందుల కారణంగా సారవంతమైన నేల కాస్తా గుల్ల అవుతోంది. రసాయన ఎరువుల వాడకం పుడమి కాలుష్యంతో పాటు, వాయు, నీటి కాలుష్యానికి కూడా దోహదపడుతోంది. ఒక టన్ను రసా యన ఎరువులను వినియోగిస్తే.. అందులో కేవలం మూడున్నర క్వింటాళ్ల రసాయన ఎరువులను మాత్రమే పంటలు స్వీకరిస్తాయని, మిగిలిందంతా పుడమిలోకి ఇంకిపోవడం, వర్షాలు పడినప్పుడు చెరువులు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల్లోకి వెళ్లిపోవడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలతో పోల్చిచూస్తే..మన దేశంలో వీటి విని యోగం తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వాడుతున్న ఈ రసాయన ఎరువుల వల్ల పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్తో మేలు.. ♦ దిగుబడి పెంచుకోవడానికి వినియోగించే ఎరువుల్లో ఆర్గానిక్, ఇనార్గానిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఎరువులు ప్రకృతి సిద్ధమైనవి. పంట వ్యర్థాలు, మొక్కలు, జంతువుల వ్యర్థాలు, మునిసిపల్ వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులను ఆర్గానిక్ ఎరువులుగా పరిగణిస్తారు. ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు, వాన పాములు, సూక్ష్మజీవుల పునరుత్పత్తికి దోహద పడుతుంది. ఇక రసాయనాలను వినియోగించి తయారు చేసేవే ఇనార్గానిక్ ఎరువులు. పంటల ఎదుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది. ఫాస్ఫేట్ మొక్కలకు ముఖ్యమైన పోషక విలువలను అందిస్తుంది. వీటితో పాటు పొటాషియం భూమిలో నీటి సామర్థ్యాన్ని, భూ సాంద్రతను పెంచుతాయనే వాదన ఉన్నా.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లాలు చర్మంపైన, శ్వాసపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సేంద్రీయ సేద్యం పెరుగుతున్నా దేశంలో సేంద్రీయ సేద్యం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించే గణాంకాలు చెబు తున్నా.. రసాయన ఎరువుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలి గించే అంశం. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు రసాయన ఎరువుల వాడకంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఎరువులు భూమిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే యడంతో భూమి తన సారాన్ని కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు. పంటల దిగు బడి కోసం శాస్త్రీయ ఎరువులు వినియోగించకుండా కేవలం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గి, తదనంతర కాలంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దాదాపు 50% మేరకు పెరిగినట్లు అగ్రికల్చర్ ఇన్పుట్ సర్వే వెల్లడిస్తోంది. చైనాలో హెక్టార్కు 13.06 కిలోలు చైనా ఒక హెక్టార్కు 13.06 కిలోల పురుగు మందులు వాడుతుంటే, జపాన్ 11.85 కిలోలు, బ్రెజిల్ 4.57 కిలోలు వినియోగిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశా ల్లోనూ ఇలాంటి మోతాదుల్లోనే వినియోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో అత్యధికంగా పంజాబ్లో ప్రతి హెక్టార్కు 0.74 కిలోలు వినియోగిస్తున్నారు. పంజాబ్, హరియాణాలు పంటల దిగుబడి కోసం అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగి స్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హరియాణాలో 0.62 కిలోలు, మహారాష్ట్రలో 0.57 కిలోలు, కేరళలో 0.41 కిలోలు, ఉత్తరప్రదేశ్లో 0.39 కిలోలు, తమిళనాడులో 0.33 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. జాతీయ సగటు 0.29 కిలోలుగా ఉంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. యూరియానే అత్యధికం.. ఎరువుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, ఒక బస్తా యూరియా వేయాల్సిన చోట పంట ఎదుగుదల, దిగుబడి కోసం రెండు మూడు బస్తాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కంటే దీని ధర తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం సైతం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. యూరియాపై కేంద్రం దాదాపు 75 శాతం మేరకు సబ్సిడీ అందిస్తుంటే.. డీఏపీ లాంటి ఎరువులపై 35 శాతం మాత్రమే ఇస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉన్నా.. భూసార పరీక్షల నిర్వహణ ద్వారా ఏయే భూములకు ఎలాంటి పోషకాలు కావాలి, అవి ఏయే రసాయన ఎరువుల్లో ఉంటాయో తెలుసుకుని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాల్సి ఉన్నా.. రైతులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన ఎరువులను యథేచ్ఛగా వాడుతున్నారు. తద్వారా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి, వరి, గోధుమ, చెరకు పంటలకు ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నారు. పంజాబ్లో కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నష్టాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే.. నత్రజని కాలుష్యం పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పంజాబ్లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరింది. కొంతకాలం ఎరువుల వినియోగం తర్వాత భూమి లోపల ఉండే బ్యాక్టీరియా చచ్చిపోయి, కార్బన్, మినరల్స్ వంటివి పోయి ఈ రసాయనాలే డామినేట్ చేస్తాయి. మొక్కకు సహజ సిద్ధమైన బలం చేకూరకుండా నేరుగా రసాయనాలే ప్రభావితం చేస్తాయి. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. రెండు, మూడు పంటలు వచ్చే ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో వరి పొలాల్లో విపరీతంగా యూరియా ఇతర రసాయనాల వినియోగం కారణంగా నేల మొత్తం రసాయనాలే నిండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రసాయనేతర ఎరువులైన ఆవు, ఇతర జంతువుల పేడ, గృహాల నుంచి వచ్చే చెత్తతో తయారుచేసిన ఎరువుల వినియోగం పెంచాలి. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు, పాలసీ అనలిస్ట్ రసాయన, సేంద్రీయ కాంబినేషన్ మంచిది రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమి తన నిజ స్వరూపం, సారాన్ని కోల్పోతుంది. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చనిపోతాయి. ఎరు వులు వాడితే మొక్కల్లో నీటి నిల్వశాతం కూడా తగ్గు తుంది. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మొక్క కు రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువులు కాంబినేషన్గా అందించాలి. ఉదాహరణకు మొత్తం పది బస్తాల ఎరువులు వినియోగిస్తామను కుంటే.. అందులో ఆరు బస్తాలు రసాయన ఎరువులు, 4 బస్తాల సేంద్రీయ ఎరువులు ఉండేలా చూడాలి. దీనితో సమతుల్యత ఉంటుంది. పురుగుల మందుల వల్ల బీపీ, షుగర్, కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు. – కె.రాములు ఎండీ, ఆగ్రోస్ లిమిటెడ్ సబ్సిడీలు తగ్గించుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్లో భాగంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా రైతులకిచ్చే సబ్సిడీలు కూడా తగ్గిస్తోంది. శ్రీలంక తరహాలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించాలని చూస్తోంది. సేంద్రీయ, రసాయన ఎరువులు కలగలిపి ఉపయోగించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కానీ ఒక్క సేంద్రీయ లేదా రసాయన ఎరువుల వాడకంతో పంటలు పండవు. చైనా, అమెరికాతో పోల్చితే భారత్లో తక్కువగానే ఎరువులు వాడుతున్నారు నిజమే. అయితే చైనాలో హెక్టార్కు 80 క్వింటాళ్లు, అమెరికాలో 60 క్వింటాళ్లు పండిస్తున్నారు. కానీ మన దేశంలో 25 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. 1991లో మనం ఎగుమతులు చేసే దశ నుంచి, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు సహా, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు, మాంసం, నూనెలు, పప్పుధాన్యాలు, పంచదార వంటివి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ దిగుమతులకు డంపింగ్ కేంద్రంగా మారింది. భారత్లో ఉత్పత్తులను దెబ్బతీసి దిగుమతులపై ఆధారపడేలా చేసే ధనిక దేశాల ప్రయత్నాలకు కేంద్రం లొంగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ. – సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం నేత, వ్యవసాయ నిపుణులు -
టెక్స్టైల్ పార్క్కు సహకరించడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఎంవోయూకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని పెద్దలను తాను అనేక సార్లు అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కును తీసుకొస్తే ఇక్కడి సర్కారు నుంచి స్పందన లేక పోగా ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి మోదీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తోందన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్ సీజన్నుంచే అమల్లోకి వస్తుందని, రైతులకు మేలు చేసేలా కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. భారత్ బ్రాండ్ పేరుతో యూరియా నానో యూరియాతో పాటు భారత్బ్రాండ్ పేరుతో యూరియా ప్రవేశ పెడుతున్నట్టు, ఇందుకు 8 ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు కిషన్రెడ్డి తెలిపారు. 2014లో దేశ వ్యవసాయ బడ్జెట్ రూ.21,933 కోట్లు ఉంటే, తొమ్మిదేళ్లలో రూ.లక్షా 25 వేల 33 కోట్లకు పెరిగిందని వివరించారు. కిసాన్క్రెడిట్కార్డుల ద్వారా రూ.28,590 కోట్ల వ్యవసాయ రుణాల మంజూరు, 23 కోట్ల సాయిల్హెల్త్ కార్డులను రైతులకు అందజేసినట్టు తెలియజేశారు. ఒకప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన నూనెల దిగుమతి ఉండేదని, ఇప్పుడు రైతుల నుంచి నూనె గింజల సేకరణ 1,500 శాతం పెరిగిందని తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం, పప్పుదినుసుల సేకరణలో కూడా కేంద్రం 7300 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఎరువుల రాయితీ గత ఏడాదికి ఈ ఏడాదికి పోలిస్తే 500 శాతం పెరిగిందని చెప్పారు. రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని కిషన్రెడ్డి వివరించారు. ప్రస్తుతమున్న ఈ–నామ్మార్కెట్లు 1260 బాగా నడుస్తున్నాయని తెలిపారు. ♦ 9 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను గురించి కిషన్రెడ్డి వివరించారు. అవేంటంటే... ♦ తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్యోజన ద్వారా ఏటా రూ.6 వేలు అందజేత ♦ రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం. ♦ సించాయ్యోజన కింద చిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి. ♦ దీని కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులను గుర్తించి, వాటిని పూర్తి చేసుకోవడం కోసం ఇప్పటి వరకు రూ.1,248 కోట్లు కేటాయింపు. ♦ రూ.23,948 కోట్లతో ఎల్సీడీసీ ద్వారా గొర్రెల పెంపకం, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు రుణాల మంజూరు. ♦ ఆయిల్ పామ్ మిషన్ కింద రూ.214 కోట్లు. ♦ ఒక్క ఎరువుల మీద రూ.27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ. ♦ రైతులకు మేలు చేసే ‘వేపపూత’ యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చారు ♦ తెలంగాణలో ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఒకప్పుడు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు వెచ్చిస్తోంది. -
ఎరువుల ప్రణాళిక ఖరారు...
సాక్షి, హైదరాబాద్: రాబోయే వానాకాలం సీజన్లో 24.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎరువుల ప్ర ణాళికను ఖరారు చేసింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం కేటాయించిన ఎరువులు వానాకాలం సీజన్కు పూర్తిస్థాయిలో సరిపోతాయని తెలిపాయి. ఎరువుల్లో అత్యధికంగా 9.50 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించారు. 9.40 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, లక్ష మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కేటాయించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. కాగా, ఏడాదికేడాదికి యూరియా వాడకం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చరొట్ట విత్తనాలను సరఫరా చేయడం వల్ల, గతం కంటే ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం తగ్గుతోందంటున్నారు. మండలాలకు ఎరువుల సరఫరా... వచ్చే నెల మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఒక వర్షం పడితే చాలు రైతులు దుక్కులు దున్నుతారు. దీంతో ముందస్తుగా మొదటి దఫా ఎరువులను మండలాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మండలాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సే వా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశా రు. రైతులకు ఎరువులు నిత్యం అందుబాటు లో ఉండేలా చూడాలని ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఎరు వుల కొరత రాకుండా, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఎరువులను రేక్ పాయింట్ల నుంచి రవాణా చేసేందుకు మార్క్ఫెడ్ ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. మొత్తం 20 రేక్ పాయింట్ల నుంచి ఎరువులను తీసుకెళ్లేందుకు మూడు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒక ఏజెన్సీకే 18 రేక్ పాయింట్లు వచ్చాయి. మిగిలిన రెండు రేక్ పాయింట్లు మరో రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఎరువుల రవాణా కోసం రూ. 96 కోట్లు ఖర్చు కానుంది. -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్షా తెలిపారు. -
భవిష్యత్ నానో యూరియాదే
సాక్షి, అమరావతి: భవిష్యత్ అంతా నానో యూరియాదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. నానో టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా వినియోగంతో పర్యావరణానికి, పంటలకు అత్యంత మేలు జరుగుతుందని తెలిపారు. రవాణా, వాడకం, ధరలతో పాటు పంటల దిగుబడి విషయంలో సంప్రదాయ యూరియాతో పోలిస్తే ఎన్నోరెట్లు అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. నానో యూరియా వినియోగం, అవగాహనపై మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గే ఈ యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇఫ్కో డైరెక్టర్ ఎం.జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. 8 శాతం పెరిగిన దిగుబడి ఇఫ్కో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ టి.శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ 500 ఎంఎల్ బాటిల్లో ద్రవరూపంలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమని చెప్పారు. నానో యూరియా వినియోగించిన అనేక పంటల్లో ఎనిమిదిశాతం మేర దిగుబడి పెరిగిందని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. నానో యూరియా వాడకంపై రూపొందించిన కరపత్రాలను మంత్రి కాకాణి విడుదల చేశారు. జాతీయ రహదారుల్లో మిల్లెట్ కేఫ్లు జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయ్యాలని మంత్రి కాకాణి సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్ల ఏర్పాటు వల్ల చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల స్థానిక స్వయం సహాయక సంఘాలతో పాటు యువతకు అప్పగించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ద్వారా యూనివర్సల్ కవరేజ్ సాధించిన మొదటి రాష్ట్రం మనదేనని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్బాబు పాల్గొన్నారు. -
రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి. సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు. డిమాండ్ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ట్రయల్రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమృద్ధిగా నానో యూరియా నిల్వలు నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – టి.శ్రీధర్రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
నానో యూరియాతో వ్యవసాయ రంగంలో విప్లవం: మంత్రి నిరంజన్రెడ్డి
ఏజీవర్సిటీ: వ్యవసాయరంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలోని ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటి సారిగా యారియాను ద్రవరూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిదని, ఇది దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎరువులు–రసాయనాల వాడకం–నానో యూరియా వినియోగం అవశ్యకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా గురించి రైతులకు వివరించారు. భారతీయుడైన రమేశ్ రాలియా దీనిని కనుగొన్నారని, 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను ప్రయోగించి.. ఫలితాలను పరిశీలించాక మార్కెట్ల్లో విడుదల చేశారని చెప్పారు. దీని వల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని, దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నానో యూరియా వల్ల రవాణా ఖర్చులు తగ్గి, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతుల భారం తప్పుతుందని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హన్మంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, మార్కెఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్కుమార్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సీజన్: దండిగా యూరియా
ఖరీఫ్ సీజన్కు ముందే వ్యవసాయానికి అవసరమైన ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో జూన్ నెల్లోనూ జలవనరులు తొణికిసలాడుతున్నాయి. జిల్లాలో ముందస్తుగా ఎడగారు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో సాగు విస్తీర్ణం చాలా తక్కువ. అయినా ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టి పీడించేది. గతంతో పోల్చుకుంటే.. జిల్లాలో గడిచిన మూడేళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో మూడింతల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసింది. సాక్షి,నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్ ముందస్తుగానే ప్రారంభమవుతోంది. ఇప్పటికే సాగు విస్తీర్ణం అంచనాకు అనుగుణంగా విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయశాఖ తాజాగా అవసరమైన మేరకు ఎరువులు కూడా సిద్ధం చేస్తోంది. వ్యవసాయానికి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీజన్కు ముందే గత నెల్లోనే పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద రూ.7,500 జమ చేసింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎడగారుకు ముందుగానే ఎరువుల నిల్వలు ఉంచాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. 109 సొసైటీల ద్వారా సరఫరా జిల్లాలో 561 ఆర్బీకేల ద్వారా ఎరువులను గ్రామాల్లోనే రైతులకు సరఫరా చేస్తుంటారు. జిల్లాలో 470 ప్రైవేట్ డీలర్స్ కూడా ఎరువుల విక్రయాలు చేస్తున్నారు. తాజాగా జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న మార్క్ఫెడ్ సంస్థ పరిధిలో 109 సొసైటీల ద్వారా కూడా రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వివిధ రకాల ఎరువులను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రబీ ముగిసిన తర్వాత ఖరీఫ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎరువుల సమస్య రాకుండా నిల్వ చేశారు. జిల్లాలో యూరియా 18 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 5 వేల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,700 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 13 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2 వేల మెట్రిక్ టన్నులు చొప్పున 39,700 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు అవసరం అవుతాయని అంచనా. మరో 32 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల ఈ వారంలో రానున్నాయి. ప్రతి నెలా 20 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల వరకు అవసరానికి అనుగుణంగా జిల్లాకు పంపిణీ చేస్తున్నారు. ఎరువుల కొరత ఎక్కడా లేదు జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా కావాల్సినంత ఎరువులు జిల్లాకు వస్తున్నాయి. ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ నెలకు కావాల్సిన స్టాక్ కన్నా ఎక్కువగానే నిల్వ ఉంది. రైతులు ఎవరూ ఎరువులు లేవనే అసత్య ప్రచారాలు నమ్మవద్దు. రైతులకు ఎక్కడకు వెళ్లినా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. – సుధాకర్రాజు, జేడీ వ్యవసాయశాఖ -
ఆర్బీకేల్లోనూ నానో యూరియా
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. రానున్న ఖరీఫ్లో ఈ యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు వారికి మరింత అందుబాటులోకి ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేసింది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా లిక్విడ్ రూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 500 మిల్లీ లీటర్ల బాటిల్లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా బాటిల్ కేవలం రూ.240కే అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17వేల లీటర్లు) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో సుమారు లక్ష మందికి పైగా 5,46,012 బాటిళ్లు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. కొరత లేకుండా నిల్వలు.. ముందస్తు ఖరీఫ్ కోసం ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం సీజన్లో రైతులకు ఏ దశలోనూ ఎరువుల కొరత రానీయకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఖరీఫ్లో 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 6.19లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేసింది. సాంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 2022–23 సీజన్ కోసం 16లక్షల బాటిళ్ల (8లక్షల లీటర్లు) ఇఫ్కో ఏపీకి కేటాయించింది. వీటిలో కనీసం 10లక్షల బాటిళ్లు (5 లక్షల లీటర్లు) ఖరీఫ్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వీటిలో కనీసం 25 శాతం ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయిల్ రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కావాల్సినంత నిల్వలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీలో నానో యూరియా వినియోగం పెరుగుతోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రానున్న ఖరీఫ్ సీజన్ కోసం 8లక్షల లీటర్ల నానో యూరియా బాటిళ్లను ఏపీకి కేటాయించాం. అవసరమైతే కేటాయింపులు మరింత పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – శ్రీధర్రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో వారంలో వ్యవసాయ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో అధికారులు ఎరువుల సరఫరా ప్రారంభించారు. ఈ సీజన్లో 25 లక్షల టన్నుల ఎరువులు అవసర మవగా అందులో 10 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప టికే అన్ని జిల్లాలకు కలిపి 4.20 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మార్క్ఫెడ్ 2.13 లక్షల యూరియా నిల్వలను ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్ ఎరువులు బఫర్ స్టాక్లో ఉన్నట్లు మార్క్ఫెడ్ వర్గాలు వెల్లడిం చాయి. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా సిద్ధం గా ఉండాలని మార్క్ఫెడ్ను వ్యవసాయశాఖ ఆదేశించింది. వానాకాలం సీజన్లో ఎరువుల సరఫరా, పంపిణీ, పర్యవేక్షణపై వ్యవసాయశాఖ మార్గదర్శకాలు తయారు చేసింది. మార్గదర్శకాలు ఇవీ.. ♦రిటైల్ డీలర్లకు రెండు ట్రక్కుల కంటే ఎక్కువగా ఎరువులను కేటాయించకూడదు. ♦ఏదో ఒక కంపెనీ లేదా బ్రాండ్లకు చెందిన వాటిని ప్రోత్సహించేలా జిల్లా వ్యవసాయా ధికారులు వ్యవహరించకూడదు. ♦అంతర్రాష్ట్ర అనధికారిక ఎరువుల సరఫరాను అడ్డుకోవాలి. సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలి. ♦ప్రతి నెలా మొదటి వారంలో ఎరువుల డీలర్ల సమావేశాన్ని జిల్లా వ్యవసాయాధికారి నిర్వహించాలి. ♦ఎరువుల లైసెన్సులను మాన్యువల్ ప్రాతి పదికన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు జారీచేయకూడదు. ♦జిల్లాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేసే వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. -
రామగుండంలో 3.74 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్సిటీ(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో 2021–22 సంవత్సరం 3,74,728.32 టన్ను ల యూరియా ఉత్పత్తి అయిందని ఆ కర్మాగారం సీజీఎం విజయ్కుమార్ బంగార్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కర్మాగారం వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. దేశీయంగా ఎరువుల కొరత తీర్చడమే ఆర్ఎఫ్సీఎల్ ఉద్దేశం. ఈ ప్లాంట్లో ప్రతిరోజూ 2,200 టన్నుల అమ్మో నియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కర్మాగారం వాణిజ్య ఉత్పత్తుల్లో తెలంగాణకు 2,11,073.13, ఆంధ్రప్రదేశ్కు 1,00,321.11, కర్ణాటకకు 63,334.08 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల కొరత తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరించిందని, వాటిల్లో ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్సీఐ) కూడా ఒకటని తెలిపారు. -
నెల్లూరులో నానో యూరియా ప్లాంట్!.. రూ.250 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన బెంగళూరులో తొలి ప్లాంట్ నెలకొల్పిన భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) రెండో ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్లాంట్ను నెలకొల్పడంపై ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు జరుపుతోంది. ఎందుకింత ఆదరణ....? సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా దవ్ర రూపంలో ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరియా బస్తాతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, మెరుగైన పనితీరు, ద్రవరూప యూరియా బాటిళ్లను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుండటం, రవాణా ఖర్చులు ఆదా కావడం దీనికి ప్రధాన కారణాలు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నానో యూరియా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఏపీలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది. కోటి లీటర్ల సామర్థ్యంతో నెల్లూరు అగ్రి సెజ్లో ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో ఆసక్తి చూపుతోంది. కనీసం 20 ఎకరాల్లో ప్లాంట్ నెలకొల్పేందుకు భూ కేటాయింపుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. బస్తా యూరియాతో సమానం.. 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియాను బాటిళ్లలో ఇఫ్కో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా నానో యూరియా బాటిల్ రూ.240కే లభిస్తోంది. సంప్రదాయ ఎరువుల్లో ఉండే పోషకాలన్నీ కలిగి ఉండడం, అన్ని పంటలకు అనుకూలమైనది కావడం, 80–90 శాతం యూరియా మొక్కకు అందడం, భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని రుజువు కావడంతో ‘నానో’ పట్ల రైతుల్లో ఆదరణ పెరుగుతోంది. గత ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా సుమారు 20 వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17,064 లీటర్లు) కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది డీఏపీ, జింక్, కాపర్ కూడా.. నానో యూరియా విక్రయాలను ప్రోత్సహిస్తూ రిటైల్ మార్కెట్లతో పాటు ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత రబీ సీజన్ కోసం 5.25 లక్షల బాటిల్స్ (2.65 లక్షల లీటర్లు) అందుబాటులో ఉంచగా రికార్డు స్థాయిలో 4.35 లక్షల బాటిళ్ల (2.17 లక్షల లీటర్లు) విక్రయాలు జరిగాయి. డిమాండ్ను బట్టి నిల్వ పెంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేస్తోంది. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ఇఫ్కో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ఉత్పత్తులతో ట్రయిల్ రన్ నిర్వహించింది. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కలుపు తగ్గింది.. దిగుబడి పెరిగింది ఖరీఫ్లో ఆరు ఎకరాల్లో ఎం–7 వరి రకం సాగు చేశా. 30వ రోజు, 60వ రోజు నానో యూరియాను రెండుసార్లు లీటర్ నీటిలో 4 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేశాం. కలుపు సమస్య, ఖర్చు తగ్గింది. దిగుబడి సరాసరిన రెండు బస్తాలు అధికంగా వచ్చింది. – అశోక్కుమార్, ఎల్లాయపాడు, నెల్లూరు జిల్లా త్వరలో ప్లాంట్కు పునాది రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇఫ్కో అంగీకరించింది. నెల్లూరులో భూములను కేటాయించడంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ప్లాంట్కు పునాదిరాయి వేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. – వై.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ -
ఎరుపు కోసం రైతన్నపడిగాపులు
-
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం రైతులకు పండుగ ముందు తీపికబురు అందించింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని కేంద్రం భారీగా పెంచింది. ప్రస్తుతం యూరియాపై అందిస్తున్న రాయితీని రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు అందించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రాయితీ ధర రూ.1200 నుంచి రూ.1650కి, ఎన్పీకే ఎరువుపై ఇస్తున్న రాయితీ ధర రూ.900 నుంచి రూ.1015కి, ఎన్ఎస్ పీపై ఇస్తున్న రాయితీ ధరను రూ.315 నుంచి రూ.375కి పెంచింది. ఈ రాయితీ పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.28వేల కోట్ల భారం పడనుంది. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదని కేంద్ర మంత్రి వివరించారు.(చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!) -
యాదాద్రి రింగ్రోడ్డు.. అందాలు మెండు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతోపాటు ఆహ్లాద వాతావరణం కలిగేలా వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రి కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్కు సమీపంలో నిర్మించిన సర్కిల్ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 60 మీటర్లతో ఏర్పాటు చేసిన ఈ సర్కిల్లో చెన్నై నుంచి తెచ్చిన ఫీనిక్స్ ఫాం జాతి మొక్కలతోపాటు సీజనల్ పూల మొక్కలను నాటారు. దీంతో ఇప్పుడు ఆ సర్కిల్ రంగుల వలయంలా మారి ఆకట్టుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ యాదాద్రి భువనగిరి యూరియా.. రైతుల బాధ ఇదయా! కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. –సదాశివనగర్ (ఎల్లారెడ్డి) జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో ధరూరు/దోమలపెంట(అచ్చంపేట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు 1,00,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇన్ఫ్లో తగ్గడంతో ఉదయం ప్రాజెక్టు 15క్రస్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 10 క్రస్టు గేట్లను ఎత్తి 67,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 1,00,948 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి 1,45,169 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. రెండు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,692 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 64,487క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. -
తెల్లవారుజాము 3 గంటల నుంచే..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
దక్షిణ తెలంగాణలో ప్లాంటు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: భూసార పరిరక్షణలో నానో యూరియా కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ కలోల్లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణ నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని, ఈ దిశగా ఇఫ్కో యోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, నానో యూరియా వినియోగంతో భూసార పరిరక్షణతో పాటు తక్కువ వినియోగంతో అధిక దిగుబడులు సాధించే వీలుందన్నారు. మంత్రితో పాటు జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ ఉన్నతాధికారి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేశ్ రాలియా తదితరులున్నారు. విస్తృతంగా వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు రాష్ట్రంలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ దిశగా అధ్యయనం కోసం అత్యధిక పరిశ్రమలు ఉన్న గుజరాత్లో పర్యటించి పరిశ్రమలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శనివారం గుజరాత్లోని సబర్కాంఠ జిల్లాలో పరిశ్రమలను బృందం సందర్శించింది. ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీఎం కె.చంద్రశేఖరరావు సూచనల మేరకు జిల్లాల వారీగా పంట ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్రానికి నానో యూరియా
సాక్షి, హైదరాబాద్: నానో యూరియా.. ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న ఘన యూరియాకు ప్రత్యామ్నాయం. తక్కువ ఖర్చు, పర్యావరణ హితం, మంచి దిగుబడి దీని ప్రత్యేకత. భారతీయ రైతాంగ స్వీయ ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ఆవిష్కరించిన ఈ నానో యూరియా అతి త్వరలో రాష్ట్రానికి చేరనుంది. గుజరాత్లోని కలోల్ నుంచి రాష్ట్రానికి బయల్దేరే నానో యూరియా ట్రక్ను శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆన్లైన్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు పాల్గొన్నారు. నానో ప్రత్యేకతలివే ♦నానో టెక్నాలజీతో రూపొందించిన నానో యూరియాతో ప్రభుత్వాలపై సబ్సిడీ, రవాణా భారాలు తగ్గుతాయి. ♦ప్రస్తుతం ఒక బస్తాపై రూ.800 నుంచి రూ.1000 వరకు ప్రభుత్వం రాయితీ భారాన్ని మోస్తోంది. రూ.240కే లభించే 500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ♦ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ పొందింది. ♦ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత నానో యూరియాను రెండుసార్లు పిచికారీ చేయాలి. మామూలు యూరియా సమర్థత 30 శాతమైతే దీని సమర్థత 80 శాతమని ఇఫ్కో చెబుతోంది. -
తొలిసారిగా.. అర లీటర్ సీసాలో బస్తా యూరియా
సాక్షి, అమరావతి: సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) దీనిని ఇటీవల ఆవిష్కరించింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కారం. నానో టెక్నాలజీపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతుండగా.. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాను ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. ఏమిటీ నానో యూరియా.. తరతరాలుగా మనందరికీ తెలిసిన సంప్రదాయ యూరియా తెల్లటి గుళికల రూపంలో ఉంటుంది. బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను కేవలం 500 మిల్లీలీటర్ల సీసాలో పట్టేలా చేశారు. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయి. పైగా ఇది మహా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సీసాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. భావి ఎరువుల మార్కెట్ రంగంలో ఇదో మేలి మలుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుంది. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.240 కాగా.. యూరియా బస్తా ధర రూ.268. -
యూరియా కోసం బారులు..
-
యూరియా కోసం బారులు.. లైన్లో మందు సీసాలు
సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూ లైన్లో తమ గుర్తుగా వస్తువులు ఉంచారు. చెప్పులు, రాళ్లతో పాటు మందు బాటిళ్లను కూడా లైన్లో ఉంచారు. తాగి పడేసిన మందు సీసాలను లైన్లో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (విక్రయాల్లో విచిత్రాలెన్నో..) -
విక్రయాల్లో విచిత్రాలెన్నో..
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా అమ్మకాల్లో ప్రయివేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు ఒడిగట్టారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టాలంటూ కలెక్టర్ను ఆదేశించింది. దీంతో ఆయన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పుల్లయ్యతో విచారణ చేయిస్తున్నారు. ఇప్పటికే డీఆర్వో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు. ఈ క్రమంలో డీలర్ల ‘వేషాలు’ వెలుగు చూశాయి. ♦నందికొట్కూరులోని రెండు దుకాణాల్లో ముగ్గురు వ్యక్తులే 188 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. దీనిపై డీఆర్వో విచారణ చేయగా.. ఆ ముగ్గురూ ఆయా షాపుల్లో పనిచేసే గుమాస్తాలేనని తేలింది. బిజినవేములకు చెందిన ఇర్ఫాన్ 84.6 టన్నులు, షేక్ సికిందర్ 49.14 టన్నులు, చెరుకుచెర్లకు చెందిన శివన్న 54.945 టన్నులు కొన్నట్లు డీలర్లు రికార్డు చేశారు. ♦నంద్యాలలోని ఒక ఫర్టిలైజర్ దుకాణంలో బి.గోవిందు అనే వ్యక్తి ఏకంగా 174.555 టన్నుల యూరియా (3,491 బస్తాలు) కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. ఒక మండలానికి సరిపోయే యూరియాను ఒకే వ్యక్తి కొన్నట్లు డీలర్లు మాయ చేశారు. అలాగే అద్దంకి సత్యనారాయణ అనే వ్యక్తి 169.155 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు చూపారు. ♦ఇలా 23 మంది వేలాది బస్తాల యూరియా కొనుగోలు చేసినట్లు డీలర్లు చూపడం వెలుగులోకి వచ్చింది. యూరియాతో సహా రసాయనిక ఎరువులను పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం మేరకు ఈ–పాస్ మిషన్లో రైతు వేలిముద్ర తీసుకుని పంపిణీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. 3 షాపుల లైసెన్స్ సస్పెండ్ యూరియా అధిక ధరకు అమ్ముతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలిన నేపథ్యంలో కల్లూరు మండలం చిన్నటేకూరులోని ధనుంజయ ఫర్టిలైజర్స్, కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని సాయికృప ఏజెన్సీస్, వసుంధర ఆగ్రో ఏజెన్సీస్ లైసెన్స్లను సస్పెండ్ చేస్తూ కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ ఆర్.విజయశంకర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అందుబాటులో అవసరమైన యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, దీన్ని దశలవారీగా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ‘యూరియా లాక్ ’శీర్షికన ఆదివారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చారు. జూలై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయకపోవడంతో వెంటనే సీఎం కేసీఆర్ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రితో మాట్లాడారని, తాను కూడా కేంద్రమంత్రిని కలిశానని పేర్కొన్నారు. దీంతో కేంద్రం వెంటనే జూలై కోటా సరఫరా మొదలుపెట్టిందని, ఈ నెలలో 2.05 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మిగిలిన యూరియాను ఈ నెలాఖరుకల్లా ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈరోజుకు రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, -
యూరియా ‘లాక్’
సాక్షి, హైదరాబాద్: కరోనా... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి రాష్ట్రంలోని వ్యవసాయ అవసరాలపై కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ వైరస్ విజృంభిస్తున్న వేళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే కాదు స్థానికంగా ఏర్పడిన ‘లాక్డౌన్’పరిస్థితులు అడుగడుగునా రాష్ట్రంలోకి ఎరువుల రాకను అడ్డుకుంటున్నాయి. విదేశాల నుంచి యూరియాను తెచ్చే నౌకల గమ్యస్థానాలైన పోర్టుల నుంచి రాష్ట్రంలో ఉండే ర్యాక్ పాయింట్లు, గోదాముల వరకు అన్నిచోట్లా ఈ మాయదారి వైరస్ తన ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్కు యూరియా ముప్పు పొంచి ఉందని, కరోనాకు తోడు తుపానులు కూడా యూరియా దిగుమతులకు అడ్డంకిగా మారాయని వ్యవసాయశాఖ ఓ నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం గత నెల నుంచే ప్రారంభం కావడం, ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు గరిష్టంగా వినియోగం జరిగే అవకాశం ఉండడంతో ఏం చేయాలో కూడా ఆ శాఖ అధికారులకు పాలుపోవడం లేదు. మొత్తంమీద కరోనా ప్రభావం కారణంగా అవసరానికన్నా 2.5 లక్షల టన్నుల వరకు యూరియా కొరత ఏర్పడిందని, రాష్ట్రంలో ప్రస్తుతం 5.84 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులే అందుబాటులో ఉన్నాయని, అందులోనూ యూరియా కేవలం 1.89 లక్షల మెట్రిక్ టన్నులే ఉందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. నాలుగు నెలలుగా సరఫరాలో జాప్యం వాస్తవానికి, రాష్ట్రంలో ప్రతి సీజన్కు సాగు చేసే పంటల విస్తీర్ణం ఆధారంగా తమకు ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫర్టిలైజర్స్ శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. ఆ మేరకు ప్రతి సీజన్కు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ (డీవోఎఫ్) ఎరువులను కేటాయిస్తుంది. ఈ ఏడాది మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయనే అంచనాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈసారి ఎరువుల కేటాయింపు ప్రతిపాదనలను భారీగానే పంపింది. దీనికి అనుగుణంగానే డీవోఎఫ్ కూడా ఈసారి మన రాష్ట్రానికి 10.50 లక్షల మెట్రిక్ టన్నులు (గత సంవత్సరాలతో పోలిస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా) యూరియాను కేటాయించింది. ఇందులో ఈనెల 31 నాటికి 6.13 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏప్రిల్, మే, జూన్, జులై మాసాల్లో కేవలం 3.70 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇక మిగిలిన ఎరువులు కూడా కలిపి మొత్తం 22.50 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కేటాయించగా, అందులో జూలై వరకు రావాల్సిన దాంట్లో ఇప్పటివరకు 5 లక్షల టన్నుల మేర తక్కువ రావడం గమనార్హం. మరో 37 వేల టన్నులు వచ్చే చాన్స్ ఇక వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రాష్ట్రానికి ఈనెల 31 వరకు మరో 37 వేల టన్నులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉన్న 8 ర్యాక్ పాయింట్ల నుంచి పలు ఫర్టిలైజర్ కంపెనీలు ఈ మేరకు ఎరువులు ఇస్తాయని ఆ శాఖ అంచనా వేస్తోంది. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా అవి కూడా ఏ మేరకు వస్తాయన్నది సందేహాస్పదమే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత ఏర్పడే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు గాను గత నెలల్లో తక్కువగా వచ్చిన ఎరువులనయినా రాష్ట్రానికి పంపాలని, రానున్న నెలల్లో కేటాయింపుల కంటే ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇవీ అడ్డంకులు: ►మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అక్కడ లేబర్ సమస్య బాగా ఏర్పడింది. దీనికి తోడు ఆంఫా, నిసర్గా తుపానుల కారణంగా ఆ రాష్ట్రంలోని యూరియా ఉత్పత్తి కార్మాగారాల్లో పనులు నిలిచిపోయాయి. ►మే నెలలోనే కృష్ణపట్నం పోర్టులో లేబర్ సమస్య రావడంతో సప్లై నెమ్మదించింది. ఇక, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 10 నుంచి 16 వరకు అక్కడ లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు. జూన్లో పారాదీప్ పోర్టుకు రావాల్సిన యూరియా నౌక ఇంకా చేరలేదు. ►ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ర్యాక్ పాయింట్లలో కూడా లోడింగ్, అన్లోడింగ్ నిలిచిపోయింది. యూరియా రవాణా ఆగింది. ►సనత్నగర్, ఆదిలాబాద్ ర్యాక్ పాయింట్లలో ఏప్రిల్ నెలలో, కరీంనగర్ పాయింట్లో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కారణంగా అన్లోడింగ్కు అవాంతరాలు కలిగాయి. ►ఇక నిజామాబాద్ ర్యాక్పాయింట్లో యూరియా అన్లోడింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఇక్కడ బియ్యం దిగుమతికి ప్రాధాన్యత ఇస్తుండడం, ప్లాంట్లు, పోర్టుల నుంచి యూరియా తెచ్చే ర్యాక్లు తక్కువగా లోడ్ అవుతుండడంతో ఇక్కడ కూడా ఆశించిన స్థాయిలో యూరియా దిగుమతి కావడం లేదు. ►రవాణా లారీల్లో ఎక్కువగా మక్కలు వెళుతున్నాయి. దీనికి తోడు రబీలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులతో గోదాములు నిండిపోవడంతో యూరియా నిల్వకు సమస్య ఏర్పడుతోంది. ►మన రాష్ట్రానికి యూరియాను ఎక్కువగా సరఫరా చేసే కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్సీఎల్)ను ఈనెల మొదటివారం నుంచి షట్డౌన్ చేయడం ఈ ఆలస్యానికి మరింత కారణం అవుతోంది. చెన్నై, మహారాష్ట్రల్లోని యూరియా ప్లాంట్లు కూడా ఏప్రిల్ నుంచి మూతపడి ఉన్నాయి. ►కోవిడ్, తుపానుల కారణంగా చైనా, వియాత్నాం, గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన యూరియా నౌకలు సమయానికి రావడం లేదు. -
యూరియా కోసం పడిగాపులు
రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఆదివారం యూరియా పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్తోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారు జామున 3 గంటలకే చెన్నారావుపేట సొసైటీ ఆవరణకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలీసు బందోబస్తు మధ్య యూరియా అందించారు. అమీనాబాద్ సహకార సంఘం వద్దకు కూడా రైతులు అధికంగా తరలివచ్చారు. – చెన్నారావుపేట -
యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎరువుల సంస్థలో అవినీతి ఏపుగా పెరిగింది. మార్క్ఫెడ్కు మరక అంటింది. రైతులకు సరిపడా యూరియాను సిద్ధం చేయలేని ఆ సంస్థ, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అనవసరంగా అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కొనాల్సిందేనని అధికారులు ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్)పై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా యూరియా కొరతను ఎరువుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాలకు ఒక కంపెనీ ఏకంగా ఉత్తర్వులే జారీ చేశారని, ఒక జిల్లాకు చెందిన మార్క్ఫెడ్ అధికారి సంబంధిత కంపెనీతో ఘర్షణకు దిగారనే విషయాలు కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఖరీఫ్లో ఎరువుల పంపిణీ వ్యవసాయ లక్ష్యం -19.40 లక్షల మెట్రిక్ టన్నులు ఇందులో యూరియా - 8.50 లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు - 10.90 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువుల కంపెనీలతో కుమ్మక్కై.. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద డీఏపీ 14,900 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,800 మెట్రిక్ టన్నులు, యూరియా 10,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కంటే ఇతర ఎరువులనే మార్క్ఫెడ్ అధికారులు ఎక్కువగా అందుబాటులో ఉంచడం గమనార్హం. యూరియా కొరత ఉన్నందున లింకు పెడితే రైతులు కొంటారని అధికారులకు కంపెనీలు నూరిపోస్తున్నాయి. అలా చేస్తే పర్సంటేజీలు ఇస్తామని ఆశ చూపిస్తున్నాయి. యూరియా కోసం గత్యంతరం లేక ప్యాక్స్లు, అక్కడి నుంచి రైతులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయక తప్పడంలేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం గమనార్హం. ఇష్టారాజ్యంగా ధరలు... జూలై, ఆగస్టులోనే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం వాటికి డిమాండ్ లేదు. అయినా రైతులతో కొనిపిస్తున్నారు. మార్క్ఫెడ్ ధరల ప్రకారం ప్యాక్స్కు ఇచ్చే డీఏపీ బస్తా ధర రూ.1,250 కాగా, డీలర్లకు కంపెనీలు ఇచ్చే ధర రూ. 1,150 నుంచి రూ. 1,190 మాత్రమే. కాంప్లెక్స్ ఎరువులకు మార్క్ఫెడ్ ఇచ్చే ధర బస్తా రూ. 980 కాగా, డీలర్లకు ఇచ్చే ధర రూ. 900 నుంచి రూ. 940 మాత్రమే. డీఏపీ బస్తా ధర మార్క్ఫెడ్ వద్ద రూ. 50 నుంచి రూ. 100, కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.40 నుంచి రూ.80 అధికం. -
ఖరీఫ్ నేర్పిన పాఠం..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో యూరియా పంపిణీలో ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న రబీ సీజన్లో ఎరువుల పంపిణీకి ముందుజాగ్రత్త పడుతోంది. గతేడాది రబీ సీజన్లో ఎరువుల కేటాయింపుల కోసం పంపిన ప్రతిపాదనలకు దాదాపు రెట్టింపు నిల్వలు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సాక్షి, నిజామాబాద్: గత ఏడాది 2018 రబీ సీజన్లో 36,720 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని ప్రతిపాదించగా.. ఈ ఏడాది ఖరీఫ్లో ఎదురైన అనుభవాల రీత్యా రబీ సీజన్లో ఏకంగా 71,537 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంటే గతేడాది కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో కేటాయింపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గత రబీ సీజన్లో జిల్లాకు ఏ మేరకు యూరియా వచ్చిందనే అంశంపైనా లెక్కలు తీస్తున్నారు. ఎరువులు : 1.21 లక్షల మెట్రిక్ టన్నులు.. రబీ సీజన్లో మొత్తం 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి పంపించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 71,537 టన్నుల యూరియాతో పాటు, 8,621 మెట్రిక్ టన్నుల డీఏపీ, 7,570 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 958 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ, 33,045 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కేటాయించాలని కోరుతున్నారు. ముందస్తు నిల్వలు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సహకార సంఘాలు ఎరువుల విషయంలో అలసత్వం వహించడంతో యూరియా కొరతకు కారణమైంది. సహకార సంఘాలు ముందస్తుగా నిల్వలు చేసుకోకపోవడంతో ఒక్కసారిగా వచ్చిన డిమాండ్కు సరిపడా ఎరువులను సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. రెండు బస్తాల యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. వ్యవసాయ పనులన్నీ మానుకుని రోజంతా క్యూలైన్లో నిలబడితే రెండు బస్తాల యూరియా దొరకడం కష్టంగా మారింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. పాసుపుస్తకాలను, చెప్పులను క్యూలో పెట్టి అనేక పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రబీ సీజన్లో ఇలా పరిస్థితులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త పడాలని నిర్ణయించింది. ఇందుకోసం సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు ముందుగానే అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆర్థికంగా బలంగా ఉన్న సహకార సంఘాలు, వరి విస్తీర్ణం అధికంగా ఉండే ప్రాంతాల సహకార సంఘాల్లో ముందస్తుగా నిల్వలు తెప్పించుకుని పెట్టుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో ఒక్క ఆర్మూర్ సబ్ డివిజన్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల వరి విస్తీర్ణం అధికంగా ఉంటుంది. దీంతో ఈ సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలుంచాలని నిర్ణయించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా ఇలాగే ముందస్తు నిల్వలు తెప్పించి పెట్టుకోవాలని వ్యవసాయశాఖ సహకార సంఘాల పాలకవర్గాలకు ఆదేశాలు జారీ చేసినా.. పలు సంఘాలు పెడచెవిన పెట్టడంతో యూరియా కొరత తీవ్రమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 82 వేల హెక్టార్లలో వరి అంచనా... ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 82 వేల హెక్టార్లలో వరి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 13 వేల హెక్టార్లలో ఎర్రజొన్న, ఆరు వేల హెక్టార్లలో మొక్కజొన్న, పది వేల హెక్టార్లలో శనగ, మరో ఆరు వేల హెక్టార్లలో బాజ్రాతో పాటు నువ్వు, కూరగాయలు, పప్పుదినుసు వంటి పంటలు సాగవుతాయి. ఈసాగు విస్తీర్ణానికి అవసమైన ఎరువులను తెప్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. -
యూరియా కష్టాలు.. గంటల కొద్ది పడిగాపులు
సాక్షి, జనగాం : రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం గంటల కొద్ది లైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్ల వద్ద చెప్పులతో రైతులు బారులు తీరుతున్నారు. పాలకుర్తి మండలం ఎఫ్ఎస్సీఎస్ కోపరేట్ బ్యాంకు వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కాళ్లు తిమ్మిర్లు పట్టేలా గంటల పాటు వరుసలో నిలబడి ఉన్నా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఒక లారీ లోడ్లో 506 యూరియా బస్తాలు వస్తే రోజు వెయ్యి మంది నుoచి 1200 మంది రైతులు బస్తాలకోసం వస్తున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, యూరియా బస్తాల కొరత లేకుండా అన్ని ప్రాంతాలకు రవాణా చేసి అధికారులు ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. -
‘యూరియా పంపిణీలో క్షణం వృథా కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: రైతులకు యూరియా అందించడంలో క్షణం కూడా వృథా కానివ్వబోమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. ఎరువులను త్వరితగతిన రాష్ట్రానికి చేర్చేందుకు రోడ్డు, రైల్వే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రబీకి కూడా యూరియా నిల్వలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అన్ని పోర్టుల నుంచి 20,387 మెట్రిక్ టన్నులు, విశాఖ నుంచి 6,800 మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఏపీ లోని గంగవరం పోర్టులో అధికారులతో సమావేశమైన మంత్రి యూరియా సత్వర రవాణాపై చర్చించారు. తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు కారి్మకులు, రవాణాదారులు సహకరించాలని, అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు. మంత్రి వెంట వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులున్నారు. -
తీరనున్న యూరియా కష్టాలు
సాక్షి, జడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పడుతున్న యూరియా కష్టాలు ఇక తీరనున్నాయి. తాజాగా బుధవారం జడ్చర్ల రైల్వేస్టేషన్కు వ్యాగన్ ద్వారా స్పిక్ కంపెనీకి చెందిన 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. గురువారం మరో రెండు వ్యాగన్ల ద్వారా 3,800 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది. జడ్చర్ల రేక్పాయింట్కు చేరుకున్న యూరియాను మహబూబ్నగర్ డీఏఓ సుచరిత, మార్క్ఫెడ్ ప్రతినిధి ప్రణీత్, రేక్పాయింట్ అధికారి, జడ్చర్ల ఏఓ రాంభూపాల్ పరిశీలించారు. వచ్చిన ఈ యూరియాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయా జిల్లాలకు పంపిణీ ఇలా యూరియాను మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. గద్వాల, నాగర్కర్నూలు జిల్లాలకు 129 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను పంపించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించిన యూరియాలో జడ్చర్ల మండలానికి 120 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోరమండల్ యూరియా మొదటి విడతగా 800 మెట్రిక్ టన్నులు, రెండో విడతగా 3,000 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి జిల్లాలో కొరత లేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యూరియా కొరత లేదని డీఏఓ సుచరిత స్పష్టం చేశారు. బుధవారం జడ్చర్ల రేక్పాయింట్ పరిశీలించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, గురువారం 3,800 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కావాల్సిన విధంగా యూరియాను సరఫరా చేస్తున్నామన్నారు. వచ్చిన యూరియాలో 50 శాతం మార్క్ఫెడ్ ద్వారా సంఘాలకు ఇస్తామని, మిగతాది డీలర్లకు కేటాయిస్తామన్నారు. తద్వారా రైతులు రద్దీ లేకుండా సౌకర్యంగా యూరియా తీసుకువెళ్లగలుగుతారన్నారు. గత జూన్లో వర్షాలు కురియకపోవడం వల్ల యూరియా డిమాండ్ లేదన్నారు. జూలై, ఆగస్టులో వర్షాలు కురియడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.17 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. వీటికోసం 34 వేల మెట్రిక్టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు పంపామన్నారు. నెల వారీగా నివేదికలు ఇచ్చామని అందులో బుధవారం సాయంత్రం వరకు 22,649 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యిందన్నారు. జిల్లాలో మండలాల వారీగా ముందుజాగ్రత్తలు తీసుకుని యూరియా నిల్వలు ఉంచటం వల్ల సమస్య తలెత్తకుండా చూశామన్నారు. అవసరమైన ప్రాంతాలకు నిల్వ ఉన్నచోటనుంచి పంపిణీ చేశామని తెలిపారు. -
సేంద్రియ యూరియా!
రెండేళ్లుగా సేంద్రియ యూరియా తయారు చేసి వాడుకుంటూ చక్కని దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ యువ రైతు సోదరుల విజయ సూత్రాలే నేటి నేటి సాగుబడిగా మీ ముందు... ఆరుగాలం చెమటోడ్చి వ్యవసాయం చేసే రైతులు స్వతహాగా స్వేచ్ఛా జీవులు. అయితే, విత్తనాలు, ఎరువులకు, పురుగుమందులకు పూర్తిగా మార్కెట్పైనే ఆధారపడడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఉత్సాదకాలన్నిటినీ దుకాణాల్లో కొనుక్కొని వాడుకోవడానికి అలవాటు పడిన రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమకున్న స్వేచ్ఛను కోల్పోతున్నారు. యూరియా వంటి రసాయనిక ఎరువు బస్తాల కోసం తెలంగాణ జిల్లాల్లో రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడుతూ నానా బాధలు పడుతున్నారు. అయితే, జగిత్యాల జిల్లాలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రం తమ స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నారు. తమ పంటలకు అవసరమైన సేంద్రియ యూరియాను ఇసుక, ఆవు మూత్రంతో తామే తయారు చేసుకుంటూ నిశ్చింతగా పంటలు పండించుకుంటున్నారు. అటువంటి ఓ యువ రైతు సోదరుల విజయగాథ ఈ వారం ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ♦ దండవేని నరేష్, సురేష్ అన్నదమ్ములు, యువకులు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. ఐదేళ్లుగా 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేస్తున్నారు. పాలేకర్, చౌహాన్ క్యు, సీవీఆర్ మట్టిసేద్యంపై యూట్యూబ్లో వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం చేపట్టి అభివృద్ధి పథంలో కొనసాగుతున్నారు. ♦ రెండెకరాల్లో 16 రకాల కూరగాయలు, 3 ఎకరాల్లో వరి, మిగతా 3 ఎకరాల్లో చిరుధాన్యాలు, పసుపు తదితర పంటలు పండిస్తున్నారు. రసాయనాలు వాడకుండా తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను జగిత్యాల పట్టణంలో సొంతంగా స్టాల్ ఏర్పాటు చేసుకొని మార్కెట్ ధరపై 10% అధిక ధరకు స్వయంగా అమ్ముకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు. ♦ నరేష్, సురేష్ పంటలకు ఘనజీవామృతం, జీవామృతం, లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, మట్టి ద్రావణం, చేప అమినోయాసిడ్ ద్రావణం, జీవన ఎరువులు వంటి వాటిని పంటల పోషక అవసరాలకు తగినట్లుగా వాడుతూ ఉంటారు. వీటిని స్వయంగా తామే తయారు చేసుకుంటారు. అయితే, రెండేళ్లుగా ఇసుక, ఆవు మూత్రంతో సేంద్రియ యూరియాను కూడా తయారు చేసుకొని పంటలకు వేసుకుంటున్నారు. వాడకానికి సిద్ధమైన సేంద్రియ ఇసుక యూరియా 30 రోజుల్లో సేంద్రియ యూరియా సిద్ధం సేంద్రియ యూరియాకు కావాల్సిన ముడి పదార్థాలు.. ఇసుక, నాటు ఆవు మూత్రం. యూరియా తయారీకి నాటు ఆవు మూత్రం శ్రేష్టమని, దీనితోపాటు ఏ పశువు మూత్రమైనా వాడుకోవచ్చని నరేష్, సురేష్ చెబుతున్నారు. దగ్గరలో ఉన్న వాగు నుంచి ఇసుకను సేకరించుకోవాలి. అందులో రాళ్లు, రప్పలు లేకుండా జల్లించుకోవాలి. వర్షం, ఎండ పడకుండా కొష్టం/షెడ్లో సేంద్రియ యూరియా తయారు చేసుకోవాలి. ఇందుకు 30 రోజులు పడుతుంది. మొదటి 20 రోజులు ఇసుకలో ఆవు మూత్రం రోజూ కలుపుతూ తడిగా ఉంచాలి. తర్వాత 10 రోజులు ఆ ఇసుకకు గాలి తగలకుండా ప్లాస్టిక్ షీట్లో మూటగట్టి ఉంచాలి. తయారు చేసే విధానం: ఇసుకను ఒక పెద్ద నల్లని ప్లాస్టిక్ కవర్పై పోయాలి. 100 కిలోల ఇసుకపై 10–12 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని పోసి, ఇసుక పూర్తిగా తడిసేలా కలగలపాలి. తర్వాత, గాలి చొరబడకుండా కవర్ కట్టేయాలి. 19 రోజుల పాటు రోజూ కవర్ను విప్పి, ఇసుక తడి ఆరకుండా ఉండేంత ఆవు మూత్రాన్ని చల్లి.. మళ్లీ కవర్ను గట్టిగా తాడుతో కట్టి నీడలో ఉంచాలి. 20 రోజులకు ఇసుక యూరియా పసుపు నుంచి నల్లని రంగులోకి మారుతుంది. ఇక సేంద్రియ యూరియా వాడకానికి సిద్ధమైనట్టే. సేంద్రియ యూరియా తయారీకి మరో పద్ధతి సేంద్రియ యూరియాను మరింత సులభంగా తయారు చేసుకునే పద్ధతి మరొకటి ఉందని రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్కుమార్(98661 92761) తెలిపారు. పశువుల చావిడిలో నేలపైన ఇసుక పోసి, అక్కడ పశువులను కట్టేయాలి. అవి పేడ వేస్తాయి, మూత్రం పోస్తాయి కదా. పేడను విడిగా తీసుకొని.. మూత్రంతో తడిసిన ఇసుకను ఏరోజుకారోజు తీసి పక్కన కుప్పగా పోసుకోవాలి. పశువుల మూత్రమే కాదు మనుషుల మూత్రం కూడా సేంద్రియ యూరియా తయారీకి అద్భుతంగా పనిచేస్తుంది. అలా 20 రోజులు చేయాలి. 21వ రోజున ఆ ఇసుకకు గాలి ఆడకుండా ఉండేలా మూటగట్టి 10 రోజుల తర్వాత తీయాలి. అంతే.. సేంద్రియ యూరియా సిద్ధం! రసాయనిక యూరియా పంటపై చల్లితే ఎక్కువ తక్కువగా పంటకు అందుతుందని, అది కూడా 20% మాత్రమేనని, మిగతాది వృథా అవుతుందని కొక్కు అశోక్కుమార్ అన్నారు. సేంద్రియ యూరియా పంటపై చల్లినప్పుడు సమానంగా, పుష్కలంగా అందుతుందని తెలిపారు. పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం దీని వల్ల ఉండదని, మోతాదు ఎక్కువైనా పంటకు నష్టం ఉండదని, చీడపీడల విజృంభించవని అన్నారు. రైతులందరూ సేంద్రియ యూరియాను తయారు చేసుకొని వాడుకుంటే ఆర్థికంగా, పర్యావరణపరంగా, భూసారం పరంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఎకరానికి 200 కిలోలు రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్కుమార్ గత ఖరీఫ్కు ముందే జగిత్యాలలో రైతులకు సేంద్రియ యూరియా తయారీపై శిక్షణ ఇచ్చారు. నరేష్, సురేష్ కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు. వాళ్లు వరి సాగుకు సేంద్రియ యూరియా వాడటం ఇది వరుసగా మూడో సీజన్. నాటు వేసిన 20 రోజులకు ఎకరానికి 200 కిలోలు, పొట్ట దశలో మరో 200 కిలోల సేంద్రియ యూరియా చల్లుతున్నారు. 2018 ఖరీఫ్లో ఎకరానికి 28 క్వింటాళ్లు, రబీలో 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి పొందారు. రసాయనిక యూరియా కోసం తోటి రైతులు రోజుల తరబడి క్యూలలో నిల్చుంటూ ఉంటే.. ఈ యువ రైతులు మాత్రం.. స్వల్ప ఖర్చుతో ముందే తాము తయారుచేసి పెట్టుకున్న సేంద్రియ యూరియాను సకాలంలో వరి పంటకు అందించడంతోపాటు పొటాషియాన్ని అందించే పొగాకు కషాయం పిచికారీ చేసి నిశ్చింతగా ఉన్నారు. వర్షం పడని చోట దాచుకుంటే 1–2 రెండేళ్ల వరకు నిల్వ ఉంచుకొని వాడొచ్చని నరేష్(96409 63372), సురేష్ తెలిపారు. ప్టాస్టిక్ కవర్కు బదులు సిమెంటు తొట్టెలో సైతం సేంద్రియ యూరియాను సులభంగా, పెద్దమొత్తంలో తయారు చేసుకునే వీలుంది. ఎకరానికి విడతకు 100 నుంచి 200 కిలోలు వేసుకోవచ్చు. రసాయనిక యూరియా వేసిన తర్వాత పంటకు చీడపీడల బెడద ఎక్కువ అవుతుందని, సేంద్రియ యూరియా వల్ల ఆ సమస్య రాలేదన్నారు. సేంద్రియ యూరియాపై భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లోతైన పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
యూరియా ఆగయా!
సాక్షి, నిజామాబాద్: అన్నదాతల ఇక్కట్లు తొలగి పోనున్నాయి. యూరియా కష్టాలు తీరనున్నాయి.. జిల్లాలో కొద్ది రోజులుగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎరువు కోసం రైతులు సొసైటీల వద్ద బారులు తీరి నానా తిప్పలు పడ్డారు. అయితే, యూరియా కొరత తీర్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. తాజాగా ఆదివారం జిల్లాకు 2,551 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రైలు వ్యాగన్లలో వచ్చిన ఎరువు బస్తాలను గ్రామాలకు పంపిస్తున్నారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకుని అన్ని సొసైటీలకు లారీల్లో సరఫరా చేశారు. జిల్లాలో ని 90 సొసైటీలకు ఇప్పటికే ఎరువు బస్తాలు చేరుకున్నాయి. సోమవారం నుంచి రైతులకు ఎరువు బస్తాలు అందజేయనున్నారు. ఆందోళన వద్దు.. యూరియాకు ఎక్కడా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అధికారులకు సూచించారు. రైలులో వచ్చిన స్టాక్ను సొసైటీలకు తరలించే ప్రక్రియను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. యూరియా సరఫరా పూర్తి కాకముందే అవసరం మేరకు ఇండెంట్ పెట్టాలని అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి జిల్లాకు యూరియా స్టాక్ వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల మేర ఎరువులు జిల్లాకు వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని డీఏవో వివరించారు. రైతులకు సరిపడా ఎరువును సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రవాణాలో జాప్యం జరగడం వల్ల కొంత సమస్య ఏర్పడిందని చెప్పారు. ఇక మీదట ఆ సమస్య ఉండబోదని, రైతులకు సరిపడా ఎరువులను సొసైటీలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
యూరియా కష్టాలు ఎవరి పాపం?
గత నెల రోజులుగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంటలకు డోకా లేదు, ఈ ఫసలు గట్టెక్కుతం అనుకున్న రైతన్నలను ఈ ఖరీఫ్ సీజన్లో ’యూరియా’ కొరత తీవ్రంగా బాధపెడుతోంది. రైతులు ఆధార్ కార్డులు చేతబట్టి, డీ.సీ.ఎం.ఎస్.ల ముందు వారం రోజుల పాటు తిరిగితే తప్ప యూరియా బస్తాలు దొరకడం లేదు. పగలు– రాత్రి అని తేడా లేకుండా వంతుల వారిగా రైతులు క్యూలో నిలబడుతున్నారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు తిండితిప్పలు మానేసి యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు వదులుతున్నారు. అసలు రైతులకు ఇన్ని బాధలు ఎందుకు? ఈ పరిస్థితికి రావటానికి కారణం ఎవరు? ఈ యూరియా కొరత పాపం ఎవరిది? యూరియా మన రాష్ట్రంలో తయారీ కాదు. మహారాష్ట్ర, బిహార్ లాంటి పక్క రాష్ట్రాల మీద ఆదారపడాల్సిందే. సీజన్ ప్రారంభంలోనే అంచనా వేసిన మొత్తం ఎరువులను మన రాష్ట్రానికి తెచ్చి, మార్కుఫెడ్ గోదాములలో నిల్వచేసుంటే రైతులకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వర్షాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతూనే పంటలు పచ్చగా కావాలంటే రైతులు యూరియా మందు వేయాల్సిన పరిస్థితి. అసలే ఇక్కడ మన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే, మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను నాలుగు రోజులపాటు పక్క రాష్ట్రం కర్ణాటకకు మళ్ళిం చారు. రైతులు వేసే అడుగు మందుల ద్వారా మొక్కజొన్న కర్రలకు, పత్తి చెట్లకు పూర్తి బలం చేకూర్చాలంటే తేమ అధికంగా ఉన్నపుడే యూరియా వేయవలిసి ఉంటుంది. కాలం పోతే (వానలు ఆగిపోతే) పదును లేకపోతే, ఆరుగాలం చేసిన కష్టం మట్టిలో కల్సిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి ముందే, ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం పడుతుందనే లెక్కలు అంచనా వేసి, దానికనుగుణంగా యూరియా నిల్వ సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ, రాష్ట్ర వ్యవసాయ మంత్రి, అధికారులు ఏ ముందస్తు చర్యలూ చేపట్టలేదు. దీంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ. 267. కానీ, యూరియా కొరతను సాకుగా చూపి కొన్ని ప్రాంతాల్లో పెర్టిలైజర్ దుకాణాదారులు ఒక్కొక్క యూరియా బస్తా మీద రూ. 50 పెంచి అమ్ముతున్నారు. మొన్న దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిలబడి, అలసిపోయి ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. సీఎం సొంత ఇలాకాలో ఎరువుల కొరత ఒక రైతు ప్రాణం తీసింది. వ్యవసాయ మంత్రి రైతుల కష్టాలను హేళన చేస్తూ వెకిలిగా, అసంబద్ధంగా మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరో వారం రోజుల్లో పత్తి, మొక్కజొన్న పంటలు పూతకు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి సకాలంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తరువాత రాబోయే వారం, పది దినాల్లో వరి పొలాలకు యూరియా ఎక్కువ అవసరం. కనీసం ఇప్పటికైనా, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి, యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తెప్పించి, రైతులకు అందుబాటులో ఉంచి, పంటలను కాపాడాలి. వ్యాసకర్త: కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు మొబైల్ : 98667 76999 -
మార్క్ఫెడ్ అప్పు.. రూ. 1,827 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మార్క్ఫెడ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కంపెనీల నుంచి యూరియా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయడం, పంటను మద్దతు ధరకు కొనడానికి ఏర్పాటైన మార్క్ఫెడ్ పరిస్థితి ఇప్పుడు అత్యంత అధ్వా నంగా మారింది. అప్పులను చెల్లించకపోతే బ్యాం కుల ఎగవేత జాబితాలోకి వెళ్లే అవకాశముందని తాజాగా మార్క్ఫెడ్ సర్కారుకు పంపిన నివేదికలో తెలిపింది. యూరియా కొనుగోలు కష్టంగా మారుతుందని, భవిష్యత్లో రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడమూ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దీంతో మార్క్ఫెడ్ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మార్క్ఫెడ్ను గాడిలో పెట్టడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సరైన ధరకు వ్యాపారులకు విక్రయించడంలో విఫలమవడం, కమీషన్లకు కక్కుర్తిపడి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విక్రయ కమిటీకి తెలప్పకుండానే మొక్కజొన్న ధరను నిర్ణయించి విక్రయించిందన్న ఆరోపణలొచ్చాయి. అప్పులు, నష్టాలు... రైతులు పండించిన మొక్కజొన్న, కంది, మినుములు తదితర పంటలను మార్క్ఫెడ్ మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి అప్పు కింద తీసుకుంటుంది. ఆ తర్వాత తాము కొన్న పంటలను వ్యాపారులకు అమ్ముతుంది. సర్కారుకు పంపిన నివేదిక ప్రకారం.. 2013–14 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు రూ.4,589 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో నిర్వహణ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆ పంట ఉత్పత్తులను వ్యాపారులకు రూ. 3,347 కోట్లకు విక్రయించింది. అంటే నికరంగా రూ.1,241 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది. 2017–18లో కందిని వ్యాపారుల కు విక్రయించడం ద్వారా రూ.350 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము పోను ఇంకా రూ.1,827 కోట్లు బ్యాంకులకు, సంస్థలకు అప్పు చెల్లించాల్సి ఉందని నివేదికలో తెలిపింది. వాయిదాల చెల్లింపులకు నిధులు లేక చేతులెత్తేసింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ)కి గత నెలలో రూ.401 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా, ఇప్పటికీ ఇవ్వలేదు. సకాలంలో ఆయా బ్యాంకులకు అప్పులు చెల్లించకపోతే ఎగవేత జాబితాలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది. -
ఊరికి యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. 3,4 రోజుల్లోనే డిమాండ్కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలన్నారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించాలన్నారు. స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించడంపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా డిమాండ్పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడటానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించడంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదు. గత నాలుగేళ్లలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటుఇటుగా యూరియా అవసరం పడింది. ఈసారి ఆగస్టు చివరికే 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడటంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. రైతుల డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయశాఖ ముందుజాగ్రత్తగా వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. అయితే పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని యూరియాను వెంటనే తెప్పించి గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. 3 వేల లారీల ద్వారా పోర్టుల్లోని యూరియా... ఐడీఎల్, ఇఫ్కో, సీఐఎల్, క్రిబ్కో, ఎన్ఎఫ్ఎల్ కంపెనీల ద్వారా వచ్చిన దాదాపు 1.15 లక్షల టన్నుల యూరియా ప్రస్తుతం విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం, న్యూ మంగుళూరు నౌకాశ్రయాలకు చేరింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియాను త్వరగా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ నాగ్యాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివిధ పోర్టుల్లోని యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించడానికి 25 ప్రత్యేక గూడ్సు రైళ్లను కేటాయించాలని కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు యూరియా నేరుగా పంపాలని కోరారు. ఇందుకు రైల్వే అధికారులు అంగీకరించారు. ప్రభుత్వం కోరినట్లు శుక్రవారమే గూడ్సు రైళ్లు కేటాయిస్తామని చెప్పారు. గూడ్సు రైళ్లలో వేగంగా స్టాక్ లోడ్ చేసే పనిని పర్యవేక్షించడానికి ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయశాఖాధికారిని పంపాలని సీఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్లకు స్టాక్ చేరుకోగానే అక్కడ లారీలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ కూడా వ్యవసాయాధికారులను నియమించాలన్నారు. రైల్వే స్టేషన్ల నుంచి మండలాలు, గ్రామాలకు నేరుగా యూరియా పంపాలని, కావాల్సిన లారీలను రైల్వేస్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచాలని రవాణాశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను ఆదేశించారు. వివిధ పోర్టుల్లో ఉన్న యూరియాను తక్షణమే రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతోపాటు 3 వేల లారీలను వాడాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపించే పనిలో సహకరించాలని కోరారు. ఏపీలో వీలైనన్ని ఎక్కువ లారీలను సేకరించి యూరియాను తెలంగాణకు పంపుతామని నాని హామీ ఇచ్చారు. పోర్టుల నుంచి నేరుగా రైల్వే స్టేషన్ల ద్వారా వచ్చే యూరియాను మళ్లీ స్టాక్ పాయింట్లకు తీసుకువెళ్లకుండా ఏ మండలంలో ఎంత డిమాండ్ ఉందో ముందే నిర్ధారించి నేరుగా పంపాలని, ఈ పనిని పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని సీఎం ఆదేశించారు. 3–4 రోజుల్లోనే లక్ష టన్నులు అందాలి... మొత్తంగా మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి తొలగిపోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ పోర్టుల్లోని యూరియాను తెలంగాణకు రప్పించే పనిని ప్రగతి భవన్లోనే ఉండి పర్యవేక్షించాలని వ్యవసాయ, రవాణాశాఖ మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, అధికారులకు నిర్దేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రగతి భవన్ నుంచే వారు రైల్వే అధికారులతో, లారీ యాజమానుల సంఘాలతో, వివిధ కంపెనీలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు కావాల్సిన యూరియా అందే వరకు విశ్రమించవద్దని, రేయింబవళ్లు పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్రావు, పార్థసారధి, సునీల్శర్మ, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోశ్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. యూరియా తెప్పించేందుకు పర్యవేక్షణ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్ నుంచి యూరియాను తెప్పించే పనులను పర్యవేక్షిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్కు పిలిపించారు. వారి ద్వారా రైల్వే శాఖకు రేక్స్ కోసం ఇండెంట్ పెట్టించారు. తక్షణం వివిధ పోర్టులకు 25 రేక్స్ పంపడానికి రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో రేక్ (గూడ్సు రైలు) ద్వారా 2,600 టన్నులు యూరియా రానుంది. కేవలం రైళ్ల ద్వారానే దాదాపు 60 వేల టన్నుల యూరియా 2–3 రోజుల్లో ఆయా జిల్లాలకు చేరుకోనుంది. అదే సమయంలో దాదాపు 4 వేల లారీల ద్వారా కూడా యూరియా వివిధ మండలాలకు చేరుకోనుంది. మొత్తం యూరియా 3–4 రోజుల్లో గ్రామాలకు చేరుతుందని, రైతులు కాస్త ఓపికగా ఉండాలని మంత్రులు సూచించారు. యూరియా కొరతను ఆసరా చేసుకొని ఎవరైనా ధరను పెంచి విక్రయించే అవకాశం ఉందని, రైతులు మోసపోవద్దని చెప్పారు. రైతులకు కావాల్సిన యూరియా అంతా ఆయా మండలాలకు చేరుకుంటుందని, 3–4 రోజుల్లో సమస్య పూర్తిగా తొలగిపోతుందని మంత్రులు భరోసా ఇచ్చారు. -
యూరియా కోసం వెళ్లి రైతు మృతి!
దుబ్బాక టౌన్: యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డ ఓ రైతు గురువారం ఆకస్మికంగా గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సుభాష్గౌడ్, బాధిత రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లికి చెందిన రైతు చేర్వాపురం ఎల్లయ్య (69)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికితోడు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నాలుగు ఎకరాల్లో వరి, మొక్క జొన్న, పత్తి పంటలు సాగు చేశాడు. పంటలకు అవసరమైన యూరియా ఎరువు కోసం మూడు రోజుల నుంచి ఎల్లయ్య దుబ్బాకకు వస్తున్నా దొరకలేదు. గురువారం వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లారీ వచ్చిం దని తెలవడంతో ఉదయం తన భార్య లచ్చమ్మతో కలసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే యూరియా కోసం వందల మంది రైతులు లైన్లో నిలుచున్నారు. దీంతో ఎల్లయ్య లైన్లో నిలబడగా ఆయన భార్య లచ్చమ్మ సైతం మహిళా రైతుల లైన్లో నిలుచుంది. సుమారు గంటసేపు లైన్లో నిలుచున్న ఎల్లయ్య, ఒక్కసారిగా సొమ్ముసిల్లి పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఆసుపత్రిలో ఎల్లయ్యను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. ఎల్లయ్య భార్య లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు కూతుళ్లు.. మృతిచెందిన రైతు ఎల్లయ్యకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు శ్యామల భర్త ఏడేళ్ల క్రితమే మరణించడంతో ఆమె కుటుంబాన్ని కూడా ఎల్లయ్యనే పోషిస్తున్నాడు. రెండో కూతురు నర్సవ్వకు వివాహం అయింది. మూడో కూతురు రేణుక వికలాంగురాలు. చిన్న కూతురు మమతకు నాలుగు నెలల క్రితమే అప్పుచేసి వివాహం చేశాడు.