vivekananda
-
పెట్టుబడులపై మాటల యుద్ధం
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు?
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో.. తెలంగాణ స్పీకర్పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. చర్యలకు అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన.. తగిన సమయం రావాలని అన్నారు. దీంతో.. ‘‘ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?. రీజనబుల్ టైం అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?..’’ అని తెలంగాణ స్పీకర్ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్ను సంప్రదించి చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానం ఇచ్చారు. దీంతో విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్పై గెలిచి.. ఈ ముగ్గురితో సహా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనవరి 16వ తేదీన SLP దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని హరీష్రావు మరో పిటిషన్ వేశారు.మహారాష్ట్ర కేసులో..రాజ్యాంగంలోని పదో షెడ్యూల్.. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన(ఫిరాయించిన) నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించింది. అయితే దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడంతో.. ఇలాంటి కేసుల్లో చర్యలకు ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. 2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ల పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది.రాజ్యాంగపరంగా ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా, చట్ట సభలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం ఆ సమయంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు.. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఫిరాయింపుల కేసుల్లో పారదర్శకత కోసం నిర్దిష్ట మార్గదర్శకాల ఆవశ్యకతను తెలియజేసింది. -
ఎమ్మెల్యే వివేకానందపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
-
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్
-
Viveka case : ఇవిగో ఆధారాలు.. ఇప్పుడేం చెబుతావు సునీత? అవినాష్ ప్రశ్నలు
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను పక్కదోవ పట్టించేలా సునీత ఏ రకంగా ప్రయత్నిస్తుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. ఈ కేసులో మాట్లాడకూడదని భావించినా.. రోజురోజుకి పెరుగుతున్న అబద్దాలను, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వివరణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలు చూద్దాం. పాయింట్ 1 : పన్నింటి రాజశేఖర్ను బయటకెందుకు పంపించారు? వివేకా ఇంట్లో పని చేసే వ్యక్తి పన్నింటి రాజశేఖర్. హత్యకు ఒక రోజు ముందు పన్నింటి రాజశేఖర్కు సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. సిబిఐ విచారణలో పన్నింటి రాజశేఖర్ను సుదీర్ఘంగా విచారించారు. లిఖితపూర్వకంగా పన్నింటి ఇచ్చిన స్టేట్మెంట్ను అవినాష్ చదివి వినిపించారు. పన్నింటి రాజశేఖర్ను సిబిఐ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు.. ప్రశ్న, సమాధానాలు ఇలా ఉన్నాయి సిబిఐ : నీకు సెలవు ఎవరు మంజూరు చేశారు? పన్నింటి రాజశేఖర్ : నాకు సౌభాగ్యమ్మ సెలవు ఇచ్చింది సిబిఐ : నీవు సెలవుపై వెళ్లాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? పన్నింటి రాజశేఖర్ : నాకు రెండు, మూడు సార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేశారు, తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. సరేనని నేను సెలవు తీసుకున్నా.. పన్నింటి రాజశేఖర్ : సునీల్ యాదవ్, ఉమా శంకర్, గంగిరెడ్డి ముగ్గురు కూడా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్. చనిపోక ముందు వివేకాతో కలిసి ప్రయాణాలు చేసేవారు. వాళ్లకు వివేకాతో ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. అంతా కలిసి తరచుగా అంటే రెండు మూడు రోజులకోసారి టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేసేవారు. రెండు రోజుల ముందు కూడా వివేకాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అవినాష్ అభ్యంతరం : ఇంట్లో ఉన్న పన్నింటి రాజశేఖర్ను నర్రెడ్డి రాజశేఖర్, సౌభాగ్యమ్మ (తమ్ముడు, అక్క) ఎందుకు బయటకు పంపించారు? కాణిపాకం వెళ్లమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్, ఉమాశంకర్, గంగిరెడ్డి తెలియదని సునీత ఎందుకు ప్రకటనలు చేస్తోంది? ఇంట్లో కలిసి కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేసే సాన్నిహిత్యం ఉందని పని వాళ్లంతా చెబుతుండగా.. సునీత ఎందుకు మాట మారుస్తోంది? --- పాయింట్ 2 : గుండెపోటు థియరీ ఎక్కడినుంచి వచ్చింది? గుండెపోటు థియరీ గురించి సునీతతో చాలా మాట్లాడుతోంది. అసలు ఈ థియరీ ఎక్కడి నుంచి మొదలయింది. దీని గురించి వివరంగా మాట్లాడుదాం. సిట్కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే..! "మాకు ఉదయం కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, ఇంట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చెప్పాడు. మా నాన్న డెడ్బాడీ బాత్రూంలో పడి ఉంది. మా నాన్న ఒంటిపై గాయాలున్నాయని చెప్పాడు, అయితే మా నాన్నకు గతంలో గుండె సమస్య ఉంది, బహుశా గుండె పోటు వచ్చి బాత్రూంలో కింద పడి మా నాన్నకు గాయాలయ్యాయేమో అని ఊహించి ఆ విధంగా ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డికి మేం సూచించాం" అని నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. సిట్కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్. అంటే కృష్ణారెడ్డితో ఏమేం మాట్లాడారో సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పైగా ఘటన జరిగిన వారంలోపు అంటే.. ఆలస్యం కాకుండా బయటికొచ్చే విషయాలు పక్కగా ఉంటాయని ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పింది సునీత. అవినాష్ పాయింట్ : గుండెపోటు కాదు, శరీరం మీద గాయాలున్నాయన్న విషయం సునీతకు అందరికంటే ముందే.. కృష్ణారెడ్డి ఫోన్ చేయగానే తెలిసింది. అయినా సునీత మధ్యాహ్నం వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, సౌభాగ్యమ్మ.. అంతా బయల్దేరి కలిసి వచ్చారు. అక్కడ లెటర్ ఉందని తెలిసి, దాన్ని దాచి పెట్టమని చెప్పి, వివేక హత్యకు గురయ్యాడన్న విసయాన్ని దాచిపెట్టింది సునీత. అందరికంటే ముందు డెడ్బాడీ ఫోటోలు కూడా తెప్పించుకున్నారు, అయినా పోలీసులకు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా అసలు నిజాలను దాచిపెట్టింది సునీత, ఆమె భర్త. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.. ఏంటంటే.. నన్ను ఇరికించే కుట్ర జరిగిందని. శివప్రకాష్ రెడ్డి..అంటే వివేకా సొంత బావమరింది నేను ఉదయం లేచి రాజకీయ పర్యటన కోసం బయటకు వెళ్తోంటే.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే.. "బావ చనిపోయాడు.. అర్జంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పాడు". అదే విషయం నేను నా వాంగ్మూలంలో చెప్పాను. నేను అదుర్తాతో వివేకానంద ఇంటికి వెళ్లగానే అక్కడ తేడా ఉందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అనుమానం ఉందని చెప్పాను. మరి ఉదయమే హత్య అని తెలిసినా.. సునీత గానీ, నర్రెడ్డి గానీ, శివప్రకాష్ రెడ్డి గానీ.. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పైగా ఏమి తెలియనట్టు నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చెప్పినట్టు? మీరు ఇదే అంశంలో టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూడాలి (వీడియో క్లిప్ ప్లే చేసి వినిపించారు) సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆదినారాయణ ఏమన్నాడంటే... "మార్చి 15 నాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్రెడ్డి ఫోన్ చేసినాడు, గుండెపోటుతో చనిపోయాడని నాకు చెప్పినాడు, ఆ రోజు మా కజిన్, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కూడా నాతో ఉన్నాడు. ఎందుకని నేను అడిగినప్పుడు.. ఎక్కువగా సిగరేట్లు తాగుతాడని, గుండె పోటు వచ్చి స్టంట్ కూడా వేశారని చెప్పాడు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను. నన్ను దర్యాప్తులో నీకు పరమేశ్వర్ రెడ్డి తెలుసా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు." అవినాష్ పాయింట్ : గుండెపోటు అన్న తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందెవరు? ఎక్కడి నుంచి మొదలయ్యిందో ఈ ఆధారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. --- పాయింట్ 3 : ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని తప్పుడు ప్రచారం అటు సునీత, ఇటు షర్మిల.. హఠాత్తుగా రాజకీయాలను తీసుకొచ్చారు. ఏంటంటే.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందట. ఎంపీ టికెట్ మోటివ్ అన్న దాంట్లో నిజమెంత? ఒక్కసారి జరిగిన ఘటనలను మీరే చూడండి. "తాను చనిపోయే చివరి క్షణం వరకు నా కోసం ప్రచారం చేశారు, మూడు గంటల ర్యాలీ సభలో వివేకా మాట్లాడారు. అవినాష్ను గెలిపించమని పది సార్లు చెప్పారు. అంతెందుకు సునీత కూడా ఢిల్లీలో ఏం మాట్లాడారు..? అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశాడని చెప్పింది." మరి.. అప్పటికే ఎంపీ టికెట్ను నాకు కేటాయించారు. 2019 టికెట్ ఒక్కటే కాదు.. 2014లోనూ నేను ఎంపీగా గెలిచాను. నా కోసం వివేకానంద ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని ఎలా చెబుతారు? పైగా అప్పుడు మీ నాన్నకు ప్రత్యర్థి బీటెక్ రవి ఇప్పుడు మీకు సన్నిహితుడు అవుతాడా? మీ నాన్న మీద అక్రమంగా, అనైతికంగా గెలిచిన బీటెక్ రవి కాకుండా.. మా మీద బురద వేస్తున్నారా? కనీసం అవగాహనతో మాట్లాడుతున్నారా? మీ కోసం ఎన్నో ఎన్నికల్లో కష్టపడితే మాపై ఆరోపణలు చేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఏ ఒక్కరినీ సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? సిబిఐ దర్యాప్తులో ఇన్ని లోపాలుంటాయా? ఇక సునీత, సిబిఐ చాలా మందితో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్ష్మీదేవమ్మ, జగదీష్ రెడ్డి, లక్ష్మీ దేవి కొడుకుతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. శశికళ & కోతో కూడా తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు గేటు దగ్గర ఇప్పకుంట్ల వాసి ఒకరు ఉంటే.. ఆయన ఇంటికి సునీత, రాజశేఖర్ వెళ్లారు. "మా నాన్న దగ్గరి వాడివి, సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలి, మేం చెప్పినట్టు మాత్రమే నువ్వు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఏం చెప్పారంటే.. అవినాష్ గుండెపోటు అని చెప్పమన్నాడని నువ్వు చెప్పాలి" అని ఒత్తిడి తెచ్చారు. అవినాష్ పాయింట్ : సునీత లాంటి వాళ్లు దస్తగిరి లాంటి వారిని కూడా అప్రూవర్గా చేయగలరు, ఇందులో చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు కావొచ్చు, అందులో భాగంగానే పస లేని విమర్శలు, కనికట్టు చేసే అబద్దాలు ఉన్నాయి. రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అవినాష్ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంత కుట్ర చేస్తారా? గుండెపోటు అని ప్రచారం మొదలెట్టిన వాళ్లు... దాన్ని నా మీద రుద్దుతారా? పైగా ఇంటింటికి వెళ్లి నేను చెప్పమన్నారంటూ ఒత్తిడి తెస్తారా? ఈ కేసులో కోర్టులమీద నమ్మకం ఉందని, చంద్రబాబు, బీజేపీలోని టిడిపి పెద్దలు దీని వెనక ఉన్నారని విమర్శించారు అవినాష్. చంద్రబాబు చేతిలో పావులుగా మారి నన్ను, మా నాన్నను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్విచ్ మీన్టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా తప్పుడు ప్రకటనలు చేసిన సిబిఐ.. తర్వాత నాలుక కర్చుకుని హైకోర్టులో కౌంటర్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. READ THIS ARTICLE IN ENGLISH : YS Avinash Reddy’s Sensational Comments on Sunitha in YS Viveka’s Murder ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు -
నిజం దాచి పెట్టింది సునీతే.. అసత్య ప్రచారం చేస్తోంది సునీతే
-
డబ్బులు లేక చివరి రెండేళ్లు పెదనాన్న నరకం చూశాడు..!
-
పాఠశాల నుంచే దాడి?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్నగర్ డాబాకొట్ల సెంటర్లో వివేకానంద సెంటినరీ హైస్కూల్ నుంచే ఎయిర్గన్తో దాడికి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడి సమయంలో ఈ పాఠశాల వెనుక వైపున రోడ్డులోనే సీఎం జగన్ యాత్ర సాగుతోంది. సీఎం జగన్ ఉన్న బస్సుకు, పాఠశాల కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. పాఠశాల ఉన్న రామకృష్ణ సమితికి చెందిన ఈ జీ+2 భవనం మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వాచ్మెన్ భద్రత లేదు. దీంతో గేటు దూకి ఎవరైనా సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచే దాడికి పాల్పడి, సులభంగా తప్పించుకొని పోయే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఆఫీసు ఉండటం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 59వ డివిజన్కు చెందిన ఓ టీడీపీ నాయకుడి అనుచరుల్లో బ్లేడ్ బ్యాచ్, ఎయిర్గన్లు, క్యాటర్బాల్, ఇతర మారణాయుధాలు వాడేవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో సీఎం జగన్ రోడ్షోను చిత్రీకరించిన స్థానికుల నుంచి వీడియోలు సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. -
వివాదాస్పదమైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తీరు
-
ఓటమి భయంతోనే వివేకానంద దాడి
కుత్బుల్లాపూర్: ఓడిపోతామనే భయం, అసహ నంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద బీజే పీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్పై దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓ న్యూస్ చానల్ నిర్వహించిన ఎన్నికల చర్చలో వివేకానంద, శ్రీశైలంగౌడ్ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శ్రీశైలంగౌడ్ను షాపూర్నగర్లోని నివాసంలో సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడు తున్నారని.. తమ సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని హెచ్చరించారు. ’’పేరేమో వివేకానంద కానీ చేష్టలేమో ఔరంగజేబును తలపిస్తున్నా యని’ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శించారు. భౌతిక దాడులు జరిగే అవకాశముందని ముందే సమాచారం వచ్చినా పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్కు ఎందుకు భద్రత ఇవ్వడం లేదని నిలదీశారు. వివేకానందను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషాన్ పై ముగిసిన వాదనలు
-
కుత్బుల్లాపూర్ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన వివేకానందగౌడ్ మరోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన టిడిపి పక్షాన గెలిచి, ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారి టిఆర్ఎస్ టిక్కెట్పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మీద 41500 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. వివేక్ కు 154500 ఓట్లు రాగా, శ్రీశైలంకు 113000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి అభ్యర్ధి కాసాని వీరేష్కు 9800 పైచిలుకు ఓట్లు వచ్చాయి. వివేక్ సామాజికవర్గ పరంగా గౌడ వర్గానికి చెందినవారు. 2014లో వివేకానంద గౌడ్ టిఆర్ఎస్ అభ్యర్ధి కె.హనుమంతరెడ్డిపై 39021 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వివేకానందగౌడ్ 2009లో టిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయి, 2014లో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్దిగా విజయం సాదించడం విశేషం. తదుపరి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2009లో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందిన శ్రీశైలం గౌడ్ 2014లో కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఇంతవరకు గెలిచినవారంతా బీసి గౌడ్ వర్గం వారే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
SC on Viveka Case : పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ : వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ ఇవ్వాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్వపరాల గురించి అడిగింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు గడువు ముగియడంతో.. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేయలేదు. సునీత ఏం కోరింది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేసిన దర్యాప్తుకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలంటూ పిటిషనర్ సునీత సుప్రీంకోర్టును అడిగింది. పిటిషనర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ వ్యవహారంలో ఈ పరిస్థితుల్లో కేసు డైరీ వివరాలను పిటిషనర్కు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గంగిరెడ్డి లాయర్ ఏం కోరారు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని, ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొన్న సుప్రీం కోర్టు, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఏపీ పోలీసులు ఏం కనుగొన్నారు? సిబిఐ ఏం తేల్చింది? వివేకానందరెడ్డి హత్య 15 మార్చి, 2019న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని కూడా నియమించింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారణ చేసిన నాటి ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తమ నివేదికను CBIకి అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు అప్పటి పోలీసులు ఏమని నివేదించారు? ఇప్పుడు తాజాగా CBI దర్యాప్తులో ఏం కనిపెట్టిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. CBIకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటీ? ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలి నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలి జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలి అనంతరం ఈ కేసులో తర్వాతి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. -
గవర్నర్ది పూర్తిగా పోలిటికల్ దర్బార్: ఎమ్మేల్యే వివేకా
-
జేపీ నడ్డాతో వివేక్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేకానంద శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని తాజా రాజకీ యాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న పలు కార్యక్రమాలను నడ్డాకు వివరించాను. సీఎం చేస్తున్న అవినీతిని వివరించాను. అన్ని ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వంపైన కేసీఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అంటే ఆయనకు భయం పుడుతోంది. రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంగా అయిందని వివరించాను. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై జేపీ నడ్డాతో చర్చించాను..’ అని తెలిపారు. -
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
-
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ వైరస్ బారరినపడక తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్గౌడ్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద్ను ‘సాక్షి’ఫోన్లో పలకరించగా వైద్యుల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతానని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్లు, శానిటైజర్లతో శుభ్రంగా ఉండాలని సూచించారు. (ఇప్పట్లో వదలదు!) -
ఢిల్లీపై కన్నేసిన కారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేయడం ద్వారా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ తనకు కలిసొచ్చిన కరీంనగర్ పూర్వ జిల్లానే తొలి టార్గెట్గా ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతోపాటు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడి రెండు సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్లో భారీ మెజార్టీని లక్ష్యంగా నిర్ధేశించిన ఆయన పెద్దపల్లిలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా అభ్యర్థిని గెలిపించే బాధ్యతను స్థానిక మంత్రి, ఇతర ఎమ్మెల్యేలపై ఉంచారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు నియోజకవరాల్లో పార్టీ యంత్రాంగం పాదయాత్రలు, ప్రచారంతో ఇతర పార్టీల కన్నా ముందంజలో ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్ పర్యటనలతో పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందనే నమ్మకంతో ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం పేరుతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఈనెల 6న కరీంనగర్లో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఎన్నికల ప్రచార సభలా సాగడంతో ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది. అదే ఊపుతో మరుసటి రోజు నుంచే గ్రామాల్లో ప్రచారానికి తెరలేపిన వినోద్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పూర్తిగా రంగంలోకి దిగారు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రాగా, అప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం సభకు భారీగా జనం రావడంతో అభ్యర్థి వినోద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నామినేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఆయన పూర్తిగా జనం మధ్యలోనే ఉంటున్నారు. మంత్రి ఈటల రాజేందర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకుంటున్నారు. కరీంనగర్ పట్టణంలో శనివారం నిర్వహించిన కేటీఆర్ రోడ్షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో వినోద్కుమార్, ఇతర టీఆర్ఎస్ శ్రేణులు భారీ మెజారిటీ అంచనాలతో రెట్టించిన ఉత్సాహంలో పనిచేస్తుండడం గమనార్హం. కేసీఆర్ సభతో మోగనున్న పెద్దపల్లి ప్రచార భేరి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర సహచరులతో కలిసి ఆడిన గేమ్లో మాజీ ఎంపీ వివేకానంద పోటీలో లేకుండా పోయారు. వెన్నుపోటు ఆరోపణలతో వివేక్ను పెద్దపల్లి అభ్యర్థిత్వం నుంచే కాకుండా ఏకంగా పార్టీ నుంచే పంపించడంలో వీరంతా సక్సెస్ అయ్యారు. అయితే వివేక్ స్థానంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 28వేల ఓట్ల తేడాతో సుమన్ చేతిలో ఓడిపోయిన బొర్లకుంట వెంకటేశ్ నేతకు టికెట్ ఇప్పించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి, టీఆర్ఎస్లో చేరిన రోజే పార్టీ టికెట్ సాధించుకున్న వెంకటేశ్ నేత పట్ల పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ముందుండి నడిపిస్తుండడంతో పరిస్థితి మారుతోంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెంకటేశ్ నేత పర్యటిస్తూ ప్రచారం జరుపుతున్నారు. కాగా, ఈనెల 1న ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపైనే వెంకటేశ్ నేత ఆశలు పెట్టుకున్నారు. సీఎం ప్రచారంతో పరిస్థితి పూర్తిగా తమ వైపుకు తిరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ స్థానికేతరుడు కావడాన్ని వెంకటేశ్నేత తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. కాగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో టీఆర్ఎస్ విజయాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ అన్నీ తామై సహకరిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఓట్లు వెళ్లకుండా తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
సలహాదారు పదవికి వివేక్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి జి.వివేకానంద రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారంరాత్రి సీఎం కేసీఆర్ కు ఆయన పంపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ టికెట్ ఇస్తానని చెప్పి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారని, కానీ తనకు టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో వెల్లడించారు. అయితే, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు. శనివారం తన అనుచరులతో భేటీ అయి వివేక్ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. వివేక్ బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నారని సమాచారం. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముంది. కాంగ్రెస్ నేతలు కూడా వివేక్తో సంప్రదింపులు జరుపుతున్నారు. -
నా దేశం ఒక సందేశం
అంతటి రసస్ఫోరకమైన, ఉన్నత స్థితిలో దేశాన్ని చూడగలగడం అంటే.. దేశంపై ఇష్టం, ప్రేమ మాత్రమే కాదు.. దేశాన్ని గౌరవించడం, దేశాన్ని పూజించడం కూడా. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం మరొకసారి ప్రతిన పూనుదాం.దేశభక్తి అంటే ఏంటి? దేశాన్ని ఇష్టపడటమా? దేశాన్ని ప్రేమించటమా? స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా దేశభక్తి అర్థాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివేకానంద ఓ దశలో నాలుగేళ్ల పాటు పాశ్చాత్యదేశాలలో పర్యటించారు. ఆ దేశాల్లోని సిరిసంపదలను, విజ్ఞానాన్ని, అభివృద్ధిని, వారు అవలంబిస్తున్న విధానాలను, ఆధునికతను, ఆ దేశాల అగ్రగామితనాన్ని, ఆధునిక టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. ఆ సుదీర్ఘ పర్యటనను ముగించుకుని, భారతదేశానికి వచ్చేందుకు అక్కడి విమానాశ్రయంలో వేచి ఉండగా ఓ పత్రికా విలేకరి ఆయన్ని.. ‘‘ఇక్కడికి, అక్కడికి తేడా ఏమిటని మీ అనుభవంలో తెలుసుకున్నారు?’’ అని అడిగారు. అందుకు వివేకానంద ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘ఇక్కడి సంపదను, వైభోగాలను స్వయంగా చూశాను. ఇప్పుడు పర్యటన ముగించుకుని నా మాతృభూమికి వెళుతున్నాను. ఈ దేశాలకు రాక ముందు నా దేశాన్ని నేను ఇష్టపడేవాడిని. ఇప్పుడు నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అంతే తేడా. అంతేకాదు, నా దేశంలోని ధూళి, నీరు, నేల పవిత్రంగా అనిపిస్తున్నాయి. చెట్టూ చేమ, రాయి రప్పా, పుట్టా గుట్టా అంతా నాకు పరమ పవిత్రంగా కనిపిస్తోంది. మొత్తం మీద నా భారతదేశం నాకు ధగధగాయ మానమైన ఓ సువర్ణ దేవాలయంలా సాక్షాత్కారం అవుతోంది’’ అన్నారు వివేకానంద. స్వచ్ఛమైన, నిత్యమైన, దేశభక్తికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా? – డా. రమాప్రసాద్ ఆదిభట్ల -
వివేకానంద గౌడ్- లీడర్తో
-
కాంగ్రెస్ పని ఖతం ఎమ్మెల్యే వివేకానంద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాహుల్గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఊహల్లో ఉన్నారని అన్నారు. రాహుల్గాంధీ ఇక్కడే అడ్డా వేసినా..టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. రాహుల్గాంధీ సభావేదికపై ఉన్న నాయకులంతా ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు కామన్ ఎజెండా లేదని విమర్శించారు. ఒక నాయకుడు ఎన్నికలకు సిద్ధమంటే, మరొకరు ఇప్పుడే ఎందుకు ఎన్నికలు అంటున్నారని పేర్కొన్నారు. ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం, సఖ్యత లేదన్నారు. అసెంబ్లీలో మాట్లాడటానికి సమస్యలు, అంశాలు ఏమీ లేక సభ నుంచి కాంగ్రెస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై వందల కేసులు వేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ మీద విమర్శలు చేస్తున్న వారికి లోకజ్ఞానం లేదన్నారు. టీవీల్లో, పేపర్లలో కనిపించడానికే కాంగ్రెస్ నాయకులు ప్రెస్మీట్లు పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
వదిలేస్తున్నారా? వెంట తెచ్చుకుంటున్నారా?
నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ –భవతి భిక్షామ్ దేహి – అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి – చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది. మరొకామె ‘‘చూడడానికి దుక్కల్లా ఉన్నారు. పని చేసుకుని బతకలేరా?’ అంటూ ఒంటికాలిమీద లేచి తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు. పాడయిపోయిన భాగాన్ని తొలిగించి – బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు అరటిపండును తినిపించారు. ఆవు వారి చేతిని ప్రేమగా నాకింది. సన్యాసులందరూ మఠం చేరుకుని, వారి వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు గుమ్మానికి ఆనుకుని కూర్చుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం ఏమిటని అడిగాడు. ‘‘పొద్దున భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఇంటావిడ తిట్టిన తిట్లు, పెట్టిన శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం నాకు పదే పదే గుర్తుకొచ్చి ముల్లులా గుచ్చుకుంటోంది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను స్వామీ’’ – అన్నాడు. అతని కళ్ల నిండా నీరు. వివేకానందుడు అతన్ని ‘‘పొద్దున మనకు భిక్షలో ఏమేమి వచ్చాయి?’’ అనడిగాడు. ‘‘సగం పాడయిపోయిన అరటి పండు, కొద్దిగా బియ్యం వచ్చాయి’’ – చెప్పాడతను. ‘‘అవును కదూ, వాటిలో మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం?’’ అడిగాడు మళ్లీ. బాగున్న అరటిపండును అవుకు పెట్టేసి, బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం’’‘‘మనం తెచ్చుకున్నవాటిలో తిట్లే లేవు కాబట్టి అవి నీవి కావు. నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు, బియ్యమే కానీ, తిట్లను తీసుకోలేదు – వాటిని ఇక్కడికి మోసుకురాలేదు. రానిదానికి – లేనిదానికి ఎందుకని బాధపడుతున్నావు?’’ అనునయంగా అడిగాడతన్ని. అతనిలో ఆవరించిన దిగులు ఏదో తొలగిపోయినట్లయి, ‘‘నిజమే స్వామీ!’’ అంటూ తలపంకించాడు సంతోషంగా. – డి.వి.ఆర్. -
హెచ్సీఏ అధ్యక్షుడిగా కొనసాగవద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు జి.వివేకానంద్కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా వివేక్ కొనసాగడానికి వీల్లేదంటూ అంబుడ్స్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. అంబుడ్స్మన్ తీర్పుపై తిరిగి విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హెచ్సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్కు వివేక్ డైరెక్టర్గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, అందువల్ల ఆయన హెచ్సీఏ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించాలంటూ అంబుడ్స్మన్ ముందు భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, బాబూరావు తదితరులు ఫిర్యాదులు దాఖలు చేశారు. విచారణ జరిపిన అంబుడ్స్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఈ ఏడాది మార్చి 8న తీర్పునిస్తూ... విశాక ఇండస్ట్రీస్కు డైరెక్టర్గా కొనసాగుతూ, అదే కంపెనీతో ఒప్పందం ఉన్న హెచ్సీఏకు అధ్యక్షుడిగా ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తేల్చారు. అందువల్ల హెచ్సీఏ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదంటూ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి మార్చి 15న అంబుడ్స్మన్ తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను మళ్లీ సవాలు చేస్తూ అంబుడ్స్మన్ ముందు ఫిర్యాదుదారులైన అజహరుద్దీన్, బాబూరావులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరిస్తూ... సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అంబుడ్స్మన్ తీర్పుపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచించింది. తీర్పును స్వాగతిస్తున్నాం... హైకోర్టు ఉత్తర్వులపై పిటిషనర్ బాబూరావు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్సీఏ పనితీరు సక్రమంగా లేకనే బీసీసీఐ నుంచి నిధులు రావడం లేదని... వివేక్ వర్గానికి చిత్తశుద్ధి ఉంటే లోధా కమిటీ సిఫారసులను అనుగుణంగా పూర్తి స్థాయి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. -
ఉత్తముణ్ని కాకపోవచ్చు...
‘నేను అందరికంటే ఉత్తముణ్ని కావచ్చు, కాకపోవచ్చు. చాలామంది కంటే ఉత్తముణ్ని అయ్యే అవకాశం ఉంది. ఎవరికంటే అధముణ్ని మాత్రం కాదు’ అనేది నచికేతుని తత్వం. ఆయనే నాకు స్ఫూర్తి, ఆదర్శం. ఎదుటివారిని గౌరవించడం మన మొదటి కర్తవ్యం. ఇతరుల పట్ల గౌరవ భావాన్ని వ్యక్తం చేయడంలో ప్రతిబింబించేది మన సంస్కారమే కాని చిన్నతనం కాదు. ఆత్మగౌరవానికి భంగం అంతకంటే కాదు. సున్నితంగా వ్యవహరించడం అంటే ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టడం అని అర్థం కాదు. సరళమైన జీవితం కొనసాగించే వారికి దృఢచిత్తం లేదు అనుకుంటే పొరపాటే. ఇంద్రధనుస్సులో మనకు పైకి కనిపించేవి మూడు రంగులే కానీ, అది ఏడు రంగుల సమ్మేళనం. అలాగే మనిషిలోనూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడంతోపాటు సంస్కారయుతంగా వ్యవహరించడం వంటి అన్ని లక్షణాలూ ఉండి తీరాలి. ఇదే విషయాన్ని స్వామి వివేకానందుడికి అతడి తల్లి బోధించింది. ‘పవిత్రంగా ఉండు, స్వచ్ఛమైన జీవితాన్ని జీవించు. ఆత్మగౌరవాన్ని సంరక్షించుకో, ఇతరులను గౌరవంగా చూడు, సరళ స్వభావంతో నిరాడంబరంగా మెలుగు. అవసరమైన చోట్ల దృఢత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడకు’ అని ఆమె హితబోధ చేశారు. ఆ ప్రభావం అతడి మీద ఎల్లవేళలా పని చేసింది. ఆ సూక్తులు ఆయనను సన్మార్గంలో నడిపించాయి. దాంతో ఇతరులను గౌరవించడానికి ఎప్పుడూ వెనకాడేవాడు కాదు. ఇతరులు తనను అవమానపరచదలిస్తే సహించేవాడుకాదు. అందుకు అతడి బాల్యంలో జరిగిన సంఘటనే నిదర్శనం. ఒకరోజు ఇంటికి వివేకానందుడి తండ్రి స్నేహితుడు వచ్చాడు. అతడు వివేకానందుడిని తేలికగా మాట్లాడాడు, అంతే... వివేకానందుడు కోపంతో తోకతొక్కిన తాచులాగా స్పందించాడు. ‘నా తండ్రి కూడా నన్ను చిన్న చూపు చూడడు, అతడి స్నేహితుడు నన్ను అహేతుకంగా కించపరచడాన్ని సహించ’నన్నాడు. ఆ తర్వాత ఆ స్నేహితుడు జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ‘మనం ఎవరికంటే ఎక్కువ కాకపోయినా తక్కువ మాత్రం కాదు’ అని వివేకానందుడి నమ్మకం. దానికి నచికేతుడిని ఉదహరించేవాడు. కఠోపనిషత్తులోని నచికేతుని వృత్తాంతంలో ఆయన ధీరత్వం, ఆత్మస్థైర్యం అర్థమవుతాయి. ఆయనే నాకు స్ఫూర్తి, ఆదర్శం అనేవాడు వివేకానందుడు. -
కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేకు మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్ : కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తల్లి శ్యామల మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం శ్యామల అంత్యక్రియలు జరుగనున్నాయి. -
వివేకానందుడు స్ఫూర్తి ప్రదాత
తానా అధ్యక్షుడు సతీశ్ వేమన కకందుకూరు : లల్ని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించు అన్న స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీశ్ వేమన అన్నారు. స్టెప్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి యువజనోత్సవాలను శుక్రవారం స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్నత చదువులతో పాటు సంపాదనకు సైతం అవకాశం ఉంటుందన్నారు. యువత దీన్ని ఉపయోగించుకుని తిరిగి మాతృభూమి సేవ చేయాలని ఆకాంక్షించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని తెలుగువారి సంక్షేమం కోసం తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో సైతం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో యువత ఉపాధి కోసం ఎయిర్టెల్ కాల్ సెంటర్ ప్రారంభించిన ప్రకాశం యాజమాన్యాన్ని అభినందించారు. స్టెప్ సీఈఓ రవి మాట్లాడుతూ యువతలో దాగి ఉనన నైపుణ్యాలను వెలికి తీయడానికి నిర్వహిస్తున్న యువజనోత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ట్రెజరర్ కంచర్ల శ్రీకాంత్, తానా సభ్యులు వడ్లమూడి విష్ణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలి
లక్సెట్టిపేట: యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎంఈవో రవీందర్ సూచించారు. మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జై హన్మాన్ యూత్ అధ్యక్షుడు తగరపు సత్తయ్య, నాయకులు ప్రవీణ్, రవిజోసెఫ్, స్వామి, రాజ్కుమార్, సురేష్ పాల్గొన్నారు. -
పింఛన్ దారులకు ఇబ్బంది కలగనీయం
రాష్ట్రంలో ఉద్యోగ పింఛన్ తీసుకుంటున్న 2.2 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పింఛన్ దారులు ఏటా నవంబర్లో ట్రెజరీ లేదా బ్యాంకుల్లో వారి జీవిత ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంటుందని.. ఆయా చోట్లకు రాలేని స్థితిలో ఉన్న పింఛన్ దారుల వద్దకు ప్రభుత్వ సిబ్బందే వెళ్లి సర్టిఫికెట్ తీసుకుంటారని చెప్పారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్, 108 ఉద్యోగుల వేతనాల అంశంపై సున్నం రాజయ్య (సీపీఎం), ఎన్టీఆర్ వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలం టూ రేవంత్రెడ్డి(టీడీపీ)లు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. -
సృజనాత్మకత
నంద్యాల: ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ కాఫీ పొడితో స్వామి వివేకానంద చిత్రాన్ని తీర్చిదిద్దారు. గురువారం స్వామి వివేకానందుడి జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని వేశానని చెప్పారు. ఆయన ప్రబోధాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. -
‘వివేకానంద బాట అనుసరణీయం’
ఇచ్చోడ : యువత వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలని, ఆయన మార్గం సదా అనుసరణీయమని రామకష్ణ సేవాసమితి ఆదిలాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి లెనిన్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీపాఠశాలలో శనివారం ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలలోని ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వివేకానందుడి జీవితం, ఆయనిచ్చిన సందేశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ విద్యార్థి వివేకాందుడి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. వివేకానందుడు చెప్పిన వాటిలో కొన్నింటినైనా ఆచరించే ప్రయత్నం చేయాలని కోరారు. అనంతరం వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సీహెచ్ క్రిష్ణ(ఆశ్రమ పాఠశాల తోషం), రెండో బహుమతి వాగదేవ్(ఆశ్రమ పాఠశాల, తోషం) గెలుపొందారు. కార్యక్రమంలో సమితి సభ్యులు లంక హన్మండ్లు, ప్రశాంత్రెడ్డి, స్థానిక పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వీకే ప్రకాశ్ వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
వివేకానంద, బోస్లపై వేటా?
విశ్లేషణ కికెట్ గురించి చెప్పడానికి, బట్టల తయారీ విజ్ఞానానికి 37 పేజీలు కేటాయించి, జాతీయ యువజనులకు స్ఫూర్తి అయిన వివేకానందుని గురించి ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో కేవలం 26 పదాలు ఇవ్వడం అన్యాయం. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయ విప్లవ నాయకుల జీవిత కథలు కేంద్రీయ విద్యాలయాల పాఠ్యపుస్తకాలలో ఎందుకు తగ్గించారు? కొన్నింటిని ఎందుకు తొలగించారు? మరికొందరు మహానుభా వుల జీవిత గాధలను ఎందుకు చేర్చడం లేదు? అని రాజస్థాన్కు చెందిన సూర్యప్రతాప్ సింగ్ రాజావత్ ఫిర్యాదు. దానికి సరైన ప్రతిస్పందనను తెలియజేయా ల్సిన బాధ్యత జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ)పైన ఉంది. ఆ విధంగా అడిగే హక్కును సమాచార హక్కు ప్రతి పౌరుడికీ ఇచ్చింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకంలో స్వామి వివేకానంద జీవిత చరిత్రను 1,250 పదాల నుంచి 87 పదాలకు తగ్గించడం, 8వ తరగతి నుంచి పూర్తిగా తొలగించడం నిజమే అయితే.. క్రికెట్కు, బట్టల తయారీకి 37 పేజీలు కేటాయించి స్వాతంత్య్ర విప్లవ నాయకులకు తగిన స్థలం కేటాయించకపో వడం నిజమే అయితే.. 36 మంది జాతీయ నాయ కులకు పాఠ్యపుస్తకాలలో స్థానం లేకపోవడం నిజమే అయితే... అందుకు కారణాలు తెలియజేయాలి. దేశాన్ని నడిపిన కథానాయకుల జీవిత చరిత్రలను నిష్పాక్షికంగా, సైద్ధాంతిక ధోరణులకు తావులేకుండా పాఠాలుగా రూపొందించడానికి, సూర్యప్రతాప్ సింగ్ భయాందోళనలకు తావులేదని చెప్పడానికి ఏ చర్యలు తీసుకున్నారో సహ చట్టం కింద ఎన్సీఈఆర్టీ వివరించడం తప్పనిసరి. శ్రీ అరబిందో ఘోష్, అశ్ఫాక్ ఉల్లాఖాన్, బీకే దత్, బాదల్ గుప్త, భాఘాజతిన్ ముఖర్జీ, బారిందర్ ఘోష్, బాతుకేశ్వర్ దత్, బినయ్క్రిష్ణ బసు, భగత్ సింగ్, చంద్రశేఖర్, దినేశ్ గుప్త, డాక్టర్ సైపుద్దీన్ కిచ్ లెవ్, జతింద్రనాథ్ దాస్, కల్పనా దత్, కర్తార్ సింగ్, ఖుదీరామ్ బోస్, ఎంఎన్ రాయ్, బికాజీ కామా, మదన్ లాల్ ధింఘ్రా, శ్యాంజీ కృష్ణవర్మ, ఒబేదుల్లా సింధి, ప్రఫుల్లా చాకీ, ప్రీతిలతా వఢ్డేదర్, రాజా మహేంద్ర ప్రతాప్, రాంప్రసాద్ బిస్మిల్, రాణీ ైగైడిన్ లుయు, రాస్ బిహారీ బోస్, సచీంద్రనాథ్ సన్యాల్, సావర్కార్, సోహాన్సింగ్ భక్నా, సుఖదేవ్, సూర్య సేన్, స్వామీ వివేకానంద, ఉధ్దమ్సింగ్ వంటి మహా నాయకుల జీవితాలను ఎందుకు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో చేర్చలేదని రాజస్థాన్ శ్రీ అరబిందో సొైసైటీ కన్వీనర్ సూర్యప్రతాప్ విమర్శించారు. 2007 ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎని మిదో తరగతి పుస్తకంలో 500 పదాలు, 12వ తరగ తిలో 1250 పదాల పాఠాలు ఉండేవని, ఆ తరువాత 12వ తరగతి పాఠం 87 పదాల వ్యాసానికి తగ్గించా రని ఎనిమిదో తరగతి నుంచి పూర్తిగా నేతాజీ పాఠాన్ని ఎత్తివేసారని తెలియజేయాలని, నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ వంటి విప్లవకారులతో సహా మొత్తం 36 మంది జాతీయ నాయకులకు అన్యాయం జరిగిందని వారి జీవనగాధలను సంక్షిప్తంగా కూడా చేర్చలేదని కూడా విమర్శించారు. క్రికెట్ గురించి చెప్పడానికి, బట్టల తయారీ విజ్ఞానానికి 37 పేజీలు కేటాయించి, జాతీయ యువ జనులకు స్ఫూర్తి అయిన వివేకానందుని గురించి కేవలం 26 పదాలు ఇవ్వడం అన్యాయం అనీ, అరబిందో ఘోష్కు సంబంధించి ఒక వాక్యం కూడా లేదని అన్నారు. భగత్ సింగ్ బికె దత్ గురించి ప్రస్తావించినా మిగిలిన వారికి ఆ భాగ్యం కూడా దక్కలేదని అన్నారు మన భారత చరిత్రకు చెందిన ఒక మౌలిక స్వరూపాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఎన్సీఈ ఆర్టీకి ఉందని వాదించారు. 2005 విధానం ప్రకారం, కష్టం గాకుండా నేర్చు కోవాలనే సూత్రం ఆధారంగా సామాజిక శాస్త్రాల సిలబస్ను సిలబస్ రివిజన్ కమిటీ మార్చిందని, పాఠ్యపుస్తక రచనా సంఘాలలో ఆయా అంశాలలో నిపుణులు ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులు విద్యా ర్థులు చిన్న చిన్న బృందాలలో కూర్చుని చర్చించుకు నేంత సులువుగా పాఠాలు రూపొందిస్తున్నారని ఎన్ సీఈఆర్టీ జవాబు ఇచ్చింది. విద్యార్థులకు సులువైన రీతిలో అందుబాటులోకి ఈ విషయాలను తేవాలనే ఉద్దేశంతో కమిటీలు పాఠాలను నిర్ణయిస్తున్నాయని ఎన్సీఈఆర్టీ పక్షాన ప్రొఫెసర్ నీరజా రశ్మి వివరిం చారు. అయినా అభ్యర్థి అడిగినది సమాచార హక్కు చట్టం కింద సమాచారం కిందకురాదని, అది వారి అభిప్రాయం మాత్రమే అని, దానికి ఇవ్వగలిగిన సమాచారమేదీ లేదని సమాధానం చెప్పారు. అయినా ఈ సూచనలను సంబంధిత కమిటీల ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. సూర్య ప్రతాప్ గారి పత్రాన్ని ఫిర్యాదుల కమిటీకి కూడా పంపామని, వారి జవాబు వెబ్సైట్లో ఉందని ఆ విష యం కూడా చెప్పామని వివరించారు. వారి ఫిర్యా దును సానుకూలంగా పరిష్కరించామని అన్నారు. సూర్యప్రతాప్ సమాచార అభ్యర్థనలో ఫిర్యాదు ఉందని, దాన్ని ఫిర్యాదుగా భావించి పరిష్కారం ఏమిటో స్పష్టంగా చెప్పకుండా మీరడిగింది సమాచా రమే కాదనడం న్యాయం కాదని కమిషన్ పేర్కొంది. కనీసం ఈ అంశంపైన పరిశీలన జరిగిందా, ఏదైనా చర్య తీసుకున్నారా లేదా తెలియజేయాలని సీఐసీ ఆదేశించింది. పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఎన్సీ ఈఆర్టీ తన విధానాన్ని స్వయంగా ప్రకటించ వలసిన బాధ్యత సెక్షన్ 4(1)(సి) కింద ఉందని, తమ నిర్ణయాల ద్వారా బాధితులైన వారికి కారణాలు తెలిపే బాధ్యత సెక్షన్ 4(1)(డి) కింద నిర్దేశించారు. (Suryapratap Singh Rajawat Vs. NCERT, New Delhi, ఇఐఇ/ఇఇ/అ/2014/000207 అ కేసులో 22.1.2016 నాటి తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
వర్సిటీల్లో వివేకానంద కార్యక్రమలు: యూజీసీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వామి వివేకానంద 153వ జయంతి సందర్భంగా జనవరి 12న ఆయన ఆలోచనలు, ప్రభోధాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) దేశంలోని అన్ని వర్సిటీలకు కోరింది. తన ప్రభోధనల ద్వారా దేశ, విదేశాల్లో వివేకానంద చెరగని ముద్ర వేశారని, ఆయన ప్రభోధనలు దేశ యువతకు స్పూర్తిదాయకమని యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వారసత్వాన్ని పరిరక్షంచడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
వివేకానందుని మార్గం ఆదర్శనీయం
కేంద్ర మంత్రి సదానందగౌడ బెంగళూరు: వివేకానందుని ఆదర్శాలు నే టి తరానికి ఆదర్శనీయమని కేంద్ర న్యాయశా ఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో భాగంగా సోమవారమిక్కడి యశ్వంతపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివేకానందుని విగ్రహాన్ని సో మవారం ఆయన లాంఛనంగా ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఏ విధంగా ఆలోచించాలో, ఎలా ఉండాలో వివేకానందుడు మార్గనిర్దేశనం చేశారన్నారు. ఆ మార్గంలో యువత సాగితే విజయాలను సొం తం చేసుకోవచ్చునన్నారు. కేంద్ర ఎరువులు, ర సాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మా ట్లాడుతూ స్వామి వివేకానందుని మార్గాన్ని అ నుసరిస్తూ దేశాన్ని మరింత బలోపేతం చేసే ది శగా యువత ముందుకు సాగాలని సూచించా రు.మాజీ మంత్రి ఎస్.సురేష్కుమార్, ఎమ్మెల్యే అశ్వత్థనారాయణ పాల్గొన్నారు. -
కుంచెతో యువతకు సందేశం
పెందుర్తి: ‘ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి. నిత్యం దాని గురించి కలలు కనాలి. దానిని చేరుకునేందుకు నిరంతరం శ్రమించాలి. అప్పుడు ఎలాంటి లక్ష్యమైనా నీ పాదాల చెంతకు చేరుతుంది. నీ స్పూర్తితో మరికొందరు నీ బాటలో నడవాలి’ యువతకు వివేకానందుడు ఇచ్చిన సందేశమిది. దీన్ని అక్షరాల పాటిస్తున్నారు యువ కార్టూనిస్ట్ బి.హరివెంకటరమణ. పెందుర్తి దరి పురుషోత్తపురంలో నివాసం ఉంటున్న హరి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కార్టూనిస్ట్గా గుర్తింపును పొందారు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల కార్టూన్లు, మూడు యానిమేషన్ చిత్రాలు, ఐదు షార్ట్ఫిల్మ్లు, మూడు డాక్యుమెంటరీలు, నాలుగు పుస్తకాలు రచించారు. 2013లో వివేకానందుని జయంతి సందర్భంగా జాతీయ యూత్ అవార్డు సాధించారు. హరి తన కార్టూన్లతో యువతను మేలుకొల్పేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆధునిక పోకడలు, పెరిగిన సాంకేతికత, విదేశీ సంస్కృతిపై వ్యామోహం తదితర అంశాలపై తనదైన శైలిలో యువతకు సందేశాన్ని అందిస్తున్నారు. వివేకానందుని వాక్కులే స్ఫూర్తి నేటి యువత టెక్నాలజీని, సోషల్ మీడియాను వేదిక చేసుకుని అద్భుతాలు చేస్తున్నారు. షార్ట్ఫిల్మ్ల ద్వారా తమ ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు చాలా వరకు అవి ప్రేమ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ వాటికి సామాజిక అంశాలను జత చేసి చూపిస్తే కొంతవరకైనా సమాజంలో మార్పు వస్తుంది. ‘బీ బోల్డ్.. బీ స్ట్రాంగ్’ అన్న స్వామి వివేకానందుని మాటలే నాకు స్ఫూర్తి. కళారంగం ద్వారానే మన ఉద్దేశాన్ని అందరికీ సులభంగా చెప్పవచ్చు. - హరి -
జిల్లాకు ఐదుగురు కొత్త డీఎస్పీలు
సీఐల పదోన్నతుల్లో భాగంగా నియామకం పోలీసు శాఖ మరింత బలోపేతం శ్రీకాకుళం కైం: జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతమవుతోంది. పెరుగుతున్న అవసరాలను గుర్తించి జిల్లాకు ఐదు డీఎస్పీ పోస్టులను మంజూరు చేయగా.. సీఐల పదోన్నతుల్లో భాగంగా ఆ ఐదు పోస్టులకు అధికారులను కేటాయించారు. విశాఖ రేంజ్ పరిధిలో పలువురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు ఇస్తూ పోలీసుశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా ఐదుగురు డీఎస్పీలు నియమితులయ్యారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ)లో ఇప్పటికే ఒక డీఎస్పీ ఉండగా మరో డీఎస్పీని జిల్లాకు ఐదుగురు కొత్త డీఎస్పీలు కేటాయించారు. అలాగే డీసీఆర్బి, సీసీఎస్, ట్రాఫిక్. మహిళా పోలీసు స్టేషన్లకు కొత్తగా డీఎస్పీలను కేటాయించారు. విశాఖపట్నం సిటీలో సీఐగా పనిచేస్తున్న సీహెచ్ వివేకానందను జిల్లా ఎస్బీ డీఎస్పీగా, గతంలో జేఆర్పురం సీఐగా పని చేసిన కె.వేణుగోపాలనాయుడుకు సీసీఎస్ డీఎస్పీగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం టెక్కలి సీఐగా పనిచేస్తున్న పి.శ్రీనివాసరావును ట్రాఫిక్ డీఎస్పీగా, సీసీఎస్ సీఐగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసరావును మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీగా నియమించారు. ఇదిలా ఉండగా గతంలో శ్రీకాకుళం డీఎస్పీగా ఉంటూ రివర్షన్కు గురైన పి.శ్రీనివాసరావును మళ్లీ డీఎస్పీగా నియమించి డీసీఆర్బీకి కేటాయించారు. -
వాహనాలకు ఆకతాయిల నిప్పు
తిరుపతిక్రైం, న్యూస్లైన్: తిరుపతిలో వాహనాలకు భద్రత కరు వైంది. ఇంటిముందు పార్క్ చేసిన వాహనాలను ఇంతకాలం దొంగలెత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఏకంగా ఆకతాయిలు నిప్పే పెడు తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆకతాయిల చేష్టల వల్ల నాలుగు బైక్లు, కారు కాలిపోయాయి. కొర్లగుంట వివేకానంద వీధిలో వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డు ఉద్యోగి సుబ్రమణ్యంరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ఆదివారం రాత్రి తన కారు, స్ల్పెండర్ప్లస్ బైక్ను ఇంటిముందు రోడ్డుమీద పార్కు చేశారు. అదే వీధిలో వాసుదేవరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన స్కూటీ పెప్(ఎపి03 ఎసి3740)ను, అదే ఇంటిలో అద్దెకు ఉంటున్న ఇద్దరు ఎస్వీ మెడికల్ కళాశాల విద్యార్థులు కారుణ్య, సురేష్కు చెందిన రెండు బైక్లను ఇంటిముందు పార్క్ చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సుబ్రమణ్యంకు చెందిన కారుతోపాటు పక్కన పార్క్ చేసిన బైక్ మంటల్లో కాలుతుండడాన్ని పొరుగింటివారు గుర్తించి కేకలు వేశారు. అప్పటికే కారు వెనుకభాగం, బైక్ పూర్తిగా కాలిపోయాయి. వారు సుబ్రమణ్యంరెడ్డిని నిద్రలేపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేసి వెళ్లిపోయారు. తర్వాత మరో 25 నిమిషాలకు వాసుదేవరెడ్డికి చెందిన స్కూటీ పెప్తోపాటు అద్దెకు ఉంటున్న వైద్యవిద్యార్థుల బైక్లు సైతం కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సంఘటన జరిగిన రెండు ప్రాంతాలను ఈస్ట్ ఎస్ఐ ప్రవీణ్కుమార్, సిబ్బంది పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయిల పనే.. రాత్రిళ్లు మందుబాబులు, ఆకతాయిలు కొర్లగుంట, తుడా సర్కిల్ ప్రాంతాల్లో నిత్యం తిరుగుతుంటారు. తుడారోడ్డులో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటితోపాటు పెద్దకాపు లే అవుట్లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో రాత్రి పొద్దుపోయేంతవరకు మద్యం విక్రయాలు జరుపుతుంటారు. అక్కడ మద్యం సేవించిన అకతాయిలు పక్కనే ఉన్న వివేకానంద వీధిలో రోడ్డుమీద పార్క్ చేసిన బైక్లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. తుడా సర్కిల్లో రాత్రిళ్లు రెండు గంటల వరకు ఫుట్ పాత్మీద టిఫిన్లు విక్రయిస్తుండడంతో మందుబాబులు అరుపులు, కేకలతో ఆప్రాంతమంతా అర్ధరాత్రి దద్దరిల్లుతూంటుంది. గస్తీ పోలీసులు ఉన్నట్టా లేనట్టా.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లగుంట వివేకానందవీధిలో నైట్ బీట్లో ఉన్న కానిస్టేబుళ్లు రాత్రి ఆ ప్రాంతానికి గస్తీకి వెళ్లారా?లేదా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ తిరుగుతుంటే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నైట్ బీట్లను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమంది నైట్ బీట్లో ఉన్న పోలీస్ సిబ్బంది మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నారనే అరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
వివేకానందుడే ఆదర్శం
కర్నూలు(కల్చరల్), న్యూస్లైన్: స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సుదర్శన్రెడ్డి తెలిపారు. స్థానిక మెడికల్ కాలేజీ మైదానంలో వివేకానంద జయంతి ఉత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకాగ్రత, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. ప్రతిరోజు వివేకానందుని సూక్తులను గుర్తు చేసుకుంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సరస్వతి విద్యా పీఠం క్షేత్ర సంఘటన కార్యదర్శి(హైదరాబాద్) లింగం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. బలమే జీవనం, బలహీనతే మరణం అని చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడన్నారు. సంకల్పం మంచిదైతే, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెడితే విజయం తప్పక వరిస్తుందని రవీంద్ర విద్యా సంస్థల డెరైక్టర్ పుల్లయ్య అన్నారు. వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఒక ఉత్తమ సంకల్పంతో కర్నూలు నగరంలోని రాజ్విహార్ సర్కిల్లో వివేకానందుడి విగ్రహం ప్రతిష్టించిందన్నారు. ఆకట్టుకున్న ర్యాలీ : ఉదయం 10 గంటల నుంచి నగరంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వివేకానందుని చిత్ర పటాల ఫ్లెక్సీలతో ర్యాలీగా కదిలి వచ్చారు. కొందరు విద్యార్థులు వివేకానందుని వేషధారణలో ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాష్, నగరపాలక సంస్థ కమిషనర్ వివిఎస్.మూర్తి, కట్టమంచి స్కూల్ డెరైక్టర్ జనార్దన్ రెడ్డి, వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి, కార్యదర్శి ఎన్.శ్రీనివాసరెడ్డి, కార్యాధ్యక్షులు కిష్టన్న, కోశాధికారి శివ ప్రసాదరావు,రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలల డెరైక్టర్ రామమోహన్, సుబ్బయ్య, కాళంగి నరసింహ వర్మ, సందడి సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..!
సుబోధ శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..! కలకత్తాలో భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తా దంపతులకు 1863 జనవరి 12న నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఓ బాలుడు, చిన్న వయసులోనే శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో ఒదిగాడు. స్వామి వివేకానందగా ఎదిగాడు. కేవలం తన ఒక్కడి మోక్షం కోసం సాధన చేేన సాధారణ తపస్విలా కాక, సమాజంలోని దీనులను ఉద్ధరించాలని తపించిన మహోన్నతుడిగా చివరి దాకా జీవించారు వివేకానంద. ఆధ్యాత్మికత అంటే, ముక్కు మూసుకొని, ప్రపంచానికి దూరంగా బతకడమని ఆయన చెప్పలేదు. తోటి మానవుడిలోనే మాధవుడున్నాడన్న వాస్తవాన్ని బలంగా ప్రతిపాదించారు. అందుకే ఆయన ఓ సందర్భంలో, ‘‘నా మాటంటే మీకు ఏమైనా విలువ ఉంటే, నేనొక సలహా ఇస్తాను. మీ ఇంటి కిటీకీలు, తలుపులు తెరిచేయండి! మీ వాటాలో పతనావస్థలో, దుఃఖంలో పేదవాళ్ళు కుప్పలుగా పడి ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి, ఉత్సాహంతో, పట్టుదలతో సేవచేయండి. జబ్బుపడిన వారికి మందులివ్వండి. యావచ్ఛక్తితో వారికి ఉపచర్య చేయండి. తిండి లేక మాడిపోతున్నవాళ్ళకు ఆహారం అందించండి. అజ్ఞానులైన వారికి మీలో ఉన్న జ్ఞానం మేరకు బోధనలు చేయండి..’’ అని అతి పెద్ద ధర్మసూక్ష్మాన్ని అత్యంత సరళంగా చెప్పేశారు. ‘‘ప్రతి పురుషుణ్ణీ, స్త్రీనీ, ప్రతి జీవినీ దైవంగా చూడండి. అత్యంత నిష్ఠను పాటించిన అనంతరం నేను ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడనే పరమ సత్యాన్ని కనుగొన్నాను. అది వినా వేరే దైవం లేదు’’ అని తేల్చారు. మరో అడుగు ముందుకు వేని,... ‘‘ప్రత్యక్ష దైవమైన నీ సోదర మానవుణ్ణి పూజించలేనివాడివి, ప్రత్యక్షం కాని పరమాత్ముణ్ణి ఎలా పూజించగలవు?’’ అని సూటిగానే ప్రశ్నించారు. ‘జీవాత్మ సేవ చేసేవాడు పరమాత్ముని సేవించినట్లే!’ అని పదే పదే గుర్తు చేశారు. మహాత్మాగాంధీ అన్నట్లు ‘‘స్వామి వివేకానందుని బోధనలకు ప్రత్యేకంగా ఎవరి నుంచీ ఎటువంటి పరిచయమూ అవసరం లేదు. చదివేవారి మీద వాటంతట అవే చెరగని ముద్ర వేస్తాయి.’’ భౌతికంగా కనుమరుగైన 111 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ నిత్య చైతన్య దీప్తిగా స్వామీజీని నిరంతరం తలుచుకోవడం, అన్నేళ్ళ క్రితం ఆయన చెప్పిన మాటలతో నవతరం స్ఫూర్తి పొందడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చింతన జెన్ అంటే ఏమిటి? భారతదేశంలో పుట్టి, చైనాలో చిన్గా మారి, కొరియా, జపాన్ నేలల్లో ఇంకి, ఆ దేశాలను సారవంతం చేసిన ఒక అద్భుత, సజీవ చైతన్యమే జెన్. బౌద్ధ, జైన మతాలలోని కఠోర నిబంధనలను అనుసరించలేని వారికోసం ఆ రెండు మతాల మేలు కలయికగా పుట్టిందే జెన్. దీనిని ఎవరు ప్రతిపాదించారో ఇతమిత్థంగా తెలియదు. అయితే బోధిధర్ముడే దాని మూలపురుషుడని కొన్ని గ్రంథాలు చెబుతాయి. ఇంతకీ జెన్ అంటే ఏమిటి... చతురోక్తులు, సునిశిత హాస్యం, విషాదం, సరసం తదితరాలు కలిసిన ఓ నవరస గుళిక. మనలోని నైపుణ్యాల వెలికితీతకు ప్రతీక. ప్రాపంచికమైన జీవితానికి, విషయాలకు సంబంధించి ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పరచుకునేందుకు అనువైన మార్గమే జెన్. జీవితాన్ని తాజాగా, మరింత సంతృప్తిగా ఉంచే మార్గం జెన్. గురువుల సహకారంతో వ్యక్తిగత అనుభవం ద్వారా సమకూరే ఒక ఆధ్యాత్మిక సంపూర్ణ జ్ఞానం జెన్. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో జీవన సరళినే ఉదాహరణగా సరళమైన కథల రూపంలో.. కళ్లకు కడుతుంది. జెన్ కథలను చదివితేమన లోపాలు ఏమిటో మనకే తెలిసిపోతాయి. సమస్యను ఎలా ఎదుర్కోవాలో బోధపడుతుంది. అందుకే జెన్ కథలు ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందాయి. -
వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి
నయీంనగర్, న్యూస్లైన్ : యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ కిషన్పురలోని వాగ్దేవి కళాశాలలో ఆదివారం వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సమ్మేళనాన్ని నిర్వహించారు. కలెక్టర్ కిషన్ అధ్యక్షత వహించి సమ్మేళనాన్ని జ్యోతి వెలిగిం చి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ రాజయ్య హాజరై మాట్లాడుతూ యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన వివేకానందుడి సేవలు మరువలేనివన్నారు. అన్నింటి కంటే జ్ఞానం గొప్పదని, యువత జ్ఞానాన్ని పెంపొం దించుకుని తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు. ప్రపంచ జనాభాలో భారతదేశం రెం డో స్థానంలో ఉందని వివరించారు. ఉన్నత విద్య పూర్తి చేసుకున్న యువత సైతం మాన వ సంబంధాలను మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి యువత సన్మార్గంలో నడవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యంతో యువత ముందుకు సాగాలని కోరారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి సంస్కృతీసంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న నేటి యువతలో తగిన నైపుణ్యత కొరవడిందని చెప్పారు. యువత చెడు అనుకరణలతో బంగారు భవిష్యత్ను అంధకారంలోకి నెట్టివేసుకుంటుందన్నారు. ప్రతి గ్రీవెన్స్లో 50 మంది డిగ్రీలు, పీజీలు చదువులు పూర్తి చేసుకున్న యువతీయువకులు కనీసం అటెండర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పించాలని దరఖాస్తులు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలోకి రావాలని ఆయన సూచించారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో 40 శాతం యువత ఉందని ఆయన తెలిపారు. యువత శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త కార్యదర్శి పాలకుర్తి విజయ్కుమార్కు కలెక్టర్ అవయదాన పత్రాన్ని అందజేశారు. సమావేశంలో రామకృష్ణ మఠం నుంచి ఆత్మపరమానందస్వామి, సెట్వార్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి కె.పురుషోత్తం, నెహ్రూ యువకేంద్రం మనోరంజన్, యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు పాల్గొన్నారు. -
వివేకానందుడి బోధనలు అనుసరణీయం
=రామకృష్ణ సేవా సమితి బాధ్యుడు చిటికానంద మహరాజ్ =కేయూకు చేరిన రథయాత్ర =ఘన స్వాగతం పలికిన విద్యార్థులు, అధికారులు కేయూ క్యాంపస్, న్యూస్లైన్ : ఎప్పటికీ ఆదర్శంగా నిలిచే వివేకానందుడి బోధనలను అందరూ అనుసరించాలని హైదరాబాద్లోని రామకృష్ణ సేవా సమితి బాధ్యులు స్వామి చిటికానంద మహరాజ్ సూచించారు. వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రామృష్ణ సేవా సమితి, జయంత్యుత్సవాల సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ప్రారంభించిన రథయాత్ర సోమవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీకి చేరింది. ఈ సందర్భంగా కాన్వొకేషన్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో మహరాజ్ మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి విద్యార్థుల్లో వ్యక్తిత్వ నిర్మాణం పెంపొందేలా విద్యావిధానం ఉండాలని చిటికానంద అభిప్రాయపడ్డారు. విద్యార్థులు మానవత్వంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించా రు. ఇందులో ఎక్కడా భారతీయ సంప్రదాయాలు, విలువలు, సనాతన ధర్మాన్ని విస్మరించొద్దని కోరారు. సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం మాట్లాడుతూ వివేకానందుడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి వివేకానందుడి జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందాలని సూచించారు. తొలుత కేయూకు చేరుకున్న రథయాత్రను రెండో గేట్ వద్ద రిటైర్డ్ అధ్యాపకుడు గుజ్జల నర్సయ్య ప్రారంభించగా, పరిపాలనా భవనం నుంచి కాన్వొకేషన్ మైదారం వరకు వీసీ వెంకటరత్నం యాత్ర వెంట నడిచారు. అలాగే, యాత్ర సాగిన దారి పొడవునా విద్యార్థులు పూలతో స్వాగతించారు. ఇంకా వివేకానందుడి విగ్రహానికి పలువురు పూలమాలలు వేశారు. సమావేశంలో రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి మురళీధర్, ప్రభుచైతన్య, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.దామోదర్, ప్రొఫెసర్లు రాజయ్య, బాలస్వామి, వివిధ సంఘాల బాధ్యులు రావుల కృష్ణ, నమిండ్ల సుమన్, తిరుపతి, రాజేష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. కాగా, వివేకానందుడి జీవిత చరిత్ర-సందేశం పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. -
ఫుట్బాల్ పోటీల్లో నల్లగొండ ఓటమి
రామకృష్ణాపూర్, న్యూస్లైన్ : ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న పోటీలను పెద్దపెల్లి ఎంపీ వివేకానంద, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలీ రఫత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్ఫాస్ట్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, పూల్-ఏలో నల్లగొండ-ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో 0-5 గోల్స్తో నల్లగొండ ఓడిపోయింది. అలాగే ఈస్ట్ గోదావరి-మెదక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎవరూ గోల్స్ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. పూల్-బీలో విశాఖపట్నం-నిజామాబాద్ జట్లు తలపడగా 7-0 గోల్స్ తేడాతో విశాఖపట్నం గెలుపొందింది. -
నీళ్లు దోచుకుంటున్నది సీమాంధ్రులే..
బెల్లంపల్లి, న్యూస్లైన్ : తెలంగాణ నీళ్లు, నిధులు దోచుకుంటున్నది సీమాంధ్రులేనని పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, ఎగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నుంచి నీళ్లు రావని సీమాంధ్ర నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి జరగకుండా ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాలు 298 టీఎంసీలు రావాల్సి ఉందన్నారు. రాయలసీమకు 144 టీఎంసీల నీళ్లు వెళ్లాల్సి ఉండగా 364 టీఎంసీలు వాడుకోవడానికి ప్రాజెక్టులు కడుతున్నారని తెలిపారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులెవరూ పనిచేయడం లేదన్నారు. హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికులు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని పేర్కొన్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జి.వినోద్, రాష్ట్ర నాయకుడు సిలువేరు నర్సింగం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, టీబీజీకేఎస్ ఏరియా సంయుక్త కార్యదర్శి జి.చంద్రశేఖర్, నాయకులు కొమ్మెర లక్ష్మణ్, కుంబాల రాజేశ్, ఎన్.రమేశ్, ఎస్.హరికృష్ణ, సత్తిబాబు, టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి బడికెల శ్రావణ్ పాల్గొన్నారు. నియామకాలు టీఆర్ఎస్లో పని చేస్తున్న పలువురికి ఎంపీ పదవులు కేటాయించారు. పార్టీ జిల్లా కార్యదర్శులుగా బెల్లంపల్లి నం.2 ఇంక్లైన్బస్తీకి చెందిన ఎల్తూరి శంకర్, బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన గోగర్ల రాజేశ్, తూర్పు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మునిమంద రమేశ్లకు నియామకపత్రాలు అందజేశారు. సీఎం కిరణ్ అబద్ధాల కోరు మందమర్రి రూరల్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అబద్ధాల కోరని పెద్దపల్లి ఎంపీ వివేకానంద విమర్శించారు. శుక్రవారం మందమర్రిలో ఆయన ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నీళ్లు, నిధులపై కేంద్రానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రాణిహిత ప్రాజెక్టుతో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఉన్న గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ తన స్వలాభం కోసమే హైదరాబాద్లో అశోక్బాబు సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు జే.రవీందర్, తోట రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వివేకానంద జయంతి సందర్భంగా కాకినాడలో సదస్సు
-
యువతకు వివేకానందుడు ఆదర్శం
దేవరకద్ర, న్యూస్లైన్: యువతకు ఆదర్శంగా నిలిచిన గొ ప్ప వ్యక్తి వివేకానందుడని, ఆయన ఆశ య సాధనకు యువ త ముందుకు రావాలని హైదరాబాద్ రా మకృష్ణ మఠం ప్రతినిధి స్వామి శిథికంఠనంద మహారాజ్ పిలుపు నిచ్చారు. వివేకానందుని 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న రథయాత్ర ఆదివారం దేవరకద్రకు చేరుకున్నది. వివేకానందుని రథయాత్ర ఊరేగింపు పట్టణంలో నిర్వహించిన అనంతరం స్థానిక శ్రీనివాస గార్డెన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. యువత వివేకానందుడి ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దే శభక్తితో పాటు మన సంస్కృతిని కాపాడేందుకు కట్టుబడి ఉండాలని కోరారు. వివేకానందుని జీవితచరిత్రను ప్రతి ఒక్కరూ చద వడంతో పాటు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను దేశం కోసం, సమాజం కోసం వినియోగించాలని కోరారు. మంచి మార్గంలో నడుస్తూ యువత సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అంతకుముందు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వామి శిథికంఠనంద మహారాజ్ను పలువురు పుర ప్రముఖులు సన్మానించారు. సమావేశంలో రథయాత్ర జిల్లా ఇన్చార్జి రాజమల్లేశ్, యూత్ఫర్సేవా ప్రతినిధి చైతన్యరెడ్డి, సర్పంచ్ శోభా, రాందాసు, కరణం రాజు, రాందేవ్రెడ్డి, యజ్ఞభూపాల్రెడ్డి, ఆంజనేయులుగౌడ్, జట్టినర్సింహా రెడ్డి, కొండశ్రీనివాసరెడ్డి, చంద్రయ్య, నర్వ శ్రీనివాసరెడ్డి,సుధాకర్రెడ్డి, నిరంజన్రెడ్డి, తదితరులు పాల్గోన్నారు. -
అమెరికాలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన రామ్దేవ్
-
గతమంతా శాస్త్రీయతే!
ద్వారకానగరాన్ని, శల్యుడికి, కృష్ణుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని... మహాభారతం అభివర్ణిస్తుంది. అంతేకాదు, ఆకాశంలో ఎగిరే యంత్రాల నుంచి ఆయుధాలు, క్షిపణుల ప్రయోగం గురించి కూడా ప్రస్తావిస్తుంది. వాటివర్ణన అణ్వాయుధాలను, ఎగిరే పళ్లాలను పోలి ఉంటుంది. ఇటీవలి కాలం వరకు ఆధునిక చరిత్రకారులు ద్వారకను పుక్కిటి పురాణంగా కొట్టిపారేశారు. రామసేతు, మహాభారతం, సరస్వతీ నది... వంటి వాటిని కూడా పుక్కిటి పురాణాలుగా ముద్రవేశారు. గుజరాత్లో ద్వారకానగరం, పెద్దకోటలు, భారీ పునాదులు తవ్వకాలలో బయటపడ్డాయి. ‘వీటిని మానవమాత్రులు నిర్మించలేరు’ అంటూ అధికారులు పేర్కొనడాన్ని బట్టి ఆ నగరాన్ని... దేవతలలో ఒకరైన విశ్వకర్మ నిర్మించాడన్న వాదన నిజమేనని సూచిస్తోంది. అలాగే అవాస్తవికమైనదిగా భావించిన సరస్వతీ నది ఉనికి నిజమేనంటూ ‘నాసా’ ధృవీకరించడం... మన పురాణాలలో వర్ణించినట్టుగానే అనేకానేక ప్రదేశాల ఉనికి నిజమేనని రుజువయింది. ఈ ఆవిష్కరణలలో పాశ్చాత్య మేధావులైన శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పాలు పంచుకుంటున్నారు. దేవుళ్లు, గంధర్వులు, యక్ష రాక్షసులు తదితరులంతా వివిధ డైమన్షన్స్ నుంచి వచ్చినవారేనని వైదికగ్రంథాలు పేర్కొంటున్నాయి. మానవజాతి మరొక డైమన్షన్ నుంచి వచ్చిందని, దేవుళ్లు దానిని పర్యవేక్షించారని ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అయితే ఈ వాస్తవాన్ని మెజారిటీ ప్రజల మనస్సుల నుంచి తుడిచివేయడం ఆసక్తికరమైన విషయం. ఆధునిక మానవుడు దేవుడే లేడని విశ్వసిస్తున్నాడు. తాను జీవించవలసిన పర్యావరణాన్ని, ప్రకృతిని స్వార్థం కోసం విధ్వంసం చేస్తూ ఈ భూమిపైన ఉన్న వనరులను దోచుకుంటున్నాడు. ఈ యుగంలో మానవుడు స్వార్థం, నిరీశ్వర వాదంతో తనతో సహా అన్నింటినీ విధ్వంసం చేస్తాడని పెద్దలు ఏనాడో స్పష్టంగా హెచ్చరించారు. ఈ వాస్తవాన్ని చూడగలిగినవారు, మానవ జాతిని కాపాడగలిగినవారు కొందరే వున్నారు. మహాభారతంలోని వనపర్వంలో మార్కండేయ మహర్షి కలియుగంలో జరగబోయే ఘట్టాలను స్పష్టంగా అభివర్ణించారు. వేదాలు మానవులకు ప్రవర్తనా నియమావళినే కాదు, దేవుళ్లతో సంభాషించేందుకు మార్గాలను (హవనాలు, మంత్రాలు) సూచించాయి. మనం ఈ డైమన్షన్లో పరిపూర్ణంగా జీవించామని భావించినప్పుడు తిరిగి మన ఇంటికి మనం వెళ్లేందుకు మార్గాన్ని కూడా వేదాలు సూచించాయి. వైదిక గురువుల మాటలలోని ప్రామాణికతను, విశ్వసనీయతను ఆధునిక శాస్త్రం నెమ్మదిగా ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో, వేల ఏళ్ల కిందటే గ్రంథస్థం చేసిన శాస్త్రీయ వాస్తవాలను కనుగొని, వేదాలు చెప్పింది వాస్తవమే తప్ప పుక్కిటిపురాణం కాదనే అభిప్రాయానికి వస్తున్నారు. ఏది ఏమైనా... మహాప్రళయానికి కారణ భూతమైన విషయం మాత్రం, ఆధునిక మానవుడికి శాశ్వతంగా అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతుంది. -
డీజీపీ పదవి ముగిసినా కొనసాగింపా..!
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించిన రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్రెడ్డిపై సీఎం కిరణ్కుమార్రెడ్డి అమితప్రేమ చూపుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద విమర్శించారు. శనివారం మంచిర్యాలలో తన నివాస గృహంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. డీజీపీగా దినేష్రెడ్డి పదవి కాలం ము గిసినా ఆయన స్థానంలో కొత్త డీజీపీ నియామకం విషయంలో నోరు మెదపడం లేదన్నారు. 30 జూలై 2011లో దినేష్రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. సాధారణం గా డీజీపీకి రెండేళ్ల పదవి కాలం ఉంటుందని.. ఇ ప్పటికే ఆ పదవి కాలం ముగిసిందని చెప్పారు. మ రొకరిని డీజీపీగా నియమించాల్సి ఉండగా.. సీ మాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం పే రుతో దినేష్రెడ్డిని కొనసాగించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దినేష్రెడ్డి తెలంగాణవాదులపై తప్పుడు కేసులు బనాయించి.. బైండోవర్లు చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సభలు.. సమావేశాల కోసం అనుమతి కోరి తే ఆఖరి దశలో అనుమతి ఇచ్చిన డీజీపీ సమైక్యవాదంతో సీమాంధ్రులు చే పడుతున్న కార్యక్రమాలకు కోరిన వెంటనే అనుమతి ఇస్తున్నారని అన్నా రు. దినేష్రెడ్డి స్థానంలో కొత్త డీజీపీని నియమిం చాలని డిమాండ్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు సుదమల్ల హరి కృష్ణ, పానుగంటి శ్రీనివాస్, తేజ పాల్గొన్నారు. -
‘దేశం కోసం పరుగు’కు అనూహ్య స్పందన
సిద్దిపేట, న్యూస్లైన్: స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగోలో ఉపన్యాసం చేసి సెప్టెంబర్ 11తో 120ఏళ్లు పూర్తయ్యాయి. భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటినది ఈ ఉపన్యాసమే. దీంతో స్వా మికి ఎనలేని కీర్తిప్రతిష్టలు వచ్చాయి. ఈ రోజు ను పురస్కరించుకుని బుధవారం జిల్లాలో చేపట్టిన ‘దేశం కోసం పరుగు’కు అనూహ్య స్పంద న లభించింది. ముఖ్యంగా యువత, విద్యార్థులు అధికసంఖ్యలో ఈ పరుగులో పాల్గొని దేశభక్తిని చాటారు. సిద్దిపేటలో జరిగిన ‘దేశం కోసం పరుగు’ను వన్టౌన్ సీఐ నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరసావర్క ర్ సర్కిల్ వద్ద జరిగిన సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరియాద అంజిరెడ్డి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడిన వా ళ్లే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ నాయకులు ప్రవీణ్, మల్లారెడ్డి, బీజేపీ నాయకులు, హిందూ ప్రతి నిధులు శ్రీకాంత్రెడ్డి, మోహన్రెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్, గోల్కొండ రాఘవులు, రాజేశం, చంద్రశేఖర్, భానుచందర్ పాల్గొన్నారు. మానవసేవకే పరితపించారు: బాలేంద్రజీ రామాయంపేట: రామాయంపేటలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశంకో సం పరుగులో విద్యార్థులు భారీగా పాల్గొన్నా రు. అనంతరం సిద్దిపేట ఎక్స్రోడ్లో నిర్వహించిన సమావేశానికి వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర కన్వీనర్ బాలేంద్రజీ హాజరై మా ట్లాడారు. మానవ సేవే మాధవ సేవగా దీనజనోద్ధరణ కోసం వివేకా పరితపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాలకృష్ణారెడ్డి, విద్యార్థులు, వివేకానంద యూత్ నాయకులు, ఆవాస విద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు. వివేకా ఆశయ సాధనకు కృషి చేయాలి గజ్వేల్: వివేకానందా ఆశయ సాధనకు యువ త కృషిచేయాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నరేష్బాబు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్లో ‘దేశ భవితకు యువత పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వమత సమ్మేళనంలో వివేకానందా భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పారని కొని యాడారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశానికి నలువైపులు నుంచి ప్రమాదాలు ముం చుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డ్రిగీ కళాశాల సైకాలజీ లెక్చరర్ శ్రీని వాసచారి మాట్లాడుతూ యువత శారీరక శక్తితో మానసిక శక్తిని అలవర్చుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వివేకానందా ఉత్సవసమితి గజ్వేల్ నియోజకవర్గ శాఖ కన్వీనర్ తుమ్మ క్రిష్ణ మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తిని యువకుల్లో నింపేందుకే వివేకా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు స్వామి, క్రాంతి, క్రిష్ణ, కర్ణాకర్రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద చూపిన మార్గంలో నడవాలి స్వామి వివేకనంద చూపిన మార్గంలో యువత నడవాలని జిల్లా యువజన సంక్షేమాధికారి ఎస్. రామచంద్రయ్య సూచించారు. బుధవారం గజ్వేల్లోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో ‘సేవా’ వలీంటరీ ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్(జాతీయ సేవా పథకం) అధ్వర్యంలో ‘వివేకనందుడు యువతకు ఆదర్శం’ అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ఈ సదస్సులో జూనియర్ కళశాల ప్రిన్సిపాల్ ఎలిజబెత్, ‘సేవా’ సంస్థ అధ్యక్షుడు దేశబోయిన నర్సింహులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి వం శీధర్, డీడబ్ల్యూఓ మేనేజర్ బాలయ్య, రామరాజు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఆదర్శం స్వామి వివేకానంద జోగిపేట: యువతుక ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని సీఐ సైదానాయక్ అన్నారు. జోగిపేటలో నిర్వహించిన జాతీయ యువ పరుగును ఆయన ప్రారంభించారు. అనంతరం అందోలు వద్ద ఉన్న వివేకానందుడి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జయంతి ఉత్సవాల కమి టీ జిల్లా కార్యదర్శి జె.లక్ష్మన్,సభ్యులు ఆర్.ప్రభాకర్గౌడ్, డీసీసీబీ మాజీ డెరైక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేలుకో భారత్..!
-
స్వామి వివేకానంద భోధనలు అనిర్వచనీయం