Young boy
-
శివమణితో సమానంగా.. జూనియర్ శివమణి!
డ్రమ్స్ పేరు చెప్తే ఇండియాలో శివమణి గుర్తుకు వస్తాడు. ఆయనో పెద్ద డ్రమ్స్ ప్లేయర్. ప్రితీష్ కూడా ఏం తక్కువ కాదు. జూనియర్ శివమణి అని చెప్పచ్చు. ఎ.ఆర్ ప్రీతీష్ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం తల్లిదండ్రులతోపాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఐదేళ్ల వయసులో అతను తొలిసారి డ్రమ్స్ చూశాడు. సరదాగా దాని మీద ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత అదే అతనికి పనిగా మారింది. వయసులో తనకన్నా పెద్దవాళ్ళతో పోటీ పడి మరీ వాయించేవాడు.డ్రమ్స్ మీద రకరకాల ప్రయోగాలు చేసేవాడు. 8వ తరగతి వచ్చేనాటికి ప్రదర్శనలు ఇస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకునేవాడు. ఆ తర్వాత అతని దృష్టి గిన్నిస్ రికార్డ్ మీద పడింది. ఎలాగైనా దాన్ని సాధించాలని అత్యంత వేగంగా డ్రమ్స్ వాయించడాన్ని నేర్చుకున్నాడు. ఏడు నెలలపాటు అదే పనిగా డ్రమ్స్ వాయించి ఆ పట్టు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గిన్నిస్ ప్రతినిధుల ముందు నిమిషానికి 2,370 సార్లు డ్రమ్స్ వాయించాడు. అంటే ఒక సెకనుకు దాదాపు 40 సార్లు డ్రమ్ వాయించాడు. అతని ప్రతిభ చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అత్యంత చిన్న వయసులో ఒక నిమిషంలో అత్యధిక సార్లు డ్రమ్స్ వాయించిన వ్యక్తిగా అధికారిక రికార్డు అందజేశారు. ప్రీతీష్ కల నెరవేరింది.ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా..వద్దొద్దు! చిన్నారులకోసం చిన్నారుల గేయంపాడుదాం గేయం తారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలుచంద్రుడి పక్కన చుక్కల్లా మెరిసే బంగరు గోపికలుఅంబరానికి తోరణమై నిలిచే అందాల జ్ఞాపికలుఎగరేసే దారం లేదు ఎవరి చేతి ఆధారం లేదుఎత్తున నిలిచే ఊతం అయినా మెరిసే తారకలుఏ రోజూ సెలవు లేదు ఏనాడూ అలుపు రాదువజ్రాలంటి మెరుపు ΄ోదుఅందుకే అవి తారకలుతారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలు∙ -
17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదన
ఆలోచన ఉండాలే గానీ.. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. ఈ డిజిటల్ యుగంలో అయితే.. కంటెంట్ క్రియేషన్ & డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో యువకులు డబ్బు సంపాదించడానికి సిద్దమైపోతున్నారు. ఇలాంటి మార్గాలను అనుసరించే ఓ బ్రిటీష్ యువకుడు నెలకు ఏకంగా రూ.16 లక్షల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.17 ఏళ్ల బ్రిటీష్ యువకుడు కెలన్ మెక్డొనాల్డ్.. పండుగ సీజన్లో ప్రత్యేకమైన స్టిక్కర్లను విక్రయించడం ద్వారా నెలకు 19000 డాలర్లు (రూ. 16,08,748) సంపాదిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అతని తల్లి ఇచ్చిన డిజిటల్ డ్రాయింగ్, కటింగ్ & ప్రింటింగ్ మెషీన్ను ఉపయోగించే ఇంత పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు.కెలన్ మెక్డొనాల్డ్ రూపొందించిన స్టిక్కర్ల ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేశారు. సొంతంగా రూపొందించిన స్టిక్కర్లను గాజు వస్తువులు, యాక్రిలిక్పై అంటించి.. డబ్బు సంపాదించేవారు. ప్రతి రోజూ కాలేజ్ పూర్తయిన తరువాత స్టిక్కర్ల వర్క్ మీద మూడు గంటలకు పనిచేసేవాడు.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ఇప్పటి వరకు కెలన్ 94,410.31 డాలర్లు సంపాదించినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 79.93 లక్షల కంటే ఎక్కువే. నాకు లభించిన క్రిస్మస్ కానుక ద్వారా ఇంతలా డబ్బు సంపాదించవచ్చని నేను ఊహించనే లేదు. ప్రస్తుతం నా సమయం కూడా చాలా వేగంగా సాగిపోతోంది కెలన్ మెక్డొనాల్డ్ వెల్లడించారు. -
హీరో విజయ్ బర్త్డే వేడుకల్లో అపశృతి.. కాలిపోయిన బాలుడి చేయి!
దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అభిమానుల అత్యుత్యాహం ప్రమాదానికి దారి తీసింది. విజయ్ 50వ బర్త్డే సెలెబ్రేషన్స్లో భాగంగా చెన్నై విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఈసీఆర్ శరవణన్ ఫ్యాన్స్ కోసం ఒక ట్రిక్రీ షోను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ షోలో ఓ యువకుడు కిరోసిన్ ఉపయోగించి స్టంట్ చేస్తున్నాడు. చేతికి మంటలు అంటించుకొని టైల్స్ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ కమ్రంలో ప్రమాదం జరిగింది. టైల్స్ పగలగొట్టిన తర్వాత యువకుడి చేతి మంటలు ఆరిపోలేదు. అది కాస్త ఎక్కువై చేయి మొత్తం కాలిపోయింది. ఈవెంట్లో పక్కనే ఉన్నవారు త్వరగా స్పందించి.. మంటలు ఆర్పేశారు. అనంతరం అంబులెన్స్లో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. -
వీల్చైర్లో వచ్చాడు... విల్పవర్ చూపాడు
వీల్చైర్కు పరిమితమైన ఈ యువకుడు విల్ పవర్ మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. స్నేహితుల సహాయంతో వీల్చైర్లో నుంచి రిషికేష్లో బంగీ జంప్ చేశాడు. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల మనసు దోచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ డేర్’ ‘మోర్ పవర్ టు యూ, బాయ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. చాలామంది హార్ట్ ఇమోజీలతో రియాక్ట్ అయ్యారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్ అవనీష్ బాజ్పాయ్ ఆర్టిఫిషియల్ లింబ్తో భటిండాలో 14,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
ఈ వయసులోనే పెళ్లి వద్దని మందలించడంతో.. విద్యార్థి విషాదం!
అనంతపురం: ప్రేమించిన బాలికతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థి (మైనర్) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన సోమనాథ్, రుక్మిణమ్మ దంపతుల పెద్ద కుమారుడు అభిషేక్ (17) కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపి పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. ఈ వయసులోనే పెళ్లి వద్దని బాగా చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత అదే అమ్మాయితో పెళ్లి చేస్తామని, అప్పటి వరకూ బుద్ధిగా చదువుకోవాలని తండ్రి సోమనాథ్ తెలిపాడు. ఇందుకు అభిషేక్ అంగీకరించలేదు. తనకిప్పుడే పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. దీంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు.... మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలను కుమారుడికి వివరించారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ గురువారం తెల్లవారుజామున తమ తోటలోకి వెళ్లి చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన తండ్రి సోమనాథ్... చెట్టు వేలాడుతున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇవి చదవండి: ‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు -
రూ.350 కోసం దారుణ హత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బాలుడు కేవలం రూ.350 కోసం 18 ఏళ్ల యువకుడిని అత్యంత పాశవికంగా హత్యచేశాడు. హత్య చేసి దోచుకున్న సొమ్ముతో బిర్యానీ తిందామని నిందితుడు భావించాడు. గొంతు నులిమి ఊపిరిపోయేలా చేసి కుప్పకూల్చాడు. వెంటనే కత్తితో విచక్షణారహితంగా 60 సార్లకుపైగా పొడిచాడు. తల, మెడ, కళ్లు, వీపు.. ప్రతి చోటా పొడిచాడు. ఒళ్లంతా రక్తసిక్తమైన మృతదేహంపై నిల్చుని డ్యాన్స్చేశాడు. ఈ దారుణ హత్య అక్కడి సీసీటీవీలో రికార్డయింది. మంగళవారం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలోని జనతా మజ్దూర్ కాలనీలో చోటుచేసుకుంది. హత్య తర్వాత నిందితుడు అక్కడ గుమికూడిన జనాన్ని దగ్గరకు రాకుండా బెదిరించాడు. విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని బుధవారం ఉదయం అరెస్ట్చేశారు. చనిపోయిన 18 ఏళ్ల మృతుడికి, 16 ఏళ్ల నిందితుడికి అస్సలు ముఖ పరిచయం కూడా లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు గత సంవత్సరంలోనూ ఇలా ఒకరిని డబ్బు దొంగలించేందుకు బెదిరించాడని తెలుస్తోంది. నిందితుడుసహా నలుగురు మైనర్లు ఒక గ్యాంగ్లా ఏర్పడి చిన్నపాటి చోరీలు చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మద్యం మత్తులో ఇలా విచక్షణారహితంగా ప్రవర్తించానని పోలీసుల ముందు నిందితుడు నేరం అంగీకరించాడు. -
సింగిల్ఫేజ్ స్థంబానికి కరెంట్ వైర్ పెడుతుండగా.. విషాదం!
నిజామాబాద్: తాడ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడిలో దూదేకుల ఇంతియాజ్ (25)అనే యువకుడు శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామ శివారులోని తన ఫౌల్ట్రీఫాం వద్దకు వెళ్లిన ఇంతియాన్ అక్కడనేఉన్న సింగిల్ఫేజ్ స్థంబానికి కరెంట్ వైర్ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అఫ్రిస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇవి చదవండి: రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడు.. -
వీడు మాములోడు కాదు, డ్రమ్ములు అదిరిపోవాల్సిందే
-
బుడతా..! నీ టాలెంట్కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్ను గురి చూసి కొడుతున్నాడు. దూరంలో ఉన్న లక్ష్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rudra Pratap singh (@littleyogaguru) ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్కు హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన్నోడు టాలెంట్ చూసేయండి. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని..
పామును చూస్తేనే మనం వణికిపోతాం.. తెలిసీ తెలియని వయసులో ఓ చిన్నారి పాముకు చుక్కలు చూపించాడు. పాము తోకను పట్టుకుని దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి అందరినీ భయపెట్టాడు. ఇది చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ఒక బుడతడు ఏకంగా పాముతో ఆడుకున్నాడు. దానిని చేతితో పట్టుకుని ఇంటి లోపలకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. అది చూసి కుటుంబ సభ్యులు దడుచుకున్నారు. ఈ క్రమంలో నేలపై కూర్చొన్న వారు ఒక్కసారిగా పైకి లేచి దూరంగా పరిగెత్తారు. గట్టిగా అరుస్తూ భయపడిపోయారు. అలాగే పామును లోపలకు తీసుకురావద్దని, బయటకు తీసుకెళ్లాలంటూ బాలుడికి సైగలు చేస్తూ గట్టిగా అరిచారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ బాలుడి మరో చేయి పట్టుకుని పాముతో సహా అతడిని ఇంటి బయటకు తీసుకెళ్లాడు. దీంతో, ప్రమాదం తప్పింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఈ ఘటనకు ఇంటి పెద్దల నిర్లక్ష్యాన్ని కొందరు విమర్శించారు. జంగిల్ బుక్ విలేజ్ బుక్గా మారిందని కామెంట్స్ చేశారు. ఈ వీడియో చూస్తే ఖంగు తింటారు.. నేడు(జూలై 16న) వరల్డ్ స్నేక్ డే.. ఈ సందర్భంగా పలువురు పాములకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, ఓ నెటిజన్ షాకింగ్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోకు తోక పట్టుకుని పామును జడ్జ్ చేయకండి అంటూ కామెంట్స్ పెట్టారు. Never Judge a snake by it's tail ? @Pendrive_Baba pic.twitter.com/ytet6ps7bg — Jude David (@judedavid21) September 6, 2021 ఇది కూడా చదవండి: వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య.. -
ఫ్రాన్స్లో ఆగని నిరసనలు
పారిస్: ఫ్రాన్స్లో పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి ఘటన అనంతరం మొదలైన ఉద్రిక్తతలు మూడో రోజు రాత్రి కూడా కొనసాగాయి. నిరసనకారులు వీధుల్లో అడ్డంకులు ఏర్పాటు చేసి, కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. బాణసంచా కాల్చి పోలీసుల పైకి వదులుతున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్డిపోకు, రోడ్లపై కార్లకు నిప్పుపెట్టారు. పారిస్లోని 12వ డిస్ట్రిక్ట్ పోలీస్స్టేషన్పై దాడి జరిగింది. రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్ను దోచుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు 40వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది పారిస్ రీజియన్కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ ప్రకటించారు. ఇలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. బాహాబాహీకి దిగిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు భవంతులకు, వాహనాలకు నిప్పుపెట్టారని ప్రభుత్వం తెలిపింది. టీనేజర్లను బయటకు రానివ్వకండి: తల్లిదండ్రులకు మాక్రాన్ వినతి దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లకు సోషల్ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి అనంతరం అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్ను తొలగించాలని కోరారు. వీడియో గేమ్లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు అస్తమానం వీధుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. -
తగ్గేదే లే.. ఈ బుడ్డోడి డాన్స్ చూశారా?
-
ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్కి మంత్రి ఫిదా!
చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్మేట్స్ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు. అతను పాడే విధానం ఏదో ఒక పెద్ద స్టార్ సింగర్ మాదిరి ఓ రేంజ్లో మంచి కాన్ఫిడెన్స్తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్న్ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. Bas itna confidence chahiye life me. 😀 "ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं ! नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi — Temjen Imna Along (@AlongImna) January 18, 2023 (చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు) -
Viral Video: మ్యాన్ హోల్ ను డంబెల్ లా ఎత్తేశాడు.. కానీ..!
-
హైదరాబాద్ నుంచి పారిపోయి కర్ణాటకలో సహజీవనం
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన ఓ మైనర్ బాలుడిని నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ బాలుడు(17), బాలిక (16) మే నెలలో తమ తమ ఇళ్లల్లో నుంచి పారిపోయారు. కూతురు కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కర్ణాటకలో వారు ఉన్నట్లు గుర్తించారు. కాగా బాలిక అప్పటికే నాలుగు మాసాల గర్భవతి. బాధ్యుడైన మైనర్ బాలుడిపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జువైనల్ హోమ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్) -
Viral Video : సింహంతో వ్యక్తి పరాచకాలు..
-
కన్నీళ్లు మిగిల్చి... వెళ్లిపోయావా కన్నా
విశాఖపట్నం: తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. పాఠశాలకు వెళ్తూ తల్లి కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందిన సంఘటన ఉక్కునగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక డీపాల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పెరుమాళ్ల ఎలీజా సేవారిన్ (9) తల్లితో కలిసి శనివాడలో నివసిస్తున్నాడు. తండ్రి ఎలై సేవారిన్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా తల్లి సౌజన్యతో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తల్లి సౌజన్య కుమారుడిని తీసుకుని స్కూటీపై స్కూల్కు బయల్దేరారు. సరిగ్గా డీపాల్ పాఠశాల కూడలి వద్దకు వచ్చేసరికి మలుపు తిరుగుతున్న స్కూటీని ఫార్మా కంపెనీకి చెందిన బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎలీజా సేవారిన్ కింద పడిపోవడంతో బస్సు బాలుడి తలపై నుంచి దూసుకుపోయింది. దీంతో చిన్నారి తల భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతిచెందాడు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో తల్లి సౌజన్య షాక్కు గురైంది. అప్పటి వరకూ తనతోనే ఉన్న కుమారుడు విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయింపు ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బస్సు డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో డ్రైవర్, అందులోని ఫార్మా ఉద్యోగులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఉక్కునగరం పోలీసులు ఘటనా స్థలికి భారీగా చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ఫార్మా బస్సులు ఈ మార్గంలో ప్రయాణించరాదని, ప్రమాదానికి కారణమైన ట్రాన్స్ఫోర్టు సంస్థ యజమాని రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాఠశాల విద్యార్థి మృతి చెంది బయట ఉద్రిక్తతగా ఉండగా తరగతులు నిర్వహించడంపై యాజమాన్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక డీసీపీ ఆనందరెడ్డి, ఏసీపీ టి.త్రినాథ్, స్టీల్ప్లాంట్, దువ్వాడ, గాజువాక సీఐలు, ఎస్ఐలు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నంచారు. అనంతరం టౌన్ అడ్మిన్ విభాగంలో ఉక్కు యాజమాన్యం ప్రతినిధులు చర్చలు జరిపారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, బయ్యే మల్లయ్య, ఎస్.మోహన్బాబు జరిపిన చర్చల్లో మృతుని కుటుంబీకులకు డీపాల్ పాఠశాల యాజమాన్యం రూ. 5 లక్షలు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. ఫార్మా కంపెనీ చిన్న స్థాయి అధికారులు రూ.లక్ష ఇస్తామని చెప్పగా ఎమ్మెల్యే నాగిరెడ్డి తిరస్కరించి రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. వారి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అనంతరం స్టీల్ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
పెళ్ళి విషయమై ప్రేమికుల మధ్య ఘర్షణ.. యువకుడిపై బ్లేడుతో యువతి దాడి
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్ కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ యత్నాలు చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మీసౌమ్య కూడా అదే రోడ్డులోని ఓ మహిళా హాస్టల్లో ఉంటూ ఉద్యోగ వేటలోనే ఉంది. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న టీ స్టాల్ వద్ద మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఇక ఈమధ్యనే తాను ప్రేమిస్తున్నాను, వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పిన అశోక్ ఆమె ఖర్చులు కూడా భరిస్తూ వస్తున్నాడు. కాగా ఈ నెల 5వ తేదీన టీస్టాల్ వద్ద ఇద్దరూ కలిసిన సమయంలో అశోక్ పెళ్లి ప్రస్తావన తేగా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీ సౌమ్య తన దగ్గర ఉన్న బేడు (మినీ కట్టర్)తో అతనిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్ ఎడమ చెంప నుంచి చెవి వరకు తీవ్రగాయమైంది. పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పదునైన బ్లేడ్ (మినీ కట్టర్)తో బలంగా దాడి చేయడంతో అశోక్ చెంపపై భాగంలో లోతైన గాయమైంది. 50 కుట్లు పడ్డాయి. నరాలు తెగిపోవడం వల్ల దవడ భాగంలో కొంతమేరకు పెరాలసిస్ వచ్చిందని, అధికంగా రక్తస్రావం కావడంతో రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. చదవండి: (కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్కు వేధింపులు) -
ప్రేమించలేదని ప్రాణం తీసాడు...
-
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
-
బాలుడిని కాటేసి అక్కడే చనిపోయిన పాము.. షాక్లో పేరెంట్స్
మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ చేసిన వినయ విధేయ రామ సినిమాలో విలన్ను పాము కాటు వేశాక.. ఆ పాము చనిపోవడం చూశాము కదా.. అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటుచేసుకుంది. ఓ బాలుడిని కాటు వేసిన పాము అక్కడికక్కడే చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు అనూజ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. కాగా, అనూజ్ తన తల్లితో సహా కుచాయ్కోట్లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రోజులాగే అనూజ్ ఇంటి ముందు ఆడుకుంటుడగా.. ఓ పాము(విష సర్పం)ను బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు.. అనూజ్ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే పాము చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులుతో పాటు స్థానికులు షాకయ్యారు. అనంతరం, ఆ పామును ఓ డబ్బాలో వేసి స్థానికులు.. అధికారులకు అందజేశారు. ఇక, పాము కాటు వేసినా బాలుడి బ్రతికే ఉండటంతో అతడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: నదీస్నానంలో భార్యకు ముద్దు.. బయటకు లాగి చితకబాదిన జనం -
బాలుడిపై మహిళ లైంగిక దాడి.. చివరకు భలే ట్విస్టు
బాలుడిని లైంగికంగా వేధించినందుకు ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధారావికి చెందిన ఓ మహిళ(20)కు ఓ బాలుడి(17)తో సోషల్ మీడియాతో 2020లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. అతడికి తన లవ్ ప్రపోజ్చేసింది. కానీ, బాలుడు ఆమె ప్రపోజల్ను తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు. ఆమె మాత్రం వేరే ఫోన్ నెంబర్లు, ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అతడిని వేధించింది. ఇదిలా ఉండగా.. బాధిత బాలుడు జనవరి 19న ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ, అతడిని కలవాలని ధారవిలోని తన బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. దీంతో ఆ బాలుడు ఆమె ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా తర్వాత కూడా వాషిలోని ఓ లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు బాలుడిని పిలిపించుకొని ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాలుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్లంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాలుడి కుటుంబానికి ఆమె మరో షాకిచ్చింది. బాలుడితో పాటు అతని తండ్రి, నలుగురు మేనమామలు, బంధువు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నవీ ముంబై పోలీసులు కేసును ధారవి పోలీసులకు బదిలీ చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
బాత్రూమ్లో ట్యూషన్ టీచర్.. ఫోన్తో వీడియోలు తీసి..
సాక్షి, ముంబై: విద్య నేర్పిన గురువులకు ఎంతో విలువనిచ్చే దేశం మనది. కానీ, కొంత మంది విద్యార్థులు తమకు పాఠాలు నేర్పిన టీచర్ల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ టీచర్ బాత్ రూమ్లో ఉండగా విద్యార్థి తన సెల్ ఫోన్ కెమెరాతో ఆమె వీడియోలు రికార్డు చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. పుణెలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థికి పాఠాలు చెప్పిందుకే తన పేరెంట్స్ ఓ ట్యూషన్ టీచర్ను ఎంపిక చేశారు. సదరు విద్యార్థికి ఆమె.. గత ఐదేళ్లుగా పాఠాలు చెబుతోంది. టీచర్ ప్రతీరోజు బాలుడి ఇంటికి వచ్చి పాఠాలు బోధిస్తుండేది. ఈ క్రమంలో సదరు బాలుడు.. టీచర్పై వ్యామోహంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా బాత్రూమ్లోని ఓ సోప్ బాక్స్లో సెల్ ఫోన్ను పెట్టి వీడియోలు తీశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు టీచర్.. పాఠం చెప్పిన అనంతరం బాత్రూమ్ వెళ్లింది. ఇంతలో సోప్ బాక్స్లో ఏదో ఉన్నట్టు అనిపించడంతో తెరిచి చూసి.. ఒక్కసారిగా షాకైంది. సోప్ బాక్స్లో ఉన్న ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఉంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్కు చెప్పి.. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బాలుడికి పాఠాలు చేప్పే క్రమంలోనూ తన శరీర భాగాలను ఫొటోలు తీశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు
-
ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు. ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') ఆ తండ్రి బాధ తీర్చలేనిది.. మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు. -
బాగా చదువుకోవాలని చెప్పినందుకు..
చందానగర్: చదువుపై శ్రద్ధ పెట్టాలని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన ఓ బాలుడు 14వ అంతస్తు పైనుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనపై ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగండ్లలోని ఓ అపార్ట్మెంట్ టవర్స్లో సీ–14 బి3లో నివాసం ఉంటున్న అమిత్ కిమోతీ తన కుమారుడు అద్వైత్ కిమోతీ(13)ని బాగా చదువుకోవాలని హెచ్చరించాడు. దీంతో అకస్మాత్తుగా పరుగుపెట్టిన అద్వైత్ 14వ అంతస్తు పై నుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో దగ్గరలోని సిటిజన్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు ఉదయం 9.30 గంటలకు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగు రోజుల్లో పెళ్లి.. ‘పెళ్లి కొడుకు’ అదృశ్యం
సాక్షి, అమీర్పేట(హైదరాబాద్): నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనల ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం, కొట్టాయగూడెం రోడ్కు చెందిన సత్యనారాయణగుప్తా (30) కూకట్పల్లిలో ఉంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 13న రాత్రి 9.30 గంటల సమయంలో సోదరుడు బాపిరాజుకు ఫోన్ చేసి తాను స్వగ్రామికి వెళ్తున్నానని, కేపీహెచ్బీలో బస్సు ఎక్కానని తెలిపాడు. మరుసటి రోజు ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబసభ్యులు నగరానికి వచ్చి సత్యనారాయణ కోసం వివిధ చోట్ల విచారించారు. బస్సు ఎక్కి ఎస్ఆర్నగర్లో దిగిపోయాడని డ్రైవర్ వారికి చెప్పాడు. ఈ నెల 17న వివాహం జరగాల్సి ఉన్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
విషాదం: వద్దురా తమ్ముడు అంటే వినలేదు.. కళ్లముందే ఘోరం..
రణస్థలం: బావిలో స్నానం చేస్తున్న అన్నయ్యను చూసి తాను కూడా బావిలో దిగాలని ప్రయత్నించాడు. ప్రమాదమని అన్నయ్య వారించినా వినలేదు. ఈత రాకపోవడంతో చెట్టుకు చీర కట్టి మరీ బావిలోకి దిగాడు. కొద్ది సమయానికే చీర తెగిపోవడంతో అన్నయ్య కళ్లముందే మునిగిపోయి మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన రణస్థలం మండలం జె.ఆర్.పురం పంచాయతీ గొల్లపేటలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గండమాని లోకేష్(13) అన్నయ్య పవన్తో కలిసి గ్రామ సమీపంలోని చెరువు పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లారు. పవన్కు ఈత రావడంతో బావిలో దిగి స్నానం చేస్తున్నాడు. తమ్ముడు లోకేష్ కూడా స్నానం చేసేందుకు ప్రయత్నించాడు. అన్నయ్య వద్దని చెప్పిన వినకుండా బావి పక్కనే ఉన్న చిన్న చెట్టుకు చీర కట్టి దిగాడు. కొద్దిసేపటికే చీర తెగిపోవడంతో లోకేష్ మునిగిపోయాడు. తమ్ముడు బావిలో మునిగిపోతున్నాడని పవన్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బయటకు తీసి 108కి ఫోన్ చేశారు. వారు వచ్చేటప్పటికే లోకేష్ మృతిచెందాడు. తల్లిదండ్రులు సత్యవతి, సోములు కూలి పనులు చేసుకుంటూ కుమారులతో పాటు కుమార్తెను చదివిస్తున్నారు. లోకేష్ చనిపోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని జె.ఆర్.పురం ఎస్సై జి.రాజేష్ తెలిపారు. (చదవండి: బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి) -
పదమూడేళ్ల బాలుడు.. 7 గురికి కొత్త జీవితం ఇచ్చాడు..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని బాలుడు తన మరణంలోనూ మరో ఏడుగురికి జీవితాన్ని ఇచ్చాడు. చిన్నతనంలోనే అవయవ దానంపై ఆలోచనలు కలిగిన ఆయన మరణంలోనూ తన లక్ష్యాన్ని వదలలేదు. వివరాల్లోకి వెళ్లే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన డాక్టర్ భానుప్రసాద్ – సీత దంపతులు సామాజిక, అన్యాయాలకు గురైన బిడ్డలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తూ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ఇలా పది మంది పిల్లలు ఉండగా, వీరిలో నాలుగో బాలుడు సిద్దూ. ఆరో తరగతి చదివే ఆయన ఈనెల 14న తీవ్ర జ్వరం రావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 19వ తేదీన హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సిద్ధూ కోరిక మేరకు గురువారం ఆయన శరీరంలో పనికొచ్చే అవయవాలను భానుప్రసాద్ దంపతులు అందజేసి ఉదారత చాటుకున్నారు. కాగా, ఆస్పత్రి వైద్యులు సిద్దూ నేత్రాలు, కిడ్నీలు, లివర్, ప్రాంకియాస్ అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమర్చనుండడంతో ఏడుగురికి ప్రాణభిక్ష పెట్టినట్లయింది. -
ప్రియురాలికి కుదిరిన పెళ్లి.. మమ్మీ.. డాడీ సారీ..!
సాక్షి, దోమ(రంగారెడ్డి): కులాలు వేరైనా యువతి, యువకుడి మనసులు కలిశాయి. ఉద్యోగం సాధించిన తర్వాత ఏడడుగులు నడిచి జీవితాంతం కలిసి బతుకుదామని బాస చేసుకున్నారు. అంతలోనే అమ్మాయికి పెళ్లి కుదరడంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంబాపురం ఆనందం, లలిత దంపతుల చిన్న కుమారుడు వినయ్(23) నల్లగొండ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నాడు. లాక్డౌన్తో ఏడాదిగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వినయ్, అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. వినయ్ తాను ఉద్యోగం సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందామని యువతికి చెప్పడంతో సరేనంది. అయితే అమ్మాయికి మరో వ్యక్తితో ఇటీవల పెళ్లి కుదిర్చారు. అయితే ఈవిషయమై ఇద్దరూ ఫోన్లో చాట్ చేసుకున్నారు. కలిసి జీవించనప్పుడు ఎందుకు బతకడం.. చనిపోదామని నిర్ణయించుకున్నారు. గత నెల 29న పొలం దగ్గరకు వెళ్లిన వినయ్ పురుగుల మందు తాగాడు. కుటుంబీలకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వికారాబాద్ మిషన్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. వినయ్ ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబీకులకు తెలియరాలేదు. అంత్యక్రియలు అనంతరం అతడి ఫోన్ను పరిశీలించగా వినయ్ ప్రేమ విషయం, ప్రేమికులు ఇద్దరూ చాటింగ్ చేసుకున్న విషయాలు బయటపడ్డాయి. అందులో మమ్మీ.. డాడీ క్షమించండి.. నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నా.. అని ఉంది. దీంతో మృతుడి తండ్రి ఆనందం శుక్రవారం తన కుమారుని మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. శనివారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినయ్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
దారుణం: ప్రేమించిన యువతి దక్కలేదని..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హమిర్పూర్ జిల్లా జాఖరీ గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసాద్ ప్రజాపతి అనే యువకుడు రాజస్థాన్లోని అల్వాల్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో, తను ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే, లక్ష్మీ ప్రసాద్ ప్రేమను అతని, తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారిని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా.. తాను ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుందనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో నేరుగా వ్యవసాయ భూమికి చేరుకున్నాడు. అక్కడ, తీవ్ర ఆవేదనకు లోనై ఏడుస్తూ.. సెల్ఫీవీడియో తీసి బంధువులకు, తన మిత్రులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా ఉన్న సదరు యువకుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిదండ్రులతో గొడవ.. సొరంగం తవ్విన యువకుడు
-
తల్లిదండ్రులతో గొడవ.. సొరంగం తవ్విన యువకుడు
మాడ్రిడ్: సాధారణంగా తల్లిదండ్రులు.. తమ పిల్లలు అల్లరి చేసినప్పుడు తిట్టడమో.. కొట్టడమో చేస్తూంటారు. దానికి.. పిల్లలు మహ అయితే, కాసేపు అలగడం, భోజనం మానేయడమో చేస్తుంటారు. మరికొంత మంది అల్లరి పిల్లలు ఇంట్లో చెప్పకుండా.. పక్కింట్లో లేదా తెలిసిన వారింటికో వెళ్లిపోతారు. అలాంటి వారంతా, కోపం తగ్గగానే తిరిగి తమ ఇంటికి చేరుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే, స్పెయిన్ కు చెందిన ఒక కుర్రాడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. వివరాలు.. ఈ సంఘటన 2015లో చోటుచేసుకుంది. స్పెయిన్ కు చెందిన 14 ఏళ్ల ఆండ్రెస్ కాంటోకు ట్రాస్ సూట్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో సూట్ ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ, తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేదు. బయటకు వెళ్లవద్దని కోప్పడ్డారు. దీంతో అలిగిన ఆ బాలుడు ఇంటి వెనకాల ఉన్న పేరడును తవ్వడం మొదలుపెట్టాడు. ప్రతి రోజు స్కూల్ నుంచి రావడం.. ఇంటి వెనుక వెళ్లి సొరంగం తవ్వడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఆ బాలుడు ప్రతిరోజు దాదాపు 14 గంటలపాటు పాటు నేలను తవ్వేవాడు. ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ఆరు సంవత్సరాలు పాటు తవ్వాడు. ఈ క్రమంలో 3 మీటర్ల లోతులో ఒక గుహలాగా ఏర్పడింది. ఈ సొరంగం తవ్వడంలో అతనికి ఒక మిత్రుడు కూడా సహకారం అందించాడు. ఈ గుహలో, ఉండటానికి గదిని.. దాంట్లో ఒక బెడ్, కుర్చీని ఏర్పాటు చేసుకున్నాడు. బాత్రూంను కూడా నిర్మించుకున్నాడు. అంతటితో ఆగకుండా వైఫైను సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సొరంగం పూర్తయ్యే నాటికి ఆండ్రెస్కు 20 ఏళ్లు. అయితే, ఈవీడియోను ఆండ్రెస్ కాంటో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ భలే.. ఉంది బాసు నీ ఐడియా ’, ‘ వర్ష కాలంలో జాగ్రత్త’, ‘ నీ అలకకు.. హ్యాట్సాఫ్.’ ‘ మేము చిన్నప్పుడు అలిగాం.. కానీ ఇలాంటి ఆలోచన మాకు రాలేదు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
ఇయర్ ఫోన్ ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది..
సాక్షి, వరంగల్: ఇయర్ ఫోన్ ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. ఇయర్ ఫోన్ పెట్టుకొని సరదాగా పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని చింతల్లో రైలు పట్టాలపై జరిగింది. వరంగల్ జీఆర్పీ ఎస్ఐ పరశురాములు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ చంద్రవదన కాలనీకి చెందిన అల్లూరి సునీల్ (28) రోజూ మాదిరిగానే పెయింటింగ్ పని కోసం వెళ్లాడు. (బంజారాహిల్స్లో బెంజ్ కారు బీభత్సం) పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ చింతల్లోని రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో ఏడీఆర్ఎం స్పెషల్ రైలు ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఎంజీఎం మార్చూరీకి తరలించారు. వరంగల్ రైల్వేస్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
విశాఖ: బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం
-
ఈ బుడ్డోడికి హర్భజన్ ఫిదా..
సాక్షి, ముంబై: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక బాలుడు కిక్-అప్స్ చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో శనివారం పోస్ట్ చేశారు. ఇంత చిన్న వయసులో ఆ చిన్నోడు బాల్ తో ఆడుకున్న తీరుకు ముగ్ధుడై తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా వుంటూ, విభిన్న వీడియోలతో ఆకట్టుకునే భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ఇటీవల రాహుల్ ద్రావిడ్ అద్భుతమైన క్యాచుల వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన వీడియోల పరంపరంలో మరో ఆణిముత్యం లాంటి వీడియోను షేర్ చేశారు. ఈ వయసులో నమ్మశక్యంకాని నైపుణ్యమంటూ ఆ బుడ్డోడికి ఫిదా అయిపోయాడు. View this post on Instagram Unbelievable skill at his age.. another great in years to come 🤔?? What say guys A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on Jul 10, 2020 at 10:39pm PDT -
బాలికపై యువకుడి అత్యాచారం
తాండూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని తాండూరు శివాజీచౌక్లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. తాండూరు మండలం దస్తగిరిపేట్కు చెందిన యువకుడు పవన్ స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం బాలికను ప్రేమపేరుతో నమ్మించి కారులో హైదరాబాద్ తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం తన వద్ద ఉన్న బాలిక ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసే యత్నం చేశాడు. దీంతో బాధితురాలు కుటుంబీకులతో కలసి నవంబర్ 8న తాండూరు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అయితే కొందరు రాజీకి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో వారం తర్వాత బాధితురాలు తాండూరు డీఎస్పీని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. కాగా నిందితుడు మరో ఇద్దరు బాలికలను కూడా వేధించాడని సమాచారం. బాలికపై అత్యాచారం జరిగినా కేసు నమోదులో జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
పెళ్లి చేసుకోకుంటే చంపేస్తా..
జనగామ: ఇద్దరు యువతులపై అత్యాచారం, హత్య ఘటనల నుంచి ఇంకా తేరుకోక ముందే.. జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతిని యువకుడు వేధించిన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బస్సులో యువతిని వెంబడిస్తూ పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా 20 నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఓ యువతి(19) హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు సంపత్ ఆమెతో కలిసి చదువుకోవడంతో పరిచయం ఉంది. ఆమె స్వగ్రామానికి వచ్చేందుకు శుక్రవారం సికింద్రాబాద్లో బస్సు ఎక్కుతున్న క్రమంలో సంపత్ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. తాను కూడా బస్కెక్కి జనగామ వరకు వెంబడించి, బస్టాండ్లో దిగాక ఆమె ఫోన్ లాక్కుని పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ బెదిరించాడు. దీంతో కేకలు వేస్తూ బాధితురాలు సంపత్ నుంచి తప్పించుకుని నేరుగా డీసీపీ కార్యాలయానికి చేరుకుంది. ఆమె వాంగ్మూలం తీసుకున్న సీఐ మల్లేశ్.. 20 నిమిషాల్లోనే సంపత్ను పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువతిని డీసీపీ శ్రీనివాస్రెడ్డి అభినందించారు. ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా వెంటనే 100 డయల్కు ఫోన్ చేయాలని సూచించారు. -
యువతి,యువకుడిపై దుండగుల అమానుష దాడి
-
యువదొంగకి దేహశుద్ధి
సాక్షి, కాజీపేట: ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు అభరణాలను దొంగిలించడానికి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన గురువారం రాత్రి బాపూజీనగర్లో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం కొంపెల్లి శేషమ్మ(62) భర్త చనిపోవడంతో రైల్వే ఫించన్పై ఆధారపడి జీవిస్తుంది. కొడుకు వేరే ఇంటిలో ఉంటుండడంతో తాను కట్టుకున్న ఇంట్లోనే శాంతమ్మ ఒంటరిగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఓ యువకుడు వృద్ధురాలి మెడలో ఉన్న నగలపై కన్నెసి గురువారం రాత్రి ఇంటి వెనుక తలుపు లేపుకుని లోపలి చోరబడి దాడి చేశాడు. శేషమ్మ మెడలో ఉన్న బంగారు అభరణాలను తెంచుకోవడానికి ప్రయత్నించగా ప్రతిఘటిస్తునే కేకలు వేయడంతో స్థానికులు అటుగా రావడంతో బయపడి బయటకు పరుగెత్తాడు. స్థానికులు ఏం జరిగిందని అడిగి తెల్సుకుంటుండగా నేరం తనపైకి రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ యువకుడు వృద్ధురాలి కొడుకు ఇంటికి వెళ్లి మీ అమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి వారితో కలిసి ఏం తెలియనట్లుగానే మళ్లీ ఘటన స్థలికి వచ్చాడు. సదరు యువకుడిని గుర్తించిన వృద్ధురాలు స్థానికులకు చూపించింది. దీంతో వారు ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. అప్పటికే కాలనీవాసులు 100 డయల్కు ఫోన్ చేయడంతో బ్లూకోర్ట్స్ టీం పోలీసులు వచ్చి యువకుడిని పోలీసుస్టేషన్కు తరలించి వాస్తవ పరిస్థితిపై విచారణ జరుపుతున్నారు. ఈ పేనుగులాటలో వృద్ధురాలి మెడ నుంచి ఎటువంటి బంగారు నగలు పోలేదని పోలీసులు తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండలంలోని తిమ్మాపూర్ తండాకు చెందిన బుక్య గణేశ్(26) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ భార్య లలిత శీత్లా పండుగకు తల్లిగారి ఇల్లయిన నిర్మల్ జిల్లా మామిడ లింగాపూర్కు వెళ్లింది. గణేశ్ను కూడా రమ్మనగా.. నిరాకరించాడు. తండా శివారులోని వెంకటాద్రి చెరువు పక్కకు వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా గణేశ్ మూడేళ్ల క్రితం దుబాయ్వెళ్లి ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చాడు. అక్కడ ఉపాధి లేకపోవడంతో రూ.5 లక్షల అప్పులైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా..? భార్య గొడవైందా..? ఎవరైనా హత్య చేశారా..? అనే కోణం విచారిస్తున్నట్లు మృతదేహాన్ని పరిశీలించిన మెట్పల్లి డీఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్పై రాంనాయక్ తెలిపారు. -
ఈ చిన్నోడు.. మనసున్నోడు
జగదేవ్పూర్(గజ్వేల్): వయస్సు 17 కుర్రాడు తోటి విద్యార్థులకు సేవ చేయాలన్న సంకల్పంతో సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వయస్తు చిన్నదైనా మనస్సు మాత్రం పెద్దదే.. మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలకు సేవలందిస్తున్న అమెరికా అబ్బాయిపై ప్రత్యేక కథనం... కుటుంబ నేపథ్యం నల్గొండ జిల్లా పట్టణానికి చెందిన శీల శంకరయ్య, ధనలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. శంకరయ్య నల్గొండలో నాగార్జున డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ తన ముగ్గురు కొడుకులు శ్రీనివాస్, రమేష్, హరినాథ్, కూతురు కరుణశ్రీలను ఉన్నత చదువులు చదివించారు. ముగ్గురు కొడుకులు మెడిసిన్లో స్థిరపడగా, కూతురు కరుణశ్రీ స్టాప్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. శీల శ్రీనివాస్ నల్గొండలో 10 వరకు చదివి, ఇంటర్, డిగ్రీ, మెడిసీన్ హైదరాబాద్లో చదివారు. అలాగే కుటుంబం మొత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ హైదరాబాద్లోనే కొన్నేళ్లపాటు సివిల్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించి విధులు నిర్వహించారు. అనంతరం 1990లో శంకరయ్య కుటుంబం మొత్తం అమెరికాకు వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ సివిల్ వదులుకుని డాక్టర్గా విధులు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు. శ్రీనివాస్, అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు రిత్విక్శీల, కృత్విక్ శీల, కూతురు సాన్వి. ముందుగా శ్రీనివాస్ తన తల్లి చదివిన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కోప్పోల్ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు పంపణీ చేయడం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలో సేవలు చేయాలన్న లక్ష్యంతో అమెరికాలో తనతో పాటు ముగ్గురితో కలిసి ఓ సంస్థను ఏర్పాటు చేశారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే పేరు పెట్టి సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా తమకు వచ్చే వేతనంలో కొంత జమా చేయడం మొదలు పెట్టారు. మొదటి సారిగా తెలంగాణ ప్రాంతంలోని కొప్పోల్ గ్రామంలో ప్రారంభించారు. జగదేవ్పూర్ మండలంలోని 52 పాఠశాలల విద్యార్థులకు 2016లో నోట్బుక్లు అందించారు. ఇండియాలో నాన్ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కు తన పెద్దమ్మ కొడుకైనా మధుసూదన్ కొఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. అమ్మనాన్నల స్ఫూర్తితో... విద్యార్థి రిత్విక్శీల ప్రస్తుతం అమెరికాలో డిగ్రీ చదువుతున్నారు. అయితే తను సేవ చేయడానికి అమ్మనాన్నలే స్ఫూర్తిగా నిలిచారు. గత ఐదేళ్ల క్రితం రిత్విక్ నానమ్మ చదివిన పాఠశాలలో విద్యార్థులకు నాన్న నోట్ పుస్తకాలు ఇవ్వడం చూసాడు. అప్పుడే నేను కూడా సేవ చేయాలే ఆలోచన వచ్చి, అప్పటి నుంచి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. తోటి విద్యార్థులకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు. అమ్మనాన్నలు పుట్టి పెరిగిన నేలపై సేవలు చేయాలనే ఉద్ధేశ్యంతోనే నల్గొండ జిల్లాలో ప్రారంభం చేసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్, మర్కూక్ మండలాల్లో సేవలు ప్రారంభించారు. మూడేళ్లుగా ఇక్కడి విద్యార్థుల లక్షల రూపాయలు ఖర్చు చేసి వేల నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 35 లక్షల విలువ గల నోట్ పుస్తకాలను 1 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. ఆనందం చెప్పలేనిది... ఈ నెల 14న జగదేవ్పూర్లోని నోట్ పుస్తకాల పంపిణీకి విద్యార్థి రిత్విక్ శీల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే నోట్ పుస్తకాలు అందించారు. రిత్విక్శీలను చూసి విద్యార్థులు సంతోషంలో మునిగితేలారు. రిత్విక్తో చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు. బాగా చదివి ఉన్నతస్థాయి శిఖరాలకు చేరుకోవాలని హితబోధ చేశారు. రిత్విక్తో పోటీ సెల్ఫీ పోటోలు దిగేందుకు విద్యార్థులు పోటీ పడడం, చేతులు కలపడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందం వెల్లివిరిసింది. సేవ చేయడంలో సంతృప్తి.. సేవ చేస్తే ఏమొస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ సేవలో ఉన్న సంతృప్తి మరెందులో లేదనిపిస్తుంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. నా ఆశయం వెనుక అమ్మనాన్న ఉన్నారు. వారి కలను నిజం చేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి గోల్ పెట్టుకుని చదువుకోవాలి. అప్పుడే కన్నవాళ్ల కలలు, మా లక్ష్యం నిజం అవుతుంది. రానున్న రోజుల్లో సేవలను విస్తృత్తం చేస్తాను. – రిత్విక్శీల -
మద్యం మత్తులో యువకుడి హల్చల్
-
నరకం చూపారు..
నాలుగు నెలల క్రితం ఓ యువకుడు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. కుటుంబసభ్యులు,బంధువులు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు..నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు ఆ యువకుడు ఒంటి నిండా గాయాలతో ఇంటికి చేరాడు. తనను కొందరు మోసం చేసి తీసుకువెళ్లి నాలుగునెలలపాటు చిత్రహింసలకు గురిచేశారని వారి చెర నుంచి తప్పించుకు వచ్చానని తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి,పిఠాపురం: కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన కోడ జయరాజు (20) పదో తరగతి పాసయ్యాడు. ఇంటర్ ప్రైవేటుగా చదువుతూ కాకినాడలో ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. గత ఏడాది నవంబర్ 20వతేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అన్ని ప్రాం తాల్లో గాలించినా అతడి బంధువులు కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నాలుగు నెలలు దాటినా ఆయువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఇంతలో బుధవారం రాత్రి ఆయువకుడు ఒంటి నిండా గాయాలతో ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆ యువకుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మాయమాటలతో నమ్మించారు. తనను కొవ్వూరుకు చెందిన బెణుగు శ్రీను మరి కొందరు మాయ మాటలతో నమ్మించి సుదూర ప్రాంతలకు తీసుకెళ్లి నిర్బంధించి చేపల వేట చేయించారని ఆ యువకుడు చెబుతున్నాడు. గతేడాది నవంబర్ 20న అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కోడ జయరాజు తుని వెళ్లాడు. అక్కడ తన బంధువుల ఇంటికి వెళదామని భావించినా చివరకు తన దగ్గర రూ.400 ఉండడంతో వాటితో రెండు రోజులు తునిలో తిరుగుతూ చివరికి రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బు అయిపోవడంతో తినడానికి ఏమీ లేక ఆకలితో రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం బస్టాండ్లో ఉన్న అతడి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆరా తీశారు. భోజనం పెట్టి డబ్బులు ఇస్తామని తాము చెప్పిన పని చేయాలని చెప్పడంతో ఆకలితో ఉన్న బాధితుడు దానికి అంగీకరించి వారి వెంట వెళ్లాడు. చిత్రహింసలకు గురిచేసేవారు తొలుత కొవ్వూరు తీసుకెళ్లిన వారు నాలుగు రోజుల అనంతరం కడప దగ్గరలోని ఒంటిమిట్టకు దూరప్రాంతమైన కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ నదీపాయలలో చేపల వేట చేయమని చెప్పారని బాధితుడు తెలిపాడు. తాను మత్స్యకార కుటుంబానికి చెందిన వాడినైనా వేటకు ఎప్పుడు వెళ్లలేదని తనకు రాదని చెప్పడంతో తీవ్రంగా కొట్టిన వారు బలవంతంగా చేపల వేట చేయించేవారన్నాడు. ప్రతి రోజూ రాత్రి సమయాల్లో వేటకు తీసుకువెళ్లే వారని, వారు చెప్పినట్టు చేయకపోతే చిత్రహింసలు పెట్టేవారని వాపోయాడు. మూడు సార్లు తప్పించుకోడానికి ప్రయత్నించగా పట్టుకున్న వారు తాళ్లతో బంధించి చితక్కొట్టేవారని కన్నీరుమున్నీరవుతున్నాడు. రెండు సార్లు తనపై హత్యాయత్నం చేశారని, చేసేదేం లేక వారు చెప్పినట్టు వేట చేసే వాడినన్నాడు. చివరకు ఈనెల నాలుగో తేదీన అర్ధరాత్రి చేపల వేట సాగిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళతానని చెప్పి తప్పించుకున్నానని తెలిపాడు. ఓ గ్రామంలో గొర్రెల కాపరులు తనను రెండు రోజుల పాటు తమ దగ్గర ఉంచుకుని చివరకు డబ్బులిచ్చి ఇంటికి వెళ్లిపొమ్మని పంపించడంతో బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నానని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయాన్ని కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కడప పరిసర ప్రాంతాల్లో ఇలాగే చాలా మందితో నిర్బంధంగా వేట చేయిస్తుంటారని తమ కుమారుడిని చిత్రహింసలకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జయరాజు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎటువైపైనా ఒక వైపే
ఒక యువకుడు గుర్రం మీద బయల్దేరాడు. అతడు కొత్తగా బౌద్ధధర్మాన్ని స్వీకరించాడు. గుర్రం మీద ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక చోటికి చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న యేరు అడ్డం వచ్చింది. అది ఉధృతంగా పారుతోంది. గుర్రంతో సహా దిగలేనంత లోతుగా ఉందని వెంటనే అంచనాకు రాగలిగాడు. కానీ ఎలా దాటడం? అవతలి వైపునకు ఎలా చేరడం? ఎంత ఆలోచించినా ఉపాయం తోచలేదు. గుర్రం దిగి చాలాసేపు అలాగే నిరీక్షించాడు. గుర్రం పచ్చిక మేస్తూవుంది. సాయంత్రం కావస్తోంది. యువకుడి సహనం నశిస్తూవుంది. అప్పుడు యేరుకు అటువైపు ఒక గురువు నడుస్తూ కనిపించాడు. యువకుడు ఉత్సాహంగా లేచి, గొంతెత్తి కేకేశాడు. ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’ గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’. ఇది హాస్యం కాదు. ఒక అవరోధం రాగానే ప్రయత్నాన్ని విరమించుకొమ్మని చెప్పడం కాదు. అసలు ఏ వైపైనా ఎందుకు దాటాలి? ఏ ప్రపంచం ఇవ్వగలిగే అనుభవం ఆ ప్రపంచానికే ఉండగా మరెక్కడికో చేరాలన్న ఉబలాటం దేనికి? గురువు చెప్పింది అర్థమైన యువకుడు సానుకూలంగా గురువుకు నమస్కరించి, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ తన అశ్వం వైపు బయల్దేరాడు. ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’. -
కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
ప్రకాశం బ్యారేజీ (తాడేపల్లి రూరల్): కృష్ణానది ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంలో 16వ కానా గేటు వద్ద సోమవారం స్థానికులు ఓ పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు గేటు కింద భాగంలో వేప్రాన్పై ఉన్న మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి వయసు 25 ఏళ్లు ఉండవచ్చని, మాసిపోయిన గడ్డం, బ్లూ కలర్ షర్టుపై చెక్స్, లైట్ బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని ఏఎస్ఐ రాజు తెలిపారు. ఆచూకీ తెలిస్తే తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు. హత్యా ? ఆత్మహత్యా ? ప్రమాదమా ? చనిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే గేటుపై పడి తీవ్ర గాయాలవుతాయి. మద్యం మత్తులో అయితే తలకిందులుగా పడి తలకు దెబ్బ తగులుతుంది. ఇవేమీ లేకుండా కుడి చేతిపై ఒక్క గాయం మాత్రమే కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి గేటుపై పడితే తీవ్ర గాయాలు కావడమే కాకుండా రక్తస్రావం కూడా అవుతుంది. మృతదేహంపై ఇలాంటి ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. మరి ఈ మృతి ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? వేచి చూడాల్సిందే. గస్తీ లేదు.. ప్రకాశం బ్యారేజీపై ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తరువాత విజయవాడ, తాడేపల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించడం లేదు. దీంతో విద్యార్థులు, యువకులు, మద్యం బాబులు, ప్రకాశం బ్యారేజీని అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. -
ప్రేమ విఫలమై ఆత్మహత్యాయత్నం
అప్రమత్తమై యువకుడిని కాపాడిన పోలీసులు ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద ఓ యువకుడు శనివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. సీసీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అతని వివరాలు సేకరించగా...యువకుడు మంగళగిరికి చెందిన మాచర్ల రవితేజ అని, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు తెలిపాడు. పోలీసులు యువకునికి కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఫిరంగిపురం: ఓ యువకుడు గాయాలపాలై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఫిరంగిపురం శాంతిపేటకు చెందిన తలకోల క్రీస్తురాజు అలియాస్ మహేష్బాబు (26) కారు డ్రై వరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9గంటల వరకు ఇంటి వద్దనే ఉన్నాడు. బజారుకు వెళ్ళి వస్తానని ఇంటిలో చెప్పి బయటకు వచ్చిన మహేష్బాబు శనివారం తెల్లవారుజామున మార్నింగ్స్టార్ కళాశాల వెనుకవైపున రైలు పట్టాలు పక్కన విగతజీవిగా కనిపించాడు. తలభాగంలో, కుడిభుజంపై పదునైన ఆయుధంతో దాడిచేసినట్లు గాయాలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం అక్కడకు తీసుకువెళ్ళి మహేష్బాబును హతమార్చి ఉంటారని చర్చించుకుంటున్నారు. అటువైపుగా పొలాలకు వెళుతున్న రైతులు గమనించి రైల్వే స్టేషన్లో సమాచారం అందించడంతో జీఆర్పీ పోలీసులు మత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
ఆముదాలపల్లిలో యువకుడి మృతి నిజాంపట్నం: స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్ళి యువకుడు చెరువులో గల్లంతైన సంఘటన నిజాంపట్నం మండలంలోని ఆముదాలపల్లిలోయ చోటు చేసుకుంది. ఆముదాలపల్లికి చెందిన పిల్లిబోయిన గోపి(23) హైదరాబాద్లో కానిస్టేబుల్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ దీపావళి పండుగకు ఇంటికి వచ్చాడు. ఇద్దరు స్నేహితులు మరకా ఏడుకొండలు, అశోక్కుమార్లతో కలసి చెరువులో స్నానం చేసేందుకు గురువారం వెళ్ళాడు. స్నేహితులిరువురు ఈతకు చెరువులోకి వెళ్ళగా గోపి స్నానం చేసేందుకు కొంత లోతుకు వెళ్ళాడు. ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఉండటంతో ఒక్కసారిగా గోపి మునిగిపోయాడు. స్నేహితులు గమనించి అతనిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికి కనిపించలేదు. గ్రామస్తులు చెరువులో గాలించగా మృతదేహం సాయంత్రం లభ్యమైంది. -
హత్యా ? ఆత్మహత్యా ?
* అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి * ఆత్మహత్య చేసుకున్నాడనేది స్నేహితుడి మాట * హత్య చేసి ఉండొచ్చని మృతుడి బంధువుల ఆరోపణ పిడుగురాళ్ళ టౌన్: పట్టణ శివారు నలబోతుల కుంటలో ఓ యువకుడు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుండగా, బంధువులు మాత్రం హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పాటిగుంతల కాలనీకి చెందిన షేక్ అక్రమ్ (23) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. అతడు పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు ఈ నెల 27న మరో యువకుడితో పెళ్లి జరుగుతుందని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఏమైందో ఏమో..? ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం అక్రమ్ తన స్నేహితులు సాగర్, శ్రీనుబాషాలతో కలిసి డ్రైవర్స్కాలనీ సమీపంలో ఉన్న నలబోతుల కుంట వద్దకు మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం చాలలేదని సాగర్ను పట్టణానికి పంపించాడు. ఏమైందో ఏమో అక్రమ్ తాను చనిపోతున్నట్టు ఫోన్లో మాట్లాడుతూ కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పక్కనే ఉన్న శ్రీనుబాషా స్థానికులకు చెప్పాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయాన్ని రాత్రి 10 గంటలకు కుంట సమీపంలోని ప్లాట్ ఇన్చార్జి తిమ్మారెడ్డికి చెప్పి వెళ్లారు. శనివారం ఉదయం ప్లాట్ ఇన్చార్జి బంధువులకు సమాచారం అందించాడు. బంధువులు కుంట వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సహకారంతో అక్రమ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఏఎస్ఐ బాషా కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
హంద్రీనీవా కాలువలో యువకుడు గల్లంతు
ఓర్వకల్లు /కల్లూరు: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బోయ శ్రీరాములు, చిట్టెమ్మ దంపతుల కుమారుడు రమేష్(16) తన స్నేహితులైన శివ, హనుమంతు, నగేష్, ఆనంద్లతో కలసి శుక్రవారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లాడు. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామ సమీపంలో గల హంద్రీనీవా కాలువలో రమేష్ రెండుసార్లు ఈత కొట్టి పైకి వచ్చాడు. మూడోసారి గట్టుపైనుంచి కాలువలోకి దూకిన అనంతరం వెలుపలికి రాలేదు. దీంతో తోటి మిత్రుడు అతని కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. వెంటనే నన్నూరు గ్రామానికి చేరుకుని స్థానికులకు సమాచారం అందజేశారు. ఆ మేరకు గ్రామానికి చెందిన కొందరు ప్రజలు హంద్రీనీవా కాలువ గట్టుకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తడకనపల్లె గ్రామం నుంచి వెల్దుర్తి మండలం వద్దనున్న మల్లేపల్లి వరకు గాలించారు. ఈ విషయాన్ని ఉలిందకొండ పోలీస్స్టేషన్కు సమాచారం చేరవేసినప్పటికీ తమ పరిధిలోకి పోలీసులు చెప్పడంతో కర్నూలు తాలూకా రూరల్ పోలీస్స్టేషన్కు సమాచారం అందజేశారు. సాయంత్రం చీకటి పడటంతో ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, మల్లేపల్లి వద్దనున్న ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద అధికారులకు గ్రామస్తులు వివరాలను అందజేసి వెనుదిరిగివచ్చారు. రమేష్ ఆచూకీ కోసం శనివారం ప్రయత్నం చేస్తామని పోలీసులు, సంబంధిత అధికారులు తెలిపినట్లు సమాచారం. -
దత్తుపై దయచూపండి..
ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితి శస్త్రచికిత్స చేయాలంటే రూ.25 లక్షలు అవసరం అప్పులు చేసి, ఉన్నదంతా ఖర్చుపెట్టిన తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఆదిలాబాద్ రిమ్స్ : పంతొమ్మిదేళ్ల వయసులో చలాకిగా ఉండాల్సిన ఆ యువకుడు.. మంచానికే పరిమితమయ్యాడు. ఆ వయసులో అందరిలా తాను చదువుకోవాలని.. ఆటలాడాలని.. ఆశ ఉన్నా అనారోగ్యం అతడి పాలిట శాపంగా మారింది. లివర్ చెడిపోయి అతని బతుకు దుర్భరంగా మారింది. పొట్ట ఉబ్బి, కాళ్లు, చేతులు వాపులతో అసలు నడవడానికే ఇబ్బంది పడుతున్నాడా యువకుడు. వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా అనారోగ్యమే.. ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన దుమ్మ వనిత, భగవాండ్లు దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. గతంలోనే కూతురు హేమలత వివాహం చేయగా, ప్రస్తుతం కుమారుడు దత్తాత్రి డిగ్రీ తతీయ సంవత్సరం చదువుతున్నాడు. 2008లో జాండీస్ రావడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు దత్తుకు లివర్ పాడైపోయిందని తెలిపారు. దీంతో ప్రతీ నెల ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్సలతో ప్రతీ నెల దాదాపు రూ.20 వేల ఖర్చు వచ్చేది. ఇలా ఏడాది పాటు వైద్యం చేయించుకున్నారు. అక్కడ నయం కాకపోవడంతో మళ్లీ మహారాష్ట్రలోని నాగ్పూర్లో చూపించారు. మళ్లీ హైదరాబాద్లోని మెడిసిటీలో మూడేళ్ల పాటు చికిత్స చేయించుకున్నారు. ఇలా మూడేళ్లలో రూ.2 లక్షలు ఖర్చయ్యాయి. అక్కడ నుంచి మళ్లీ వార్దాలో నెలరోజుల పాటు చికిత్స అందించారు. ఇలా ప్రతినెల ఆస్పత్రులు చుట్టూ తిరిగిన వ్యాధి నయం కాలేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు దత్తు తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో రూ. 2 లక్షలు అప్పుతీసుకోగా, రూ. 3 లక్షల వరకు ప్రై వేట్ అప్పులు చేసి కొడుకు చికిత్స అందిస్తున్నారు. ఉస్మానియా, యశోద ఆస్పత్రులకు వెళ్లినా ప్రయోజనం లేదు. రూ.25 లక్షల వరకు చెల్లిస్తే శస్త్రచికిత్స చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రస్తుతం రెండు నెలలుగా దత్తు మంచానికి పరిమితమయ్యాడు. రిమ్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స తీసుకుంటున్నాడు. దత్తు తండ్రి భగవాండ్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదత్తుకు సపర్యాలు చేస్తూ ఇంట్లోనే ఉంటోంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఎవరైనా దాతలు ఆదుకుని తమ కొడుకును కాపాడాలని ఆ తల్లిదండ్రులు వనిత, భగవాండ్లు వేడుకుంటున్నారు. -
ఐదుగురిపై కత్తితో దాడి
పాతకక్షలే కారణం నలుగురు మహిళలు, బాలుడికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం నాదెండ్ల బీసీ కాలనీలో ఘటన నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో ఉన్మాదిగా మారిన యువకుడు నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచిన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్లలో శుక్రవారం సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని బీసీకాలనీ ఉరవకట్ట సెంటర్లో నివాసం ఉండే అలుగునీడి వినోద్ కుమార్ ఇంటిఎదురుగా నివాసం ఉంటున్న నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో దాడిచేసి గాయపరిచాడు. పాతకక్షలే కారణం.. బీసీ కాలనీలో నివాసం ఉండే అలుగునీడి శివయ్య కుమారుడు వినోద్కుమార్ తిమ్మాపురంలోని ఓ స్పిన్నింగ్మిల్లులో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ఎదురింట్లో ఉన్న షేక్ నాగార్జున కుటుంబంతో వీరికి పాత కక్షలు ఉన్నాయి. గత ఏడాది వినోద్ కుమార్ తల్లి పూర్ణమ అనారోగ్యంతో మతి చెందారు. గురువారం ఆమె మొదటి వర్ధంతి జరుపుకున్నారు. తన తల్లి మరణానికి ఎదురింటివారి వేధింపులే కారణమని భావించిన వినోద్ కుమార్ వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గురువారం రాత్రి వివాదం కొనసాగింది. శుక్రవారం ఉదయం కూడా ఇరుకుటుంబాల మధ్య కలహాలు జరిగాయి. దీంతో వినోద్కుమార్ చిలకలూరిపేటకు వచ్చి కొబ్బరిబోండాలు నరికే కత్తి కొలుగోలు చేసి ఇంటికి చేరుకున్నాడు. ఉదయం 10గంటల సమయంలో ఎదురింట్లో పురుషులు ఎవరూ లేని సమయం చూసి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. నాగార్జున తల్లి షేక్నాగూర్బీ, భార్య షేక్ బాజీ, ఆరేళ్ల కుమారుడు షేక్ సాయిపై కత్తితో వినోద్కుమార్ దాడి చేశాడు. పెద్దగా కేకలు వినబడటంతో పక్కనే నివాసం ఉంటున్న బాజీ తల్లి మస్తాన్బీ, మరో మహిళ షేక్ బీబీజాన్ అడ్డుకోవటానికి ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగువారు గుమిగూడి వినోద్ చేతిలోని కత్తిని లాక్కోవడంతో జేబులో దాచుకున్న మరో చిన్న కత్తిని బయటికి తీశాడు. ఆ కత్తిని కూడా స్థానికులు లాక్కొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన షేక్ నాగుర్బీ, మస్తాన్బీలను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షేక్ బాజీ, షేక్ సాయి, షేక్ బీబీజాన్లను 108 వాహనంలో కోండ్రుపాడులోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు.వీరిలో షేక్ బాజీ, షేక్ మస్తాన్బీల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. తన తల్లి మనస్థాపానికి గురై మరణించిందని, అందుకే వారిపై కక్ష తీర్చుకోవటానికిదాడిచేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న వినోద్కుమార్ చెప్పాడు. -
హవ్వా.. చైనా జనాలకు చీమకుట్టినట్లైనా లేదు
బీజింగ్: మానవత్వం భారతదేశంలో రానురాను తగ్గిపోతుందని గగ్గోలుపడిపోతుంటాంకానీ చైనాతో పోల్చుకుంటే మాత్రం మనమే నయం అనిపిస్తుందేమో. అవును.. చైనాలో మానవత్వం ఎప్పుడో మంటగలిచిపోయిందని ఈ విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది. చైనాలో సాధారణంగా చిన్నపిల్లల కిడ్నాప్లు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ విషయం ఎంతో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అసలు ప్రజలకు ఇలాంటి అంశాలపై ఎంతమేరకు ఆందోళన ఉంటుందో, ఎలా తమ బాధ్యతను నిర్వర్తిస్తారో తెలుసుకునేందుకు కొందరు యువకులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒక చిన్నపిల్లాడిని బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో నిల్చోబెట్టి అందరూ చూస్తుండగా క్లోరో ఫామ్ ముక్కుకు పెట్టి ఎత్తుకెళ్లిపోతున్నట్లుగా ప్రవర్తించారు. ఇలా పార్క్లలో, రెస్టారెంట్లలో, వీధుల్లో, కళాశాల వద్ద పరిపరి విధాలుగా కిడ్నాప్ చేస్తున్నట్లుగా నటించారు. కానీ, ఇదంతా చూస్తున్న ఆ చుట్టుపక్కలవారు కనీసం ఆ కిడ్నాపర్ను అడ్డుకోలేదు కదా... కనీసం ఆందోళన కూడా పడలేదు. మాకే సంబంధం లేదన్నట్లుగా కనీసం చీమకుట్టినట్లయినా లేకుండా కనిపించారు. ఏ ఒక్కరూ అతడిని గల్లా పట్టుకొని అడుగుతారేమోనని ఆశగా చూసిన అంతా బాధ్యతా రహితంగానే కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. -
పోకిరీ వేషం... కుదిరింది రోగం!
-
ప్రకాశంజిల్లాలో కీచకపర్వం
-
ఎనిమిదేళ్ళుగా.. పాక్ జైల్లోనే..!!