yousufguda
-
హైదరాబాద్ యూసుఫ్ గూడాలో అగ్నిప్రమాదం
-
యూసఫ్గూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి రోడ్డు పడిపోయింది. అదే సమయంలో వస్తున్న ఓ బస్సు సదరు యువతిపై నుంచి వెళ్లటంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను అస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. మృతురాలికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. -
సింగోటం రాముని చంపింది వీడే..
-
సింగోటం రాము హత్య కేసులో సంచలన నిజాలు
-
సింగోటం రాము హత్యకు కారణాలు..
-
హైదరాబాద్ యుసుఫ్ గూడలో దారుణ హత్య
-
హైదరాబాద్ యూసుఫ్ గూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
-
జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం!
సాక్షి, హైదరాబాద్: తన భర్త అదృశ్యమయ్యాడని ఓ నవ వధువు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూసుఫ్గూడ బస్తీలో నివసించే సోను(24) ప్రైవేట్ ఉద్యోగి కాగా, భార్య షేక్ రోషణి(24) ఈవెంట్ మేనేజర్గా పని చేస్తోంది. ఈ నెల 5న ఆఫీసుకు వెళ్లిన సోను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో రోషణి అతనికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లైందని, నెల రోజులుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని భార్య తెలిపింది. ఈ కారణంగా తన భర్తకు గుంటూరు జిల్లా మాచర్లలో నివసించే తల్లిదండ్రులు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అన్ని ప్రాంతాల్లో వెతికానని, తన భర్త జాడ తెలియరాలేదని చెప్పింది. తన అత్తమామల వద్దే భర్త ఉండి ఉంటాడంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హరర్ మూవీలు చూపించి.. అమెరికా అల్లుడి వికృత చేష్టలు
సాక్షి, బంజారాహిల్స్: ఎన్ఆర్ఐ భర్త మోసం చేయడంతో బాధిత యువతి ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా మంగళవారం యూసుఫ్గూడ ఎల్ఎననగర్లోని అత్తింటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్కు చెందిన మారి మహేష్ 2022 మే 26న రామేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది జూన్ 18న యూఎస్ఏలోని టెక్సాస్కు తీసుకెళ్లాడు. అయితే ఆ మర్నాటి నుంచే నీ వల్ల కట్నం తక్కువగా వచ్చింది మరొకరిని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేదంటూ గొడవ పడుతున్నాడు. రామేశ్వరిని వదిలించుకోవాలని పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. హరర్ మూవీలు చూపించేవాడు. బలవంతంగా హుక్కా తాగించేవాడు. ఆ తర్వాత రెండు నెలలకే గత ఆగస్టు 18న రామేశ్వరితో పాటు ఇండియాకు వచ్చిన మహేష్ ఆమెను దోమల్గూడలోని పుట్టింట్లో వదిలేసి ఆ తెల్లవారే అమెరికా వెళ్లిపోయాడు. ఆమెకు తెలియకుండానే రానుపోనూ టికెట్లు బుక్ చేసుకున్నాడు. తనను తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే టికెట్ దొరకడం లేదంటూ బుకాయించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు గత అక్టోబర్ 23న అమెరికాకు టికెట్ బుక్ చేసి రామేశ్వరిని భర్త వద్దకు పంపించారు. రామేశ్వరి ఫ్లైట్ ఎక్కగానే ఈ విషయమై ఆమె తండ్రి మహేందర్ అల్లుడికి ఫోన్ చేయగా తనకు ఏం సంబంధం లేదని ఆమె ఎవరో తనకు తెలియదంటూ అసభ్యంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఆమె అమెరికా వెళ్లాక కూడా ఘర్షణ పడటమేగాక విడాకుల నోటీసుపై సంతకం కూడా పెట్టించాడు. ఈ విషయమే రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించగా తమపై దాడి చేయడానికి వచ్చారంటూ మహేష్ తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించారు. పోలీసుల సూచన మేరకు బాధితురాలు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రోజులు గడిచినా మహేష్ను, ఆమె తల్లిదండ్రులను పోలీసులు పిలవకపోవడంతో రామేశ్వరి తన తల్లిదండ్రులతో కలిసి అత్తమామను కలవడానికి వెళ్లగా ఇంటికి తాళం వేసి బయటికి గెంటేశారు. తన ఇంటికి తనను రావొద్దని చెప్పడానికి వారి ఏం హక్కు ఉందంటూ బాధితురాలు అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని, తక్షణం మహేష్ను అమెరికా నుంచి పిలిపించాలని కోరింది. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
వీళ్లు మాములోళ్లు కాదు.. వయ్యారంగా వచ్చి.. చీరలు దోచి
సాక్షి, హైదరాబాద్: కంచిపట్టు చీరలు చూపించాలని కొందరు, సాదాసీదా చీరలు చూపించాలని మరి కొందరు మహిళలు రెండు గ్రూపులుగా చీరల దుకాణానికి వచ్చి సేల్స్మెన్ దృష్టి మరల్చి చీరలతో ఉడాయించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యూసుఫ్గూడ చెక్పోస్ట్లో వయ్యారి వీవ్స్ పేరుతో చీరల షోరూం కొనసాగుతోంది. ఈ నెల 17న సాయంత్రం కొందరుమహిళలు రెండు గ్రూపులుగా ఈ షాప్నకు వచ్చారు. ఒక గ్రూపు మహిళలు కంచిపట్టు చీరలు చూపించాలని సేల్స్మెన్ను కోరగా ఆయన వాటిని చూపిస్తుండగా కొద్దిసేపటికే మరోగ్రూపు మహిళలు అక్కడికి వచ్చి సాదా చీరలు చూపించాలని కోరారు. సదరు సేల్స్మెన్ అటువైపు వెళ్లగానే కంచిపట్టు చీరలు చూస్తున్న మహిళలు వాటిని చాకచక్యంగా దొంగిలించారు. సేల్స్మెన్ ఇటు వచ్చిన కొద్దిసేపటికే సాదా చీరలు చూస్తున్న మహిళల బృందం సేల్స్మెన్ కళ్లు గప్పి చీరల్ని మూటలో వేసుకున్నారు. ఈ బృందం వెళ్లిపోయిన తర్వాత చీరలు చూడగా స్టాక్ తక్కువగా కనిపించడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించగా సేల్స్మెన్ దృష్టి మరల్చి ఈ రెండు బృందాలు చీరలు దొంగిలించినట్లు గుర్తించారు. దీంతో షోరూం యజమాని తిరుమల రఘురాం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మంగళవారం యూసుఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్ మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పోటీలకు 26 రాష్ట్రాల నుంచి 800 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని చెప్పారు. క్రీడలలో పాల్గొనడం వలన ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉంటామని చెప్పారు. ఈ చాంపియన్ షిప్ ఏర్పాటు చేసిన నిర్వహకులు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. క్రీడలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశం తో ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరగడం ఎంతో సంతోషిదగ్గ విషయం అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. -
సీడబ్ల్యూసీ ఎదుట కరాటే కల్యాణి .. ‘అవమానించిన వారిని వదిలేది లేదు’
సాక్షి, హైదరాబాద్: అక్రమ దత్తత ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి బుధవారం యూసుఫ్గూడ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో చంటిబిడ్డతో సహా అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం రాబట్టారు. అనంతరం కరాటే కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, ఎదుగుతున్న తనను కావాలని కొందరు అసత్య ఆరోపణలతో బయటకు లాగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. నిరాధార ఆరోపణలు చేసి తనను అవమానించిన వారిని వదిలేది లేదని, న్యాయపరంగా వారిపై పోరాడతానన్నారు. అధికారులు తన వాదనను నమ్మారని, తాను తప్పు చేయలేదని చెప్పడానికి అది చాలన్నారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఇంతవరకు తాను చంటిబిడ్డను దత్తత తీసుకోలేదని, భవిష్యత్లో తీసుకుంటానా లేదా అనే విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. చదవండి: ఓటీటీలో సామ్, నయన్ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? నిబంధనలు పాటించాల్సిందే.. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సీడబ్ల్యూసీ అధికారులు కరాటే కల్యాణికి స్పష్టం చేశారు. ఆమె వద్ద ఉన్న పాపను చిన్నారి తల్లి స్వప్నకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనందున భవిష్యత్లో దత్తత తీసుకోవాలంటే రంగారెడ్డి వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు సమా చారం. ప్రస్తుతం కల్యాణి వద్ద ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు కూడా సీడబ్ల్యూసీకి అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజతో పాటు సభ్యులు లలిత, ప్రమోద తదితరులు పాల్గొన్నారు. -
భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య
సాక్షి, బంజారాహిల్స్: ఆత్మహత్య చేసుకుంటానని భార్యతో చెప్పి వెళ్లిన వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్గూడ కార్మికనగర్లో నివసించే పులివడ్ల భాస్కర్(40) అపోలో ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తుంటాడు. మద్యానికి బానిసై రోజూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన భార్య కవిత గ్యాస్కు డబ్బులు కావాలంటూ భాస్కర్ను అడిగింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భాస్కర్ బయటికి వెళ్లగానే.. ఆందోళన చెందిన కవిత తన మామకు ఫోన్ చేసింది. అందరూ కలిసి భాస్కర్ కోసం గాలించగా రహ్మత్నగర్ నిమ్స్మే గ్రౌండ్లో చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ భాస్కర్ కనిపించాడు. వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడని.. మద్యానికి బానిసయ్యాడని తండ్రి రత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ పేరుతో ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి.. యువకుడి అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్: : మైనర్ బాలికను మాయమాటలతో మోసం చేసిన లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్గూడ చెక్పోస్టు సమీపంలోని తాహెర్ విల్లా కాలనీలో పని చేస్తున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ కోనేటి రమేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. గత నెల 21న సదరు బాలికను రమేష్ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి లైంగికి దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి గత నెల 23న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేష్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిదితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్మెంట్కు ముందు! -
భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సాగర్ కె చంద్ర డైరెక్షన్లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి లీడ్ రోల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న(బుధవారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇందుకోసం యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది నగర పోలీస్ శాఖ. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ చెక్పోస్ట్ వైపు వాహనాలకు అనుమతి నిరాకరిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, క్రిష్ణ కాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుంది. #HYDTPinfo Commuters, please make note of traffic restrictions/diversions in view of the Pre-Release Event of the Telugu movie "Bheemla Nayak" at 1st TSSP Bn. Grounds, Yousufguda on 23.02.2022.@JtCPTrfHyd pic.twitter.com/lUn348As8R — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 pic.twitter.com/xihE3KATJj — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్లిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలల్ని పార్కింగ్ ప్రదేశాలుగా గుర్తించారు. వాహనదారులు ఈ రూట్లలో ప్రయాణించి.. అసౌకర్యానికి గురికాకూడదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్లు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 21వ తేదీనే ఈ ఈవెంట్ జరగాల్సిన ఉండగా.. ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్ను వాయిదా వేశారు. దీంతో 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి ఉండదని, కేవలం 23వ తేదీతో ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం. -
కూతురు మృతి.. అంతదూరం నుంచి రాలేమన్న తల్లిదండ్రులు
సాక్షి, బంజారాహిల్స్: కరోనా మహమ్మారి వల్ల కడచూపుకూడా దక్కడం లేదు. తల్లిదండ్రులు చనిపోతే తమ పిల్లలు, కన్నవాళ్లు చనిపోతే తల్లిదండ్రులు చివరి చూపు చూసుకునేందుకు కూడా వీల్లేకుండా పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఖానాపురానికి చెందిన శీలం అరుణ శ్రీ(31) బ్యూటీషియన్గా పనిచేస్తూ యూసుఫ్గూడ సమీపంలోని యాదగిరి నగర్లో గత ఏడు సంవత్సరాలుగా ఉంటోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసింది. తల్లిదండ్రులు స్వగ్రామంలో ఉండగా పోలీసులు వారికి సమాచారం అందించారు. అయితే కరోనా వ్యాపిస్తుండటంతో రాకపోకలకు కూడా తమకు తీవ్ర ఇబ్బందికారంగా ఉందని.. వచ్చివెళ్లేందుకు డబ్బులు కూడా లేవని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. మీరే అంత్యక్రియలు చేయాలని కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డి తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్లో వ్యభిచారం.. -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: యూసఫ్గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు... సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇక ప్రమాదానికి కారణమైన బస్సు కొండాపూర్ డిపోనకు చెందినదిగా తెలుస్తోంది. ఘటనకు కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
తెల్లారితే పెళ్లి.. మరో యువతితో వరుడు..
సాక్షి, హైదరాబాద్: తెల్లారితే పెళ్ళి పీటలెక్కాల్సిన వరుడు అంతకుముందే మరో యువతిని పెళ్లి చేసుకొని ఉడాయించాడు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన వెంకట దుర్గాప్రసాద్(29) యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి అద్దెకుంటున్నాడు. అమ్మాయిలను మాటలతో మభ్యపెట్టి ప్రేమలోకి దింపుతూ కాలం గడుపుతున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో నివసిస్తున్న యువతి(24)తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె ప్రేమిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ యువతి తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన యువకుడితో పెళ్లి కుదుర్చుకుంది. ఇందుకుగాను 20 రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. ఈ నెల 22వ తేదీన పెళ్లిజరగాల్సి ఉంది. రూ.3 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. తీరా తెల్లారి పెళ్లి అనగా వెంకట దుర్గాప్రసాద్ అసలు రంగు బయటపడింది. ఆరు నెలలుగా మరో యువతితో ప్రేమలో పడ్డాడని ఆమెతోనే పది రోజుల క్రితం పెళ్లి జరిగిందని తెలుసుకొని బాధిత యువతి ఖంగుతినింది. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పరారీలో ఉన్న దుర్గా ప్రసాద్ను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
పట్టపగలు యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బంగారు నగలు కట్ చేసే కట్టర్తో దాడికి తెగబడి ప్రాణాలు తీశాడు. సోమవారం హైదరాబాద్లోని యూసుఫ్గూడ జవహర్నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతడు ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అగ్గిరాముడు మధురానగర్లో ఇస్త్రీ షాపు నిర్వహించడంతోపాటు ఓ ఇంట్లో వాచ్మెన్గా పని చేస్తూ జవహర్ నగర్లో కుటుంబంతో సహా అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె వెంకటలక్ష్మి (19) ఏడో తరగతి వరకు చదివింది. కొన్నాళ్లు ఇళ్లల్లో పని చేసింది. రెండు నెలల నుంచి జవహర్ నగర్లోని జోడి ఫ్యాషన్ జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్స్లో పని చేస్తోంది. ఈ షాపు యజమాని జ్యోత్స్న నాలుగు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం కూడా స్టోర్స్ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో యజమానురాలికి ఫోన్ చేసింది. షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని చెప్పింది. తర్వాత 3.30 గంటల సమయంలో ఓ యువకుడు షాప్లోకి వచ్చాడు. అక్కడే ఉన్న బంగారు నగలు కట్ చేసే కట్టర్తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న వెంకటలక్ష్మిని స్థానికులు కొద్దిసేపటి తర్వాత గమనించారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల నుంచి వేధింపులు ఆరు నెలలుగా సాగర్ అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి సాగర్ ఇలానే చేసినట్లు ఆమె పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిన కారణంగానే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్ గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలిసింది. దుకాణంలో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం వేళల్లో వినియోగదారుల రద్దీ కూడా ఉండదన్న ఉద్దేశంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాగర్కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారు బయట కాపు కాయగా.. దుకాణంలోకి వెళ్లిన సాగర్ ఘాతుకానికి తెగబడినట్లు సమాచారం. గొంతు కోసిన తర్వాత సాగర్ ఆమె మెడలో ఉన్న చున్నీతో ఉరి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు మధురానగర్లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గతంలోనూ అతడు తమ కూతురిని బెదిరించాడని వెంకటలక్ష్మి కుటుంబీకులు తెలిపారు. రోదిస్తున్న వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నాం. స్థానికుల సమాచారంతోపాటు ఘటనా స్థలంలో ఉన్న సీసీఫుటేజీలు, వీధిలోని ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నాం. బాధితురాలి సెల్ఫోన్ కాల్డేటా సైతం పరిశీలిస్తున్నాం. – ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్జోన్ డీసీపీ -
నడుస్తు నడుస్తూనే కిందపడి వ్యక్తి మృతి
-
కూతురుని లవ్ చేశాడని..
-
కుమార్తెను ప్రేమిస్తున్నాడని..
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేయడమేగాక ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్గూడ జవహర్నగర్కు చెందిన మహేందర్, భరత్నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ యాదవ్ కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఈ నెల 21న అఖిల్, సాయి అనే ఇద్దరు యువకులు మహేందర్ను బలవంతంగా కారులో వెంకటేష్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. మల్లేష్, సాయి, వెంకటేష్ అతడిని తీవ్రంగా కొట్టడంతో మహేందర్ సృహతప్పి పడిపోవడంతో 22వ తేదీ తెల్లవారుజామున యూసుఫ్గూడ రహదారిపై పడేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి బాలమణి కుమారుడిని కేర్ ఆసుపత్రిలో చేర్చించాడు. బుధవారం కోలుకున్న మహేందర్ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ సనత్నగర్ పోలీస్స్టేషన్కు పంపగా, వారు తమ పరిధి కాదంటూ జూబ్లీహిల్స్ కు పంపారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూసుఫ్గూడలో అర్ధరాత్రి రౌడీల హల్చల్
-
సినిమాల్లో అవకాశం కోసం వ్యభిచారం
- పోలీసులకు చిక్కిన ఇంజినీరింగ్ యువతి సాక్షి, బంజారాహిల్స్ : వెండితెర మీద వెలిగిపోవాలన్న కోరిక.. ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే తపన.. వీటికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. వాటి నుంచి బయటపడి కలల లోకాన్ని చేరుకునేందుకు ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకొని పోలీసులకు చిక్కింది. ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువతి వ్యభిచార గృహంలో పోలీసులకు దొరికిపోయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్ నగర్లో నాగభాస్కర్ అలియాస్ విక్కి కొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. పి.సాయి దుర్గాప్రసాద్ అలియాస్ కార్తీక్, పి.ధర్మ అనే ఇద్దరు ఆయనకు అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలను ఎంచుకొని వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అడిగినంత డబ్బు ఇచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ అందమైన అమ్మాయి తనకు సినిమాల్లో నటించాలని కోరిక ఉందని దుస్తులు, మేకప్, ఖర్చుల కోసం డబ్బులు లేవని చెప్పడంతో వీరు ఆమెను ట్రాప్ చేశారు. సినిమా షూటింగ్ కోసమంటూ అందమైన ఫొటోలు తీశారు. విషయం ముందుగానే చెప్పి ఆ ఫొటోలను కొందరు యువకులకు పోస్ట్ చేసి బేరం పెట్టారు. ఇంకేముంది చాలా మంది ఆమె కావాలన్నారు. రెండు రోజుల క్రితం ఎల్ఎన్నగర్లోని వ్యభిచార గృహంపై దాడి చేసిన సమయంలో ఆమె పోలీసులకు చిక్కింది. ఆమె వివరాలు రాబట్టగా ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తేలింది. ఆమెతో పాటు ముంబైకి చెందిన మరో మోడల్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని నింబోలి అడ్డాలోని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు విక్కీ పరారీలో ఉండగా అసిస్టెంట్లు కార్తీక్, ధర్మాలను ఐపీసీ సెక్షన్ 370, 370ఏ, పీటా యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఐఏఎస్ అధికారిని ప్రశ్నిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : యూసుఫ్గూడలో దారుణ హత్యకు గురైన కారు డ్రైవర్ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ నాగరాజు మృతదేహాన్ని తరలించేందుకు కుమారుడికి సహకరించారన్న అనుమానంపై ఆయనను విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ ప్రమేయం కూడా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ కేసులో ఐఏఎస్ కుమారుడు వెంకటేష్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. మరోవైపు తన భర్త హత్యకు వెంకటేషే కారణమని మృతుడి భార్య జమున ఆరోపిస్తుంది. -
‘నా భర్త హత్యకేసులో మరో మహిళ ప్రమేయం’
హైదరాబాద్ : యుసుఫ్గూడలో దారుణ హత్యకు గురైన కారు డ్రైవర్ నాగరాజు భార్య జమున తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ హత్యకు సంబంధించి మరో మహిళ ప్రమేయం ఉందని ఆమె ఆరోపణలు చేసింది. ఐఏఎస్ కుమారుడు వెంకట్ ఈ హత్య చేయించి ఉంటాడని జమున తెలిపింది. మరోవైపు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి భార్య నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా సూర్యాపేట సమీపంలోని దుబ్బతండాకు చెందిన కారు డ్రైవర్ భూక్యా నాగరాజు (40)... భార్య జమున, తన ఇద్దరు పిల్లలతో రహమత్నగర్లోని జవహర్ నగర్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్గూడలోని సాయికల్యాణ్ అపార్ట్మెంట్ పైకి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజుతో వెళ్లిన వ్యక్తి మాత్రమే కిందకు దిగి వెళ్లిపోయాడు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదే వ్యక్తి సదరు అపార్ట్మెంట్ పైకెళ్లి... ఓ మూటను కిందకు తీసుకొస్తుండగా చప్పుడయింది. ఈ అలికిడికి అప్రమత్తమైన అపార్ట్మెంట్లోని ఓ వృద్ధుడు... ఎవరు నువ్వు... ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో సదరు వ్యక్తి మూట వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో ఆ వృద్ధుడు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మూటలో యువకుడి మృతదేహం కనుగొన్న పోలీసులు అతడిని నాగరాజుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. కాగా హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
అపార్ట్మెంట్లో మూట.. మూటలో శవం
-
అపార్ట్మెంట్లో మూట.. మూటలో శవం
- యూసుఫ్గూడలో కారు డ్రైవర్ దారుణ హత్య - నిందితుడు ఓ ఐఏఎస్ కుమారుడిగా అనుమానం! - ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఓ కారు డ్రైవర్ హత్యకు గురయ్యాడు. యూసుఫ్ గూడలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ హత్య... ఆలస్యంగా వెలుగులోకి చూసిం ది. దీనికి పాల్పడింది ఓ ఐఏఎస్ అధికారి కుమారుడిగా అనుమానిస్తున్నారు. వెళ్లింది ఇద్దరు.. తిరిగొచ్చింది ఒక్కరు: సూర్యాపేట సమీపంలోని దుబ్బతండాకు చెందిన కారు డ్రైవర్ భూక్యా నాగరాజు (40)... భార్య జమున, తన ఇద్దరు పిల్లలతో రహమత్నగర్లోని జవహర్ నగర్లో ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్గూడలోని సాయికల్యాణ్ అపార్ట్మెంట్ పైకి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజుతో వెళ్లిన వ్యక్తి మాత్రమే కిందకు దిగి వెళ్లిపో యాడు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదే వ్యక్తి సదరు అపార్ట్మెంట్ పైకెళ్లి... ఓ మూటను కిందకు తీసుకొస్తుం డగా చప్పుడయింది. ఈ అలికిడికి అప్రమ త్తమైన అపార్ట్మెంట్లోని ఓ వృద్ధుడు... ఎవరు నువ్వు... ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో సదరు వ్యక్తి మూట వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మూటలో శవం... ఆ మూట నుంచి దుర్వాసన వస్తుండటంతో వృద్ధుడు పోలీసులకు సమాచారం అందిం చాడు. పోలీసులు మూట విప్పి చూడగా ఒకరి మృతదేహం బయటపడింది. ఈ మృతదేహం జవహర్నగర్లో ఉంటున్న నాగరాజుగా నిర్ధారించుకున్నారు. శుక్రవార మే హత్యకు గురైన నాగరాజుతో టెర్రస్ పైకి వెళ్లిన వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో లభించిన యువకుడి చిత్రాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కాల్ డేటా పరిశీలన... అయితే ఈ హత్యకు పాల్పడింది ఓ ఐఏఎస్ అధికారి కుమారుడని విశ్వసనీయ సమాచారం. ఆదివారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని కాల్డేటా పరిశీలిస్తున్నారు. మృతుడి భార్య నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
జాయ్ఫుల్.. ఫేర్వెల్
-
తల్లి ఔనంది... కూతురు కాదంది
హైదరాబాద్(బంజారాహిల్స్): తన కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని తల్లి ఫిర్యాదు చేసిన గంటలోనే అలాంటిదేమీ లేదని తననెవరూ వేధించడం లేదంటూ కూతురు ఆ యువకుడిని పోలీస్స్టేషన్ నుంచి తీసుకెళ్లిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్కు చెందిన విక్కీ అనే యువకుడు తన కూతురును వెంటపడుతూ వేధిస్తున్నాడని ఓ మహిళ శనివారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను వేధించడం లేదని ఆయన వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తన ఇష్ట్రపకారమే మాట్లాడుతున్నానంటూ సదరు యువతి పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. దీంతో ఎవరిని నమ్మాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. కూతురి మాట ప్రకారం పోలీసులు విక్కీని వదిలిపెట్టగా ఆమె స్వయంగా సదరు యువకుడిని బయటికి తీసుకురావడం విశేషం. -
ఒక్కరోజు రోడ్డు
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలకు నగర రోడ్లు ఎంతగా ఛిద్రమయ్యాయో ప్రతి వాహనదారుడికి అనుభవమే. అలాంటి రోడ్లలో ఈ చిత్రంలో కనిపిస్తున్నది కూడా ఒకటి. శ్రీనగర్ కాలనీలోని సందీప్తి గ్యాస్ గోడౌన్ నుంచి యూసుఫ్గూడ ఆర్బీఐ చౌరస్తా వరకు ఉన్న ఈ రోడ్డు మొన్నటి వర్షాలకు పూర్తిగా గుంతలు పడింది. దీంతో అధికారులు ఈనెల 7న అర్ధరాత్రి తారు రోడ్డు వేశారు. అయితే వాహనదారుల ఆనందం ఒక్కరోజుకే పరిమితమైంది. 9వ తేదీ ఉదయానికి ఇలా గుంతలు పడి, కంకర తేలి ప్రమాదకరంగా మారింది. గుంతలుగా ఉన్నప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు రోడ్డు బాగుందని కాస్త వేగంగా వచ్చినవారు ఈ కంకరపై జారిపడి గాయాల పాలవుతున్నారు. నగరంలో రోడ్ల నాణ్యతకు ఈ మార్గం అద్దం పడుతోంది. -
పాలిటెక్నిక్ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్: యూసుఫ్గూడ స్టేట్ హోమ్ ఆవరణలోని సర్వీస్ హోమ్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఈ మేరకు సర్వీస్ హోమ్ అధికారులు మంగళవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోని (16) అనే బాలిక నగరంలో పాలిటెక్నిక్ చదువుతుంది. అయితే ఆమె సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కిరాణ దుకాణంలో అగ్నిప్రమాదం
-
హైదరాబాద్లో SBI ఆలిండియా వాలీబాల్
-
నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా..
యువతికి వేధింపులు అర్ధరాత్రి ఆమె పని చేసే ఇంట్లోకి ప్రవేశించి హంగామా హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ఓ యువకుడు... అర్ధరాత్రి పూట ఆమె పని చేసే ఇంట్లోకి ప్రవేశించి హంగామా సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ నివాసి వినోద్సింగ్ కొంత కాలంగా జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో పని చేస్తున్న యువతి వెంటపడి ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి.. మూడు రోజులుగా పనికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉంటోంది. వినోద్ ఫోన్ చేస్తే తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయబోతున్నారని, ప్రేమ పేరుతో తనను వేధించవద్దని స్పష్టం చేసింది. తనను కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా.. పెళ్లికొడుకుతో పాటు నిన్నుకూడా చంపేస్తానని అతను యువతిని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు తన ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో ఆగ్రహానికి గురైన వినోద్ ఆదివారం అర్ధరాత్రి ఆమె పని చేసే ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. యువతి ఉండే గది వద్దకు వెళ్లి తచ్చాడుతుండగా ఇంటి యజమాని గమనించి అక్కడికి వెళ్లే లోపు పరారయ్యాడు. విషయాన్ని యజమాని బాధిత యువతి దృష్టికి తీసుకెళ్లగా ఆమె సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమపేరుతో తనను వేధిస్తున్న వినోద్పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తైక్వాండో పోటీల ముగింపులో పాల్గొన్న జయప్రద
-
'మా వాడు తప్పు చేసుంటే శిక్షించండి'
కడప: హైదరాబాద్ యూసుఫ్గూడ ఏటీఎం దోపిడీ కేసు నిందితుడు శివకుమార్ తప్పు చేసినట్టయితే కఠినంగా శిక్షించాలని అతని తల్లిదండ్రులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై శివ కుమార్ తల్లిదండ్రులు స్పందించారు. మందలించినందుకు 2006లోనే శివకుమార్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీలలిత బుధవారం ఉదయం యూసుఫ్గూడలోని ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా శివకుమార్ పిస్తోల్తో కాల్పులు జరిపి ఆమె నుంచి బంగారు గొలుసు, ఉంగరం, చెవి కమ్మలు, సెల్ఫోన్, ఏటీఎం కార్డు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. దోపిడీకి పాల్పడిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి అతని నుంచి పిస్తోల్తో పాటు మూడు ఏటీఎం కార్డులు, బంగారు గొలుసు, చేతి ఉంగరం, ఐదు సెల్ఫోన్లు, బటన్ చాకు, హ్యాడ్ కర్చీఫ్, రూ.4,000 నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆగంతకుడు కడప జిల్లాకు చెందిన పెదపల్లి శివకుమార్రెడ్డి అని గుర్తించారు. -
ఏటీఎం దోపిడీ కేసు నిందితుడి అరెస్టు
-
ఏటీఎం దోపిడీ కేసు నిందితుడు పట్టుబడ్డాడిలా...
హైదరాబాద్: సంచలనం సృష్టించిన యూసఫ్ గూడ ఏటీఎం దోపిడీ కేసు నిందితుడిని పోలీసులు గురువారం రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి గత మూడేళ్లుగా ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉంటూ నేరాలకు పాల్పతున్నాడని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. విలాసాలకు అలవాటుపడి అతడు వక్రమార్గం పట్టాడని చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అతన్ని పట్టుకున్నామని వెల్లడించారు. యూసఫ్ గూడ ఏటీఎంలో చొరబడి నాటు తుపాకీతో యువతిని బెదిరించి ఏటీఎం కార్డు, ఆభరణాలు ఎత్తుకుపోయాడన్నారు. యువతిని భయపెట్టేందుకు తుపాకీతో పక్కకు కాల్చాడని వెల్లడించారు. తన తెలిసిన వారి సహకారంతో మహారాష్ట్రలో ఈ తుపాకీ కొనుగోలు చేసినట్టు నిందితుడు చెప్పాడని కమిషర్ తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకుని 24 గంటల్లో ఛేదించామన్నారు. అతడి వద్ద నుంచి 3 ఏటీఎం కార్డులు, 5 సెల్ ఫోన్లు, బంగారపు గొలుసు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హాస్టల్స్ లో చేరే వారి విషయంలో హాస్టల్స్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఏటీఎం కేంద్రాల్లో తప్పనిసరిగా సెక్యురిటీ ఉండాలని, క్వాలిటీ సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించినట్టు కమిషనర్ చెప్పారు. -
ఏటీఎం దోపిడీ కేసు నిందితుడి అరెస్టు
యూసుఫ్గూడలోని ఏటీఎం సెంటర్లో రివాల్వర్తో బెదిరించి యువతి నుంచి సొత్తు దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్లిన యువతిని నిందితుడు తన వద్ద ఉన్న రివాల్వర్తో బెదిరించి.. గాల్లోకి కాల్పులు కూడా జరిపి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్, ఏటీఎం కార్డు, నగదు తదితరాలను దోచుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఒక్క రోజులోనే నిందితుడిని పట్టుకోగలిగారు. అతడివద్ద నుంచి తుపాకి, మూడు బుల్లెట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. -
ఏటీఎం దోపిడీ వీడియో విడుదల
యూసుఫ్గూడ ఏటీఎం దోపిడీ కేసులో విచారణ వేగవంతమైంది. ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరా ఫుటేజ్లో నిందితుడిని పోలీసులు గుర్తించారు. యూసుఫ్గూడ ఆర్బీఎస్ ఏటీఎం కేంద్రంలో బుధవారం ఉదయం 7.25కు సాఫ్ట్వేర్ ఉద్యోగిని డబ్బులు డ్రా చేస్తుండగా... ఆమెపై దాడి జరిగింది. ముసుగుతో లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తాను కష్టాల్లో ఉన్న నగదు కావాలంటూ తుపాకీతో బెదిరించాడు. ఈ బెదిరింపుల వీడియో క్లిప్పింగును పోలీసులు గురువారం విడుదల చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీటీవీ ఫుటేజిలో అతడు బెదిరించి, బయటకు వెళ్లేవరకు ఉన్న దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అయితే అతడు ముసుగుతో రావడంతో కచ్చితంగా నిందితుడిని గుర్తించడం కొంత కష్టంగా మారింది. నిందితుడు తన వద్ద ఉన్న రివాల్వర్ తో ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి తన వద్ద ఉన్న డెబిట్ కార్డు, బంగారు నగలు ఇచ్చేసింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు మరో ఏటీఎంలో రూ. 3,500 డ్రా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
యూసఫ్గూడ ఏటీఎమ్ నిందితుడి వీడియో దృశ్యాలు
-
ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు
-
ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు
హైదరాబాద్: యూసఫ్గూడలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద బుధవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించింది. ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తున్న యువతిపై ఆగంతకులు కాల్పులు జరిపారు. అనంతరం ఆమె నుంచి నగలు, నగదు దోచుకుని అక్కడి నుంచి పరారైయ్యారు. వెంటనే తేరుకున్న సదరు యువతి స్థానికుల సహాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఏటీఎం పరిసర ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించి... నిందితులకు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యువతి మధురానగర్ హాస్టల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఈ రోజు ఉదయం 7.30 గంటలకు చోటు చేసుకుంది. -
ప్రియురాలిపై ప్రియుడి హత్యాయత్నం
-
మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి..
యువతులను తరలిస్తున్న దంపతులఅరెస్ట్ నిందితులపై కేసు యువతులను జడ్జి ఎదుట హాజరుపరిచి ఇళ్లకు పంపించిన పోలీసులు సూర్యాపేట : ‘‘ఓ పెద్ద మనిషి కుటుంబంలో వివాహవేడుక ఉంది... అక్కడ మీరు నృత్యం చేసి ఆహ్వానితులను సంతృప్తిపరిస్తే మంచి పారితోషికం లభిస్తుంది’’ అంటూ పేద యువతులను ప్రలోభపెట్టి వ్యభిచారరొంపిలోకి దింపుతున్న దంపతుల గుట్టురట్టయ్యింది.. రాష్ట్ర రాజధాని సమీప జిల్లాలకు చెందిన ఆరుగురు యువతులను ఇదే తరహాలో విశాఖ పట్టణానికి తరలిస్తూ వాహనాల తనిఖీలో పోలీసులకు చిక్కారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని యూసుఫ్గూడకు చెందిన బండి శ్రీనివాస్, పిట్ట దివ్యారెడ్డి దంపతులు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండలకు చెందిన ఆరుగురు యువతులను విశాఖపట్నంలో ఓ వివాహ వేడుకలో నృత్యం చేయాలని నమ్మబలికి తీసుకెళ్తున్నారు. ఏపీ9బిహెచ్2124 నంబర్ గల ఫోర్డ్ ఎన్డీవర్ వాహనంలో ఆ ఆరుగురుని ఎక్కించుకొని శుక్రవారం రాత్రి విశాఖపట్నానికి బయలుదేరారు. సూర్యాపేట పట్టణ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ - విజయవాడ రహదారిపై గల ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఎన్డీవర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అం దులో ఉన్న దంపతులు, యువతులను ప్రశ్నించగా తాము ఓ వివాహ వేడుకకు విశాఖపట్నానికి వెళ్తున్నామని, ఇందులో ఉన్న వారంతా నృత్యం చేసేవారని తెలిపారు. వాహనంలో ఉన్నవారు భయాందోళనకు గురయినట్టు గమనించిన పోలీసులు గట్టిగా దబాయించారు. దంపతులిద్దరూ కొంత కాలంగా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఆరుగురు యువతులను కూడా వ్యభి చార కూపానికి తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని సీఐ మొగలయ్య తెలిపారు. దంపతులిద్దరి పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఆరుగురు యువతులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి వారి వారి ఇళ్లకు పంపించినట్టు పేర్కొన్నారు. వారు దంపతులేనా..? బండి శ్రీనివాస్, పిట్ట దివ్యారెడ్డి దంపతుల కాదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు కొంత కాలంగా పెళ్లిళ్ల వద్ద నృత్యం చేయాలని నమ్మబలుకుతూ యువతులను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్టు సమాచారం. ఆర్థిక అవసరాల కోసం విద్యార్థినులు, గిరిజన తండాలకు చెందిన యువతులు వీరి వలలో చిక్కుకొని వ్యభిచార కూపంలోకి దిగుతున్నట్టు తెలిసింది. -
మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: యూసుఫ్గూడలోని కృష్ణానగర్ బస్తీలో ఓ మినీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. 108 క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అదే ప్రమాదంలో నాలుగు కార్లు, 5 బైకులు ధ్వంసమైనాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి... మినీ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
అదుపుతప్పిన మినీబస్సు : ముగ్గురికి గాయాలు
-
యూసుఫ్గూడ జీహెచ్ఎస్కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఎం. కాశీనాథ్ గౌడ్ స్మారక ఖోఖో టోర్నమెంట్లో జూనియర్ విభాగం టైటిల్ను యూసుఫ్గూడ గవర్నమెంట్ హైస్కూల్(జీహెచ్ఎస్) జట్టు కైవసం చేసుకుంది. బడీ చౌడీలోని హెల్త్ లీగ్ క్లబ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో యూసుఫ్గూడ జీహెచ్ఎస్ జట్టు 10-5 స్కోరుతో మనోరంజిత మెమోరియల్ హైస్కూల్ జట్టుపై విజయం సాధించింది. సెమీఫైనల్లో యూసుఫ్గూడ జీహెచ్ఎస్ జట్టు 7-0తో కేవీ హైస్కూల్ (గోల్కొండ) జట్టుపై, మనోరంజిత మెమోరియల్ హైస్కూల్ హెల్త్ లీగ్ క్లబ్ జట్టుపై గెలిచాయి. హెల్త్ లీగ్ క్లబ్ జట్లు ముందంజ సీనియర్ పురుషుల విభాగంలో తొలి రౌండ్లో హెల్త్ లీగ్ క్లబ్ (ఎ)(బి) జట్లు విజయాలను సాధించాయి. హెల్త్ లీగ్ క్లబ్ (ఎ) జట్టు 8-2తో కేవీ హైస్కూల్ (సీఆర్పీఎఫ్-బార్కాస్) జట్టుపై గెలిచింది. రెండో మ్యాచ్లో హెల్త్ లీగ్ క్లబ్ (బి) 7-4తో శ్రీహనుమాన్ వ్యాయామ శాల(హెచ్వీఎస్) (ఎ) జట్టుపై గెలిచింది. కేవీ హైస్కూల్ (గోల్కొండ) 2-1తో నయాబజార్పై, హైదరాబాద్ జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ క్లబ్ జట్టు 9-4తో యూసుఫ్గూడ జీహెచ్ఎస్ జట్టుపై నెగ్గాయి. అంతకు ముందు ఈ పోటీలను ప్రముఖ వ్యాపార వేత్త ప్రీత్పాల్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ నరేందర్ గౌడ్, ఓయూ ప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధన్కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైనల్లో తనిష్క్
జింఖానా, న్యూస్లైన్: అఖిల భారత బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు తనిష్క్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో తనిష్క్ 21-10, 21-18తో అమిత్ కులకర్ణి (మధ్యప్రదేశ్)పై విజయం సాధించాడు. మరో సెమీస్లో సర్వజిత్ (పశ్చిమ బెంగాల్) 21-18, 21-13తో వికాస్ సింగ్పై గెలిచి ఫైనల్స్కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో అస్సాంకు చెందిన మనాలి సిన్హా-సుమిత్ర జోడి విజేతగా నిలిచింది. మనాలి-సుమిత్ర జోడి 21-2, 21-3తో నవీన్ నాయర్ -సర్వజిత్ కౌర్ (ఉత్తరప్రదేశ్) జంటను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో పాటు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మనాలి సిన్హా (అస్సాం) 21-1, 21-1తో స్రవంతి (ఆంధ్రప్రదేశ్)పై, సుమిత్ర (అస్సాం) 21-13, 21-11తో అమృత భట్టాచార్య (పశ్చిమ బెంగాల్ )పై గెలిచి ఫైనల్స్కు చేరుకున్నారు. వెటరన్ సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీనివాస రావు 21-10, 20-22, 23-21తో గౌతమ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)పై, దినేష్ యాదవ్ (మధ్యప్రదేశ్) 21-10, 21-16తో జాన్ మతాయ్ (ఛత్తీస్గఢ్)ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అనిల్ కుమార్-తనిష్క్ (ఆంధ్రప్రదేశ్) జోడి 21-10, 21-6తో పటేల్-జాన్మతి (ఛత్తీస్గఢ్) జోడిపై గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టింది. మిగతా ఫలితాలు చందన్ సింగ్-వికాస్ సింగ్ (ఉత్తరాఖండ్) జోడి 21-14, 22-20తో సర్వజిత్ బౌమిక్-సుదీప్ (పశ్చిమ బెంగాల్) ద్వయంపై, అభిజిత్ దత్త-హతిబరూవ (అస్సాం) జంట 21-12, 21-16తో సపన్ కుమార్-విమల్ వివేక్ (బీహార్)జోడిపై, అమిత్ కులకర్ణి-అమిత్ సక్సేనా (మధ్యప్రదేశ్) జోడి 21-14, 21-12తో రాజేష్-శ్రీజిత్ (కేరళ) ద్వయంపై విజయం సాధించాయి. -
కరెంటు లేక వాయిదా పడ్డ మూడో రౌండ్
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్... 15 దేశాల నుంచి గ్రాండ్మాస్టర్లు... భారత దేశంలోని ప్రముఖ చెస్ క్రీడాకారులతో పాటు రాష్ట్రానికి చెందిన అనేక మంది చిన్నారులు... ఒకేసారి సుమారు 70 బోర్డుల మీద గేమ్లు... యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో దృశ్యం ఇది. అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నీలో భాగంగా మంగళవారం మూడో రౌండ్ గేమ్లు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం గం. 2.30కు గేమ్లు మొదలయ్యాయి. గంట తర్వాత గం. 3.30 ప్రాంతంలో కరెంటు పోయింది. అంతా అంధకారం. గంట గడిచింది. అయినా కరెంటు రాలేదు. దీంతో గం. 4.30 ప్రాంతంలో ఈ రౌండ్ మ్యాచ్లను రద్దు చేశారు. బుధవారం మూడు, నాలుగు రౌండ్లు నిర్వహిస్తామని ప్రకటించారు. నగరంలో ఒక్క గచ్చిబౌలిలో మినహా ఏ స్టేడియంలోనూ జనరేటర్ సౌకర్యం లేదు. కాబట్టి పెద్ద టోర్నీలు ఏవైనా జరిగితే కరెంటు తీయకుండా మాట్లాడుకుంటారు లేదా జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ టోర్నీ నిర్వాహకులు మాత్రం మరచిపోయారు. విదేశాల నుంచి వచ్చిన గ్రాండ్మాస్టర్లు దీని గురించి ఏమనుకుంటారో...! ఫలితాలూ ఆలస్యమే షెడ్యూల్ ప్రకారం తొలి రోజు సోమవారం రెండు రౌండ్లు జరిగాయి. కానీ నిర్వాహకులు ఒక్క రౌండ్ ఫలితాలే మీడియాకు ఇచ్చారు. మంగళవారం రెండో రౌండ్ జరిగినట్లు ఫలితాలు ఇచ్చారు. కానీ వాస్తవానికి తొలిరోజే రెండో రౌండ్ గేమ్లు కూడా జరిగాయి. రెండో రౌండ్ ముఖ్య ఫలితాలను కూడా ‘సాక్షి’ ప్రచురించింది. కానీ మూడో రౌండ్ సందర్భంగా కరెంటు లేక గందరగోళం జరిగిన విషయం తెలియకుండా... గేమ్లు జరిగినట్లు, అది కూడా ముందు రోజు ఫలితాలను ఇవ్వడం ద్వారా నిర్వాహకులు ఎవరిని మభ్యపెడదామని అనుకుంటున్నారో వారికే తెలియాలి.