కూటమి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చేసిందేమి లేదు. వరదలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. విజయవాడతో పాటు జిల్లాలోని గోదావరి, శబరి వరద బాధితులను ఆదుకోకుండా తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ అంటూ తప్పుడు ప్రచారాలతో కాలం గడపడం భావ్యం కాదు. ఇలాంటి వాటిని విస్మరించి ప్రజల సంక్షేమానికి పాటుపడాలన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి.
– పి.బాలదేవ్,
జిల్లా కార్యదర్శి, ఆదివాసీ గిరిజన సంఘం
Comments
Please login to add a commentAdd a comment