సాక్షి,పాడేరు: జిల్లా విజన్ 2047కు ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ కోరారు. కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 2047 నాటికి భారత్ ఎలా ఉండాలి అనే అంశంపై వికసిత్ భారత్పై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర విజన్ 2047పై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రుపొందిస్తున్నాయన్నారు. జిల్లాకు సంబంధించి అందరి సలహాలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. వికసిత్భారత్ 2047 అమలు, ప్రణాళికలు, ప్రయోజనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రక్తహీనత కేసులపై ప్రత్యేక దృష్టి: అరకు ఎంపీ తనూజరాణి
జిల్లాలో రక్తహీనత కేసులు అధికంగా ఉన్నాయని, ప్రజల ఆరోగ్యం–రక్తహీనత సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మాట్లాడారు.గిరిజనుల వైద్య ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలతో పాటు సికిల్సెల్ ఎనీమియా కేసులకు అవసరమైన రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయాభివృద్ధితో మేలు: అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం
గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధితోపాటు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, మత్స్యగుండంలో అడ్వంచర్ పార్కు అభివృద్ధి, అన్ని గ్రామాలకు తారురోడ్లు నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. గిరిజన ప్రాంత చిన్నారులకు పాత విద్యా విధానమే మంచిదని ఆయన అభిప్రాయ పడ్డారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరిషాదేవి వీడియో కాన్ఫరెన్స్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ్, సబ్కలెక్టర్ సౌర్యమన్ పటేల్, గిరిజన యువప్రగతి, వీసీఎఫ్ టాటా సంస్థ ప్రతినిధులు డాక్టర్ సింహాచలం, డాక్టర్ కె.అప్పలరాజు, కొయ్యూరు ఎంపీపీ రమేష్బాబు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్
Comments
Please login to add a commentAdd a comment