పెదబయలు/పాడేరు : వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తున్న భార్యాభర్తలను మృత్యువు పాము కాటు రూపంలో విడదీసింది. ఈ విషాదకరమైన ఘటన పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ మారుమూల కుర్తాడిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన రమేష్ (30), రమణమ్మ(25) భార్యాభర్తలు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే ఈనెల 4న ఇంట్లో పడుకున్నారు. తెల్లవారుజాము 3 గంటల సమయంలో వారిని పాము కాటేసింది. ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని కుటుంబ సభ్యులు 108 లో ముంచంగిపుట్టు సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం పాడేరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీరికి వైద్యం అందిస్తున్నారు. ఈ సమయంలో రమణమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను అంబులెన్స్లో విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. భర్త రమేష్ పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వెంటనే ఆస్పత్రికి తరలింపు
విషమించిన భార్య రమణమ్మ ఆరోగ్యం
మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు
తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి
దంపతులను విడదీసిన మృత్యువు
Comments
Please login to add a commentAdd a comment