అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన తల్లీకూతుళ్లు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన తల్లీకూతుళ్లు

Published Thu, Oct 3 2024 3:04 AM | Last Updated on Thu, Oct 3 2024 3:04 AM

అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన తల్లీకూతుళ్లు

● పవర్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌ పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించిన నాగజ్యోతి, సాహితీ

తల్లీకూతుళ్లు నాగజ్యోతి, సాహితీలను సత్కరిస్తున్న నారాయణరావు, గోపీనాథ్‌

నర్సీపట్నం: గత నెల 22 నుంచి 30 వరకు సింగపూర్‌, మలేషియాలలో భారతీయ కేర్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో తల్లీకూతుళ్లు సత్తా చాటారు. తల్లి పి.వి.ఎం.నాగజ్యోతి(ఉపాధ్యాయుని) పవర్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్‌ పోటీల్లో, కుమార్తె సాహితీ సిమ్మింగ్‌లో బంగారు పతకాలు సాధించారు. వీరిని వ్యాపారవేత్త వెలగా నారాయణరావు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాఽథ్‌ బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ నాగజ్యోతి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నారని చెప్పారు. తల్లిని ఆదర్శంగా తీసుకుని కుమార్తె సాహితీ సిమ్మింగ్‌లో దూసుకుపోతున్నట్టు చెప్పారు. సింగపూర్‌, మలేషియాలలో జరిగిన పోటీల్లో నాగజ్యోతి పవర్‌ లిఫ్టింగ్‌ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌, అథ్లెటిక్స్‌ విభాగంలో డిస్క్‌, జావలిన్‌త్రోలలో ప్రథమస్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు, 100 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీస్థానంలో నిలిచి వెండి పతకం సాధించారని తెలిపారు. కుమార్తె సాహితీ సిమ్మింగ్‌ 50 మీటర్లు, బ్యాక్‌ స్ట్రోక్‌ 100 మీటర్లు, బ్యాక్‌స్ట్రోక్‌ 59 మీటర్ల ప్రీ స్టయిల్‌ విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలు సాధించారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement