చింతమనేని వేధింపులు తాళలేక నామినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

చింతమనేని వేధింపులు తాళలేక నామినేషన్‌

Published Thu, Feb 13 2025 8:50 AM | Last Updated on Thu, Feb 13 2025 8:50 AM

-

ఏలూరు రూరల్‌: దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రేవులగడ్డ ముకేష్‌ బాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఈ నెల 10న నామినేషన్‌ పత్రాలు అందించారు. దెందులూరు నియోజకవర్గంలో నాయకుల వేధింపులకు గురవుతున్న ఎందరో టీడీపీ కార్యకర్తలు తన విజయానికి సహకారం అందిస్తారన్నారు. తన తండ్రి గోవర్ధన్‌తో కలిసి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశానని గుర్తు చేసారు. అయినప్పటికీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, కొందరు నాయకులు తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం సైతం పట్టించుకోవడం లేదని వాపోయారు.

విజయవాడ వెళ్లాలనడంతో

రోదిస్తున్న

దివ్యాంగుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement