![పన్నుల వసూళ్లలో పురోగతి అవసరం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11wgl103-330080_mr-1739332267-0.jpg.webp?itok=lvzEP3fn)
పన్నుల వసూళ్లలో పురోగతి అవసరం
వరంగల్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూళ్లలో పురోగతి అవసరమని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. హనుమకొండ నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయంలోని సీఎస్సీ సెంటర్, ఈ–సేవ కేంద్రాన్ని కమిషనర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీగా టాక్స్ వసూళ్లు, నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment