స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్గా రవీందర్గౌడ్
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్గా గొడిశాల రవీందర్గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వారం రోజుల క్రితం ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణారెడ్డి బదిలీపై హైదరాబాద్కు వెళ్లగా ఆయన స్థానంలో జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్గౌడ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు తేడా ఉంటుందని, అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్ల సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ను ఘన్పూర్, శివుని పల్లి, ఛాగల్లు జీపీల కార్యదర్శులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యదర్శులు సీహెచ్.లింగయ్య, తిరునగరి శ్రీకాంత్, ఎదునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment