విజయమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలి | Sakshi
Sakshi News home page

విజయమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలి

Published Fri, Apr 19 2024 1:45 AM

మాట్లాడుతున్న బీఎస్పీ ఎంపీ అభ్యర్థి మందా జగన్నాథం 
 - Sakshi

ఎర్రవల్లిచౌరస్తా: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయమే అంతిమ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ ఎంపీ, బీఎస్పీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మందా జగన్నాథం అన్నారు. బీఎస్పీలో చేరిన సందర్భంగా గురువారం ఎర్రవల్లి మండలంలోని కొండేరులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలంతా ఏకదీక్షతో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, కాన్షీరామ్‌ ఆశయాలకు అనుగుణంగా సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలన్నారు. అన్ని రంగాల్లో కూడా బహుజనులు పైకి రావడానికి అంబేద్కర్‌ చేపట్టిన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లి బీఎస్పీ ఉద్దేశాలను వివరించాలన్నారు. రేపటి నుండే కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఎస్పీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి ఎం.జి కృష్ణ, జిల్లా అద్యక్షుడు రాంబాబు, నాయకులు రాజు, సునంద, యేసురాజు, సవరన్న, వెంకట్‌, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement