రాష్ట్రస్థాయి క్రికెట్‌ విజేత మహబూబ్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రికెట్‌ విజేత మహబూబ్‌నగర్‌

Published Fri, Oct 18 2024 12:58 AM | Last Updated on Fri, Oct 18 2024 12:58 AM

రాష్ట్రస్థాయి క్రికెట్‌ విజేత మహబూబ్‌నగర్‌

గద్వాలటౌన్‌: క్రికెట్‌ టోర్నమెంట్‌ చివరిరోజు తుది మ్యాచ్‌ ఆట సాధ్యపడలేదు. భారీ వర్షం కురువడంతో సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడకుండానే టోర్నీ ముగిసింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం టోర్నీ ముగించాల్సి ఉండగా.. బుధవారం రాత్రి, గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తునే ఉంది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. మ్యాచ్‌లు ఆడించడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చి నిర్వహకులు లీగ్‌ కమ్‌ నాకౌట్‌లో జరిగిన మ్యాచ్‌ల గెలుపు, రన్‌రేట్‌లను పరిగణలోకి తీసుకున్నారు. అందరి అమోదంతో నిర్వాహకులు టోర్నీ విజేతలను ప్రకటించారు.

టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్‌..

గత నాలుగు రోజులుగా స్థానిక స్టేడియంలో హోరాహోరీగా సాగిన క్రికెట్‌ పోటీలు క్రీడాభిమానులను ఎంతగానో అలరించాయి. ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న 68వ రాష్ట్రస్థాయి అండర్‌–14 క్రికెట్‌ పోటీలు గురువారం ముగిశాయి. రన్‌రేట్‌ ఆధారంగా రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్‌ జట్టును ప్రకటించారు. లీగ్‌ దశలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా జట్లు సమ ఉజ్జీలుగా ఉండటంతో ఆ రెండు జట్లను రన్నర్స్‌ విభాగానికి జాయింట్‌ విన్నర్స్‌గా ప్రకటించారు. నల్లగొండ జిల్లా జట్టును మూడో స్థానంలో గెలుపొందినట్లు నిర్వహకులు ప్రకటించారు. టోర్నీలో క్రీడాకారులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జితేందర్‌ తెలిపారు.

రన్నర్స్‌గా హైదరాబాద్‌, రంగారెడ్డి జట్లు

వర్షంతో సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడకుండానే ముగింపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement