విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేద్దాం

Published Thu, Sep 5 2024 2:08 AM | Last Updated on Thu, Sep 5 2024 2:08 AM

విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేద్దాం

కరీంనగర్‌: శాసీ్త్రయ విద్యాసాధనే ధ్యేయంగా విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేద్దామని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంగిడి కుమార్‌, ముల్కల మారుతి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో జరిగిన పీడీఎస్‌యూ 50 వసంతాల సదస్సులో మాట్లాడారు. భారత విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్రలో పీడీఎస్‌యూ ప్రత్యేక చరిత్ర కలిగి ఉందని, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్‌, దుస్సా చేరాలు, బొమ్మ సాంబయ్య, రంగవల్లి, మారోజు వీరన్న లాంటి ఎందరో వీరులు విద్యార్థుల హక్కులు, శాసీ్త్రయ విద్య, సమ సమాజ స్థాపన కోసం పోరాడుతూ అమరులయ్యారని గుర్తు చేశారు. నాయకులు ప్రణాడి అజయ్‌, అంజనీప్రసాద్‌, తాటిపల్లి గౌతం, రిషి, వరుణ్‌, సుధాకర్‌, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement