కరీంనగర్టౌన్: వీధి వ్యాపారుల దుకాణాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పప్పుల సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్లోని బీఎంఎస్ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లా ప్రభుత్వాసుపత్రి వెనకాల 126, శాతవాహన విశ్వవిద్యాలయ రహదారి పక్కన 25 షెడ్లు నిర్మించగా.. ఈ షెటర్ల కేటాయింపుల్లో దళారులు అక్రమ వసూళ్లకు తెర తీశారని ఆరోపించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు స్మార్ట్సిటీ నిధులతో ప్రభుత్వాసుపత్రి వద్ద, శాతవాహన యునివర్సిటీ వద్ద కలిపి 151 షెటర్లు నిర్మించారని, ఈ ఏడాది మార్చిలో నగరపాలక, రెవెన్యూ దరఖాస్తు ఆహ్వానించారని తెలిపారు. దుకాణాల కేటాయింపు కోసం 1,092 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వీధి వ్యాపారుల నుంచి రూ.25,000 నుంచి రూ.50,000 వరకు వసూలు చేశారని తెలిపారు. స్ట్రీట్ వెండర్స్ జిల్లా నాయకులు నక్క అరుణ్కుమార్, పసుల శ్రవణ్, తొర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment