లోకల్‌ వాయిస్‌ | - | Sakshi
Sakshi News home page

లోకల్‌ వాయిస్‌

Published Thu, Sep 5 2024 2:08 AM | Last Updated on Thu, Sep 5 2024 2:08 AM

లోకల్

ముంపు ప్రాంతాలపై నిర్లక్ష్యం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో వరద ముంపు ప్రాంతాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరుసగా కురిసిన భారీ వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో వరద, డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి. వంట సామగ్రి, వస్తువులన్నీ నీటికి తడిచి చెడిపోయాయి. పాములు, తేళ్లు లాంటి విష కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయి. అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రతి వర్షాకాలం సీజన్‌లో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– బోలుమల్ల సదానందం, వావిలాలపల్లి

ముందే సమాచారమివ్వాలి

కరీంనగర్‌టౌన్‌: విజయవాడ లాంటి ఘటనలు కరీంనగర్‌లో చోటుచేసుకోకుండా ఉండాలంటే వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందస్తు సమాచారమందించాలి. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు చేపట్టాలి. ప్రకృతి సిద్ధంగా వచ్చే వరదలతో ముప్పు ఉందని భావిస్తే ఆ పరిసర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అలా చేసినప్పుడే వరద ముప్పు, ప్రాణ నష్టం తప్పుతుంది.

– బొంగోని రాజాకిషన్‌గౌడ్‌, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
లోకల్‌ వాయిస్‌1
1/1

లోకల్‌ వాయిస్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement