కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 9వ డివిజన్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఆధ్వర్యంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు అల్లం కనకలక్ష్మి పలు వురు మహిళలకు పార్టీ సభ్యత్వ రశీదులు అందచేశారు. కార్యక్రమంలో అంజలి, రమ, పూజిత, తిరుమల, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
ఎస్జీటీలకు
ఓటుహక్కు కల్పించాలి
కరీంనగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు ఓటుహక్కు కల్పించాలని తెలంగాణ ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరామ్ శ్రీనివాస్, ప్రవీణ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఆపరేటర్ల అంతర్గత బదిలీ
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో పని చేస్తున్న పలువురు కంప్యూటర్ ఆపరేటర్లను గురువారం అంతర్గతంగా బదిలీ చేస్తూ కమిషనర్ చాహత్ బాజ్పేయ్య్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తపల్లిలో కుక్కల పట్టివేత
కొత్తపల్లి: కరీంనగర్ నగరపాలక సంస్థలోని ఏబీసీ(యానిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్ ఆధ్వర్యంలో గురువారం కొత్తపల్లి పట్టణంలో కుక్కలను పట్టుకున్నారు. అనంతరం వాటిని ఏబీసీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment