కొత్తపల్లి: కరీంనగర్లో విద్యుత్ టవర్ల నిర్మాణంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ బ్యాంక్ కాలనీ ఫీడర్ పరిధిలోని అభయాంజనేయస్వామి ఆలయం, బ్యాంక్ కాలనీ, రెడ్డి ఫంక్షన్ హాల్, సుభాష్నగర్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ ఎస్.నరేందర్ తెలిపారు. అదే విధంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ గోదాంగడ్డ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ రాంచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని రామచంద్రాపూర్కాల నీ, ఏవోస్కాలనీ, గోదాంగడ్డ, శ్రీనగర్కాలనీ, భగత్నగర్, సప్తగిరికాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.సుధీర్ కుమార్ తెలిపారు.
కరీంనగర్ రూరల్లో..
విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నందున సోమవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 33/11 కేవీ నగునూర్, ఆర్నకొండ, రుక్మాపూర్, కాట్నపల్లి సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment