కొత్తపల్లి: ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–19 నెట్బాల్ పోటీలకు కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర జూ నియర్ కళాశాల విద్యార్థులు ఎంపికై నట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి అండర్ 19 నెట్బాల్ పోటీల్లో బి.శివాజీ చారి, హెచ్.సాయిరెడ్డి, జి.మని చందులు ప్రతిభకనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈమేరకు కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికవ్వాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment