● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్: సద్దుల బతుకమ్మ పండుగకు నగరవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం నగరంలోని మానేరు డ్యాం, రామచంద్రాపూర్కాలనీ, గౌతమినగర్, శ్రీనగర్కాలనీ, సప్తగిరికాలనీ, మార్కండేయకాలనీ నిమజ్జనం పాయింట్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గంగుల, మేయర్ వై.సునీల్రావు మాట్లాడుతూ రూ.2 కోట్ల 20 లక్షలతో నగరంలోని మానేరు వాగు, కిసాన్నగర్ గార్లకుంట, చింతకుంట, వేదభవన్, గౌతమినగర్, రామచంద్రాపూర్కాలనీ, శ్రీనగర్కాలనీ, మార్కండేయనగర్, సప్తగిరికాలనీ, మానకొండూర్, కొత్తపల్లి, అల్గునూర్, సదాశివపల్లి, పద్మనగర్, రేకుర్తి వెంకటమ్మ చెరువు, సీతారాంపూర్ సాయిబాబా టెంపుల్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లిల్లో ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిమజ్జన పాయింట్ల వద్ద లైటింగ్, బారికేడ్స్తో పాటు గజఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, దిండిగాల మహేశ్, మాజీ కార్పొరేటర్ ఏవీ.రమణ, ఎస్ఈ రాజ్కుమార్, డీఈ ఓంప్రకాశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment