● 922 అభ్యంతరాలను పరిష్కరించిన అధికారులు ● అత్యధికంగా తిరుమలాయపాలెంలో 271 క్లెయిమ్లు
ఖమ్మంవన్టౌన్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జీపీలు, వార్డుల వారీగా అధికారులు ఇటీవల ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలను అన్ని గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించగా, జిల్లాలో పురుష ఓటర్లు 4,12,398 మంది, 4,39,120 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించగా 922 క్లెయిమ్లు నమోదయ్యాయి. వీటన్నింటినీ పరిష్కరించిన అధికారులు శనివారం ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
చింతకాని, రూరల్లో తొమ్మిదే..
జిల్లాలో 586 గ్రామపంచాయతీలకు గాను 5,398 వార్డులు ఉన్నాయి. ఆయా జీపీల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయగా, గడువు ముగిసే నాటికి 922 అభ్యంతరాలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తిరుమలాయపాలెం మండలం నుండి 271 అభ్యంతరాలు రాగా, చింతకాని, ఖమ్మం రూరల్ మండలాల తొమ్మిది అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఓటర్ల తుదిజాబితా విడుదల చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ప్రకటించాక జాబితాలో మార్పులకు, చేర్పులకు అవకాశం ఉంటుందని డీపీఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment