పాల్వంచరూరల్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల విద్యార్థులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి బాలబాలికలు పోటీలకు హాజరై సత్తా చూపారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానిలోని ఆశ్రమ క్రీడా పాఠశాలలో మొదటి రోజు బాలికలకు, రెండో రోజు బాలురకు పోటీలు నిర్వహించగా శనివారం కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఖోఖో తదితర పోటీల్లో 400 మంది బాలురు హాజరయ్యారు. పోటీల ముగింపు సమావేశానికి హారైన ఐటీడీఏ పీఓ రాహుల్ మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేసి మెనూపై ఆరా తీశారు. అలాగే, సమావేశంలో భద్రాచలం తెల్లం వెంకట్రావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఎనిమిది అంశాల్లో ప్రతిభ చూపిన 240 మందిని క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఐటీడీఏ డీడీ మణెమ్మ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment