ఖమ్మం చైర్మన్గిరీ ఎవరికి?
ఖమ్మం మార్కెట్ చైర్మన్ గిరీ తమకేనన్న ధీమా పలువురు ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం.. ఇప్పటికే మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించడంతో చైర్మన్గా ఎవరిని నియమిస్తారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డామని, అధికారంలో లేకున్నా పార్టీని వీడని తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని పలువురు మంత్రిని కలిసి విన్నవించుకున్నట్లు సమాచారం. కానీ మంత్రి దృష్టిలో ఎవరు ఉన్నారోననే అంశంపై ఎడతెగని ఉత్కంఠ సాగుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లకు చైర్మన్లను నియమిస్తున్నా ఖమ్మం పెండింగ్లో ఉండడంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.
ఖమ్మం మార్కెట్ ప్రధాన ద్వారం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతుండడంతో ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈక్రమంలోనే వ్యవసాయ మార్కెట్ కమిటీలపై ఆశలు పెట్టుకున్న నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్లకు గాను నాలుగింటికి పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. ఇంకా నాలుగు కమిటీలు భర్తీ చేయాల్సి ఉండడం.. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం తెరపైకి రావడంతో పదవులు ఆశిస్తున్న వారు పట్టువీడకుండా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment