బంగారు తాపడం పనులకు రూ.8 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

బంగారు తాపడం పనులకు రూ.8 లక్షల విరాళం

Published Sat, Sep 21 2024 3:10 AM | Last Updated on Sat, Sep 21 2024 3:10 AM

బంగారు తాపడం పనులకు రూ.8 లక్షల విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు సికింద్రాబాద్‌కు చెందిన భక్తులు శుక్రవారం రూ.8 లక్షల విరాళం సమర్పించారు. సికింద్రాబాద్‌కు చెందిన బొర్రా నిరంజన్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలా ద్రికి విచ్చేశారు. నిరంజన్‌ ఇటీవల రైలు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. అమ్మవారి దయతో మామూలు స్థితికి చేరుకున్న ఆయన దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా బంగారు తాపడం పనుల కోసం రూ.8 లక్షల విరాళాన్ని ఆలయ ఈఓ కె.ఎస్‌.రామ రావుకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ రామరావు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement