పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి | Sakshi
Sakshi News home page

పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి

Published Tue, May 7 2024 12:15 AM

పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి

శ్రీరాంపూర్‌: ఎండ తీవ్రత పెరిగినందున ఓసీపీల్లో పని వేళలు మార్చాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాంను కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో వినతిపత్రం అందజేశారు. కంపెనీ రెండు రోజుల క్రితం షిఫ్ట్‌ వేళలు మార్చుతూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఇవి సరిగ్గా లేవని పేర్కొన్నారు. ఫస్ట్‌ షిఫ్ట్‌ను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటలకు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందించారని, బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా పని వేళలూ సర్దుబాటు చేసేలా ఏరియాల జీఎంలకు ఆదేశాలిస్తామని తెలిపారని సీతారామయ్య పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల విధులకు హాజరయ్యే సింగరేణి క్లర్క్‌లకు స్పెషల్‌లీవ్‌ కాకుండా ఓడీ ఇవ్వాలని సీఎండీని కోరగా.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఇస్తున్నారో ఆ విధంగానే వర్తింపజేస్తామని సీఎండీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement