మాచర్ల: పట్టణంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం కల్యాణం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో బొల్లా బ్రహ్మానాయుడు, పెదకూరపాడులో నంబూరు శంకరరావు, చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడులు నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
న్యూస్రీల్
మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ తరలివచ్చిన జనం తీన్మార్, సంప్రదాయ నృత్యాలతో సందడి కార్యక్రమానికి హాజరైన పార్టీ ప్రముఖులు