గిడుగు స్మారక జాతీయ పురస్కారానికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

గిడుగు స్మారక జాతీయ పురస్కారానికి ఎంపిక

Published Wed, Jan 22 2025 1:03 AM | Last Updated on Wed, Jan 22 2025 1:03 AM

గిడుగు స్మారక జాతీయ   పురస్కారానికి ఎంపిక

గిడుగు స్మారక జాతీయ పురస్కారానికి ఎంపిక

కరీంనగర్‌ కల్చరల్‌: కరీంనగర్‌లోని గాయత్రినగర్‌కు చెందిన ప్రముఖ కవి గంప ఉమాపతి గి డుగు రామ్మూర్తి పంతులు స్మా రక జాతీయ పురస్కారానికి ఎ ంపికయ్యారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో అవార్డు అందుకోనున్నారు. సామాజిక అంశంలో.. ఎందుకిలా అనే పుస్తకం రాసిన ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్‌ నిర్వాహకులు తెలిపారు.

గల్ఫ్‌ పంపిస్తానని మోసం.. వ్యక్తికి జైలు

మేడిపల్లి: దుబాయ్‌ పంపిస్తానని డబ్బులు తీసుకొని, మోసగించిన కేసులో ఓ వ్యక్తికి కోరుట్ల జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా పిప్పిరి మండలం బీంగల్‌ గ్రామానికి చెందిన ఏగోలం మనోజ్‌కుమార్‌ మేడిపల్లి మండలంలోని రాగోజిపేటకు చెందిన ఆరుగురిని దుబాయ్‌ పంపిస్తానన్నాడు. వారి వద్ద రూ.40 వేల చొప్పున తీసుకున్నాడు. తర్వాత వారిని దుబాయ్‌ పంపలేదు. బాధితుల్లో ఒకరైన రాపల్లి నగేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు కోర్టు సమర్పించినట్లు ఎస్త్సె శ్యాంరాజ్‌ తెలిపారు. నేరం రుజువు కావడంతో కోర్టు మనోజ్‌కుమార్‌కు మంగళవారం మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధించిందని పేర్కొన్నారు.

చోరీ కేసులో వ్యక్తికి జైలు

సిరిసిల్ల కల్చరల్‌: చోరీ కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ప్రవీణ్‌ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది మే 4న ముస్తాబాద్‌ మండలంలోని చిప్పలపల్లి పెద్దమ్మ గుడిలో అమ్మవారి పుస్తె, మెట్టెలు చోరీకి గురయ్యాయి. గ్రామ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు గాడిచెర్ల రామచంద్రం ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌కు చెందిన శివరాత్రి సంపత్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పీపీ సందీప్‌ కేసు వాదించారు. కోర్టు మానిటరింగ్‌ ఎస్సై రవీందర్‌ నాయుడు, కానిస్టేబుల్‌ దేవేందర్‌ సాక్షులను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో మంగళవారం సంపత్‌కు జడ్జి శిక్ష ఖరారు చేశారు.

వైన్స్‌ వద్ద బైక్‌ చోరీ

వాహనం బ్యాగులో రూ.84 వేలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వైన్స్‌ వద్ద నిలిపిన ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎస్సై రమాకాంత్‌ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సయ్యద్‌ జావిద్‌ మంగళవారం రాచర్లగొల్లపల్లి శివారులోని వైన్స్‌ వద్ద బైక్‌ నిలిపాడు. మద్యం కొనుగోలు చేసి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. బైక్‌ బ్యాగులో రూ.84 ఉన్నాయని, వాహనంతోపాటు డబ్బులను దుండగులు ఎత్తుకెళ్లారంటూ లబోదిబోమన్నాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement