మధ్య తరగతికి మేలు | - | Sakshi
Sakshi News home page

మధ్య తరగతికి మేలు

Published Sun, Feb 2 2025 12:20 AM | Last Updated on Sun, Feb 2 2025 12:20 AM

మధ్య

మధ్య తరగతికి మేలు

పెద్దపల్లిరూరల్‌: మధ్యతరగతి ఉద్యోగులకు ఆదాయపుపన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం మేలు కలిగించినట్లయ్యింది. రూ.లక్షలోపు సంపాదించే ఉద్యోగికి మూడు లక్షల సీలింగ్‌ విభాగాన్ని రూ.నాలుగు లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం.

– బొంకూరి శంకర్‌,

జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్‌

ఎంపీలు ఏం చేశారు?

పెద్దపల్లిరూరల్‌: అధికార పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు పార్లమెంట్‌లో ఉండి ఏంలాభం? బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏంసాధించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికే పెద్దపీట వేశారు.

– ఈద శంకర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌, ఐడీసీ

కార్మిక వ్యతిరేకం

పెద్దపల్లిరూరల్‌: కేంద్ర బడ్జెట్‌లో కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత కరువైంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న కుట్ర బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం.

– ముత్యంరావు,

జిల్లా కార్యదర్శి, సీఐటీయూ

No comments yet. Be the first to comment!
Add a comment
మధ్య తరగతికి మేలు 
1
1/2

మధ్య తరగతికి మేలు

మధ్య తరగతికి మేలు 
2
2/2

మధ్య తరగతికి మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement