దూకుడు తగ్గించండి: సీఎం రేవంత్‌కు ఖర్గే సూచన! | Congress Bosses Seeks Explanation From Cm Revanth On Hydra | Sakshi
Sakshi News home page

దూకుడు తగ్గించండి: సీఎం రేవంత్‌కు ఖర్గే సూచన!

Published Tue, Oct 1 2024 12:53 PM | Last Updated on Tue, Oct 1 2024 3:08 PM

Congress Bosses Seeks Explanation From Cm Revanth On Hydra

సాక్షి,ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ ముగిసింది. ముంగళవారం(అక్టోబర్‌1) జరిగిన ఈ భేటీలో హైదరాబాద్‌లో ఇళ్ల కూల్చివేతలపై  సీఎంను హైకమాండ్‌ ఆరా తీసినట్లు సమాచారం. సమావేశం దాదాపు గంటసేపు కొనసాగింది. 

చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ  కోసం హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా సర్వే జరుగుతున్నట్లు సీఎం ఖర్గేకు తెలిపారు. నిన్న హైకోర్టు హైడ్రా కూల్చివేతలపై ఘాటుగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో హైకమాండ్‌ ఆరా తీసినట్లు తెలిసింది.

పేదలకు అన్యాయం జరగకుండా, ప్రజావ్యతిరేకత రాకుండా దూకుడు తగ్గించాలని సందర్భంగా రేవంత్‌రెడ్డికి ఖర్గే సూచించినట్లు సమాచారం.  ప్రభుత్వ పథకాల అమలు, దసరాకు మంత్రివర్గ విస్తరణపైనా ఖర్గేతో రేవంత్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. 

ఇదీ చదవండి: బుల్డోజర్‌ను బొందపెట్టండి:కేటీఆర్‌ 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement