demolitions
-
చట్టాన్ని ధిక్కరిస్తే.. హైడ్రాను రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎన్నిసార్లు చెప్పినా.. చట్టాన్ని ధిక్కరించి మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సివస్తుందని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ‘ఎందుకంత తొందర.. రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరాన్ని మార్చలేరు. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు కాదు’అని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని పేర్కొంది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. ‘సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఓసారి తెల్లవారుజామున 4 గంటలకు ప్రహరీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు.. అధికారులు అలా చేయరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆక్రమణల స్వాధీనానికి, అనుమతి లేని భవనాల కూల్చివేతకు మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. కానీ, ప్రతి దానికీ ఓ చట్టం అంటూ ఉంటుంది. దాన్ని ప్రతీ వ్యక్తి పాటించి తీరాల్సిందే’అని తేల్చిచెప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి సర్వే నంబర్ 296/ఇ/2 మూడు గుంటల భూమిలోని షెడ్ను ఎలాంటి సమాచారం లేకుండా (ఆదివారం) కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కోర్టు ఎదుట హాజరుకావాలన్న ఆదేశాల మేరకు ఆయన న్యాయస్థానం ముందు హాజరయ్యారు.ఇకపై జరగదంటూనే.. మళ్లీ అదే తప్పుపిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతిపత్రంపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. నాలా, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులు ఇలా అన్ని డ్యాక్యుమెంట్లను ప్రవీణ్ సమర్పించారు. అయినా పట్టించుకోకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు రోజున కూల్చివేశారు’అని చెప్పారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పంచాయతీ కార్యదర్శి బలవంతంగా అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. సెలవు రోజు కూల్చివేతలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ప్రతీసారి ఇలా జరగకుండా చూసుకుంటామంటూనే మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలనూ లెక్కచేయకుండా, చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 99ను రద్దు చేస్తాం. హైడ్రా తప్పులకు ఓ రిజిస్ట్రర్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. నిర్మాణ అనుమతి రద్దు ఉత్తర్వులను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు? సదరు పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకున్నారా? హైడ్రా తీరు ఆక్షేపణీయం. నీటి వనరులు, రహదారులు, ప్రభుత్వ భూముల రక్షణకు మేం వ్యతిరేకం కాదు. కానీ, చర్యలు చట్టబద్ధమై ఉండాలన్నదే మా ఉద్దేశం’అని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన స్టేటస్కో ఆదేశాలను పొడిగిస్తూ, తదుపరి విచారణ వరకు ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించకూడదని ఆదేశించారు. ప్రతివాదులకు వ్యక్తిగత నోటీసులతో సహా నోటీసులు జారీ చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు. -
TG: మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదు
హైదరాబాద్, సాక్షి: మహానగరంలో విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా)పై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం కూల్చివేతలు చేపడతారా? అంటూ మండిపడింది. ఈ క్రమంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై (HYDRAA Demolitions)పై దాఖలైన పిటిషన్పై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ కే.లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడతారా? సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధమని చెప్పినా నిబంధనలు పాటించరా? న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తే.. అది తెలిసేలా చేస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో హై కోర్టుకు హాజరైన హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్(HYDRAA Inspector Rajasekar) పైనా ధర్మాసనం మండిపడింది. పోలీస్ శాఖను నుంచి డిప్యూటేషన్పై వచ్చినంత మాత్రాన అక్కడ వ్యవహరించినట్లు ఇక్కడ ఉంటామంటే కుదరదు అని మందలించారు. మరోసారి ఇలాగే జరిగితే మీపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదన్న జస్టిస్ కే లక్ష్మణ్.. ఏది చేసిన చట్టపరంగా ఉండాలని సూచించారు. అలాగని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం విచారణను వాయిదా వేశారు. -
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అక్రమ నిర్మాణమని శుక్రవారం నోటీసులిచ్చి.. శనివారం హాజరుకు ఆదేశాలిచ్చి.. ఆదివారం కూల్చివేస్తారా? అంత తొందరేముంది? కూల్చి వేతలు చేపట్టే ముందు సహేతుక సమయం ఇవ్వాలి కదా?’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలోని తన ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాల్రెడ్డి హైకోర్టులో ఆదివారం హౌజ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలు సమర్పించడానికి పిటిషనర్కు ఒక వారం సమయం ఇచ్చారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, కాదని చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హైడ్రాను హెచ్చరించారు. ఒక్కరోజులో పత్రాలు సమర్పించటం ఎలా సాధ్యం?..: తన ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు హైడ్రా ఒక్క రోజే సమయం ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ‘అక్రమ నిర్మాణమని శుక్రవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’ అని కోరారు. దీంతో హైడ్రా తీరుపై అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం.. వారంలోగా అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది. -
హైదరాబాద్లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు.. ఈసారి ఎక్కడంటే?
సాక్షి,హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది.తమ ప్లాట్లలో ఫామ్హౌస్ కట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల సమస్యల్ని విన్నారు. బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించేస్తున్నారు.తాజాగా, రంగారెడ్డి జిల్లా హయత్నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. కోహెడ సర్వే నెంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్ సంరెడ్డి బాల్రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన ప్లాట్లలో ఫాం హౌస్ నిర్మించాడు. దీంతో 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చి వేతలకు ఉపక్రమించింది.రంగనాథ్ వార్నింగ్మొన్నటికి మొన్న శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్లను తొలగించింది. హోర్డింగ్లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధుల్లేవు: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. శనివారం(ఫిబ్రవరి1) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. ‘అధికారులు కూటమి నేతల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. సుప్రీం నిబంధనలను అధికారులు పాటించాలి. తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్రెడ్డిని ప్రకటిస్తే అతడి ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొనుగోలు చేశారు. గపూర్, లక్ష్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లు ధ్వంసం చేశారు. తిరుమలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వ్యాపార సముదాయాలు బెదిరింపులకు పాల్పడ్డారు. మా పాలనలో ఏ రోజు విధ్వంసం చేయలేదు. ప్రత్యర్థుల ఆస్తులు విధ్వంసానికి పాల్పడటం అనే సంస్కృతి కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కూల్చివేతలకు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, కలెక్టర్కు మెయిల్ చేయాలి.కూల్చివేతలకు మూడు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల ముందు అప్పీలు నోటీసులు ఇవ్వాలి. కూల్చివేతల వీడియో, ఫొటోలు తీయాలి. నగర ప్రథమ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ అంశంపై మేయర్ సుప్రీంకోర్టుకు వెళ్తారు, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోరాటం చేస్తాం. బీజేపీ నాయకులు, టీడీపీ నేతల అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకుంటే లడ్డు భాస్కర్రెడ్డి డిప్యూటి మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. తిరుపతి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు 70 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మీకు తగిన బుద్ధి చెబుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనికి పదింతలు బదులు తీర్చుకుంటాం. గత పదేళ్ళలో ఏ రోజు మేం కూటమి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చంద్రబాబు దాష్టిక పాలనపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీని పాతాళానికి తొక్కివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని భూమన అన్నారు. -
మళ్లీ అమీన్పూర్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని హైడ్రాకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
పోచారంలో కూల్చివేతలపై స్పందించిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: పోచారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) స్పందించారు. భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని.. అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని.. ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందన్నారు.కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్! -
HYDRA: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
-
HYD: యాప్రాల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: కొంత కాలం గ్యాప్ తర్వాత హైడ్రా మళ్లీ తన జేసీబీలకు పని చెప్పింది. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని యాప్రాల్లో హైడ్రా శుక్రవారం (డిసెంబర్6) అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 32,14లో ఉన్న ఫంక్షన్హాల్ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించినందుకు ఫంక్షన్హాల్లో కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు తెలిపారు.కూల్చివేతలు వివాదాస్పదమైనందున హైడ్రా తన దూకుడు కొద్దిగా తగ్గించింది. హైకోర్టు చివాట్లతో తన స్పీడుకు బ్రేకులు వేసింది. అక్రమ నిర్మాణాలని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు రంగంలోకి దిగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిన జవహర్నగర్ ప్రాంతంలో చాలా వరకు భూ కబ్జాలతో పాటు అక్రమ నిర్మాణాలున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఫిర్యాదులున్నాయి. -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
ఇళ్ల కూల్చివేతలపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
‘హైడ్రా’పై కేఏ పాల్ వాదనలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: హైడ్రాపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం(అక్టోబర్ 23) హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో బెంచ్ ముందు పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. పాల్ వాదనలు విన్న కోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది.నిర్వాసితులు ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని సూచించింది. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. -
మూసీ నివాసితులను వెంటాడుతున్న కూల్చివేతల భయం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నివాసితులను కూల్చివేతల దడ వెంటాడుతూనే ఉంది. నదీ ప్రక్షాళన రాజకీయ కేంద్ర బిందువుగా మారి తాత్కాలికంగా కూల్చివేతల ప్రక్రియ నిలిచినా.. భవిష్యత్తులో మళ్లీ వీటి బెడద తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నివాసితులు తమ ఇళ్లను రక్షించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటుండగా.. మరికొందరు సామాజిక కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోరాటం ఆందోళనలు సైతం ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు అధికారేతర రాజకీయ పక్షాలు అండగా తామున్నామంటూ పరీవాహక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల పర్యటనలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.కోర్టును ఆశ్రయించిన నివాసితులు మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2,166 నివాసాలు నదీ గర్భంలో ఉన్నట్లు డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల బృందం ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో 68 శాతం ఇళ్లకు మార్కింగ్ చేశారు. కొన్ని గృహాలను కూలీల సహకారంతో కూల్చివేశారు. దీంతో కొందరు మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, కొత్తపేటలోని దాదాపు 620 కుటుంబాలు కోర్డులో పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో 400 నివాసాలకు స్టే వచ్చింది. మరోవైపు ఇటీవల వేసిన ఆర్బీ మార్క్ను సైతం ఇళ్ల యజమానులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ కమిషన్కు దళిత కుటుంబాలు మూసీ పరివాహకంలో నివాసాలు కూల్చకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్ను దళిత కుటుంబాలు ఆశ్రయించాయి. కూలిపనులు చేసుకొని జీవనం సాగించే తమ ఇళ్లను అర్ధాంతరంగా కూల్చివేస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాదర్ఘాట్, శంకర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు పోస్టుకార్డు ఉద్యమం మూసీరివర్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి, గవర్నర్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లకు పోస్టు కార్డులు రాసి పంపించారు. గతంలో చేపట్టిన డ్రోన్ సర్వేపై ఆధారపడకుండా తిరిగి భౌతికంగా సర్వే చేస్తే మూసీకి దగ్గరలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లను వదిలే ప్రసక్తిలేదని నివాసితులు తేల్చి చెబుతున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొంటున్నారు.చదవండి: షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. డోర్లాక్ పేరుతో అడ్డగోలు బాదుడుపక్కా నిర్మాణాలతోనే సమస్య.. మూసీ పరీవాహక పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30 శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో శాశ్వత నిర్మాణాలతో సమస్య తీవ్రమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చేబుతున్నారు. దీంతో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. -
హైకోర్టుకు ‘మూసీ’ బాధితులు..రేపు కీలక విచారణ
సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు బాధితులు సోమవారం(అక్టోబర్ 14) హైకోర్టు తలుపుతట్టారు. మూసీ పరివాక ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నామని, ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తమ ఇళ్లు కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టులో పిటిషన్ వేశారు.అధికారులు తమ ఇళ్లపై మార్కింగ్ వేసిన విషయాన్ని వీరంతా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ ఇళ్లు కూల్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. మంగళవారం హైకోర్టు ఈ పిటిషన్లను విచారించనుంది. కాగా, మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ రివర్బెడ్లో ఉన్న ఇళ్ల కూల్చివేతను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్రావు ఫైర్ -
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి,హైదరాబాద్:హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్పై శుక్రవారం(అక్టోబర్4) హైకోర్టు విచారణ జరిపింది.హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని కోర్టులో కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు.అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు.ఈ కేసులో ప్రతి వాదులు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై స్టేకు నిరాకరణ -
ఇళ్లు కూల్చేందుకా ఓట్లు వేసింది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: పోరాట యోధుడిగా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన యోధుడు మహాత్మాగాంధీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం(అక్టోబర్2) గాంధీజయంతి సందర్భంగా తెలంగాణభవన్లో జాతిపితకు కేటీఆర్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ‘ప్రపంచం మొత్తం విశ్వగురువుగా కీర్తించిన నేత గాంధీ.మార్టిన్ లూథర్ కింగ్కు కూడా మహాత్మా గాంధీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో పేదల పట్ల ప్రభుత్వం మానవీయంగా వ్యవహరిస్తోంది.మమ్మల్ని వేరే పని అని తీసుకువచ్చి ఇల్లు కూలగొట్టమంటున్నారని కూలీలు చెప్తున్నారు.మీకు ఓట్లు వేసింది ఇళ్ళు కూలగొట్టడానికి కాదు. ఈ విషయంలో పైన ఢిల్లీలో ఉన్న గాంధీలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ఆలోచించాలి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అక్రమమైనా.. ఇళ్ల జోలికి వెళ్లం: రంగనాథ్ -
బుల్డోజర్ను బొంద పెట్టండి: కేటీఆర్ పిలుపు
సాక్షి,హైదరాబాద్:పేదలు దసరా పండగ సంతోషంగా జరుపుకోలేని దుస్థితికి సీఎం రేవంత్రెడ్డి తీసుకొచ్చాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం(అక్టోబర్1)అంబర్పేట గోల్నాకలోని తులసీరాంనగర్లో పర్యటించిన కేటీఆర్ మూసీ కూల్చివేతల బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పది నెలలు అయ్యింది రేవంత్ రెడ్డి వచ్చి. హైదరాబాద్ లో ఒక్క ఓటు కూడా రాలేదని మీ బతుకులు ఆగం చేశాడు. పెన్షన్లు రూ.4వేలు చేస్తా అన్నాడు. ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం కాదు కాగా ఇనుము కూడా రాలేదు.మూసీలో దోచుకో, ఢిల్లీలో పంచి పెట్టు అన్నట్టుగా కొత్త దుకాణం తెరిచాడు. ఇక్కడ 38 ఇళ్లకు రంగులు వేసాడట. ఏ ఇంటికి కష్టం వచ్చినా పక్కింటి వాళ్ళు అడ్డుకోవాలి. బుల్డోజర్ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు.ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూల్చాలని. పేదల ఇల్లు ఎవరికి దోచి పెట్టడానికి కూలుస్తున్నారు. గంగా నది ప్రక్షాళన కోసం 2400 కిలోమీటర్లు ఉన్న ప్రాజెక్ట్ రూ. 20 వేల కోట్లతో కేంద్రం చేపట్టింది. కానీ మూసి నదికి లక్షా 50 వేల కోట్లతో శుద్ధి చేస్తానన్న పేరుతో దోచుకోవడానికి రేవంత్రెడ్డి చూస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. -
HYD: చాదర్ఘాట్లో ‘మూసీ’ కూల్చివేతలు షురూ
సాక్షి,హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి విడత పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారు. చాదర్ఘాట్ మూసానగర్, శంకర్నగర్లో రెడ్మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేత ప్రారంభమైంది. చాదర్ఘాట్ పరిసరాల్లో 20 ఇళ్ళకు మార్కింగ్ చేసిన అధికారులు ఇప్పటికే నిర్వాసితులను తరలించారు. రెవెన్యూ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం(అక్టోబర్1) తొలిసారిగా కూల్చివేతలు జరుగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్కు రిజర్వు బ్యాంకు -
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భయపెట్టాలనుకుంటున్నారా?: ‘హైడ్రా’పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్:అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్,అమీన్పూర్ ఎమ్మార్వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ మండలం శ్రీకృష్ణానగర్లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై హైకోర్టుకు రంగనాథ్ వివరణ ఇచ్చారు. అమీన్పూర్ కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలిపారు. విచారణకు రంగనాథ్ సోమవారం(సెప్టెంబర్30) ఉదయం హైకోర్టు ముందు వర్చువల్గా హాజరయ్యారు.సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆసుపత్రి భవనాన్ని ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం ఎలా కూలుస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా అని నిలదీసింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ సందర్భంగా హైకోర్టు చురకంటించింది. అమీన్పూర్ గురించి అడిగితే కావేరి హిల్స్పై సమాధానం ఎందుకు చెప్తున్నారని సున్నితంగా మందలించింది.హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని ప్రజలనుకుంటున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.అధికారుల వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు అమీన్పూర్ కూల్చివేతలపై స్టే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. హైడ్రాతో పాటు అమీన్పూర్ ఎమ్మార్వో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.చార్మినార్ ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూల్చేస్తారా..హైకోర్టు ఘాటు వ్యాఖ్యలుఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారుచెరువుల్లో వర్షపు నీరు చేరకపోవడంపై ఏం చర్యలు తీసుకున్నారుఅసలు విషయాలు వదిలేసి కూల్చివేతలెందుకుచార్మినార్ కూల్చేయమంటే కూల్చేస్తారాకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులో ఎలా కూల్చివేతలు చేపడతారుకూల్చివేతలు ఇలానే చేస్తే ఇంటికెళ్లిపోతారు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండికూల్చివేతలు తప్ప మీకు వేరే పాలసీ ఏం లేనట్లుందిఅమీన్పూర్పై మాత్రమే సమాధానం చెప్పండి కావేరిహిల్స్ గురించి మేం అడగలేదుఅనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టండిప్రభుత్వ భూముల్ని రక్షించండి.. మేం అండగా ఉంటాంప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదుప్రభుత్వ శాఖలకు ఆదాయం కావాలిమీ బాస్లను సంతృప్తి పరిచేలా పనులు చేయొద్దుసామాన్యులు, పెద్ద వాళ్ల మధ్య వ్యత్యాసం చూపిస్తున్నారుఆదివారం కూల్చడం ఏంటి?భయపెట్టాలని చూస్తున్నారా?వీకెండ్లోనే కూల్చివేతలు ఎందుకు కూల్చివేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారాచట్ట వ్యతిరేకంగా పనిచేసే అధికారులను చంచల్గూడ, చర్లపల్లికి పంపిస్తాంఇదీ చదవండి: కూల్చివేతలపై వెనక్కి..! -
KSR Live Show: కూల్చడం కాదు.. ప్రత్యామ్నాయం చూపించాలి
-
KSR Live Show: 2300 భవనాలు కూల్చివేత.. వరల్డ్ క్లాస్ సిటీని చేయడానికే..
-
కూల్చివేతలపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన విషయాల్లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ మార్కింగ్ పేరుతో మూసీపై చేస్తున్న హడావుడిని ప్రస్తుతానికి నిలిపివేయాలని, దూకుడు తగ్గించాలని సర్కారు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని, హైడ్రా ఏర్పాటు చేసి పెద్దల జోలికి వెళ్లకుండా దశాబ్దాలుగా నివాసముంటున్న తమపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందంటూ పేదలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతుండటంతో జాగ్రత్త పడాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెమటోడ్చి సంపాదించుకున్న నివాసాలను నేలమట్టం చేసి తమ బతుకులను ప్రభుత్వం రోడ్డుపైకి తెస్తోందనే భావన సామాన్య ప్రజల్లో క్రమంగా బలపడుతుండడంతో ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు కూడా హైడ్రా, మూసీ విషయాల్లో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం, పేదలు..మధ్యతరగతి వారి ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, సొంత పార్టీలో సైతం కొంత ప్రతికూలత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వెనక్కు తగ్గాలనే నిర్ణయానికి వల్చినట్లు తెలిసింది. అన్ని కోణాలను బేరీజు వేసుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. పేదలను ఒప్పించి, మెప్పించాకే.. మూసీ నదిపై ఉన్న ఆక్రమణల తొలగింపు రాజకీయంగా వివాదాస్పదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే వారితో మాట్లాడి పునరావాస ప్యాకేజీపై వారిని ఒప్పించి మెప్పించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని, ఆ తర్వాతే అడుగులు ముందుకేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి చెరువుల ఆక్రమణలు, ఎఫ్టీఎల్, బఫర్జోన్ల వరకే కార్యాచరణను పరిమితం చేయాలని, హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు, బడాబాబుల ఫామ్హౌస్లపై చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వల్చినట్టు సమాచారం. రుణాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు మూసీ నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై విస్తృత ప్రచారం చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు బాహాటంగానే మాట్లాడుతుండటం గమనార్హం. పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని, పరిహార ప్యాకేజీని అమలు చేస్తామని, బ్యాంకర్లతో రుణాలిప్పిస్తామంటూ హామీ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. పీసీసీ కూడా దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని భావిస్తోంది. వీటితో పాటు, ముఖ్యంగా పునరావాసంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించకుండా ముందుకెళ్లడం మంచి కన్నా ఎక్కువగా చెడు చేస్తుందని, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించనున్నట్లు తెలిసింది. రుణాల విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను సమాయత్తం చేస్తున్నట్టు సమాచారం. అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడిన సీనియర్ మంత్రి శ్రీధర్బాబు కూడా ఇదే కోణంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘హైడ్రా’ బూచి కాదు: రంగనాథ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా బూచి కాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. భవిష్యత్ తరాలకోసమే అక్రమ కట్టడాలు కూలుస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ)శాఖ కార్యదర్శి దానకిషోర్తో కలిసి రంగనాథ్ శనివారం(సెప్టెంబర్28) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గతంలోనూ మూసీ నిర్వాసితులను తరలించారు.చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తుతోంది. భారీగా వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏమీ చేయలేరు.మూసీని సుందరీకరించడం కోసం కూల్చివేతలు చేయడం లేదు.గతంలో మూసీ సుందరీకరణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు’అని పురపాలక కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యం, 2 నెలలుగా హైడ్రా కూల్చివేతలు జరుపుతోందిచెరువుల ఆక్రమణలు తొలగించాం.. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారువరదల నుంచి ప్రజలను కాపాడటమే హైడ్రా లక్ష్యం. ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చుతున్నాంఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకుంటూపోతే కట్టడి చేయవద్దా?ఆక్రమణల్లో పేదవాళ్ల ఇళ్లు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదుమేము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవుభవిష్యత్తులో వరదలతో కోటి మంది ఇబ్బంది పడతారుఆస్పత్రుల్లో పేషెంట్లు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తున్నారుకొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందిహైడ్రాను భూతంలా చూపిస్తున్నారు. తప్పు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాంహైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు హైడ్రాపై ఆందోళన వద్దు..నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం: దానకిషోర్వందేళ్ల క్రితమే నిజాం మూసీ నది అభివృద్ధి నమూనాలు రూపొందించారు.ఈ నమూనాలు థేమ్స్ నది కంటే అద్భుతంగా ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో ఇటీవల 20 నిమిషాలకే 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది.20 నిమిషాల కొద్దిపాటి వర్షానికే నగరం మునుగుతోంది.మరో 20 నిమిషాలు వర్షం పడితే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితిమూసీ ఒడ్డున కూల్చివేతలు సుందరీకరణ కోసం మాత్రమే కాదు..ప్రమాదం నుంచి కాపాడేందుకు కూడాపేద ప్రజలు నీళ్ళల్లో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మూసీ ప్రక్షాళనప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల పర్యటన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అక్టోబర్లో ఉంటుంది.మూసీ నీళ్ల శుద్ధి కోసం 3800 కోసం కొత్త ఎస్టీపీలు తీసుకువస్తాం.మూసీ నీళ్లను మంచి నీళ్ళుగా మార్చేందుకు రూ. 10వేల కోట్లతో పలు కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి.మూసీ పరీవాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.10వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తే వెళ్తామని మాతో చెప్పారు..కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి.మూసీ బాధితులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది.. ఈ విషయమై కమిటీ వేశాం.మూసీ నదీ పరివాహక ప్రాంత వాసులను 14 ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నాం.పిల్లల చదువుల కోసం తల్లితండ్రులు ఆందోళన అవసరం లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.23 లోకేషన్లలో నిర్వాసితులు మానసికంగా ఆందోళన చెందకుండా కౌన్సెలింగ్ ఇస్తారు.సీనియర్ అధికారులతో కాంప్స్ ఏర్పాటు చేస్తాం.50 కుటుంబాలను ఇప్పటికే షిఫ్ట్ చేశారు... మరో 150 కుటుంబాలు షిఫ్ట్ చేస్తున్నారు.హైడ్రా వస్తుంది కూలుస్తుంది అనేది అవాస్తవం...ప్రజలు ఆందోళన అవసరం లేదు.ఏ కుటుంబాలను బలవంతంగా షిఫ్ట్ చేయించడం లేదు..స్వచ్చందంగా ప్రజలు సహకరించాలినష్టపరిహారం ఇవ్వాల్సిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం ఇస్తుంది. ఇదీచదవండి: హైడ్రా బాధితుల తరపున కొట్లాడతాం: బీఆర్ఎస్ -
మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతున్న సర్కార్
-
మళ్లీ హైడ్రా పంజా
పటాన్చెరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్గూడలలో భవంతులను నేలమట్టం చేశారు. అమీన్పూర్ రెవెన్యూ అధికారుల నివేదిక మేరకు హైడ్రా అధికారులు ఆయా నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. కిష్టారెడ్డిపేట్లో మూడు పెద్ద భవనాలను, పటేల్గూడలో 22 విల్లాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. కూల్చివేతల కోసం భారీ క్రేన్లను వినియోగించారు. అమీన్పూర్ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రక్రియలో పాల్గొన్నారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటేల్గూడలో విల్లాలు నిర్మించిన యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. అయితే తాము ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తహసీల్దార్ రాధ ఆయనకు వివరించారు. విల్లాల నిర్మాణానికి సర్వే నంబర్ 6 పరిధిలో అనుమతులు తీసుకొని సర్వే నంబర్ 12లో నిర్మిస్తున్నట్లు గుర్తించామని ఆమె స్పష్టం చేశారు. కాబట్టి ఎలాంటి కోర్టు స్టే ఆర్డర్ కూల్చివేతల ప్రక్రియలకు అడ్డుకాదని చెప్పారు. కిష్టారెడ్డిపేట్లో సర్వే నంబర్ 164లో మూడు భవంతుల నిర్మాణాలు జరిగాయని, వాటిని కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. కిష్టారెడ్డిపేట్లో సర్వే నంబర్ 164లో ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేశారని వారికి నోటీసులు ఇచ్చి తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. కూల్చివేత ప్రక్రియకు ముందే హైడ్రా, రెవెన్యూ అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని పరిశీలించి కూల్చివేతలకు ఉపక్రమించారు. సామాన్య ప్రజలకు, పరిసర నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేతల్లో ఒక డాక్టర్ భవనం కూడా ఉండటం గమనార్హం. మరో భవనం ఏపీలోని ఒక ఎమ్మెల్యేకు సంబంధించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పాట్లను కొనుగోలు చేసి నిర్మాణాలు చేశామే తప్ప.. కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మించలేదని వాదిస్తున్నారు. మరిన్ని కూల్చివేతలు.. కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కిష్టారెడ్డిపేట్ పరిసర గ్రామాల పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో జరిగిన నిర్మాణాల కూల్చివేతకు అధికారులు నివేదిక రూపొందించినట్లు తెలిసింది. పొరుగు గ్రామాల ప్రభుత్వ భూముల్లో కిష్టారెడ్డిపేట్ పంచాయతీ అనుమతులతో జరిగిన నిర్మాణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అదే గ్రామంలో చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా రెవెన్యూ అధికారులు గుర్తించి హైడ్రాకు నివేదిక ఇచ్చి నట్టు సమాచారం. -
HYD: సుచిత్రలో అక్రమ కట్టడాల కూల్చివేత
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.కంటోన్మెంట్ పరిధిలోని సుచిత్ర మార్గంలో నాలా ఫుట్పాత్ను ఆక్రమిస్తూ కొందరు దుకాణాలు నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాపిక్కు ఇబ్బందవుతోందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు దుకాణాలను నేలమట్టం చేశారు. కాగా, హైదరాబాద్ నగరంలో నాలాలు, చెరువులను ఎంతటివారు ఆక్రమించినా వదిలేది లేదని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో కంటోన్మెంట్ కూడా అక్రమ కొట్టడాలపై చర్యలు ప్రారంభించడం గమనార్హంఇదీ చదవండి.. ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు: కేటీఆర్ -
బుల్డోజర్లకు బ్రేక్
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ ఒకటో తేదీదాకా నిందితులతో సహా ఎవరి ఇళ్లనూ కూల్చవద్దని ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే స్థలాలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను నిరభ్యంతరంగా తొలగించవచ్చని తెలిపింది. తమ ఆదేశాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు వర్తించవని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వి.విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచి్చంది. చట్టవిరుద్ధంగా ఒక్క కూలి్చవేత చోటుచేసుకున్నా.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దనే ధర్మాసనం ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థల చేతులను ఇలా కట్టేయలేరని అన్నారు. అయినా ధర్మాసనం తమ ఆదేశాలపై వెనక్కి తగ్గలేదు. కూల్చివేతలు రెండు వారాలు ఆపితే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఏమీ జరిగిపోదని పేర్కొంది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అధికారవర్గాలను కూలి్చవేతలు ఆపివేయమని తాను కోరలేనని తుషార్ మెహతా నివేదించగా.. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాల మేరకు.. కూలి్చవేతలు నిలిపివేయమని ఆదేశాలు జారీచేశామని తెలిపింది. పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూలి్చవేస్తున్నారని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కూలి్చవేతలపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘తాను ఒక నిర్దిష్ట మతానికి చెందినందువల్లే తన నిర్మాణాలను కూలి్చవేశారని ఒకరు పిటిషన్ వేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతకు దిగిన ఒక్క సంఘటనను ధర్మాసనం దృష్టికి తెమ్మనండి. ప్రభావిత పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. ఎందుకంటే తమకు నోటీసులు అందాయని, తమవి అక్రమ కట్టడాలని వారికి తెలుసు’ అని తుషార్ మెహతా వాదించారు. బుల్డోజర్లు ఆగవని ఎలా అంటారు? సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా కూలి్చవేతలను నిలిపివేయాలని, ఈ అంశంలో మార్గదర్శకాలు జారీచేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. కొందరు ధిక్కార ప్రకటనలు చేయడం పట్ల జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అయినా బుల్డోజర్లు ఆగవని, స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందనే దాన్ని బట్టే ఇది నిర్ణయమవుతుందని ప్రకటనలు చేశారు. వీటిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నాం. కూలి్చవేతలపై మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాక.. బుల్డోజర్ల సంస్కృతిని గొప్పగా, ఘనతగా చెప్పుకోవడాన్ని ఎలా నిరోధించాలనే విషయంలో మీరు మాకు సహాయపడండి’ అని తుషార్ మెహతాకు సూచించింది. నిందితుడు అయినంత మాత్రాన ఇళ్లు కూల్చేస్తారా? ఒకవేళ అతను దోషిగా తేలినా సరే.. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూలి్చవేతలకు దిగలేరు. ఇదెక్కడి బుల్డోజర్ న్యాయమని సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఆక్రమణలపై హైడ్రా దూకుడు
-
బుల్డోజర్ సంస్కృతికి కళ్లెం!
గత కొన్నేళ్లుగా బుల్డోజర్లతో చెలరేగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టడం ఆçహ్వానించదగ్గ పరిణామం. ఈ చీడను వదల్చడానికి ఏం చేయాలో ప్రతిపాదనలివ్వాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించటంతోపాటు వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా అమల య్యేలా ప్రామాణిక మార్గదర్శకాలను రూపొందిస్తామని కూడా తెలిపింది. ఎక్కడైనా అడ్డదారులు పనికిరావు. పైగా చట్టబద్ధ పాలనకు ఆ ధోరణులు చేటు తెస్తాయి. కంచే చేను మేసినట్టు పాలకులే తోడేళ్లయితే ఇక సాధారణ పౌరులకు రక్షణ ఎక్కడుంటుంది? దేశంలో ఈ విష సంస్కృతికి బీజం వేసినవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన్ను చూసి మొదట మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఆనక రాజస్థాన్లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఆనాటి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం చెలరేగి అనుమానితులుగా నిందితులుగా ఉన్నవారి ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశాయి. హైదరాబాద్లో నీటి వనరులకు సమీపంలో, డ్రెయినేజిలకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చేయటానికి ‘హైడ్రా’ ఏర్పాటైంది. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో కూడా అధికారులు కూల్చివేతలు సాగించారు.తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారన్న ఫిర్యాదులొచ్చాయి. ఈవీఎం సర్కారుగా అందరితో ఛీకొట్టించు కుంటున్న ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం వచ్చిరాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చేయాలని చూసింది. హత్యలు, హత్యాయత్నాలు సరేసరి. తమకు ఓటేయ లేదన్న కక్షతో పేదజనం ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. ఈ దుశ్చర్యలో ఒక మాజీ సైనికుడి ఇల్లు సైతం నేలకూలింది. ఏ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు ఈ హేయమైన పనులకు పాల్పడు తున్నాయి? హత్యలతోనూ, బుల్డోజర్లతోనూ ప్రజానీకంలో భయోత్పాతం సృష్టించి ఎల్లకాలమూ అధికారంలో కొనసాగవచ్చని పాలకులు భావిస్తున్నట్టు కనబడుతోంది.దీన్ని సాగనీయకూడదు. బుల్డోజర్ మార్క్ అకృత్యాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిందంటే... ‘నిందితులు, అనుమానితులని ముద్రపడిన వారి విషయంలో మాత్రమే కాదు. ఆఖరికి నేరస్తులుగా నిర్ధారణ అయి శిక్షపడినవారి విషయంలో సైతం చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించి తీరాలి’ అని నిర్దేశించింది. చట్టబద్ధ పాలన ఎంతటి గురుతర బాధ్యతో చెప్పడానికి ఇది చాలదా? గోవధ కేసులో నిందితుడనో, అనుమానితుడనో భావించిన వ్యక్తిపై కక్ష తీర్చుకోవటానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటిచోట్ల ఇళ్లు, దుకాణాలూ నేలమట్టం చేసిన సందర్భాలు అనేకానేకం. ఈ పని చేశాక ఆ ఇల్లు లేదా దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందనో, అక్రమంగా ఆక్రమించుకుని కట్టారనో, ఎప్పుడో నోటీసులు జారీచేశామనో అధికారులు సాకులు చెబుతున్నారు. అధికారుల్లో కొందరు ప్రబుద్ధులు ఏదో ఘనకార్యం చేశామన్నట్టు విందులు కూడా చేసుకుంటు న్నారు. బాధితులు అవతలి మతస్తులైనప్పుడు కొందరు బాగా అయిందనుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైన పోకడ. సమాజంలో ప్రతీకారేచ్ఛను పెంచి పోషించే దుశ్చర్య. ఇప్పుడున్న నాగరిక సమాజం ఎన్నో దశలను దాటుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యవస్థను ఏర్పర్చుకుంది.తప్పుడు వాగ్దానాలతోనో, కండబలంతోనో, ఈవీఎంలను ఏమార్చటం ద్వారానో అధికారాన్ని కైవసం చేసుకుని కేవలం అయిదేళ్లపాటు అధికారంలో ఉండటానికి వచ్చిన రాజకీయపక్షాలు ఎన్నో అగడ్తలను దాటుకుని వచ్చిన ఒక ప్రజాస్వామిక అమరికను ధ్వంసం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయ కూడదు. నిజానికి ఈ విషయంలో ఎంతో ఆలస్యం జరిగింది. ఎవరో న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని, పిటిషన్ దాఖలయ్యాక నోటీసులు జారీచేసి చర్యలకు ఉపక్రమించవచ్చని అనుకోవటంవల్ల ఇలాంటి దుశ్చర్యలూ, వాటి దుష్పరిణామాలు సాగి పోతున్నాయి. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. న్యాయస్థానాలు మీడియా కథనాలనే పిటిషన్లుగా స్వీకరించి ప్రభుత్వాలను దారికి తెచ్చినసందర్భాలున్నాయి. ఆ క్రియాశీలత మళ్లీ అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేఅందరూ న్యాయస్థానాలను ఆశ్రయించలేరు. వారికి ఆ స్థోమత ఉండకపోవచ్చు. కనుకనే న్యాయస్థానాలు తమంత తాము పట్టించుకోక తప్పదు. ప్రామాణికమైన మార్గదర్శకాలురూపొందించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం హర్షించదగ్గదే. కానీ చర్మం మందం ప్రభుత్వాలు వీటికి తలొగ్గుతాయా? ఆమధ్య ఢిల్లీ హైకోర్టు అక్కడి అధికారులకు చేసిన సూచనలు ఈ సందర్భంగా గమనించదగ్గవి.వేకువజామునగానీ, సాయంసంధ్యా సమయం ముగిశాకగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్డోజర్లు ప్రయోగించరాదని తెలిపింది. ముందుగా తగిన నోటీసులిచ్చి ప్రత్యామ్నాయ ఆవాసం చూపించేవరకూ అసలు కూల్చివేతలుండకూడదని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అధికారులు దారికొచ్చిన దాఖలాలు లేవు. అందువల్లే మార్గదర్శకాలు రూపొందించేటపుడు కేవలం ఎలాంటి నిబంధనలు పాటించాలో చెప్పడం మాత్రమేకాక అసలు కూల గొట్టాల్సినంత ఆవశ్యకత ఎందుకేర్పడిందో నమోదుచేసే ఏర్పాటుండాలి. అధికారులకు జవాబు దారీతనాన్ని నిర్ణయించాలి. ప్రక్రియ సరిగా పాటించని సందర్భాల్లో కోర్టు ధిక్కార నేరంకింద కఠిన చర్యలుంటాయని చెప్పాలి. రాజకీయ కక్షతో, దురుద్దేశాలతో విధ్వంసానికి పూనుకున్న ఉదంతాల్లో వెంటవెంటనే చర్యలుండేలా చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం– సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, సూచనల స్ఫూర్తి కింది కోర్టులకు సైతం అందాలి. అలా అయినప్పుడే చట్టబద్ధ పాలనకు మార్గం ఏర్పడుతుంది. -
కూల్చివేతే చెరువుల నిజమైన పరిరక్షణా?
ఇటీవల హైదరాబాద్లో చెరువులను ఆక్రమించిన భవనాల కూల్చివేతలు ప్రజలలో అటు ఆశావాదం ఇటు భయం రెండింటినీ కలిగించాయి. సినిమా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్పై గంటల కొద్దీ మీడియాలో అయిన ప్రసారాలు కొత్త ప్రశ్నలను తీసుకొచ్చాయి. చాలా చోట్ల ఆక్రమణదారులు.. చెరువుల్లో అపార్ట్మెంట్లను కట్టి సామాన్యులకు విక్రయించారు. తాజా కూల్చివేతలు ఇలాంటి బడుగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.సహజ వనరులను పరిరక్షించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమే అయినప్పటికీ, వాటిని చేపట్టిన విధానాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పూర్తి నీటి స్థాయి (FTL) ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నప్పుడు.. విలువైన ఆస్తులను పోగోట్టుకుంటున్నామన్న ఆందోళన, వ్యాపారాలు, ఉపాధి దెబ్బతింటున్నాయన్న భయం కలుగుతున్నాయి. పర్యావరణంతో పాటు ప్రజల ప్రయోజనాలను రక్షించడానికి, ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించడం ముఖ్యం.చెరువుల అభివృద్ధి అథారిటీ ఆవశ్యకతఅమెరికాలో ఇల్లినాయి రాష్ట్రంలో షికాగో, డెట్రాయిట్ మధ్యన ఉండే లేక్ మిషిగాన్ను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చెరువుల్లో ఇదొకటి. అలాగే ఇదే రాష్ట్రం పక్కన ఉన్నలేక్ ఈరీని కూడా ప్రశంసించాలి.ఈ చెరువు నుంచే నయాగారా వాటర్ ఫాల్స్ ద్వారా నీళ్లు కిందికి దూకుతాయి. వీటి ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. వీటి నిర్వహణలో అక్కడి స్థానిక సంస్థల పాత్ర ఎంతో గొప్పది. లేక్మి షిగాన్లో నీళ్లను గ్లాసుతో ముంచుకుని తాగేయగలిగేంత శుభ్రంగా ఉంటాయి. వాటి స్పూర్తిగా రాష్ట్రంలో నీటి వనరులను, పరిసర ప్రాంతాలను పరిరక్షించడానికి చెరువుల అభివృద్ధి అథారిటీ అత్యవశ్యకం. వీటిని గవర్న ర్ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. వీటిలో సామాజిక కార్యకర్తలు, విద్యా ప్రముఖులు, పార్టీల ప్రతినిధులను ఉంచాలి. ఈ కమిటీలు పరిస్థితిని బట్టి పారదర్శక నిర్ణయాలు తీసుకోవచ్చు.అథారిటీ ఏం చేయాలంటే?విధానాల రూపకల్పన: ప్రస్తుతం ఉన్న చెరువులను పరిరక్షించడం, ఆక్రమణకు గురైన నీటి వనరులను పునరుద్ధరించడం, కొత్త చెరువులను సృష్టించడం వంటి నియంత్రణ మరియు పర్యవేక్షణ: చెరువుల స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు ఆక్రమణలు, కాలుష్యం నివారణకు నియమాలను అమలు చేయడం.ప్రజలతో అనుసంధానం: స్థానికులతో మమేకం కావడం, చెరువు ప్రాముఖ్యత గురించి వివరించడం, ప్రజలను పరిరక్షణ కార్యకలాపాలలో భాగస్వామ్యం చేయడంకూల్చివేతలకు ప్రత్యామ్నాయం లేదా?ప్రస్తుతం హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. హైదరాబాద్ నగరంలో చెరువులను ఆక్రమించిన చాలామంది.. వాటిల్లో అపార్ట్మెంట్లను కట్టి ..సామాన్యులకు అమ్మేశారు. డబ్బులు రూటు మార్చి ఆక్రమణదారులు గోడ దాటేశారు. ఇప్పుడు కూల్చివేతల వల్ల వంద శాతం నట్టేటా మునిగేది సామాన్యులే. మరి ఇలాంటి చోట్ల కూల్చివేతలకు బదులుగా, భారీ పెనాల్టీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం సబబు.ఆస్తి విలువ నిర్ధారణ: FTL ప్రాంతాలలో ఉన్న ఏదైనా నిర్మాణ విలువను అంచనా వేయడం. (ఇందులో ఆస్తి యొక్క మార్కెట్వి లువ మరియు దాని పర్యావరణ ప్రభావం..రెండింటినీ కలపాలి)పెనాల్టీ: ఆస్తి యజమాని ఆ నిర్మాణాన్ని కొనసాగించాలని కోరుకుంటే, అతను ఆ ఆస్తి విలువకన్నారెండింతలపెనాల్టీని చెల్లించాలి. ఈపెనాల్టీ భవిష్యత్తులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి మరియు పర్యావరణ పరిరక్షణకు నిధులను సేకరించడానికి ఒక మార్గంగా పని చేస్తుంది.నిధుల వినియోగం: ఈ పెనాల్టీల ద్వారా సేకరించిన నిధులను పర్యావరణ పునరుద్ధరణకు ప్రత్యేకంగా వినియోగిస్తారు. దీని ద్వారా కొత్త చెరువులు సృష్టించడం, దాని చుట్టున్న ప్రాంతాల అభివృద్ధి లేదా నష్టపోయిన నీటివనరులను పునరుద్ధరించడం వంటి ప్రక్రియలు కొనసాగించవచ్చు.ప్రత్యామ్నాయ చెరువుల సృష్టిహైదరాబాద్లో పెరిగిన నగరీకరణతో సహజ నీటి వనరుల లోటు ఏర్పడింది. పాతవాటిని పునరుద్దరిస్తూనే.. కొత్త చెరువులను సృష్టించాలి.అలాగే వర్షం నీటిని ఒడిసి పట్టేలా ప్రతీ ఇంట ఇంకుడు గుంతలు ఉండేలా ప్రజలను చైతన్యమంతం చేయాలి. ఏ ఇంటి వర్షం నీళ్లు ఆ ఇంట్లోనే, ఏ కాలనీ నీళ్లు ఆ కాలనీలోనే ఇంకిపోయినప్పుడు వరద వచ్చే పరిస్థితి భారీగా తగ్గుతుంది. అలాగే కొత్తచెరువుల సృష్టి కచ్చితంగా పరిశీలించాల్సిన అంశం.తగిన ప్రదేశాల గుర్తింపు: చెరువు అభివృద్ధి అథారిటీ కొత్త చెరువులను ఎక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి తగిన స్థలాన్ని ఎంపిక చేస్తుంది. అందరిని కలుపుకుని ముందు కెళ్లడం: ఈ ప్రక్రియలో స్థానికులందరినీ కలుపుకుని వెళ్లాలి. తద్వారా ప్రతీ ఒక్కరిలో ఇది నాది అనే భావన కలుగుతుంది.అప్డేటేడ్ డిజైన్: కొత్త చెరువులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయాలి. వాటర్కన్సర్వేషన్, జీవ వైవిధ్యం, ప్రజల సౌకర్యాలను కలిగించే విధంగా ఉండాలి. నిర్వహణ మరియు నిర్వహణ: ఈ చెరువులు భవిష్యత్తరాలకు వారసత్వంగాఇ చ్చేలా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళికను ఆలోచించాలి.G.O. 111 కింద ఉన్న ప్రాపర్టీల సంగతేంటీ?ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న కట్టడాలపై షరతులు విధిస్తూ తెచ్చిన G.O. 111లోనూ బోలెడు కబ్జాలున్నాయి. వీటికి కూడా ఇవే నిబంధనలు అమలు చేయాలి. ఈ నిధులను చెరువుల పునరుద్ధరణకు వినియోగించాలి. అన్ని సున్నితమైన జోన్లపై పర్యావరణ బాధ్యత యొక్క సరిహద్దుల సమాన అన్వయించడం ద్వారా సమర్థవంతమైన నియంత్రణ ఫ్రేమ్వర్క్ ఏర్పడుతుంది. చెరువుల సంరక్షణలో భాగస్వామ్యం అయ్యే ప్రాపర్టీ యజమానులకు ఆర్థిక ప్రోత్సాహాకాలు ఇవ్వాలి లేదా పన్ను తగ్గించాలి. అందరికీ అవగాహన కల్పించాలి, భారీగా ప్రచారం చేపట్టాలి.-శ్రీకర్ వేముల, ఐఆర్ఎస్ అధికారి -
స్కూల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,సంగారెడ్డిజిల్లా: హెచ్ఎండీఏ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం(సెప్టెంబర్3) సంగారెడ్డిజిల్లా అమీన్పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండా, అమీన్పూర్లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఐలాపూర్ తండాలో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకే అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమ కట్టడాలు, సరిహద్దు రాళ్లను తొలగించారు. అనంతరం సర్వే నెంబర్ 462లోని అక్కడి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆక్రమణలు కూల్చివేశారు. 15 గుంటల భూమి ఆక్రమించి స్కూల్ గదులు, ప్రహరీని హైడ్రా కూల్చివేసింది. -
‘హైడ్రా’ కూల్చివేతలు ఆపాలి.. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరుతో హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రిట్ పిటిషన్ వేశారు. చినదామోర చెరువులోని బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలోని ఆక్రమణలను 7 రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చారని.. హైడ్రా ఎటువంటి చట్టబద్దత లేని ఏజెన్సీ అని.. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని మర్రి రాజశేఖర్రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.ఉదయం 6 గంటల సమయంలో నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటంటూ పిటిషనర్ ప్రశ్నించారు. "హైడ్రా" చర్యలు సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధం అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విచారణ కొనసాగుతోంది.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే.ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. -
హైడ్రా.. హైదరాబాద్ వరకే పరిమితం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీగా పేర్కొన్నారు. ‘‘అక్రమ భవనాలను కూల్చేస్తాం. కేటీఆర్ ఫాంహౌస్కు సర్పంచ్ అనుమతి ఇచ్చారంటున్నారు. సర్పంచ్కు అనుమతులు ఇచ్చే అధికారం ఉండదు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు. నా కుటుంబ సభ్యులవి అక్రమ కట్టడాలుంటే ఆధారాలు చూపాలి’’ అని రేవంత్ అన్నారు.‘‘రాయదుర్గంలో కూల్చివేత సరైనదే. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ గైడ్లైన్స్ పాటిస్తున్నాం. చెరువులు, కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవడానికి ఎక్సంప్షన్ ఇచ్చింది. సెక్రటేరియట్ జీహెచ్ఎంసీ లాంటి భవనాలపై సుప్రీంకోర్టు అనుమతి ఉంది.’’ అని రేవంత్ చెప్పారు.కవిత బెయిల్పై రేవంత్ స్పందనకవిత బెయిల్పై సీఎం రేవంత్ స్పందిస్తూ.. ‘‘సిసోడియాకు బెయిల్ ఇవ్వడానికి 15 నెలలు పట్టింది. కేజ్రీవాల్ కు ఇప్పటివరకు బెయిల్ రాలేదు. కవితకు బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసింది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.రుణమాఫీపై..ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. రుణమాఫీపై సవాల్కు హరీష్రావు కట్టుబడి లేడు. కేటీఆర్ కొండగల్ వస్తానంటే స్వాగతిస్తా. కేటీఆర్ను.. కేసీఆరే నమ్మడు. కలెక్టర్ దగ్గర గ్రీవెన్స్ పెట్టాం. రుణమాఫీ కాని వారి లిస్ట్ కలెక్టరేట్లో ఇవ్వాలి. ఇప్పటి వరకు రూ. 17,933 కోట్లు రుణమాఫీకి జమ చేశాం’’ అని రేవంత్ వెల్లడించారు. -
కమలం 'హైడ్రా'మా
-
హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ
సాక్షి హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. ఆదివారం ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి చెరువులో కాలేజీలు నిర్మించారని వారి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయని నారాయణ అన్నారు. ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు. కబ్జాలు పాల్పడిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు జరపాలన్నారు. ఎంఐఎం నేతలవి కూడా తొలగించాలన్న నారాయణ.. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. -
కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్.. నెక్ట్స్ టార్గెట్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ సమర్పించింది. 10 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా రిపోర్ట్లో వెల్లడించింది. మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసినట్లు హైడ్రా పేర్కొంది.నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. నందినగర్లో ఎకరం స్థలాన్ని, లోటస్పాండ్లో పార్కు కాంపౌండ్ వాల్ను కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది.మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేతఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేతమిథాలీ నగర్లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాబీజేఆర్ నగర్లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రాగాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేతగాజుల రామారావు భూదేవి హిల్స్లో చెరువు ఆక్రమణలను చేసిన బోనాలు కూల్చివేతబంజారా హిల్స్లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేతచింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రానందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేతనందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదుకాగా, హైదరాబాద్లో ‘హైడ్రా’ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ తరహా వ్యవస్థలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. అవకాశమున్న చోటఆక్రమణలను తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా కాపాడేలా చర్యలు చేపట్టనున్నట్టు వివరించాయి.ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడ చెరువుల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలంటూ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ గౌతం తదితరులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోని పరిస్థితిపై సమీక్ష కూడా జరిపినట్టు తెలిసింది. త్వరలోనే ఇతర నగరాల్లో ‘హైడ్రా’తరహా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. -
మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం
మేడ్చల్ రూరల్/కంటోన్మెంట్: హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్ హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్ 388 పార్ట్, 523, 524 పార్ట్లు) మున్సిపల్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్స్కు నోటీసులు మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్ యాక్ట్ –2006, సెక్షన్ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్ గ్రాంట్ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్ఆర్ సర్వే నంబర్ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్ హైస్కూల్, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతున్నాయి. -
హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ
చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. హర్యానాలో మతపరమైన అల్లర్లకు కారణమైన వారికి సంబంధించిన ఇళ్లను బుల్డోజర్తో కూలదోసేందుకు ఉపక్రమించింది హర్యానా పోలీసు శాఖ. ఇప్పటికే మూడు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆదివారం ఈ కార్యక్రమం నాలుగోరోజుకి చేరుకుంది. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. ఇందులో భాగంగా అల్లర్లకు ప్రధాన కారణమైన సహారా హోటల్ను కూడా కూల్చివేశారు అధికారులు. జులై 31న విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపుపై కొంతమంది సహారా హోటల్ పైభాగం నుండి రాళ్లు రువ్వడంతో ఈ వివాదం పురుడు పోసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో దగ్గర్లోని దేవాలయంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అదేరోజు రాత్రి ఆ ప్రాంతంలోని మసీదు దగ్ధం కాగా అక్కడి నుండి గురుగ్రామ్ వరకు వందల కొద్దీ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారితో సహా ఆరుగురు మరణించగా వందల సంఖ్యలో సామన్యులు గాయపడ్డారు. అల్లర్లకు పాల్పడిన వారిలో చాలామంది అరెస్టులకు భయపడి వేరే ప్రాంతాలకు పారిపోయారు. దీంతో పోలీసులు నిందితులకు సంబంధించిన ఆస్తులను లక్ష్యం చేసుకుని అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. #WATCH | Haryana | A hotel-cum-restaurant being demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. pic.twitter.com/rVhJG4ruTm — ANI (@ANI) August 6, 2023 ఇది కూడా చదవండి: అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్ -
Ippatam: ప్రహరీ గోడల తొలగింపు షురూ
సాక్షి, గుంటూరు: ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించే పనులను చేపట్టారు. గతంలో ఈ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయడంతో వాళ్లకు చెందిన ప్రహరీ గోడలు తొలగింపు పనులు అధికారులు ఇవాళ ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. గతంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు 14 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించిన ఏపీ హైకోర్టు. -
మీ సానుభూతి మాకు అవసరం లేదు: పవన్కు దిమ్మ తిరిగే కౌంటర్
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చి వేస్తోందంటూ జనసేన, తెలుగుదేశం నాయకులు వారం రోజులుగా నానా హడావుడి చేశారు. వాస్తవానికి రోడ్డును ఆక్రమించిన వారి ఇళ్లను ప్రభుత్వం ఎక్కడా కూల్చలేదు. కేవలం ప్రహరీ, మెట్లను మాత్రమే తొలగించారు. దీనిని రాజకీయంగా వాడుకుని, లబ్ధి పొందాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల అక్కడ పర్యటించి హంగామా చేశారు. జనసేన సభకు భూములిచ్చిన వారి ఇళ్లను కూల్చి వేశారంటూ విష ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక్కో ఇంటికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పటం వాసులకు విసుగు తెప్పించింది. ‘ప్రభుత్వం మా ఇళ్లను కూల్చ లేదు. మీ సానుభూతి మాకు అవసరం లేదు. డబ్బులు ఇచ్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయొద్దు’ అంటూ బుధవారం ఆయా ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (‘ఈనాడు’కు ఎందుకంత కడుపుమంట?.. రామోజీకి కళ్లు కనపడట్లేదా?’) -
బాబుతో కలిసి ఉన్మాదిలా మారిన పవన్: మంత్రి అంబటి
సాక్షి, తాడేపల్లి: ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ ఉన్మాదిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బాలి అన్న ఒక్క మాట ఆయనలోని ఫ్రస్టేషన్ను బయటపెడుతోందన్నారు. ఈనాడు రాతలను పట్టుకుని చంద్రబాబు సలహాతో ఇప్పటం వచ్చి రంకెలు వేసి వెళ్ళారని ద్వజమెత్తారు మంత్రి. పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇవ్వడం వల్లే తొలగింపులు జరిగాయనటం పూర్తిగా అవాస్తవమని, సభ పెట్టకముందే గత ఫిబ్రవరిలోనే మార్కింగ్ చేశారని స్పష్టం చేశారు. ‘చంద్రబాబుతో కలిసినప్పటి నుంచి పవన్ కల్యాణ్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. ఏ విగ్రహాలను తొలగించలేదు. ఒక్క ఇల్లు కూడా ఎక్కడా పడగొట్టకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విస్తరణ దేశంలో ఎక్కడా జరగలేదా?, అది రెక్కీ కాదు అని పోలీసులు చెప్పారు. ఇప్పటం ఒక ప్రశాంతమైన గ్రామం, అక్కడ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుపై రాయి వేయటం, పవన్పై రెక్కీ అనేవన్నీ అవాస్తవం. పవన్ రాజకీయాలకు పనికి వచ్చే మనిషి కాదు. పవన్ ఫ్యాన్స్కి నా మనవి.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదవద్దు. ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని ఇచ్చావా?, పవన్ను నమ్మి వెళితే జీవితాంతం బాధపడతారు. అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలని తెలుసుకోండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా.. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు.’ అని పవన్ కల్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇదీ చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్టులు: కొడాలి నాని -
Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా?
సాక్షి, అమరావతి: ఆక్రమణలు పెరిగి రోడ్లు ఇరుకైపోవటంతో మంగళగిరి– తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని రోడ్ల వెంట ఉన్న ఆక్రమణలను తొలగించే పని రెండేళ్ల కిందటే మొదలుపెట్టారు. గత జనవరికల్లా పూర్తి చేశారు. తరువాత రూరల్ ప్రాంతంలోని ఆర్ అండ్ బీ రోడ్ల ఆక్రమణలపై చర్యలకు దిగారు. దాన్లో భాగంగానే ఇప్పటం గ్రామ పరిధిలో 75– 80 అడుగుల మేర ఉండాల్సిన ఆర్ అండ్ బీ రోడ్డును ఇరువైపులా 10 అడుగుల మేర ఆక్రమించి ప్రహరీలను నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఇలా 54 మంది రోడ్డు ఆక్రమించినట్టు గుర్తించి జనవరిలో మార్కింగ్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు నోటీసులిచ్చారు. అనంతరం ఆక్రమణల తొలగింపును ఆరంభించారు. ఆత్మకూరు– పెద వడ్లపూడిలో తొలగింపు పూర్తయ్యింది కూడా. ఇదీ.. వాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.3 కోట్లతో ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయటంతో పాటు గత నెలలో మరో రూ.6 కోట్లను ఈ గ్రామానికి కేటాయించిందనేది కూడా కాదనలేని నిజం. తొలగింపులో భాగంగా రెండు రోజుల కిందట దాదాపు 25 మంది ఇళ్ల ప్రహరీలను తొలగించగా సంబంధింత యజమానులు సైతం సహకరించారు. ఇందులో వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్తో పాటు పార్టీ కార్యకర్తల ఇళ్ల ప్రహరీలూ ఉన్నాయి. కానీ, శుక్రవారం చివరి నాలుగు ఇళ్ల ప్రహరీలను తొలగిస్తుండగా జనసేన నాయకులు గొడవకు దిగారు. తాము జనసేనకు సహకరిస్తున్నందుకే ఇళ్లు కూలుస్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన వారి ఇళ్లను టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... ♦ఇప్పటం గ్రామంలోని ఆర్ అండ్ బీ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలను జనవరిలో మార్కింగ్ చేశారు. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో నోటీసులిచ్చారు. ♦తొలగిస్తున్నవి కేవలం రోడ్డును ఆక్రమించుకుని ఉన్న ప్రహరీలే. కానీ జనసేన ప్రచారం చేస్తున్నట్లుగా ఎవ్వరి ఇళ్లనూ కూల్చేయలేదు. ♦ప్రహరీలు తొలగింపునకు గురైన వారిలో వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్, పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ♦జనసేన ప్లీనరీ మార్చి నెలలో ఇప్పటం గ్రామంలో జరిగింది. ఆనాడు పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలిస్తానని ప్రకటించారు కానీ ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వలేదు. ♦ప్రకటించిన డబ్బులివ్వాలని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అడగటంతో జనసేన నేతలు సాకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు పథకం పన్నారు. ♦ఇప్పుడు ప్రహరీలు తొలగిస్తుంటే రాజకీయం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్... 2016లో కృష్ణా పుష్కరాల కోసమని తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం, బోట్ యార్డు, ఎన్టీఆర్ కరకట్ట, క్రిస్టియన్పేట తదితర ప్రాంతాల్లో 325 ఇళ్లను నాటి టీడీపీ ప్రభుత్వం తొలగించినపుడు నోరు మెదిపితే ఒట్టు. -
నోయిడా ట్విన్ టవర్స్- ఏపీ ప్రజావేదిక.. రెండూ కరెక్టేనా!
ఉత్తరప్రదేశ్లోని నోయిడా వద్ద రెండు భారీ ట్విన్ టవర్స్ను కూల్చివేసిన ఘట్టం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సుమారు నలభై అంతస్తుల భవనాన్ని కేవలం తొమ్మిది సెకన్లలోనే కూల్చేవేయడం ఒక ముఖ్యమైన అంశం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరో ప్రధాన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక ఈ ఆదేశాలు వివాదాస్పదం కాలేదు. రాజకీయ పార్టీలు దీనిపై విమర్శలకు దిగలేదు. అక్రమ భవనం అని కోర్టు నిర్థారించింది. అంతకు ముందు గత ఏడాది కేరళలోని కొచ్చి వద్ద నదీతీర ప్రాంతంలో నిర్మించిన మరో భారీ బహుళ అంతస్తుల భవంతిని కూడా సుప్రీం ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. ఈ ఘట్టాలు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చాయనే చెప్పాలి. చదవండి: పవన్ కల్యాణ్ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులకు ఈ పరిణామం అసౌకర్యం కలిగించినా, భవిష్యత్తులో బిల్డర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడడకుండా ఉండడానికి ఇది ఆస్కారం ఇస్తుంది. విశేషం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ సౌధం నేలకూలింది అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే మాత్రం విధ్వంసం అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదచల్లే యత్నం చేశాయి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో కృష్ణా కరకట్టను ఆనుకుని పలు భవనాలు వెలిశాయి. అవన్ని కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినవే. ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఏకంగా ప్రజావేదిక పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో ఒక అక్రమ నిర్మాణం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అధికారులు వద్దని సలహా ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నదీని అనుకుని ఎలాంటి నిర్మాణాలు జరగరాదు. దానికి నిర్దిష్టదూరంలోనే నిర్మాణాలు ఉండాలి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబే స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో బస చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు వచ్చి దీనిపై అభ్యంతరం చెప్పినా, వారిపై నిర్భంధాలు విధించారే కాని, చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు, లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన అతిథి గృహ భవనంలో మకాం చేశారు. దీనికి ప్రతిగా ఆయనకు రాజధాని భూముల పూలింగ్లో మినహాయింపులు ఇచ్చి లాభం చేశారన్న అభియోగం ఉంది. అది వేరే విషయం. చంద్రబాబు ఈ ఇంటిలో దిగడానికి కొన్ని నెలల ముందు ఆయన క్యాబినెట్లోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో వరదను పరిశీలించడానికి వెళ్లి, ఈ అక్రమ నిర్మాణాలను గమనించి వీటన్నిటిని తమ ప్రభుత్వం కూల్చివేస్తుందని అప్పట్లో ప్రకటించారు. తీరా సీన్ కట్ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధినేతే అలాంటి అక్రమ భవనం ఒకదానిలో దిగేసరికి ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. తన ఇంటి వద్ద సదుపాయంగా ఉంటుందని భావించి ప్రజావేదిక పేరుతో ఒక కన్వెన్షన్ హాల్ తరహాలో నిర్మించుకున్నారు. 2019లో టీడీపీని ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ ప్రజావేదికలో ఒక సదస్సు పెట్టి, ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించి దానిని కూల్చివేయాలని ఆదేశించారు. అంతే: చంద్రబాబుతో సహా, పలువురు టీడీపీ నేతలు, వారికి వంత పాడే మరికొన్ని ఇతర పార్టీల నేతలు ఇంకేముంది విధ్వంసం అంటూ ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చి ఏడాది అయిందంటూ మరోసారి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇదొక్కటే కాదు. ఏపీలో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా, చివరికి అది గోడ అయినా, దానిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనో టీడీపీ వారు అడ్డుకోవడం, వెంటనే స్టేలు తీసుకు రావడం చేశారు. చిత్రంగా గౌరవ హైకోర్టు వారు కూడా కారణం తెలియదు కాని, అలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎక్కువ సందర్భాలలో స్టే ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. కృష్ణా కరకట్టపై ఉన్న భవనాలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, కొందరు హైకోర్టు నుంచి స్టే పొందగలిగారు. చివరికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నీటిపారుదల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరిగోడను కూల్చినా టీడీపీ మీడియా, టీడీపీ నేతలు రచ్చ,రచ్చ చేశారు. న్యాయ స్థానం నుంచి కూడా వారికి కొంత సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి గోడ కట్టిన గీతం యూనివర్శిటీలో ఆ గోడను తొలగించినప్పుడు కూడా ఇదే తంతు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నోయిడాలో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలను కూల్చివేయించారు. ఈ కూల్చివేతకు సుమారు ఇరవై కోట్ల వ్యయం అయిందని వార్తలు వచ్చాయి. ఈ భవనాలను నిర్మించిన బిల్డర్లు తమకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అంత ఖరీదైన భవనాల నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కాని కొందరు మాత్రం ఇలా కూల్చడం కన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే బాగుండేదన్న వాదనను తీసుకు వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆ పని చేస్తే, ఇక ప్రభుత్వాలు దానిని మరింతగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతివాదన చేసేవారు అంటున్నారు. కూల్చివేత ఘట్టం పూర్తి అయ్యాక, ఈ వాద, ప్రతివాదాలకు పెద్దగా విలువ ఉండదు. మరికొన్ని ఘట్టాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో అఘాయిత్యాలకు పాల్పడిన రౌడీషీటర్ల ఇళ్లను, మతకలహాలకు కారకులైనవారి ఇళ్లను అవి అక్రమమైనవి అయితే బుల్ డోజర్లు తీసుకు వెళ్లి కూల్చివేశారు. దానిని సుప్రీంకోర్టు కూడా నిలువరించలేదు. దాంతో యూపీ ప్రభుత్వానికి బుల్ డోజర్ ప్రభుత్వం అన్న పేరు కూడా కొంతమంది పెట్టారు. తెలంగాణలోని హైదరాబాద్లో వరదనీరు, డ్రైనేజీ వ్యవస్థ పారే నాలాల మీద ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూల్చలేదని న్యాయస్థానం ఒక సందర్భంలో ప్రశ్నించింది. దాంతో అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపుతూ ఆ ఇళ్లను పలు చోట్ల కూల్చివేశారు. బాచుపల్లి అనే చోట అనుమతులు లేకుండా నిర్మించిన 200 పైగా విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయినా ఇక్కడ ఎవరూ దానిని విధ్వంసంగా అభివర్ణించలేదు. ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ,దానికి వంతపాడే ఈనాడు, తదితర మీడియా మాత్రం ఆ తరహా ప్రచారం చేశాయి. నొయిడా ఘటన తర్వాత కూడా ప్రజా వేదికను తీసివేసిన విషయాన్ని విధ్వంసంగానే ప్రచారం చేస్తారా? ఏపీకి సపరేట్ రాజ్యాంగం ఉందని వారు భావిస్తారా?. కృష్ణానది అనుకుని ఉన్న విలాసవంత భవనాల ద్వారా కాలుష్యం నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా ఏపీ వరకు మినహాయింపు ఇవ్వాలని వీరు అభిలషిస్తారా? ఈ మొత్తం ప్రకియలో టీడీపీ, అనుబంధ మీడియా ఆత్మరక్షణలో పడినట్లయింది. సుప్రీం కోర్టు చేసింది విధ్వంసమా?లేక నిబంధనలు పాటించడమా అన్నదానిపై వీరు నోరు విప్పలేని పరిస్థితి. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోయారని అనుకున్న తదుపరి యథా ప్రకారం టీడీపీ కాని, వారి మీడియా కాని విధ్వంసపు రాతలు రాయకుండా ఉంటాయని భావించలేం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే రామోజీరావు తదితర మీడియా సంస్థల యజమానులు తామే ఓడిపోయామని ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును గద్దె ఎక్కించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చన్నది వారి ఆలోచన. ఇందు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా జగన్ వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్దే కరెక్టు అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల ద్వారా తేలిందని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మీకు తెలియని ఆసక్తికర విషయాలు: ట్విన్ టవర్స్ కూలడానికి ఆ నలుగురే కారణం!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేశారు. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చి వేసింది. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ట్విన్ టవర్స్ కూల్చి వేతపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ►సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఆగస్ట్ 8 నుంచి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నోయిడా అధికారులు ఆధ్వర్యంలో ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థతో కూల్చివేత పనుల్ని ప్రారంభించారు. ►జంట భవనాల కూల్చి వేత పనుల్ని పూర్తి చేసినట్లు నోయిడా పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. భవనాల్ని నేల మట్టం చేసేందుకు సహాయక చర్యల కోసం 560మంది పోలీసులు, 100 రిజర్వ్ పోర్స్ సిబ్బంది, 4 క్విక్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగినట్లు చెప్పారు. ►ట్విన్ టవర్స్ను సెకన్ల వ్యవధిలో నేల మట్టం చేసేందుకు జంట భవనాల్లో 3,700 కేజీలకు పైగా పేలుడు పదార్థాల్ని నింపారు. ఇందుకోసం పిల్లర్స్కు సుమారు 7వేల రంద్రాలు చేశారు. వాటర్ ఫాల్ టెక్నిక్తో ఒక్క బటన్ నొక్కగానే సెకన్ల వ్యవధిలో కూల్చేందుకు 20వేల సర్క్యూట్ను సిద్ధం చేశారు. ►ప్రాజెక్ట్ ఇంజినీర్ల వివరాల ప్రకారం.. సూపర్టెక్ భవనాల్ని కూల్చే సమయం 9 సెకన్లు పడుతుంది. కూలిన వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో 12 నిమిషాల పాటు దట్టమైన శిధిలా పొగ కమ్ముకుంటుంది. కూల్చివేతతో 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాలు సేకరించే అవకాశం ఉండగా.. వాటిని తరలించేందుకు 3నెలల సమయం పట్టనుంది. ► కూలే సమయంలో కొన్ని సెకన్ల పాటు 30 మీటర్ల రేడియస్ వరకు కంపించనుంది. పేలుడు 30 మీటర్ల అధికారుల ప్రకారం, ఈ ప్రకంపనల పరిమాణం సెకనుకు దాదాపు 30మిల్లీ మీటర్లు ఉండవచ్చు. రిక్టర్ స్కేలుపై 0.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఎలా కంపిస్తుందో.. కూల్చి వేత సమయంలో నోయిడా టవర్స్ కంపిస్తాయి. ఇక 6 వరకు భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడిందని అధికారులు తెలిపారు. ► ట్విన్ టవర్స్ చుట్టు పక్కల సుమారు 7వేల కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తిరిగి వాళ్లు సాయంత్రం 5.30గంటలకు రావొచ్చని అన్నారు. కూల్చి వేతతో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్థానిక నివాసాల్లో గ్యాస్, పవర్ సప్లయ్ నిలిపివేశారు. సాయంత్రం 4 గంటలకు కరెంట్, గ్యాస్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ► సెక్టాకర్ 93ఏలో ట్విన్ టవర్స్ను నిర్మించిన ప్రాంతం చుట్టూ 450 మీటర్ల వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. బ్లాస్ట్ అనంతరం అంటే మధ్యాహ్నం 2.15 నుంచి 2.45గంటల వరకు వాహనాల రాకపో కలు ఆగిపోనున్నాయి. ► ట్విన్ టవర్స్ పక్కనే 8 మీటర్ల దూరంలో, మరికొన్ని 12 మీటర్ల దూరంలో భవనాలున్నాయి. దుమ్ము వ్యాప్తిని తగ్గించడానికి టవర్స్ను ప్రత్యేక వస్త్రంతో కప్పారు. ఈ ప్రాంతాన్ని ఒక నాటికల్ మైలు మేర నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ► రూ. 100 కోట్ల బీమా పాలసీ కింద కూల్చివేత ప్రక్రియ జరుగుతుంది . ఈ బీమా ట్విన్ టవర్స్ పక్కనే ఉన్న భవనాలకు ప్రమాదం జరిగితే..నష్ట పరిహారంగా చెల్లించనున్నారు. ప్రీమియం, ఇతర ఖర్చులను సూపర్టెక్ భరించాలి. కూల్చివేత ప్రాజెక్ట్కు రూ. 20 కోట్ల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. కూల్చివేతతో టవర్స్ నిర్మాణం కోసం ఉపయోగించిన ఉత్త ఇనుము వల్లే సుమారు రూ.50కోట్లకు పైగా నష్టం. ► ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ అనే సంస్థ తొమ్మిదేళ్ల న్యాయపోరాటం తర్వాత రెండు టవర్లను కూల్చివేసే బాధ్యతను అప్పగించింది. ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా టవర్లను నిర్మించారని సుప్రీంకోర్టు గుర్తించిన తర్వాత వాటిని కూల్చేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నోయిడా అధికారులతో కలిసి పని చేసింది. ►ఒక్కో టవర్లో 40 అంతస్తులు నిర్మించాలని బిల్డర్ ప్లాన్ చేశారు. కోర్టు ఆదేశాల కారణంగా కొన్ని అంతస్తులు నిర్మించలేకపోయినా, పేలుడుకు ముందు కొన్ని మాన్యువల్గా విరిగిపోయాయి. టవర్లలో ఒకటైన అపెక్స్లో 32 అంతస్తులను కలిగి ఉంది. సెయానేలో 97ప్లాట్లు ఉన్నాయి. మరొకటి 29. అపెక్స్ 103 మీటర్ల పొడవు ఉండగా, సెయానే 97 వద్ద ఉంది. ప్లాన్ ప్రకారం 900+ ఫ్లాట్లు ఉన్నాయి, వీటిలో మూడింట రెండు వంతులు బుక్ చేయబడ్డాయి. మరికొన్నింటిని అమ్మేశారు. నిర్మాణంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని డెవలపర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ►9 ఏళ్ల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత జంట టవర్లను కూల్చివేస్తున్నారు. సవరించిన బిల్డింగ్ ప్లాన్లో భాగంగా ఈ టవర్లు నిర్మాణానికి ఆమోదం లభించింది. ఆ ఆమోదంపై సూపర్టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీకి చెందిన నలుగురు స్థానికులు యూఎస్బీ తోతియా(80), ఎస్కే శర్మ(74), రవి బజాజ్ (65), ఎంకే జైన్ (59) నివాసితులు 2012లో కోర్టును ఆశ్రయించారు. మొదట్లో ఉద్యానవనం ఉన్న స్థలంలో టవర్లను నిర్మించినట్లు వారు తెలిపారు. అనుమతుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014లో అలహాబాద్ హైకోర్టు కూల్చివేతకు ఆదేశించగా..ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది. చదవండి👉 ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు -
జేసీబీ కూల్చివేతలు.. పిటిషనర్లకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మున్సిపల్ అధికారులు చేపట్టిన జేసీబీ అక్రమ కట్టడాల కూల్చివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతలపై నిషేధం విధించలేమని, అది పూర్తిగా మున్సిపల్ అధికారుల పరిధిలోని అంశమని, ఎవరైనా చట్టానికి లోబడి నడుచుకోవాల్సిందేనని బుధవారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జేసీబీ కూల్చివేతలపై నిషేధం విధించాలని.. ప్రత్యేకించి ఇస్లాం కమ్యూనిటీకి చెందిన కట్టడాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఉలామా-ఐ-హింద్ అనే సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. బదులుగా.. కూల్చివేతలు అంతా సర్వసాధారణంగా జరిగే వ్యవహారమని, ఉద్దేశపూర్వక చర్యలు కావని యూపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ తరుణంలో.. మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలకు సైతం సుప్రీం కోర్టు బదులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బుధవారం వాదనల సందర్భంగా.. ప్రత్యేకంగా కమ్యూనిటీ అనే పదాన్ని ప్రస్తావించారు పిటిషనర్లు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని, అల్లర్లకు సాకుగా చేసుకుంటున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ప్రతిగా.. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేలు ప్రభుత్వాల తరపున వాదనలు వినిపించారు.. ‘అంతా భారతీయ కమ్యూనిటీలే’ ని వ్యాఖ్యానించారు. అల్లర్లకు, కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని, అవసరంగా సంచలనం చేయాలని చూస్తున్నారంటూ పిటిషనర్ల వాదనను తప్పుబట్టారు. ఈ క్రమంలో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. కూల్చివేతలపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది. -
యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్
దేశంలో బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరక ఢిల్లీలో బుల్డోజర్లకు పనిచెప్పగా.. తాజాగా ఉత్తరప్రదేశ్లో బుల్డోజరుతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా మసీద్ల వద్ద ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీతో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాగా యూపీలోని ప్రయాగ్రాజ్లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి సర్కార్ కూల్చివేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్లోని కచ్ నగరంలో ఓ ర్యాలీలో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సీఎం యోగిపై విరుచుకుపడ్డారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "Close the courts, lock them down": Asaduddin Owaisi lashes out after UP Police demolish Muslim activist Afreen Fatima's house. Watch: https://t.co/jSSc5C5nSD#StandWithAfreenFatima #AfreenFatima #AsaduddinOwaisi pic.twitter.com/vPAIfsoW5b — The Cognate (@TheCognate_) June 13, 2022 ఇది కూడా చదవండి: గాంధీ ఫ్యామిలీపై ఈగ వాలినా అంతుచూస్తాం -
‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్దే’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి 63 లక్షల మందిని నిరాశ్రయులను చేస్తాయని మండిపడ్డారు. ‘‘బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ఢిల్లీలో 80 శాతం నిర్మాణాలు అక్రమణలే అని చెప్పవచ్చు. అలాగని 80 శాతం నగరాన్ని ధ్వంస చేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్దేనని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఏమైంది ఈ నగరానికి.. రోడ్లపై హల్చల్ చేస్తున్న విద్యార్థులు -
40 అంతస్థుల ట్విన్ టవర్స్ కూల్చివేత.. చివర్లో ఊహించని ట్విస్ట్!
నిబంధనలు అతిక్రమించి ఢిల్లీలోని నోయిడాలో నిర్మించిన ట్విన్ టవర్స్ కూల్చివేతలో చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ట్విస్ట్ కారణంగా సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయలని పరిస్థితి ఎదురయ్యింది. దీంతో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఒకరి తర్వాత ఒకరు తెర మీద నుంచి తప్పుకుంటున్నారు. తాజా మలుపులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి! నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడా సెక్టార్ 93లో సూపర్ టెక్ అనే రియాల్టీ సంస్థ నిబంధనలు తుంగలో తొక్కి 40 అంతస్థుల జంట భవనాలు నిర్మించింది. దీనిపై అలహాబాద్ కోర్టు మీదుగా సుప్రీం కోర్టు వరకు వివాదం నడిచింది. చివరకు నిర్మాణ సంస్థదే తప్పుగా తేల్చిన కోర్టు 2022 మే 22న రెండు జంట భవనాలు కూల్చివేయాలని ఆదేశించింది. అదే విధంగా నోయిడా అధికారులకు తలంటింది. టెస్ట్ బ్లాస్ట్ ట్విన్ టవర్స్ కూల్చివేత పనులను ఎడిఫైస్ ఇంజనీరింగ్ అండ్ డిమాలిషన్ సంస్థ చేజిక్కుంచుకుంది. ఆ తర్వాత భవనాల కూల్చివేత పనులు పరిశీలించేందుకు టెస్ట్ బ్లాస్ట్ని 2022 ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించింది. ఇక మే 22న జంట భవనాలను నాలుగు వేల కేజీల మందుగుండు సామగ్రితో పేల్చివేయడమే తరువాయి అనే సమయంలో ఎడిఫైస్ సంస్థ షాక్ ఇచ్చింది. ప్లేట్ ఫిరాయించిన ఎడిఫైస్ నోయిడాలోని ట్విన్ టవర్లను కూల్చి వేసేందుకు తమకు కేటాయించిన సమయం సరిపోదంటూ కొత్త రాగం అందుకుంది. సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువులోగా (2022 మే 22)న భవనం కూల్చివేయలేమని, తమకు మరో రెండుమూడు నెలల సమయం కావాలంటూ చెబుతోంది. చుట్టు పక్కల ఉండే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా భవనాలను కూల్చివేయాలంటే తాము మరింత సాంకేతిక సామర్థ్యం సమకూర్చుకోవాలంటూ తెలపింది. ఎడిఫైస్ సంస్థ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడంతో నోయిడా అధికారుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. మాకు సంబంధం లేదు ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా 40 అంతస్థుల భవనం కడుతుంటూ చూస్తూ ఊరుకున్నారంటూ సుప్రీం కోర్టు నోయిడా అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కిందామీదా అవుతున్నారు. భవనం కూల్చివేతతో తమకు సంబంధం లేదని.. అదంతా బిల్డరే చూసుకోవాలని చెబుతున్నారు. తాము కేవలం కూల్చివేత పనులను పర్యవేక్షిస్తామంటూ చెబుతున్నారు. కుట్ర ఆరోపణలు ట్విన్ టవర్స్ కూల్చివేత విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్డర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త అంశాలను తెర మీదకు తెస్తున్నారంటున్నా ట్విన్ టవర్ సమీప ప్రజలు. రెండు నెలలుగా సాంకేతిక అంశాలపై నోరు విప్పకుండా ఈ రోజు అదనపు సమయం కావాలని అడగటం కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు ఈ కేసులో ప్రతివాదులు. దీంతో ఈ కేసులో సుప్రీం కోర్టు తదుపరి చర్యలు ఎలా ఉండవచ్చనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: 40 అంతస్థుల జంట భవనాలు కూల్చేస్తారా లేక జైళ్లో పెట్టమంటారా ? -
జహంగీర్పురి కూల్చివేతలు.. సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జహంగీర్పురిలో కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. జహంగీర్పురి కూల్చివేతలపై 'స్టేటస్ కో' (యధాతథ స్థితి) అమలు చేయాలని ధర్మాసనం వెల్లడించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎమ్) మేయర్ కూల్చివేతలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల అనంతరానికి వాయిదా వేసింది.అయితే దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే విధించాలన్న సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సంబంధిత వార్త: జహంగీర్పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు కాగా గత శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన ఢిల్లీలోని జహంగీర్పురి పరిసరాల్లో కూల్చివేతలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏమిటని స్థానికులు ఆగ్రహించారు. బుల్డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంబంధిత వార్త: Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే.. -
నోయిడా జంట టవర్ల కూల్చివేత అప్పుడే..!
నోయిడాలోని సూపర్టెక్ ఎమరాల్డ్ సంస్థకు చెందిన జంట టవర్లను మే 22 నాటికి పూర్తిగా నేలమట్టం చేయనున్నట్లు నోయిడా అథారిటీ నేడు(ఫిబ్రవరి 28) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటికే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయని నోయిడా అథారిటీ తెలిపింది. ఆగస్టు 22 నాటికి శిధిలాలను కూడా తొలగిస్తారని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్'లతో కూడిన ధర్మాసనంకు అథారిటీ తెలియజేసింది. భాగస్వాములందరితో సమావేశం ఫిబ్రవరి 9న జరిగిందని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 17న జరగనుంది. కూల్చివేతకు గెయిల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) అందిందని అథారిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. నోయిడాలోని సెక్టార్ 93లోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయాలనే తన ఆదేశాలను పాటించనందుకు డైరెక్టర్లను జైలుకు పంపాలని హెచ్చరించింది. యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట టవర్లను కూల్చివేయాలని ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్టెక్ ఎమరాల్డ్ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది. అయితే ఇవి నిబంధనలకు విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని.. దానికయ్యే ఖర్చునూ సూపర్టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. (చదవండి: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) -
బంగ్లాదేశ్లో దుర్గాదేవి మండపాలు ధ్వంసం
ఢాకా: దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో దుర్గామాతకి తీవ్ర అపచారం జరిగింది. క్యుమిలియా జిల్లాలో దుర్గా దేవి మండపాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పలు జిల్లాల్లో హిందూ దేవాలయాలపై దాడులకు దిగారు. దుర్గ దేవి కొలువుదీరిన మండపాల వద్ద ఖురాన్ను అపవిత్రం చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో దుండగులు మండపాలపై దాడికి దిగి ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. అదనపు భద్రతా బలగాలను మోహరించింది. 22 జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకి మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చాందీపూర్ హజీగంజ్, బన్షఖాలి, షిబ్గంజ్, కాక్స్ బజార్ తదితర ప్రాంతాల్లో దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలపై బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. కాగా ఈ దాడుల వెనుక జమాత్–ఇ–ఇస్లామీ హస్తం ఉందని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మచ్చ తీసుకురావడానికి, మత ఘర్షణలు రాజేయడానికే వారు ఈ పని చేశారని చెప్పారు. కొన్ని మండపాల్లో దుర్గమ్మ పాదాల చెంత పవిత్ర ఖురాన్ను ఉంచారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఘర్షణలు చెలరేగాయి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం దుర్గాదేవి మండపాలు మూడు వేలు ఉన్నాయి. -
భారత్ ఆస్తులను ధ్వంసం చేయండి
కాబూల్: అఫ్గానిస్తాన్లో భారత్ నిర్మించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ధ్వంసం చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అఫ్గాన్లోని తమ వారిని, తాలిబన్లను ఆదేశించింది. పాకిస్తాన్ నుంచి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తాలిబన్లకు మద్దతుగా చాలామంది అఫ్గాన్ వెళ్లారని, అక్కడి భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని వారిని ఆదేశించారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ల ఆక్రమణలోకి వచ్చిన ప్రాంతాల్లో వారి తొలి లక్ష్యం భారత్కు సంబంధించిన ఆస్తులు, భవనాలేనని తెలిసిందని పేర్కొన్నాయి. ఇప్పటికే అఫ్గాన్లో ఉన్నవారు కాకుండా, ఇటీవలి కాలంలో కనీసం 10 వేల మంది పాకిస్తానీయులు తాలిబన్లకు మద్దతుగా వివిధ సరిహద్దు మార్గాల ద్వారా అఫ్గానిస్తాన్ వెళ్లారని సమాచారం. అఫ్గానిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ సుమారు 300 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. భారత్ నిధుల ద్వారా నిర్మితమైన వాటిలో డేలారం– జారంజ్ల మధ్య నిర్మించిన 218 కిమీల రహదారి, సల్మా డ్యామ్, అఫ్గాన్ పార్లమెంట్ భవనం.. ఉన్నాయి. -
‘అక్రమాల కూల్చివేత’
ముంబై: పబ్లో ప్రమాదంపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో చలనం వచ్చింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లలో అప్రమత్తత, రక్షణ చర్యలు, అక్రమ, చట్ట విరుద్ధ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సందడిగా ఉండే బార్లు, రెస్టారెంట్లలో భద్రతా ఏర్పాట్లు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 1 అబవ్ పబ్లో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడిన విషయం విదితమే. 314 చోట్ల అక్రమనిర్మాణాల కూల్చివేత శనివారం సెంట్రల్ ముంబైతోపాటు మలాడ్, ములుంద్ వంటి సబర్బన్ ప్రాంతాల్లోనూ బీఎంసీ యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. అనధికార నిర్మాణం ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే కూల్చివేయాలని ఆదేశాలిస్తూ 1000 మంది అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించింది. వీరంతా బృందాలుగా విడిపోయి 624 మాల్లు, రెస్టారెంట్లు, పబ్లలో సోదాలు చేశారు. ప్రమాదం జరిగిన కమలా మిల్స్ ఏరియాతోపాటు ఇతర ఆయా ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన 314 కట్టడాలను కూల్చివేశారు. దక్షిణ ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రముఖ జఫ్రాన్ హోటల్లో ఒక భాగాన్ని కూల్చివేసి, మరో ఏడు హోటళ్లను సీజ్ చేశారు. నగరంలోని 24వార్డుల్లో ఉన్న రెస్టారెంట్లు, పబ్లు, హోటళ్లను అన్నిటినీ తనిఖీ చేస్తామని బీఎంసీ అధికార ప్రతినిధి తెలిపారు. ఆ రెండు పబ్లపై కేసులు ఘోర ప్రమాదానికి కారణమైన 1 అబవ్ పబ్తోపాటు అదే భవనంలో ఉన్న మోజోస్ బిస్త్రో పబ్పై ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అబవ్ పబ్ సహ యజమానులైన హితేష్ సంఘ్వి, జిగర్ సంఘ్విపై లుక్–ఔట్ నోటీసులు జారీ చేశారు. సంఘ్వి సోదరులతోపాటు పబ్ యజమానుల్లో ఒకరైన అభిజిత్ మాంకాతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. కమలా మిల్స్ కాంపౌండ్లో ఉన్న ఈ రెండు పబ్లతోపాటు కుర్లాలోని రఘవంశీ మిల్స్లో ఉన్న పీ22 మాల్పైనా బీఎంసీ ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర రీజినల్ టౌన్ ప్లానింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విధులను నిర్లక్ష్యం చేసి, పబ్లో అగ్ని ప్రమాదానికి కారణమయ్యారంటూ ఇప్పటికే ఐదుగురు అధికారులపై బీఎంసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఘోరానికి కారణం ఏమిటి? తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, కింది ఫ్లోర్లో ఉన్న మోజోస్ బిస్ట్రో పబ్లో అత్యవసర ద్వారం లేకపోవటంతో కిందికి దిగే దారి ఒక్కసారిగా కిక్కిరిసిపోయి ప్రాణనష్టానికి కారణమైందని 1 అబవ్ పబ్ యాజమాన్యం పేర్కొంది. మంటలు పక్కనే ఉన్న మరో సంస్థ నుంచి తమ పబ్లోకి వ్యాపించాయని తెలిపింది. టెర్రస్పై వెదురుతో షెడ్డు ఏర్పాటు చేసి 1 అబవ్ పబ్ నిర్వహిస్తున్నారని, బార్టెండర్ల విన్యాసాల సమయంలో మంటలు పైకప్పునకు ఉన్న ప్లాస్టిక్ కవర్లకు, వెదురుకు అంటుకుని ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని అగ్ని మాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పొరుగునే ఉన్న మరో పబ్లో హుక్కాల నుంచి లేచిన నిప్పురవ్వలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నామన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరమే నిజానిజాలు తెలుస్తాయన్నారు. -
ఇళ్ల కూల్చివేతలు ఆపాల్సిందే: సర్వే
అనుమతులు లేవన్న పేరుతో జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఇళ్ల కూల్చివేతలను తక్షణం ఆపాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అలా అక్రమ నిర్మాణాలుంటే క్రమబద్ధీకరణ చేయాలన్నారు.మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షించినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. కూల్చివేతలు, ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారాలతో కేసీఆర్ సీమాంధ్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని, తెలంగాణలో పుట్టిన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిందేనని సర్వే అన్నారు. రీయింబర్స్మెంట్కు 1956 స్థానికత ప్రాతిపదిక అనడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఇక తెలంగాణ ప్రాంతంలో సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని, పార్టీ ఓటమికి ఒక్క పొన్నాలనే బాధ్యుణ్ని చేయడం సరికాదని ఆయన చెప్పారు. పొన్నాలనే పీసీసీ చీఫ్గా కొనసాగించాలని సోనియాను కోరినట్లు వెల్లడించారు.