వైఎస్‌ జగన్‌ను కలిసిన దద్దాల, టీజేఆర్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన దద్దాల, టీజేఆర్‌

Published Wed, Feb 5 2025 1:20 AM | Last Updated on Wed, Feb 5 2025 1:24 AM

వైఎస్

వైఎస్‌ జగన్‌ను కలిసిన దద్దాల, టీజేఆర్‌

కనిగిరి రూరల్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జగనన్న నియోజకవర్గ పార్టీ, రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకున్నట్లు దద్దాల తెలిపారు. దద్దాల నారాయణ వెంట జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు సూరసాని మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పులి వెంకటేశ్వరరెడ్డి, సైకం స్వర్ణ, ఏడుకొండలురెడ్డి, మడతల వెంకటేశ్వరరెడ్డి, శేషిరెడ్డి, యర్రంరెడ్డి ఆంజనేయరెడ్డి, కొండారెడ్డి, అభి ఉన్నారు.

ఒంగోలు: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సంతనూతల పాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైఎస్‌ జగన్‌ను కలిసిన దద్దాల, టీజేఆర్‌ 1
1/1

వైఎస్‌ జగన్‌ను కలిసిన దద్దాల, టీజేఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement