![మోగిన నీటి గంట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07srl277-180109_mr-1738955600-0.jpg.webp?itok=BKu9ElTi)
మోగిన నీటి గంట
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీటి గంటను అమలు చేస్తున్నారు. హెచ్ఎం జోగినపల్లి అనురాధ నేతృత్వంలో నిత్యం రెండుసార్లు.. ఉదయం 10.45 గంటలకు, మధ్యాహ్నం 2.45 గంటలకు నీటిగంట అమలు చేస్తున్నారు. నీటిగంట శబ్దం వినగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ వాటర్ బాటిళ్లతో గ్రౌండ్లోకి చేరుకొని అందరూ ఒకేసారి నీటిని తాగుతారు. హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ ప్రతి రోజు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలనే ఉద్దేశంతో నీటిగంటలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment