సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా పునర్విభజన అంశం మరోమారు తెరపైకి వచ్చింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కేడం లింగమూర్తి ప్రమాణస్వీకారం సందర్భంగా హుస్నాబాద్పై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో బలవంతంగా కలిపారని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కలవనుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
23 మండలాలతో..
సిద్దిపేట జిల్లాగా 23 మండలాలతో 11 అక్టోబర్ 2016న ఆవిర్భవించింది. తర్వాత పలు చోట్ల ప్రత్యేక మండలం కావాలని ఉద్యమాలు చేయ డంతో కుకునూరుపల్లి, అక్బర్పేట–భూంపల్లి, దూల్మిట్ట మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో 26 మండలాలకు చేరింది.
హుస్నాబాద్ మూడు జిల్లాల పరిధి
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హన్మకొండ జిల్లాలో, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నాయి. అప్పట్లో కరీంనగర్ జిల్లా నుంచి తమను వేరుచేయడంపై హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ప్రజలు ఆందోళనలు చేశారు. వీటిని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అలాగే గతంలో పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరీంనగర్లో హుస్నాబాద్ను కలుపుతామని సీఎం రేవంత్రెడ్డి సైతం హామీ ఇచ్చారు.
బెజ్జంకిలో ఉద్యమం
బెజ్జంకి మండలాన్ని సైతం కరీంనగర్లో కలపాలని కరీంనగర్ సాధన సమితి పేరుతో బెజ్జంకి ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతి పత్రం సైతం అందించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కరీంనగర్లో కలిపేందుకు మంత్రి పొన్నం మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.
హుస్నాబాద్, బెజ్జంకిలతో తగ్గనున్న జిల్లా పరిధి?
సిద్దిపేటలో బలవంతంగా కలిపారంటూ మంత్రి పొన్నం వ్యాఖ్యలు
జిల్లా వ్యాప్తంగా హాట్హాట్ చర్చ
Comments
Please login to add a commentAdd a comment