రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

Published Wed, Feb 12 2025 12:50 AM | Last Updated on Wed, Feb 12 2025 12:50 AM

రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

తోటపల్లిగూడూరు: భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాల ని జేసీ కే కార్తీక్‌ సూచించారు. మండలంలోని మండపం పంచాయతీలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని జేసీ కార్తీక్‌ మంగళవారం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ భూముల హద్దుల విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ భూసర్వే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు. రైతుల మధ్య విభేదాలు తలెత్తకుండా సరైన కొలతతో వారి భూములకు హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో జరిగిన రీ సర్వేలో దొర్లిన చిన్నపాటి తప్పిదాలను సవరించేందుకు ఈ రీసర్వే దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణప్రసాద్‌,డీటీ శివయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement