సముద్రాన్నీ
● సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ● పట్టించుకోని జీవీఎంసీ అధికారులు ● అధికార పార్టీ ఫిర్యాదు చేస్తే వెంటనే కూలగొడుతున్న జీవీఎంసీ ● కూటమి నేతల నిర్మాణాలపై మాత్రం మౌనం ● వ్యర్థాలనూ సముద్రంలోకి వదిలేస్తున్న హేచరీస్ యాజమాన్యాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఇవే కాదు బీచ్ రోడ్లో అనేక ప్రాంతాల్లో పలు కంపెనీలు, వ్యక్తులు సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టమే కాకుండా ఇందుకు తగినట్టుగా భూ రికార్డులు కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. బీచ్ రోడ్డు వెంట ప్రధానంగా మంగమారిపేట ప్రాంతంలో ఇష్టారాజ్యంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఒకవైపు సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారనే కారణంగా కేవలం గోడలనే తొలగిస్తున్న జీవీఎంసీ సిబ్బంది.... ఈ శాశ్వత నిర్మాణాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న యాజమాన్యాలకు చెందినవి కావడమే గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment