సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి చెప్పే పాఠాలే.. విద్యార్థి భవిష్యత్తుకు దిక్సూచీగా నిలుస్తాయి. బడిలో చెప్పిన చదువు.. పర్యావరణంలో అన్వేషిస్తే.. ఆ పాఠం జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే విద్యను పర్యాటకంతో మమేకం చేస్తూ జిల్లా టూరిజం అధికారులు వినూత్న ఒరవడికి తెరతీశారు. పర్యాటక ప్రాంతాల్లో ఎడ్యుకేషనల్ టూర్స్కు శ్రీకారం చుట్టారు. స్కూల్స్, కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న వారికి మూడు విభాగాల్లో అవగాహన కల్పించేలా ఎడ్యుకేషన్ టూరిజం ఐటెనెరరీ పేరుతో కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభించనున్నారు.
‘ప్రభుత్వ’ విద్యార్థులకు ఫ్రీ
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యాసానికి పనికొచ్చే ప్రాంతాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో విద్యార్థులకు రాయితీతో కూడిన ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు కేవలం రూ.10 టికెట్తో ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment