నేడు పరవాడపాలెంలో అంత్యక్రియలు
ఎంవీపీకాలనీ: ఇండియన్ ఆర్మీ జవాన్ పరవాడ నాయుడుబాబు భౌతిక కాయానికి విశాఖ ఎయిర్పోర్టులో ఘననివాళులర్పించారు. లేహ్ సెక్షన్లోని కార్ఫ్స్ ఆఫ్ ఇంజినీర్స్ రెజిమెంట్లో (873 ఇంజినీర్ వర్స్క్) నాయుడుబాబు ఇండియన్ ఆర్మీకి సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన మృతి చెందారు. శుక్రవారం విశాఖ ఎయిర్పోర్టుకు ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చారు. నేవీకి చెందిన సెరిమోనియల్ గార్డ్తో పాటు తూర్పు నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగా కమాండింగ్ ఆఫీసర్ కండోర్ మనోజ్ యాదవ్, స్టేషన్ హెచ్క్యూ (ఆర్మీ) కల్నల్ విక్రాంత్ పాండే, నగర పోలీసులు అధికారులు నాయుడు భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కశింకోటలోని పరవాడపాలెం గ్రామంలో శనివారం నాయుడుబాబు అంత్యక్రియలు ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment