అల్లిపురం: నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీవీఎంసీ స్థాయీ సంఘం ఆమోదం తెలిపిందని స్థాయీ సంఘం చైర్పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయీ సంఘం సమావేశ మందిరంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 85 అంశాలను అజెండాలో పొందుపరిచారన్నారు. వాటిని సభ్యులు చర్చించిన అనంతరం 8 అంశాలు వాయిదా వేశామన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన సుమారు రూ.6.04 కోట్లు, ప్రజారోగ్య విభాగానికి సుమారు రూ.2.45 కోట్లు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవ రెడ్డి, మురళీకృష్ణ, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు సత్యనారాయణరాజు, సహాయక వైద్యాధికారి సునీల్కుమార్, బయాలజిస్టు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment