అభివృద్ధి పనులకు ‘స్థాయీ సంఘం’ ఆమోదం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు ‘స్థాయీ సంఘం’ ఆమోదం

Published Sat, Oct 19 2024 2:02 AM | Last Updated on Sat, Oct 19 2024 2:02 AM

అభివృద్ధి పనులకు ‘స్థాయీ సంఘం’ ఆమోదం

అల్లిపురం: నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీవీఎంసీ స్థాయీ సంఘం ఆమోదం తెలిపిందని స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయీ సంఘం సమావేశ మందిరంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 85 అంశాలను అజెండాలో పొందుపరిచారన్నారు. వాటిని సభ్యులు చర్చించిన అనంతరం 8 అంశాలు వాయిదా వేశామన్నారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన సుమారు రూ.6.04 కోట్లు, ప్రజారోగ్య విభాగానికి సుమారు రూ.2.45 కోట్లు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ సి.వాసుదేవ రెడ్డి, మురళీకృష్ణ, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు సత్యనారాయణరాజు, సహాయక వైద్యాధికారి సునీల్‌కుమార్‌, బయాలజిస్టు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement