మహారాణిపేట: జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, ఇతర ఉత్పత్తిదారులు డిజిటల్ మార్కెటింగ్ విధానాలను అనుసరించి మరిన్ని ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచించారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్ ఫాంలో అందరూ చేరాలని చెప్పారు. ఈ కామర్స్ విధానాలకు పెద్దపీట వేస్తూ విక్రయదారులకు, కొనుగోలు దారులకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమలు, ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న చర్యలపై ముందుగా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఆర్డీవో పి. శ్రీలేఖ, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం.వి.ఆదిశేషు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment