65 మంది పోలీసుల రక్తదానం | - | Sakshi
Sakshi News home page

65 మంది పోలీసుల రక్తదానం

Published Sat, Oct 19 2024 2:02 AM | Last Updated on Sat, Oct 19 2024 2:02 AM

65 మంది పోలీసుల రక్తదానం

ఆరిలోవ: కై లాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని అనకాపల్లి ఎస్పీ ఎం.దీపిక ప్రారంభించారు. ఏఆర్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు, హోంగార్డులు, కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు 65 మంది రక్తదానం చేశారు. సేకరించిన 65 యూనిట్ల రక్తాన్ని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ బ్లడ్‌ బ్యాంక్‌కు అందించారు. రక్తదానం చేసిన పోలీసులకు ఎస్పీ దీపిక ప్రశంసాపత్రాలు అందించారు. ఆరోగ్యంగా ఉన్న వారు రక్తదానం చేయాలని సూచించారు. అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్‌, ఎల్‌.మోహనరావు, పరవాడ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, ఏఆర్‌ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement