పోలీస్‌ ప్రజావాణికి ఐదు అర్జీలు | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ప్రజావాణికి ఐదు అర్జీలు

Published Tue, May 7 2024 4:55 AM

-

వనపర్తి: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ రక్షితా కె.మూర్తి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా విని పరిష్కారం కోసం సంబంధిత పోలీస్‌ అధికారులకు అర్జీలను సిఫారసు చేశారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు నిర్వహించిన ప్రజావాణికి మొత్తం ఐదు అర్జీలు దాఖలయ్యాయి. అందులో భూమికి సంబంధించిన అర్జీలు 03, పరస్పర గొడవలు, భార్యాభర్తల ఘర్షనలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ సమర్పించినట్లు ఎస్పీ వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement