సాక్షి టాస్క్ఫోర్స్: మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చనేతలు విచ్చలవిడిగా అక్రమ ఆదాయం కోసం అర్రులు చాస్తున్నారు. వేముల మండలంలో మైనింగ్ లీజుదారులను బెదిరిస్తూ ఆ పక్కనే అక్రమ మైనింగ్కు పథక రచన చేస్తున్నారు. భూమి లోపల లీజుదారుల మైనింగ్లోకి ప్రవేశించి విచ్చలవిడిగా బైరెటీస్ దోచేస్తున్నారు. టిఫెన్ కంపెనీకి చెందిన బైరెటీస్ దోపిడిలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వేముల మండల వ్యాప్తంగా టీడీపీ నేతలు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. లీజుదారుల మైనింగ్లోకి దౌర్జన్యంగా చొరబడి ముడి ఖనిజాన్ని దోచేస్తున్నారు. అడ్డుచెప్పిన వారిపై దూషణలకు దిగుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో అక్రమ మైనింగ్ చేస్తూ జేసీబీ ఢీ కొని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఆ స్తంభాలపై ఉన్న 3ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి. ఇదేంటీ ఇలా అడ్డదిడ్డంగా చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి ట్రాన్స్కో అధికారులపై రెచ్చిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తర్వాత ఉంటుందంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈమొత్తం వ్యవహారం వేముల మండల వ్యాప్తంగా ప్రజానీకం విస్తృత చర్చ నడుస్తోంది. టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడే అవకాశమే లేదా? అంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు. కాగా ఈవిషయమై ట్రాన్స్కో ఏఈ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
వేములలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న తెలుగుతమ్ముళ్లు
అక్రమ మైనింగ్ చేస్తూ 3 ట్రాన్స్ఫార్మర్లను ఢీ కొట్టిన జేసీబీ
ఫిర్యాదు చేస్తే సహించమని ట్రాన్స్కో అధికారులకు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment