Nationalist Congress Party (NCP)
-
శరద్ పవార్కు అనారోగ్యం
పుణే: సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్(84) అనారో గ్యం బారినపడ్డారు. తీవ్రమైన దగ్గు కారణంగా మా ట్లాడటం కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే 4 రో జుల్లో ఆయనకున్న కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఆరోగ్యం బాగోలేకున్నా ఆయన గురువారం పుణే లోని వసంత్దాదా షుగర్ ఇన్స్టిట్యూట్లో ప్రసంగించారు. ఆ సమయంలో తరచూ దగ్గుతూనే 18 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు. ‘శరద్ పవార్ జీ ఎడతెగని దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే, వచ్చే నాలుగు రోజుల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి’అని శనివారం ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ చెప్పారు. -
Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం
తిరువనంతపురం: కేరళలోని ఎన్సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్లో భాగస్వాములు. ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్పై ఒత్తిడి తెచ్చి కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు. ఎన్సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది. -
‘గడియారం’ అజిత్ పవార్ వర్గానికే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టి(అజిత్ పవార్) అధ్యక్షుడు అజిత్ పవార్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వాడుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ గుర్తు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు ప్రచార సామగ్రిపై ముద్రించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గడియారం గుర్తుపై అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య మొదలైన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడియారం గుర్తుతో శరద్ పవార్కు ఎంతో అనుబంధం ఉంది. గుర్తు విషయంలో ప్రజల్లో గందరగోళానికి తావు లేకుండా అజిత్ పవార్ వర్గానికి కొత్త గుర్తు కేటాయించాలని శరద్ పవార్ వర్గం సూచించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చంటూ తేలి్చచెప్పింది. అయితే, ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ వర్గానికి నష్టం కలుగకుండా హామీ పత్రం సమర్పించాలని అజిత్ పవార్ వర్గాన్ని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీపీ రెండుగా చీలిపోగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించింది. -
బారామతి బరిలో అజిత్
సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పారీ్టలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. వీరిలో 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పుణె జిల్లాలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం బారామతి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. బారామతి ఎంపీ స్థానం శరద్ పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటోంది. అందుకే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో శరద్పవార్ కుమార్తె సుప్రియాసూలేపై అజిత్ తన భార్య సునేత్రా పవార్ను పోటీకి నిలిపినా సునేత్రా ఓటమిని చవిచూడటం తెల్సిందే. ఛగన్ భుజ్బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. 45 మందితో శివసేనజాబితా విడుదల మంగళవారం అర్ధరాత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 45 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి కోప్రి పాచ్ పాఖాడి నుంచి పోటీచేయనున్నారు. విలాస్ సందీపన్ భూమ్రే పైఠాన్ నుంచి, మంత్రి ఉదయ్ సమంత్ రత్నగిరి నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమి ఇప్పటివరకు 182 పేర్లను ప్రకటించింది. ఇందులో బీజేపీ నుంచి 99 మంది, శివసేన నుంచి 45 మంది, ఎన్సీపీ నుంచి 38 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడు అమిత్ ఠాక్రేను మాహిం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపారు. శివసేన(యూబీటీ) తొలిజాబితా ఉద్ధవ్ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) బుధవారం 65 మంది అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదలచేసింది. పార్టీ నేత, మాజీ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సెంట్రల్ ముంబై పరిధిలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. యువసేన నేత, ఆదిత్య బంధువు వరుణ్ సర్దేశాయ్ బాంద్రా(ఈస్ట్) నుంచి పోటీచేస్తారు. పార్టీ నుంచి చీలిపోయి పార్టీ పేరు, గుర్తును కైవసం చేసుకున్న ఏక్నాథ్ షిండే పోటీచేస్తున్న కోప్రి పాచ్ పాఖాడి నియోజకవర్గంలో శివసేన(యూబీటీ) తరఫున కేదార్ దిఘే బరిలో దిగుతున్నారు. షిండే రాజకీయగురువు ఆనంద్ దిఘే మేనల్లుడే కేదార్. -
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్సైకిల్ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
దిగ్భ్రాంతికర హత్యాకాండ
మాజీ మంత్రి, మహారాష్ట్రలోని అధికార జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్దిఖీని ముంబయ్లో మాఫియా శైలిలో హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తదుపరి లక్ష్యాలంటూ వినిపిస్తూ ఉండడం ఆందోళన రేపుతోంది. మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సందేహాలు కలిగిస్తోంది. సల్మాన్తో సన్నిహిత సంబంధాల రీత్యా సిద్దిఖీ లక్ష్యంగా మారారని కథనం. కుమారుడి నియోజకవర్గంలోని మురికివాడల పునరభివృద్ధి వ్యవహా రంలో కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందని మరో వాదన. ఇంకా అనేక రకాల కుట్ర కోణాలూ వినవస్తున్నాయి. సిద్దిఖీ దారుణ హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఈ ఘటన తాలూకు రాజకీయ పర్యవసానాలు కచ్చితంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అస్తుబిస్తుగా ఉన్న పాలక కూటమిని ఎన్నికల వేళ ఇది ఇరుకునపెట్టే అంశం కానుంది. విద్యార్థి నేత నుంచి గ్యాంగ్స్టర్గా మారిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా, అనేక నెలలుగా ఈ హత్యకు పథకం వేసినట్లు కథనం. జైలులో ఉన్నా సెల్ఫోన్ సహా సమస్త సౌకర్యాలతో బిష్ణోయ్ లాంటి కొందరు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండడం మన వ్యవస్థకు పట్టిన తెగులు.ముంబయ్లో రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో శనివారం, విజయదశమి నాటి రాత్రి సిద్దిఖీపై దాడి చేసిన ముగ్గురు దుండగులు ముందుగా ఆయన రక్షకుడిపై పెప్పర్స్ప్రే జల్లి, ఆపైన సూటిగా 6 బుల్లెట్లు కాల్పులు జరిపి ఊరేగింపులో కలిసిపోయారట. హాస్పిటల్కు హుటాహుటిన తరలించి, దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కాల్పులు జరిపిన మూడో వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బిష్ణోయ్ పక్షాన ముగ్గురు సుపారీ ఇచ్చి పథక రచన చేయగా, మరో ముగ్గురు కాల్పులు జరిపారనీ, నిందితులు యూపీ, పంజాబ్, హర్యానా – ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి రెక్కీ జరిపినట్లూ, దొరకకుండా వాట్సప్, సిగ్నల్ యాప్ల ద్వారా కథ నడిపినట్లూ సమాచారం. సరిగ్గా వారం పైచిలుకు క్రితమే ముంబయ్లోని బైకులా ప్రాంతంలో మరో ఎన్సీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడీ దారుణహత్య జరగడం విషాదం. దాదాపు 48 ఏళ్ళ పాటు కాంగ్రెస్లో ఉండి, పాపులర్ రాజకీయ నేతగా ఎదిగిన చరిత్ర సిద్దిఖీది. ఏటేటా ఆయన ఆర్భాటంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు, వాటికి హాజరయ్యే నగర ప్రముఖులు, మరీ ముఖ్యంగా హిందీ సినీ అగ్ర తారలు జగత్ప్రసిద్ధం. అంత పేరు, పలుకుబడి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బాబా సిద్దిఖీని స్వయంగా ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం ఎదుటే హత్య చేయడం దిగ్భ్రాంతికరం. ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇలా ఓ పాపులర్ నాయకుడు దారుణహత్యకు గురికావడం వ్యవస్థల వైఫల్యానికి ఉదాహరణ. అదీ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉన్న దసరా ఉత్సవాల హంగామా సమయంలోనే జరగడం పరాకాష్ఠ. దేశ వాణిజ్య రాజధానిలో ఇలాంటి ఘటన జరిగిందంటే, పాలకులకు ఇది మరీ మాయని మచ్చ. గ్లామర్ నిండిన హిందీ చిత్రసీమ, ఖరీదైన ముంబయ్ రియల్ ఎస్టేట్, ఈ రెంటితోనూ ముడి పడ్డ మాఫియా ముఠా నేతల ముక్కోణపు వ్యవహారం ముంబయ్లో ఎప్పుడూ ఒక డెడ్లీ కాంబి నేషన్. కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా మాఫియా నేతల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చాయి. 1980, ’90లలో ముంబయ్లో దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ లాంటి మాఫియా నేతల గ్యాంగ్ వార్ తెలిసినదే. గతంలో చాలా ఏళ్ళ క్రితం ప్రముఖ సినీ నిర్మాత, ఆడియో కంపెనీ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఇలాగే జరిగిందీ ప్రజలకు గుర్తే. కానీ, ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఓ గ్యాంగ్స్టర్ ఇలాంటి చర్యలకు దిగడమే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రముఖులపై హింసాత్మక దాడులు, హత్యలు ఈ ఏడాది వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమైనది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ లైవ్లో ఉండగా శివసేన (యూబీటీ) నేత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో లోపాలతో ఆగ్రహించిన హైకోర్ట్ చివరకు ఆ కేసును గత నెలలో సీబీఐకి బదలాయించాల్సి వచ్చింది. ఇవన్నీ పోలీసులకూ, పాలకపక్షానికీ చెంపపెట్టు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి సర్కార్కు ఇప్పటికే బోలెడన్ని చిక్కులున్నాయి. అధికారం కోసం ఈ పార్టీలన్నీ అనైతిక కూటమి కట్టాయనే భావన ఉంది. కూటమి పాలనపై అసంతృప్తి సహా ఇంకా అనేకం ఉండనే ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ బలం పుంజుకుంటూ ఉండడంతో, ఎన్నికల వేళ... ముంబయ్లో టోల్ఫ్రీ ప్రయాణం సహా రకరకాల జిమ్మిక్కులకు సర్కారు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇలాంటప్పుడు సిద్దిఖీ హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సిన హోమ్ శాఖకు బీజేపీ నేత, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథి. అదీ కాషాయపార్టీకి ఇబ్బందికరమే. సిద్దిఖీ మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నా ఈ హత్య ఊహించనిది. ముంబయ్లో మళ్ళీ ఒకప్పటి గ్యాంగ్వార్ పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సర్కారు ఉక్కుపాదం మోపాలి. అన్ని పక్షాలూ రాజకీయాల కన్నా రాష్ట్రంలో భయరహిత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి. గతంలో ఎంతో పేరున్న ముంబయ్ పోలీ సులు ఈ కేసును సవాలుగా తీసుకోవాలి. దోషులకు శిక్ష పడేలా చూడాలి. పోయిన ప్రతిష్ఠను తెచ్చు కోవాలి. చట్టం మీద ప్రజలకు మళ్ళీ నమ్మకం నెలకొనేలా చూడడం పాలకుల తక్షణ కర్తవ్యం. -
బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్ పాటిల్ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్ భావిస్తున్నారు.కాగా అక్టోబరు 7న ఇందాపూర్లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్ ఇందాపూర్ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్లో కాంగ్రెస్ను బీజేపీలో చేరారు.అయితే ప్రస్తుతం ఇందాపూర్ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
Sharad Pawar: నాపై నిఘాకే జెడ్ ప్లస్ భద్రత
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు. ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే. -
శరద్ పవార్కు ధన్యవాదాలు: అజిత్ పవార్
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డప్యూటీ సీఎం అజిత్ పవార్.. తన అంకుల్ శరద్ పవార్కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీని.. 24ఏళ్ల పాటు సుధీర్ఘంగా నడిపించిన శరద్ పవార్కు అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు.1999లో ఎన్సీపీ ఆవిర్భావించింది. ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. మేరకు సోమవారం ముంబైలో అజిత్ కుమార్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా పార్టీని నడిపించినందుకు శరద్ పవార్కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు పార్టీని స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్న వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.శివాజీ మహారాజ్, షాహూ మహారాజ్, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలపైనే మా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయని నేను అందరికీ హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.రాయ్గఢ్ లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీ నాయకుడు సునీల్ తట్కరే ఎన్సీపీ ప్రతిష్టను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్త్ కంటే తక్కువ స్థాయిలో ఏ పదవిలో ఉండకూడదని ఎన్సీపీ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. `కేబినెట్ పోర్ట్ఫోలియో కంటే తక్కువ పదవిని మేము అంగీకరించబోమని బీజేపీకి స్పష్టం చేస్తున్నాం. వారు చాలా మంది సభ్యులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని మాతో చెప్పారు. మేము ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే` అని ఆయన అన్నారు. స్తుతం 284 సీట్లు ఉన్న ఎన్డీయ బలం రాబోయే నెలల్లో 300 మార్కును దాటుతుందని పేర్కొన్నారు.కాగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల పోటీ చేయగా.. కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేసిన పది నియోజకవర్గాలలో ఎనిమిదింటిని గెలుచుకుంది. ముఖ్యంగా, అజిత్ భార్య సునేత్రా పవార్.. సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే చేతిలో బారామతిలో ఓడిపోయారు. -
ఎన్డీయేలో చేరాలన్న మోదీ.. శరద్ పవార్ స్పందన ఇదే
ముంబై: నకిలీ ఎన్సీపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీసీ (శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో (బీజేపీ) తాను ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ఉద్ధేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చేతులు కలపాలని సూచించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీయోలో చేరాలని తెలిపారు.‘గత 40-50 ఏళ్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు (శరద్ పవార్) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బారామతి లోక్సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్లో విలీం చేయాలని ఆయన అంటున్నారు’ అని మోదీ తెలిపారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్లు’ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించే వారితో చేతులు కలపనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో ఓటమి తాలూకు భయం కన్పిస్తోందని, అందుకే తన ప్రసంగాన్ని మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమపై వస్తున్న ప్రతికూలతను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇందుకు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను అరెస్టు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.‘కేజ్రీవాల్, సోరెన్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పాత్ర లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉందో ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఇటీవలి ప్రసంగాలు వర్గాల మధ్య చీలికలు సృష్టించేలా ఉన్నాయి. మోదీ ప్రసంగాలు ప్రధాని పదవికి తగినవి కావు. ఇది దేశానికి ప్రమాదకరం. శివసేన(యూబీటీ), ఎన్సీపీలను నకిలీ అని విమర్శించడం సరికాదు. డూప్లికేట్ అని పిలిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?’ అని శరద్ మండిపడ్డారు -
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్స్టేషన్లలో ఆమెపై కేసు నమోదైంది.ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్కు మహాయుతి కూటమి బారామతి లోక్సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
Lok Sabha polls 2024: గెలిస్తేనే నిలిచేది..!
ఈ లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్, చీలిక వర్గం చీఫ్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే... ఈ నలుగురూ గెలుపు కోసం అన్ని అ్రస్తాలనూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఎన్నికలయ్యేదాకా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. శివసేనను షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి వేరుకుంపటి పెట్టుకోవడం తెలిసిందే. వాటినే అసలైన శివసేన, ఎన్సీపీగా మహారాష్ట్ర స్పీకర్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్, శరద్ పవార్ అధికారంలో భాగస్వాములుగా లేరు. పైగా మహావికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకే పోటీ చేస్తున్నారు. కనుక గణనీయమైన సీట్లు సాధిస్తే తప్ప వారి రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో శరద్ పవార్ 50 ఏళ్లలో ఒక్క ఓటమీ ఎదుర్కోని నేత కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడని నేత కావడం విశేషం! ఠాక్రే... వీలైనన్ని చోట్ల పోటీ 2019లో బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 గెలుచుకుంది. తర్వాత పార్టీని షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవితవ్యమే అనిశి్చతిలో పడింది. ఈసారి సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటే క్రమంలో 21 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఉద్ధవ్ తన కేడర్ను కాపాడుకోవాలంటే కనీసం ఆరేడు లోక్సభ స్థానాలు గెలిచి తీరాలని రాజకీయ విశ్లేషకుడు అకోల్కర్ విశ్లేషించారు. బారామతిలో ఎవరిదో పరపతి! శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి పవార్కు కీలకమైనది. అక్కడ 3సార్లుగా ఎంపీగా గెలుస్తు న్న పవార్ కుమార్తె సుప్రియా సులే ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాలు విసురుతున్నారు. ‘‘బారామతిలో సుప్రి య ఓడితే పవార్ అంతా కోల్పోయినట్టే. అలా చూస్తే ఈ యుద్ధం శరద్, అజిత్ మధ్యే!’’ అని పరిశీలకులు అంటున్నారు. ఓట్ల చీలిక.. సీఎంగా ఉండగా ఇల్లు కదల్లేదన్న విమర్శలు మూటగట్టుకున్న ఉద్ధవ్ ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా చుడుతున్నారు. ఆయన ర్యాలీలకు మంచి స్పందనే వస్తోంది. శరద్ పవార్ ఉన్నచోటి నుంచే చక్రం తిప్పుతున్నారు. బారామతిలో కుమార్తె గెలుపు కోసం పుణె జిల్లాలో పూర్వపు ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతల మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ మన వడైన ప్రకాశ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ)తో ఎంవీఏ కూటమి సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. దాంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది అధికార కూటమికి అనుకూలిస్తుందంటున్నారు. కేడర్, ఓటర్ ఎటువైపు శరద్ పవార్, ఉద్దవ్లకు ఈ ఎన్నికలు గట్టి పరీక్షేనని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్పాండే అన్నారు. అయితే పార్టిలు చీలినా సంప్రదాయ ఓటర్లు, కేడర్ మద్దతు వావైపేనని అభిప్రాయపడ్డారు. ‘‘పైగా బీజేపీ కేడర్లోనూ అశాంతి నెలకొని ఉంది. కనుక వాళ్లు అజిత్, షిండే అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది అనుమానమే’’ అని ఆయన సందేహం వెలిబుచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన 41 లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవడం వాటికి ప్రతిష్టాత్మకమని, ఆ లెక్కన ఈ ఎన్నికలు అధికార బీజేపీ–షిండే–అజిత్ కూటమికే అసలైన పరీక్ష అని ఉద్దవ్, శరద్ పవార్ వర్గీయులు వాదిస్తున్నారు. – ముంబై -
బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పార్టీకి 6 సీట్లు.. కానీ షరతు ఇదే!
ముంబై: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ సీట్ల షేరింగ్ ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆరు సీట్లను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కాషాయ పార్టీ ఓ షరతు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ఎన్సీపీ ఎన్నికల గుర్తు కింద, ఒక ఎన్సీపీ అభ్యర్థిని బీజేపీ గుర్తు కింద పోటీ చేయించాలని ప్రతిపాదించినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పరిణామం ఎన్సీపీలో అసంతృప్తిని రేకెత్తించింది. దీంతో మహాయుతి కూటమిలో మరోసారి సీట్ల కేటాయింపుపై చర్చలు అపరిష్కృతంగా మారాయి. కనీసం 9 సీట్లు కోరుతున్న పవార్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీసీ కనీసం తొమ్మిది లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. దీంతో బీజేపీ పెట్టిన నిబంధనలను అంగీకరించడానికి ఆ పార్టీ నాయకత్వం వెనుకాడుతోంది. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఎన్సీపీ నేతలు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈసారి లోక్సభ ఎన్నికలు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో జరగనున్నాయి. జూన్ 1న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. -
ఎన్సీపీ నేత ప్రఫుల్పటేల్కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్పటేల్కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
వారి పేరు, ఫొటోలు వాడకండి.. అజిత్ పవార్ వర్గానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
రాజకీయ ప్రయోజనాల కోసం పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్పై అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శరద్ పవార్ పేరు, చిత్రాలను ఉపయోగించబోమని హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీ గత ఏడాది జూలైలో అజిత్ పవార్.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్ పవార్ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్ వర్గాన్ని కోర్టు ప్రశ్నించింది. మీరు సొంత పార్టీ గుర్తింపుతో ముందుకు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు అజిత్ వర్గానికి సూచించింది. అజిత్ పవర్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీ శరద్ పవార్ పేరును ఉపయోగించడం లేదని, కొందరు గుర్తు తెలియని కార్యకర్తలే ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో కార్యకర్తలను నిలువరించడం సాధ్యం కాదని అజిత్ వర్గం పేర్కొన్నారు. అజిత్ వర్గం వాదనలు విన్న తరువాత.. మీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కోర్టు స్పష్టం చేసింది. రెండు పార్టీలుగా విడిపోయిన తరువాత తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉందని వెల్లడించారు. శరద్ పవార్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులు వాదనలు వినిపిస్తూ.. అజిత్ వర్గం ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. ఆ గుర్తుకు శరద్ పవార్కు ఉన్న రాజకీయ బంధం గురించి అందరికి తెలుసని అన్నారు. -
ఇప్పటివరకూ సలహాలే.. ఇకపై.. లోక్సభ బరిలో డిప్యూటీ సీఎం సతీమణి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్ను బారామతి లోక్సభ స్థానం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) బరిలో నిలిపింది. పార్టీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నిర్వహించిన కార్యక్రమంలో సునేత్ర పవార్ మాట్లాడుతూ ప్రజల మద్దతు కోరారు. "మీరు ( బారామతి లోక్సభ నియోజకవర్గ ప్రజలు ) మాకు మద్దతు ఇస్తే, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం" అని సునేత్ర అన్నారు. తన భర్త అజిత్ పవార్ చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వాటి పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తానూ తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు "దాదా" ( అజిత్ పవార్ను మద్దతుదారులు ఇలా పిలుస్తారు) ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనకు ప్రజల సమస్యలు తెలియజేయడం వరకే తన పాత్ర ఉండేదని ఆమె చెప్పారు. "నా పేరు బారామతికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు మాకు అవకాశం ఇస్తే, మేమిద్దరం ( అజిత్ పవార్, సునేత్ర పవార్ ) మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం" అన్నారు. ఆడపడుచు స్థానంలోకి అన్న భార్య.. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమవుతుండటంతో సునేత్రా పవార్ అభ్యర్థిత్వంపై గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, లోక్సభ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి అభ్యర్థి సునేత్రా పవార్ . బారామతి సీటు ప్రస్తుతం అజిత్ పవార్ సోదరి, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) చేతిలో ఉంది. సూలే 2009 నుండి బారామతి ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ 1996 నుండి 2009 వరకు ఆ స్థానాన్ని పవార్ కుటుంబానికి బలమైన కోటగా పరిగణించారు. -
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
శరద్ పవార్కు మరో షాక్.. ‘అజిత్దే నిజమైన ఎన్సీపీ’: మహారాష్ట్ర స్పీకర్
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వివాదంలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్ వర్గం ఎన్సీపీనే నిజమైన పార్టీ. అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేము’ అని తెలిపారు. చదవండి: టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా కాగా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ ఎవరిది, ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే రెండు అంశాలపై రెండు వర్గాల మధ్య చిచ్చు నెలకొంది. అయితే ఇటీవల అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాన్ని 'అసలైన రాజకీయ పార్టీ'గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పార్టీ పేరు, గడియారం గుర్తు అజిత్కే దక్కింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్' అనే కొత్త పేరు వచ్చింది. -
శరద్ పవార్కు బిగ్ షాక్
ఢిల్లీ, సాక్షి: లోక్సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. ఎన్సీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్ పవార్ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన వర్గానికి ఓ పేరును ఎంచుకోవాలని ఈసీ శరద్ పవార్ను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన(రేపు) ఈసీ ముందుకు శరద్ పవార్ వర్గం.. పార్టీ పేరు, గుర్తు అభ్యర్థనతో వెళ్లనుంది. ఆ వెంటనే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఏక పక్షంగా! ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. అయితే.. ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆమె అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ కూటమి ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగడం గమనార్హం. -
‘రామ మందిరం: రాజీవ్గాంధీ హయాంలోనే వేడుక జరిగింది’
అయోద్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దేశంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు రామాలయ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వాన ప్రతికలు అందజేస్తోంది. ఇక..ఈ కార్యక్రమంపై పలువురు రాజకీయ నాయకులు బీజేపీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తోదని రాబోయే లోక్సభ ఎన్నికలకు పావుగా వాడుకుంటోందని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పింస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీరుపై విమర్శలు చేశారు. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర ఏర్పాటుకు మాజీ, దివంగత ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ హయాంలోనే కీలకమైన ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) చేసి వేడుక జరిపారని గుర్తు చేశారు. శరద్ పవార్ కర్ణాటకలోని నిపాణిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంగళవారం మాట్లాడారు. రామ మందర విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయం కోసమే చాలా హడావుడీ చేస్తున్నాయని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) వేడుక చేశారని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాత్రం రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయోద్యలో బలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 11 రోజులు ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. దానిపై కూడా సీనియర్ నేత శరద్ పవార్ స్పందిస్తూ.. రాముడిపై భక్తి, విశ్వాసం ఉండటాన్ని తాను గౌరవిస్తాన్నానని తెలిపారు. కానీ.. దేశంలో పేదరికం నిర్మూలించబడాలని ఉపవాసం చేస్తే దేశ ప్రజలు సైతం ప్రశంసిస్తారని హితవు పలికారు. చదవండి: అటల్ సేతుపై ఆటో రిక్షా.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు! -
Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం
ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజల్గావ్లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్ సోలంకె, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్లైన్ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్తో మనోజ్ జరంగె అనే వ్యక్తి అక్టోబర్ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్గావ్లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు. ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు. బీడ్ నగరంలో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్లోని ఒక హోటల్కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై బైటాయించారు. షోలాపూర్–అక్కల్కోట్ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్లోని ఎమ్మెల్యే ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్సభ సెక్రటేరియట్ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు. -
ఖర్గే, రాహుల్ గాం«దీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. -
ఎన్సీపీ ఎంపీ ఫైజల్పై అనర్హత వేటు
తిరువనంతపురం: లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్పై మరోసారి అనర్హత వేటు వేస్తూ కింద కోర్టు విధించిన తీర్పు ప్రకారం శిక్షను ఖరారు చేసింది కేరళ హైకోర్టు. కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ అల్లుడు మహ్మద్ సలేహ్ హత్యాయత్నం కేసులో దోషిగా తేలడంతో ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని మహ్మద్ ఫైజల్ హైకోర్టును కోరగా హైకోర్టు ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. జనవరి 11న ఎంపీ ఫైజల్ ఈ కేసులో దోషిగా తేలిన నాటి నుంచి ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది. హత్యాయత్నం కేసులో మహ్మద్ ఫైజల్పై ప్రాథమిక సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శిక్ష అమలుపై స్టే విధించాలన్నది ఫైజల్ డిమాండ్. ఇప్పటికే ఈ కేసులో కవరతి సెషన్స్ కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజాప్రతినిధికి ఏదైనా నేరంలో రెండేళ్లకు మించి జైలుశిక్ష విధిస్తే ఆయన చట్టసభల సభ్యత్వానికి అనర్హుడవుతాడు. ఇది కూడా చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే -
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరే ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశాలకు అజిత్ పవార్ గైర్హాజరవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సాధించాయి. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి ఎన్సీపీ రెబెల్ అజిత్ పవార్ హాజరు కాకపోగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుకు ట్రబుల్ మొదలైందని చెబుతున్నాయి. ఎన్సీపీ రెబెల్ మంత్రులకి జిల్లా సహాయక మంత్రులుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అజిత్ పవార్ మరోసారి అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన చంద్రకాంత్ పాటిల్కు పూణే జిల్లా సహాయక మంత్రిగాను దిలీప్ వాల్సే పాటిల్కు బుల్దానా జిల్లా, హాసన్ ముష్రిఫ్కు కొల్హాపూర్ జిల్లా, ధనుంజయ్ ముండేను బీడ్ జిల్లాకు సహాయక మంత్రులుగా ప్రకటించింది షిండే ప్రభుత్వం. తనవారికి మంత్రి పదవులు దక్కనందునే అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నరని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు విజయ్ వాడెట్టివార్. ఇదిలా ఉండగా ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాత్రం అజిత్ పవార్ వర్గంపై ఘాటు విమర్శలు చేశారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ట్రబుల్ మొదలయిందన్నారు.నిరాశలో ఉన్న వర్గం ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తమ అసంతృప్తిని తెలిపినట్టు సమాచారం అందింది. హనీమూన్కు వెళ్లి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ప్రభుత్వంలో ముసలం మొదలైందని వార్త్లు వస్తున్నాయి. అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్సీపీ తిరుగువర్గంలో మరో ఎమ్మెల్యే ఛగన్ భుజ్బల్ మాత్రం అజిత్ పవార్ గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని కేబినెట్ సమావేశాలకు ఎలా హాజరవుతారని, ఢిల్లీ పర్యటనకు ఎలా వెళతారని ప్రశ్నిస్తూనే రాజకీయంగా మాకు ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. ఇది కూడా చదవండి: కుల్గామ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం -
ఎన్సీపీ పార్టీ గుర్తు ఆయనకే సొంతం
ముంబై: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తు ఎవరికీ ధారాదత్తం చేసేది లేదని పార్టీ గుర్తు మా వద్దే ఉంటుందని తేల్చి చెప్పారు. నాగ్పూర్లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు ఎన్సీపీ అంటే శరద్ పవార్.. శరద్ పవార్ అంటే ఎన్సీపీ అని. అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీ అంటే జయంత్ పాటిల్ అని కూడా అందరికీ తెలుసన్నారు. 25 ఏళ్ల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని స్థాపించారని ఈ పార్టీ గుర్తు ఎప్పటికీ ఆయనతోనే ఉంటుందని ఎవరికీ ఇచ్చేది లేదన్నారు. ఈ ఏడాది జులై ప్రారంభంలో ఎన్సీపీలో చీలిక తీసుకొస్తూ అజిత్ పవార్ అధికార బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. కానీ ఆయన అంతకుముందే జూన్ 30న ఎన్సీపీ పార్టీ తనదేనంటూ ఆ గుర్తు తమ వర్గానికే కేటాయించాల్సిందిగా కోరుతూ ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్ సమర్పించిన పిటిషన్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీల అఫిడవిట్లు కూడా ఎన్నికల కమిషన్కు సమర్పించారు. దీంతో ఎన్నికల కమిషన్ కూడా పార్టీలో చీలిక వచ్చిందన్న విషయాన్ని అంగీకరిస్తూ అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. ఇది కూడా చదవండి: పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు -
ఆదానీతో కలిసి శరద్ పవార్.. ఇదేం ట్విస్టు..?
అహ్మదాబాద్: గుజరాత్లో ఆదానీకి చెందిన ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. విపక్షాల ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ నేత ఆదానీతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇందులో అభ్యంతరం ఏముంటుంది? అదానీ శరద్ పవర్ మంచి స్నేహితులని అన్నారు. జయంత్ పాటిల్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఇండియా కూటమి అన్ని సమావేశాలకు శరద్ పవర్ హాజరయ్యారు. నిస్సందేహంగా కూటమిలో ఎన్సీపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఇక అదానీ శరద్ పవర్ ఇద్దరూ సన్నిహితులు. వారి మధ్య బంధం ఇప్పటిది కాదని అహ్మదబాద్లో ఆయన నిర్మించిన నూతన ఫ్యాక్టరీకి గౌరవ అతిధిగా ఆహ్వానించారు.పవార్ దానికి హాజరైతే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్సీపీ నేత శరద్ పవర్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఫోటోలతో పాటు శరద్ పవర్ రాస్తూ.. గుజరాత్ చంచార్వాడీ వాస్నాలో అదానీ గ్రూప్ నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ఎక్సిమ్ పవర్ ప్లాంటును ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానని రాశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఈ ఫోటోలు బయటకు రాగానే రాహుల్ గాంధీ శరద్ పవార్ మధ్య వైరం మరోసారి బట్టబయలైందని వ్యాఖ్యానించారు. It was a privilege to inaugurate India’s first Lactoferrin Plant Exympower in Vasna , Chacharwadi , Gujarat along with Mr. Gautam Adani pic.twitter.com/G5WH9FaO5f — Sharad Pawar (@PawarSpeaks) September 23, 2023 ఇది కూడా చదవండి: సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ -
మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్
ముంబై: కొద్దీ రోజుల క్రితం అధికార శివసేన-బీజేపీ పార్టీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన అజిత్ పవార్ ఇప్పటికీ మా పార్టీకి చెందిన వారేనన్నారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. ఆయన రాజకీయంగా మాతో విభేదించినంత మాత్రాన మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. కొల్హాపూర్ వెళ్లేముందు పూణే బారామతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తమ పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని తాము ఇప్పటికీ కలిసే ఉన్నామన్నారు. అజిత్ పవార్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై మేము అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశామని సభాపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. దీన్ని ఆధారం చేసుకుని మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా చెబుతారు? ఆయన ఇప్పటికీ మా పార్టీకి చెందినవారేనని అన్నారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో నాయకులు పార్టీ నుండి వేరైతే దాన్ని పార్టీలో చీలిక రావడమంటారు. మా పార్టీలో అలాంటిదేమీ జరగలేదు కదా. కొంతమంది మా పార్టీని విడిచి వెళ్లారు. మరికొంతమంది రాజకీయంగా మాతో విభేదించారు. ప్రజాస్వామ్యంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అందరికీ ఉంటుందన్నారు. నేను సర్వేలు ఇంకా అధ్యయనం చేయలేదు కానీ ఎన్సీపీ- శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కంటే మెరుగ్గా రాణిస్తుందని అన్నారు. శరద్ పవార్ కంటే ముందు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అని ఆయన ఇంకా మా పార్టీతోనే ఉన్నారని అన్నారు. ఇది కూడా చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు -
లక్షద్వీప్ ఎంపీకి ఎదురుదెబ్బ
ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్సీపీ లోక్సభ ఎంపీ మొహమ్మద్ ఫైజల్కుMohammed Faizal ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీం కోర్టు మంగళవారం పక్కనపెట్టేసింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ.. ఆరువారాల గడువు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో.. ఆ గడువులోగా(ఆరువారాల) లక్షద్వీప్ పరిపాలన విభాగం అప్పీల్ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో లోక్సభ ఎంపీని దోషిగా నిర్ధారించి, శిక్ష విధించడాన్ని సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానం తప్పు అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్సభ ఎంపీగా నెగ్గారు. అనర్హత వేటు.. ఎత్తివేత అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో.. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 (3) ప్రకారం.. జనవరి 13వ తేదీన లోక్సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. ఆ ఆదేశాలపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్సభ సెక్రటేరియట్కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేసినా.. చివరకు మార్చి 29వ తేదీన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోట్ విడుదల చేసింది. 35లో నలుగురు మాత్రమే.. ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ హైకోర్టు తెలిపింది. అయితే హైకోర్టు ఆదేశాలను లక్షద్వీప్ పరిపాలన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ‘‘ఫైజల్కు ఉపశమనం ఇవ్వడం.. న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తుంది’’ అని లక్షద్వీప్ రిపాలన విభాగం వాదనలు వినిపించింది. సాలిహ్పై ఉద్దేశపూర్వకంగానే ఫైజల్తో పాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని, ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా.. ఇద్దరు విచారణ సమయంలో మరణించారని లక్షద్వీప్ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా నిర్ధారించిన కవరత్తి కోర్టు.. పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. -
బీజేపీతో నడవాలని కోరుతున్నారు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకున్న ఎన్సీపీలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ చేరాలని కొంతమంది శ్రేయోభిలాషులు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఎన్సీపీ చేతులు కలిపే ప్రసక్తేలేదని పవార్ కుండబద్దలు కొట్టారు. అయితే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్ను కలవడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. కాగా, శరద్ పవార్ సోలాపూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్తో భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘అజిత్ నా సోదరుడి కుమారుడు. అతడిని కలవడంలో తప్పేముంది?. ఒక ఇంట్లోని సీనియర్ వ్యక్తి.. తన కుటుంబంలోని మరో వ్యక్తిని కలవాలని కోరుకుంటే.. దాంతో ఎటువంటి సమస్య ఉండకూడదు’ అని అన్నారు. ఇదే సమయంలో ఎన్సీపీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపారు. కానీ, మా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. బీజేపీతో కలవాలని కొందరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. మా పార్టీ బీజేపీతో ఎప్పటికీ జతకట్టదు. బీజేపీతో ఎలాంటి అనుబంధమైనా.. అది ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదు. ఈ విషయంపై ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఇది అందరికీ స్పష్టం చేస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఈ నెలాఖరున మహా వికాస్ అఘాడీ నేతృత్వంలో ఇండియా కూటమి ముంబైలో సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిని ఇరుకున పెట్టే విధంగా ఏదో ఒక మార్పు చేయాలని అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల జయంత్ పాటిల్ కూడా ఎన్డీయేలో కలిసిపోతారనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం.. -
సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్..
ముంబై: గురువారం ముంబైలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన సీటులో కూర్చోవడంతో ఆయన నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. ఈ వీడియో వైరల్ కావడంతో అజిత్ మనసులోని మాటను ఈ విధంగానైనా బయట పెట్టారంటున్నారు నెటిజనులు. మహారాష్ట్రలో ఎన్సీపీ తిరుగుబాటు చేసిన నాటినుండి మహారాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతి సీను క్లైమాక్సును తలపిస్తూ సాగుతున్న అక్కడి రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న కుతూహలంతో ఎదురు చూస్తున్నారు రాజకీయ ఔత్సాహికులు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పార్టీలో అధమస్థాయి ప్రాధాన్యతను తట్టుకోలేక తిరుగుబాటు పర్వానికి శ్రీకారం చుట్టి బీజేపీ- శివసేన సర్కారుకు జైకొట్టి అజిత్ పవార్ ఎలాగోలా డిప్యూటీ సీఎం కుర్చీ వరకు చేరుకోగలిగారు. తర్వాతి మెట్టు కోసం అజిత్ పవార్లో కోరిక లేకపోయినప్పటికీ ఆయన చేతల్లో మాత్రం ఆ కుతూహలం బయటపడుతుంటే రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో అజిత్ పవార్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు ఆయన మనసులో ఏముందో గానీ ఆయన ఏమి చేసినా కూడా అది అధికారం కోసమే అన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఉండడడం విశేషం. తాజాగా ఎమ్మెల్యే నివాసాల పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన నేరుగా వెళ్లి సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. అజిత్ రాకను గమనించి స్పీకర్ నర్వేకర్ కుర్చీకి అంటించి ఉన్న సీఎం పేరున్న స్టిక్కరును తొలగించారు. మొదట అజిత్ వేరే కుర్చీలో కూర్చున్నప్పటికీ సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ కుర్చీలో కూర్చోమని పక్కనున్నవారు అజిత్ ను ఆహ్వానించారు. ఇదే వేదికపై ఉన్న మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే ఈ సన్నివేశం జరగడం విశేషం. ఈ వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో మహాజోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఎన్సీపీ వర్గాలు అజిత్ పవార్ నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా -
ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?
ముంబై: పూణేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నించారు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అంటూ నిలదీశారు . పూణేలోని లోక్ మాన్య తిలక్ స్మారక మందిర్ వారు ప్రధానమంత్రి నరేద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ శివసేన(యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. మీరు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు. వాటికి కట్టుబడి మీ కార్యకర్తలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.. మీరేమో ఒకే వేదికపై స్నేహితుల్లా కలిసిపోతారంటూ ప్రధాని మోదీని, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఇద్దరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని చూస్తే ఎన్సీపీ పార్టీ నిండా అవినీతిపరులే ఉన్నారంటారు. మీరేమో నేను మరాఠాల ముఖచిత్రాన్ని.. మేము బీజేపీకి వ్యతిరేకమంటూ మాటలు చెబుతారు. మరి ఈ రోజు అవన్నీ ఏమైపోయాయి. ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారా? మీరు ప్రధాని అవార్డు కార్యక్రమానికి వెళ్తే మీ కార్యకర్తలను అనుమానించినట్లే. అధికారం కోసమో మరో కారణంతోనో మీకు వెన్నుపోటు పొడిచిన వారంతా అక్కడికి వస్తారు. వారందరినీ నవ్వుతూ పలకరిస్తే మీరు వాళ్ళు చేసినదానికి ఆమోదం తెలిపినట్లు కదా? దేశమంతా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు వెళ్లి ఆయన పంచన చేరడం న్యాయమేనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ లోక్ మాన్య తిలక్ "స్వరాజ్యం మా జన్మహక్కు" అన్నారు. మీరు దాన్ని కాస్తా "సొంత రాజ్యం మా హక్కు"గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం.. -
ఆగస్టు 25, 26న ‘ఇండియా’ కూటమి సమావేశం
న్యూఢిల్లీ: 26 పార్టిలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 25, 26న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఈ భేటీకి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(శరద్ పవార్) ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల తొలి సమావేశం బిహార్ రాజధాని పాటా్నలో, రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగే మూడో సమావేశంలో ప్రధానంగా సీట్ల పంపకంపై విపక్ష నాయకులు చర్చించనున్నట్లు సమాచారం. -
ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్ పవార్
అజిత్ పవార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్ ఎమ్మెల్యేలు.. ఆశ్చర్యకరరీతిలో ఎస్పీపీ చీఫ్ శరద్ పవార్ను కలిసి ఆశ్వీర్వాదం తీసుకోవడంతో మహా రాజకీయాలు మరేదైనా మలుపు తిరుగుతాయా? అనే ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. ఈలోపు ఆ సస్పెన్స్కు తెర దించారు శరద్ పవార్. ఎట్టి పరిస్థితుల్లో తాను బీజేపీకి మద్దతు ఇవ్వబోనని.. ప్రగతిశీల రాజకీయాలే తమ ఎజెండా అని స్పష్టం చేశారాయన. ఈ మేరకు ముంబై వైబీ చవన్ సెంటర్లో జరిగిన ఎన్సీపీ యువ కార్యకర్తల సమావేశాల ఆయన ఈ ప్రకటన చేశారు. జులై 2వ తేదీన షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వానికి అనూహ్యంగా మద్దతు ప్రకటించి.. ఎన్సీపీ సంక్షోభానికి తెర తీసింది అజిత్ పవార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్. అప్పటి నుంచి శరద్ పవార్ ఎన్సీపీ వర్సెస్ అజిత్ పవార్ ఎన్సీపీగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. సంక్షోభం మొదలైన రెండువారాల తర్వాత హఠాత్తుగా ఆదివారం రెబల్ గ్రూప్, శరద్పవార్ను కలిసింది. చాలాసేపు భేటీ తర్వాత తాము పవార్ ఆశీస్సుల కోసం వచ్చామని.. జరిగింది మరిచిపోయి తమతో పొత్తు దిశగా అడుగువేయమని కోరామని రెబల్ గ్రూప్ మీడియాకు వివరించింది. అయితే ఆ భేటీలో తన స్పందన తెలపని శరద్ పవార్.. ఆ తర్వాత యువ కార్యకర్తల సమావేశంలో మాత్రం తన అభిప్రాయాన్ని ఖుల్లాగా వ్యక్తం చేశారు. విపక్ష సమావేశానికి గైర్హాజరు ఇదిలా ఉంటే.. బెంగళూరు వేదికగా జరగబోయే విపక్షాల సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పవార్ స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే హజరు కానున్నారు. అయితే రెండవ రోజు అంటే రేపు మంగళవారం జరగబోయే భేటీకి మాత్రం పవార్ హాజరు కావొచ్చని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 24 పార్టీలు ఈ కూటమి భేటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. -
మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు షాకిస్తూ అజిత్ పవార్.. అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే టీమ్లో చేరిపోయారు. అనంతరం.. అజిత్ పవార్ను డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణస్వీకారం చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనల వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా మహారాష్ట్రలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేతలు ముంబైలో శరద్ పవార్ను కలిశారు. అయితే, శరద్ పవార్ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. ఇక, వీరంతా తిరుగుబాటు చేసిన శరద్ పవార్ను కలవడం ఇదే తొలిసారి. కాగా, పవార్ను కలిసిన అనంతరం ఎన్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. శరద్పవార్ ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ను కోరినట్టు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై ఆయనేమీ స్పందించలేదని వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. అంతకుముందు శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య మాటల వార్ చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తమనే అసలైన ఎన్సీపీగా గుర్తించాలంటూ అజిత్ వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. అటు తానే ఎన్సీపీ చీఫ్ అంటూ శరద్ పవార్ స్పష్టం చేశారు. #WATCH | We all came here to seek the blessings of respected Sharad Pawar today. We requested Pawar sahib that NCP should stay united. On this, Sharad Pawar did not give any reaction: Praful Patel, Ajit Pawar faction leader, at Mumbai's YB Chavan Centre pic.twitter.com/lvgXV2AZdy — ANI (@ANI) July 16, 2023 ఇది కూడా చదవండి: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్బీస్పీ.. -
ఆర్థిక శాఖ.. ఫడ్నవీస్ చేతి నుంచి అజిత్ పవార్కు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రెబల్ నేత, అజిత్ పవార్ చేతికి వెళ్లింది. మహారాష్ట్ర మంత్రివర్గంలో జూలై 2న చేరిన (ఎన్నీపీ) ఎమ్మెల్యేలకు శుక్రవారం నాడు శాఖల కేటాయింపు జరిగింది. ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ కీలకమైన ఆర్థిక శాఖను సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పటివరకూ ఆర్థికశాఖ బాధ్యతలు కూడా ఫడ్నవీస్ వద్దనే ఉంది. అయితే ఆర్థికశాఖపై కన్నేసిన అజిత్ పవార్ పంతం పట్టీ మరీ ఈ శాఖను దక్కించుకున్నారు. ఈ బాధ్యతల్ని వెంటనే ఆయన స్వీకరించారు. బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నారు. తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్కు ఆహార, పౌర సరఫరాల శాఖ అప్పగించారు. అనిల్ పటేల్కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ కేటాయించారు. అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు. ముఖ్యమైన పోర్ట్పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు బుజ్జగించాయి. చదవండి: సుఖేష్ సంచలన ఆరోపణలపై కేటీఆర్ రియాక్షన్.. వాడెవడో కూడా తెలీదంటూ.. -
మహా కిరికిరి.. ఫడ్నవిస్ సీటుకే ఎసరు పెట్టి..
ముంబై: సంక్షోభ రాజకీయాలకు నెలవైన మహారాష్ట్రలో ముక్కోణపు పార్టీ అధికార కూటమి.. చీలికలకు గురికాకుండా జాగ్రత్త పడుతోంది. అదే సమయంలో బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన ఎన్సీపీ(రెబల్) నేత అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్లో గ్రాండ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. ఎన్సీపీ నేత, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేతికి వెళ్లనుంది. ముఖ్యమైన పోర్ట్పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో షిండే కూటమి(శివసేన)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్.. పోర్టుపోలియోల కేటాయింపులో బెట్టు ప్రదర్శిస్తూ వచ్చారు. కీలకమైన ఆర్థికంతో పాటు ప్రణాళిక మంత్రిత్వ శాఖల్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగా వ్యతిరేకించారు కూడా. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానాన్ని నేరుగా కలవకుండా.. ఎన్సీపీ(రెబల్) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ద్వారా హస్తిన నేతలతో చర్చలు నడిపించారు అజిత్ పవార్. ఫలితంగా.. మంత్రివర్గ విస్తరణ ఆసల్యం అవుతూ వచ్చింది. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా సాగిన చర్చల్లో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ప్రఫుల్ పటేల్ సమస్య పరిష్కారం అయ్యిందంటూ ప్రకటించడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో పోర్ట్పోలియోల కేటాయింపు జరగవచ్చని తెలుస్తోంది. ఇక జులై 18వ తేదీన ప్రధాని మోదీని తాము కలవబోతున్నామని.. ఎన్డీయే సమావేశానికి తమకూ ఆహ్వానం అందిందని ప్రఫుల్ పటేల్ తెలిపారు. జులై 17 నుంచి ఆగస్టు 4వ తేదీల నడుమ మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి సమావేశాలు ఎన్సీపీ సంక్షోభంపైనా హీటెక్కే అవకాశం లేకపోలేదు. అంచేత సమావేశాల కంటే ముందే కేబినెట్ విస్తరణ కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. -
మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా?
ముంబై: మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు బృందం నుండి మంత్రి వర్గంలో కొత్తగా చేరిన అనిల్ భైడాస్ పాటిల్ సొంతూరు అమల్నెర్ తిరిగి వస్తున్న క్రమంలో ఆయనను స్వాగతించేందుకు స్కూలు పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా రెండు గంటల పాటు అమానుషంగా నిలబెట్టారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలోని ఒక వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ బృందంలో అనిల్ భైడాస్ పాటిల్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ మొదటిసారి ఆయన సొంతూరు అమల్నెర్ తిరిగొస్తున్న నేపథ్యంలో ఆయనను స్వాగతించడానికి స్థానిక ఆశ్రమశాల పాఠశాల పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టారు ఆ స్కూలు టీచర్లు. మంత్రి కాన్వాయ్ రావడం ఆలస్యం కావడంతో పిల్లలు అలాగే మంచినీళ్లు కూడా తాగడానికి లేనిచోట రెండు గంటలపాటు అలాగే కూర్చుని ఎదురుచూశారు. తీరా చూస్తే చాలాసేపు నిరీక్షణ తర్వాత వచ్చిన మంత్రి పిల్లలకు కనీసం అభివాదమైనా చేయకుండా వెళ్లిపోయారు. మంత్రి గారిని స్వాగతించడానికి పిల్లల్ని నిలబెట్టడమేమిటని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాటిల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల పట్ల మంత్రి తీరు అమానుషమని దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని తెలిపారు జల్గావ్ జిల్లా అధికారులు. ఇదిలా ఉండగా తనకోసం చేసిన ఈ ఏర్పాట్ల గురించి తనకసలు తెలియదని అనిల్ పాటిల్ అన్నారు. Ridiculous. Young school students made to sit on roadside for 2 hours to welcome newly sworn in NCP rebel minister Anil Patil, returning to his City Amalner in Maharashtra. pic.twitter.com/413bOMFQhd — Nasreen Ebrahim (@EbrahimNasreen) July 9, 2023 ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్ -
పార్టీ ఫిరాయింపులను చట్టాలు నిరోధించలేవు!
రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పుడూ ఒక పద్ధతిని అనుస రిస్తాయి. వర్గ విభేదాలు బహిరంగంగా మారిన తర్వాత, ప్రతి ఒక్క పక్షం కూడా పార్టీపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తుంది. మొదటగా, రెండు గ్రూపులూ తమతమ కార్యకర్తలను నియమిస్తాయి, పార్టీ స్థానాల నుండి ప్రత్యర్థులను తొలగిస్తాయి. అప్పుడు, రెండు వైపులా ప్రత్యర్థి సమూహానికి చెందిన చట్టసభ సభ్యుల సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభిస్తాయి. చివరగా, పార్టీపై నియంత్రణను చేజిక్కించుకోవడానికి చట్టపరమైన తగాదాలు ప్రారంభమవుతాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పార్టీ గుర్తు, దాని పేరు ఏ వర్గాని దన్న సంగతి నిర్ణయిస్తుంది. అనర్హత నిర్ణయించే క్రమంలో తెలుసుకున్న సమాచారం మేరకు శాసనసభ ప్రిసైడింగ్ అధికారి (స్పీకర్) ప్రతి వర్గానికి చెందిన చట్ట సభ సభ్యుల బలం ఎంతో నిర్ణయిస్తారు. ప్రతి దశలో, ప్రతి గ్రూపునకు చెందిన సంఖ్యా బలం, పార్టీ రాజ్యాంగం ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి. మహారాష్ట్రను చుట్టుముట్టిన రాజకీయ నాటకంలో, శరద్ పవార్, అజిత్ పవార్ల నుండి మొదటి రెండు దశలు అంటే... టిట్–ఫర్–టాట్ తొలగింపులు, అనర్హతా పిటిషన్ల ధాఖలు చేయడం ఇప్పటికే పూర్తయ్యాయి. మూడవ దశ ప్రారంభం కావడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఎన్సీపీకి శాసనసభలో 53 మంది, శాసనమండలిలో తొమ్మిది మంది, లోక్సభలో ఐదుగురు, రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఎవరి వర్గంలో గణనీయమైన సంఖ్యలో నాయకులు ఉన్నారనే విషయం తెలియడంలేదు. ఇది కీలకమైనది. శివసేన కేసులో, ఎన్నికల చిహ్నాలపై, ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఈసీఐ, స్పీకర్ ఇద్దరూ శాసనసభలో, పార్టీ సంస్థాగత విభాగాలలో వర్గ బలాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. సుప్రీంకోర్టు నొక్కిచెప్పిన రెండో అంశం పార్టీ రాజ్యాంగం. ఎన్సీపీ రాజ్యాంగం ఒక వివరణాత్మక పత్రం. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నియామకం, వారి పాత్ర, క్రమ శిక్షణా చర్యల ప్రక్రియను నిర్దేశిస్తోంది. చివరి నుంచి రెండో నిబంధన పార్టీని రద్దు చేయడం లేదా మరొక సంస్థలో విలీనం చేసే ప్రక్రియను తెలియజేస్తోంది. ఈ అంశంపై పార్టీ జాతీయ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని అది పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సమావేశానికి నెల రోజుల ముందు నోటీస్ ఇస్తారు. కోరమ్, కమిటీలోని ఎన్నుకోబడిన సభ్యులలో 75 శాతం అని కూడా ఈ పత్రం నిర్దేశిస్తోంది. పార్టీని రద్దు చేయ డానికి లేదా విలీనం చేయడానికి 90 శాతం మంది అంగీకరించాలి. మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ ప్రారంభించినప్పుడు, ఆయన ముందు ఈ పత్రం ఉంటుంది. గత సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న సేన పిటి షన్లతోపాటు రెండు ఎన్సీపీ వర్గాల ఫిరాయింపు అభ్యర్థనలు 11 వరకు ఆయన ముందు ఉన్నాయి. ఎన్సీపీ సంక్షోభం ముదిరితే, సేన మాదిరిగానే, దాదాపు ఎన్సీపీ శాసనసభ్యులందరూ ఏదో ఒక వర్గం నుండి అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దాదాపు 100 మంది చట్టసభ సభ్యులు అంటే అసెంబ్లీ బలంలో మూడింట ఒక వంతు – ఫిరాయింపుల నిరో ధక చట్టంలో చిక్కుకునే పరిస్థితిని ఇది సృష్టించవచ్చు. దురదృష్టవశాత్తు, ఈ చట్టం తరచుగా పరిష్కారం కంటే సమస్యగానే ఉంటోంది. శాసనసభ అమాయకత్వం లేదా రాజకీయ వంచన 1985లో ఈ చట్టం ఆమోదం పొందడానికి దారి తీసింది. ఒక రాజకీయ పార్టీ టిక్కెట్పై ఎన్నికైన చట్టసభ సభ్యులు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించినా లేదా ఓటు వేసినా రెండు మినహాయింపులతో తమ స్థానాన్ని కోల్పోతారని ఇది పేర్కొంది. మొదటి మినహాయింపు ఏమిటంటే, చట్టసభ సభ్యులలో మూడింట ఒక వంతు మంది పార్టీ నుండి విడిపోతే, దానిని ఫిరాయింపుగా పేర్కొనరు. ఈ నిబంధన ప్రభుత్వాలను పడగొట్టడానికి విస్తృతంగా ఉపయోగపడింది. చివరికి 2003లో పార్లమెంటు దానిని తొలగించింది. రెండవ మినహాయింపు – విలీన నిబంధన అని పిలవబడేది – ఒక రాజకీయ పార్టీ మరొక దానితో విలీనం అయితే, విలీనంలో భాగమైన చట్టసభ సభ్యు లను అనర్హులుగా ప్రకటించరు. పైగా పార్టీ శాసనసభ్యులలో మూడింట రెండొంతుల మంది అంగీకరించినట్లయితే అటు వంటి విలీనం జరిగినట్లు పరిగణిస్తారు. దీన్ని యథాతథంగా తీసుకుంటే, ఒక రాజకీయ పార్టీని మరొక దానితో విలీనం చేయడానికి కావాల్సిందల్లా దాని శాసన సభ్యులలో మూడింట రెండు వంతుల మందిని ఒప్పించడమే. ఉదాహరణకు, 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత, 10 మంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యారు. ఫలితంగా ఇంతకుముందు ఒక్క సభ్యుడు కూడా లేని బీజేపీ ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే పార్టీ ఫిరాయింపులను నిరోధించే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అర్థం చేసు కోవాలని సుప్రీం కోర్ట్ శివసేన కేసు విషయంలో భావించింది. పార్టీకి చెందిన చట్ట సభలకు ఎన్నికైన సభ్యులలో మూడింట రెండు వంతుల మంది విలీనం కావడానికి ముందు... ఆ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు, సభ్యులు విలీనం అవ్వాలి. అప్పుడే ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అయినట్లు పరిగణిస్తారు. విలీనాన్ని నిర్థారించ వలసిన చట్ట సభ స్పీకర్ విలీనానికి ఎంత మంది పార్టీ కార్యకర్తలు అనుకూలంగా ఉన్నారో ఎలా తెలుసుకుంటారు? అందుకే 1999లో లా కమిషన్ విలీన నిబంధనను తొలగించాలని సిఫార్సు చేసింది. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఏనాడూ పని చేయలేదు. ఉదాహరణకు, సేన ఫిరాయింపు కేసు గత ఏడాది జూన్లో ప్రారంభమైంది, కానీ ఎక్కడా అది ముగింపునకు రాలేదు. ప్రస్తుత ఎన్సీపీ ఫిరాయింపు పిటిషన్లకు కూడా ఒక సంవత్సరం పట్టవచ్చు. అప్పటికి ఎన్నికలు సమీపిస్తాయి. దీంతో అప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా–కనీసం రాజకీయంగా చూసినా నిష్ఫలమైనట్లే. రాజ్యాంగంలో కొన్ని చట్టపరమైన నిబంధనలను చేర్చినంత మాత్రాన రాజకీయ నైతికతను సాధించలేమని మనం గ్రహించాల్సిన సమయం ఇది. ఫిరాయింపుల సమస్యను ఎప్ప టికైనా పరిష్కరిస్తుందనే ఆశతో అంటిపెట్టుకోకుండా ‘ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని పూర్తిగా తొలగించడం మంచిది. ఫిరా యింపులు రాజకీయ సమస్యలు, వాటికి రాజకీయ పరిష్కారాలు అవసరం. ఈ విషయంలో చట్టం పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తుంది. చక్షు రాయ్ వ్యాసకర్త లెజిస్లేటివ్, సివిక్ ఎంగేజ్మెంట్ హెడ్,పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
నాకు చెప్పడానికి నువ్వు ఎవరు.. అజిత్కు శరద్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్
ముంబై: మహారాష్ట్ర పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఎన్సీపీకి షాకిస్తూ అజిత్ పవార్.. షిండే వర్గంలో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో షిండే సర్కార్ అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం కుర్చీని ఇచ్చింది. ఈ క్రమంలో అజిత్ పవార్కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా పవార్ మాట్లాడుతూ.. తాను అలసిపోనని, రిటైర్ కానని.. కార్యకర్తలు తనను పని చేయాలని కోరుకుంటున్నారని అజిత్కు కౌంటర్ ఇచ్చారు. మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి లేదా మంత్రి కావాలని లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేశారు. తనకు పనిచేసే శక్తి ఉందని చెప్పుకొచ్చారు. నేను అలసిపోను... రిటైర్ కూడా కాను.. అని అటల్ బిహారీ వాజపేయి మాటలను పవార్ గుర్తు చేశారు. తనను రిటైర్ కావాలని చెప్పడానికి అజిత్ ఎవరు? అంటూ ఫైరయ్యారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఆధిత్య ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ.. సీఎం ఏక్నాథ్ షిండే టార్గెట్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను బీజేపీ హైకమాండ్ కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో, ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఇక, అజిత్ పవార్.. షిండే కేబినెట్లో చేరినప్పటి నుంచి మహారాష్ట్రలో సీఎం మార్పు తథ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది కూడా చదవండి: పొలం బాట పట్టి.. రైతులతో రాహుల్ గాంధీ ములాఖత్ -
Maharashtra political crisis: పవార్ X పవార్
మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో పోరు ముదురుతోంది. ఎన్సీపీ ఎవరిది? శరద్ పవార్దా? అజిత్ పవార్దా? ఎవరికి వారే పార్టీ తమదేనని వాదిస్తున్నారు. చిన్నాన్నపై ఎదురు తిరిగి అధికార బీజేపీ కూటమితో కలిసిపోయిన అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక పార్టీ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ను తొలగించామని తమదే అసలైన ఎన్సీపీ అంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం తమకే కేటాయించాలని ఆ లేఖలో కోరారు. ఆ మర్నాడే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన శరద్ పవార్ తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఇలా ఇరు వర్గాలు పోటాపోటీగా బలప్రదర్శన కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తూ మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచాయి. పారీ్టల్లో చీలికలు, ఏది అసలు సిసలు పార్టీ అన్న ప్రశ్నలు కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తేం కాదు. ఇదే ఏడాది మహారాష్ట్రలో శివసేనలో చీలికలు ఏర్పడినప్పుడు ఏక్నాథ్ షిండే చీలిక వర్గానికే విల్లు బాణాలు గుర్తుని కేటాయించి అదే అసలైన శివసేన అంటూ ఈసీ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎన్సీపీ వంతు వచి్చంది. ఎవరి బలాలు ఏంటి? మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకున్న 53 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతానికి 32 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారు. ఆ సంఖ్య 36కి చేరుకుంటే ఎలాంటి అనర్హత వేటు లేకుండా అధికార పక్షంలో కలిసిపోవచ్చు. ఇక ఎన్నికల గుర్తు రావాలన్నా మెజారీ్టయే కీలకం. అజిత్ పవార్ నాలుగు దశాబ్దాలుగా ఎన్సీపీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు పట్టు ఉంది. ఎంతో మంది కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకుల మద్దతు అజిత్ పవార్కు ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన బలం మరింత పెరిగే అవకాశాలున్నాయి. అయితే పవార్కు ఇలా పార్టీని వీడడం కొత్త కాదు. గతంలో పలు మార్లు బయటకు వచ్చి తిరిగి శరద్ పవార్కే జై కొట్టిన సందర్భాలున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు ఆయనను ఎంతవరకు నమ్ముతారన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే వర్గం)తో కలిసి పోటీ చేస్తే టికెట్లు ఎంతమందికి వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్డీయేతో కలిస్తే ముస్లిం, దళిత ఓట్లు పోగొట్టుకుంటామన్న ఆందోళన కూడా చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే ఆఖరి నిమిషంలో ఎంతమంది అజిత్ పవార్ వెంట నడుస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇక మహారాష్ట్ర దిగ్గజ నాయకుడిగా శరద్ పవార్కున్న పాపులారిటీయే వేరు. గత కొన్ని దశాబ్దాలుగా గౌరవప్రదమైన రాజకీయ నాయకుడిగా హోదా అనుభవిస్తున్నారు. ఆయన కనుసైగ చేస్తే చాలు ఎలాంటి పనినైనా చక్కపెట్టగల అనుచరగణం ఉంది. 82 ఏళ్ల శరద్ పవార్కు ఆయన వయసే ప్రతిబంధకంగా మారింది. మెజారీ్టయే శిరోధార్యం ఏ పారీ్టలోనైనా మెజార్టీ ఎమ్మెల్యేలు, పార్టీలో జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అత్యధికులు ఎవరివైపు ఉంటే వారిదే అసలైన పార్టీ అని ఈసీ తేలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు నిర్వహించి పార్టీని స్థాపించిన వారు కాకుండా మెజార్టీ ఎవరి వైపు ఉంటే వారికే పారీ్టని, గుర్తుని కేటాయిస్తుంది. 1968లో ఎన్నికల గుర్తుకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులున్నాయి. ఈ ఉత్తర్వుల కింద మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పారీ్టలో చీలికల కేసుని పరిష్కరించారు.1969లో కె.కామరాజ్, నీలం సంజీవరెడ్డి, ఎస్. నిజలింగప్ప, అత్యుల ఘోష్ వంటి నాయకులు ఒక్కటై ఇందిరాగాందీని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో పార్టీ రెండుగా విడిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో పాత కాంగ్రెస్కే అధికారిక గుర్తు కాడెద్దులు గుర్తు దక్కింది. 1968కి ముందు ఎన్నికల నిబంధనలు, 1961 కింద కార్యనిర్వాహక ఉత్తర్వుల జారీతో ఈసీ ఈ వివాదాన్ని పరిష్కరించేది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) చీలిక అతి పెద్దదిగా చెప్పుకోవాలి. సీపీఐ (మార్క్సిస్టు) వర్గం తమని ప్రత్యేక పారీ్టగా గుర్తించాలని కోరింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతుగా ఉన్నట్టుగా ఈసీకి లేఖ సమరి్పంచింది. ఏదేమైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరి వెంట ఎక్కువ మంది ఉంటే వారిదే అసలు సిసలు పారీ్టగా ఎన్నికల సంఘం గుర్తించడం ఆనవాయితీగా వస్తోంది. లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ? మహారాష్ట్ర ఎన్సీపీలో సంక్షోభం వచ్చే లోక్సభ ఎన్నికలపై పడే ప్రభావంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ వెనక ఉండి నడిపించినట్టు ఆరోపణలు వస్తున్న ఆపరేషన్ అజిత్ పవార్తో ఇప్పటికిప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే లాభమేమీ లేదు. ఇప్పటికే ఏక్నాథ్ షిండే సర్కార్ పూర్తి స్థాయి మెజారీ్టతో బలంగానే ఉంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొనే బీజేపీ అజిత్ పవార్ తిరుగుబాటును ప్రోత్సహించినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర, 48 ఎంపీ స్థానాలతో ఈ రాష్ట్రం పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత కీలకంగా ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి 41 లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. కానీ ఇప్పుడు ఎన్డీయేతో శివసేన లేకపోవడంతో ఆ పారీ్టలో చీలికలు తెచ్చి ఏక్నాథ్ షిండే వర్గాన్ని తమ వైపు లాక్కుంది. అయినప్పటికీ గత ఎన్నికల మాదిరిగా సీట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎన్సీపీని కూడా చీల్చడానికి ప్రయతి్నంచిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విపక్షాలను బలహీన పరచడమే కాకుండ ప్రజాకర్షణ బలంగా ఉన్న మరాఠా నాయకులైన ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వంటి వారి అండ బీజేపీ వైపు ఉంది. ఈ సారి కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గంతో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం చేతులు కలిపినప్పటికీ తమ వైపు ఉన్న నాయకులే బలంగా ఉన్నట్టుగా బీజేపీ నమ్ముతోంది. ఓ రకంగా మహారాష్ట్ర బీజేపీ చెయ్యి జారిపోకుండా కాపాడుకోవడానికే ఇదంతా చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీ సభ్యులు: 53 శరద్ పవార్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు:15 అజిత్ పవార్ సమావేశానికి హాజరైనవారు:32 ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఎమ్మెల్యేలు: 6 –సాక్షి, నేషనల్ డెస్క్ -
మహారాష్ట్రలో బీజేపీలో ట్విస్ట్.. పంకజా ముండే సంచలన కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక, పవార్ వర్గం బీజేపీ కూటమితో చేరడం పట్ల మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఎన్సీపీ నేతలను ఇప్పుడే పక్కనే కూర్చోబెట్టుకోవాలన్న కారణంగా తమ అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కతున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, పంకజ్ ముండే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవర్ వర్గం ప్రభుత్వంలో చేరడంపై చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అవినీతి ఆరోపణలున్న ఎన్సీపీ నేతలు ప్రభుత్వంలో చేరడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే తాను రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలపై సీరియస్ అయ్యారు. తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పంకజా ముండే ఖండించారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తాను కలిసినట్లు ప్రసారం చేసిన ఛానెల్పై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వదంతులు ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. బీజేపీ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడం వల్లనే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై బీజేపీ హైకమాండ్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ సిద్ధాంతం తన రక్తంలో ఉందన్నారు. సిద్ధాంతాల విషయంలో రాజీపడాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నానని సంచలన కామెంట్స్ చేశారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, అయినా తన నీతిని ప్రశ్నిస్తున్నారని, పుకార్లు పుట్టిస్తున్నారని పంకజా ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయాలపై గడ్కరీ అదిరిపోయే సెటైరికల్ పంచ్ -
NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు
ముంబై: ఎన్సీపీని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోనని.. తిరుగుబాటుతో కుదేలు అయిన పార్టీని పునర్నిర్మించి తీరతానని తోటి నేతలతో శరద్ పవార్ మరోమారు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో తన నివాసంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ చీలిక సంక్షోభం, భవిష్యత్ ప్రణాళిక గురించి పార్టీ నేతలతో చర్చించిన ఆయన.. తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని, ఇకపైనా పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. వయసు 82 అయితే ఏంటి.. 92 అయితే ఏంటి.. ఈ వయసులోనూ నేను ఇప్పటికీ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నా. పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నా కదా అంటూ పవార్ సమావేశం అనంతరం మీడియా వద్ద ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షుడిని నేనే. పార్టీలో చీలిక తదితర పరిణామాల గురించి నేరుగా ఈసీ వద్దే తేల్చుకుంటామని చెప్పారాయన. ‘‘ కొందరు తామే అసలైన ఎన్సీపీ నేతలమని.. పార్టీ అధినేత తానేనని చెప్పుకుంటున్నారు. ఎవరో ఏదో వాగుతున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఆరోగ్యంగానే ఉండి.. పని చేస్తున్నా. ఇక మీదట అధ్యక్ష పదవిలోనూ నేను ఉంటా. వయసు ఎంత మీద పడినా సరే.. పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటా. ఏం చెప్పాలనుకున్నా మనం ఎన్నికల సంఘం ముందే చెబుదాం. ఎవరికో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదూ అంటూ తోటి నేతలతో సమావేశంలో చెప్పారాయన. Meeting of @NCPspeaks was held at the Delhi residence of National President Hon'ble Sharad Pawar Saheb. Party Working committee members, Mp's, leaders and office bearers attended this meeting to discuss important strategies and chart the course for future endeavors.@supriya_sule… pic.twitter.com/3mWpQEuIoO — Sharad Pawar (@PawarSpeaks) July 6, 2023 ఇదిలా ఉంటే.. శరద్ పవార్ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన కార్యవర్గ సమావేశం.. తిరుగుబాటు నేతలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో న్యాయపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే సమాలోచనలు చేస్తోంది. ఒక ఎన్సీపీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే అజిత్ పవార్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కీలక ప్రకటన చేసింది. శరద్ పవార్ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం చెల్లదని, అసలు అలాంటి భేటీ నిర్వహించేందుకు అధికారం.. అందులో నిర్ణయాలు తీసుకునేందుకు హక్కు లేదంటూ అజిత్పవార్ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. పవార్తో రాహుల్ భేటీ ఇదిలా ఉంటే.. ఎన్సీపీ కార్యవర్గ సమావేశం తర్వాత జన్పథ్లోని తన అధికార నివాసానికి శరద్ పవార్ చేరుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. పవార్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. పార్టీ చీలిక సంక్షోభంపై వీళ్లు చర్చించినట్లు సమాచారం. #WATCH | Congress leader Rahul Gandhi meets NCP President Sharad Pawar in Delhi pic.twitter.com/vU2DUZZMqH — ANI (@ANI) July 6, 2023 ఇదీ చదవండి: బీజేపీతో పొత్తు కోసం యత్నించింది శరద్ పవారే! -
అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి
న్యూఢిల్లీ: ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అజిత్ పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ ను వెన్నుపోటు పొడిచారని చెబుతూ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఎదుట కట్టప్ప బాహుబలిని చంపిన పోస్టర్లతో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి. ఎన్సీపీ విద్యార్థి విభాగమైన రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ నాయకులు గద్దర్(నమ్మకద్రోహి) అని పెద్దగా రాసి బాహుబలి సినిమాలో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడిచిన దృశ్యం ఉన్న పెద్ద పోస్టర్ ని నిలబెట్టారు. ఢిల్లీ కార్యాలయం ఎదుట అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లు ఉన్న పోస్టర్లన్నిటినీ తొలగించి వాటి స్థానంలో ఈ పోస్టర్లను, హోర్డింగులను ఏర్పాటు చేశారు. పోస్టర్ మీద "మనలోని దేశద్రోహులు ఎవరన్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వారిని క్షమించరు" అని పైన చిన్నగా రాసి పెద్దగా నమ్మకద్రోహి అని రాశారు. ఈ పోస్టర్లు, వాటిని ప్రతిష్టించిన వీడియోలు బయటకు రావడంతో ఎన్సీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించిన క్షణం నుండి మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ వచ్చాయి. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాలు ఎలక్షన్ కమిషన్ ముందు తమ బలాన్ని నిరూపించుకునే పనిలో ఉన్నాయి. #WATCH | Old posters and hoardings of NCP that showed Ajit Pawar and Praful Patel on them are being removed from outside the office of the party in Delhi. A new poster with 'Gaddaar' (traitor) written on it is being put up there. pic.twitter.com/CjLoQmI5u9 — ANI (@ANI) July 6, 2023 ఇది కూడా చదవండి: యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం -
మా నాన్నను అవమానిస్తే ఊరుకునేది లేదు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చిన అజిత్ పవార్ రాజకీయ నాయకుల వయసు ప్రస్తావన తీసుకొచ్చి వినూత్న వాదనకు తెరతీశారు. వయసు మీదపడ్డ శరద్ పవార్ ను తప్పుకుని కొత్తనీరుకి దారినివ్వాల్సిందిగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఘాటుగా సమాధానమిచ్చారు ఎన్సీపీ తిరుగుబాటు వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు మార్గదర్శకమని, 75 ఏళ్ళు దాటిన రాజకీయ నాయకులు రాజకీయాల్లో కొనసాగడం ఆ పార్టీలో ఉండదని చెబుతూ ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను ఉదహరించారు. ప్రస్తుతం మీ వయసు 83.. కాబట్టి ఇంక చాలు రిటైర్మెంట్ ప్రకటించండి.. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము మీ దీర్గాయుష్షును కోరుకుంటామని.. అలా చేయడం వలన కొత్త తరం కొత్త ఉత్సాహంతో పనిచేస్తుందని అన్నారు. #WATCH | Maharashtra Deputy CM Ajit Pawar says, "You portrayed me as a villain in front of everyone. I still have deep respect for him (Sharad Pawar)...But you tell me, IAS officers retire at 60...even in politics - BJP leaders retire at 75. You can see the example of LK Advani… pic.twitter.com/T2XqCzEH89 — ANI (@ANI) July 5, 2023 అజిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంపీ, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందిస్తూ.. ‘‘అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్ళు.. ఇప్పటికీ ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీకోపం మాపైనే కదా. కాబట్టి మమ్మల్ని తిట్టినా సహిస్తాం. కానీ మా నాన్నగారిని అమర్యాదగా మాట్లాడితే మాత్రం సహించబోమని అన్నారు. ఎదుటివారి వయసు పెరిగింది మమ్మల్ని ఆశీర్వదించమని అడిగే ముందు అసలెందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించుకోవాలి. రతన్ టాటా సాహెబ్ కంటే కేవలం మూడేళ్లే పెద్దవారు. అయినా దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడంలేదా అని అడిగారు. అవినీతిని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వంపైనే మా పోరాటం. అసలైన ఎన్సీపీ పార్టీ శరద్ పవార్ తోనే ఉందని మా గుర్తు మాతోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. #WATCH | "Disrespect us, but not our father (Sharad Pawar). This fight is against the BJP government. BJP is the most corrupt party in the country," says NCP Working President Supriya Sule, in Mumbai. pic.twitter.com/BxrUYpU6WI — ANI (@ANI) July 5, 2023 ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
‘83 ఏళ్లొచ్చాయ్.. ఇక రిటైర్ అవ్వండి’
రెబల్ ఎమ్మెల్యేలతో బుధవారం ర్యాలీ నిర్వహించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ అధినేత, సొంత బాబాయ్ శరద్ పవార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీకు 83 ఏళ్ల వయసొచ్చింది.. రిటైర్ అయిపోయి.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ వేదిక నుంచి ఎన్సీపీ సుప్రీంకు చురకలటించారాయన. అలాగే.. గతంలో బీజేపీతో జట్టు కట్టేందుకు శరద్ పవార్ ప్రయత్నించారని, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా పేరుతో డ్రామాలు ఆడారంటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన. ఉద్దవ్ థాక్రే వైఖరిపై అసంతృప్తితో ఏక్నాథ్ షిండే బీజేపీతో జట్టు కట్టే సమయంలో.. పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా బీజేపీ వైపే మొగ్గు చూపించారు. అంతేకాదు సంతకాల సేకరణ కూడా జరిగింది. మా వైఖరికి మద్దతు ప్రకటించాలని, లేకుంటే నియోజకవర్గాల్లో సమస్యలు వస్తాయని శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లాం. జయంత్ పాటిల్, నేను కలిసి ఈ మేరకు బీజేపీతో చర్చించేందుకు ముందుకు వచ్చాం కూడా. ఆ సమయంలో ఆయన(శరద్ పవార్ను ఉద్దేశించి) ఏం చేసినా మీడియా కంట పడకూడదని చెప్పారు. ఏదైనా ఉంటే బీజేపీ వాళ్లతో ఫోన్లో మాట్లాడమని సూచించారు. అప్పటికీ ఏక్నాథ్ షిండే ఇంకా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకు మాట మార్చారో తెలీదు 2019లో సమయంలోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీ ఐదుసార్లు బీజేపీతో భేటీ అయ్యిందని అజిత్ పవార్ అన్నారు. కానీ, ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా బీజేపీతో పొత్తు లేదని.. శివసేనతో ముందుకు వెళ్తున్నామని నాకు చెప్పారు. కారణం ఏంటో కూడా నాకు తెలియదు. శరద్ పవార్ వెంట ఇప్పుడున్న వాళ్లు.. 2017లో శివసేనను కులపిచ్చి పార్టీ అన్నారు. కానీ, 2019లో వాళ్లతోనే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అలాంటిది ఇప్పుడు నన్నెందుకు విలన్ను చేస్తున్నారో అర్థం కావడం లేదు. అయినా మీరంటే నాకు గౌరవం ఉంది అంటూ శరద్ పవార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అజిత్ పవార్. #WATCH | Maharashtra Deputy CM Ajit Pawar says, "You portrayed me as a villain in front of everyone. I still have deep respect for him (Sharad Pawar)...But you tell me, IAS officers retire at 60...even in politics - BJP leaders retire at 75. You can see the example of LK Advani… pic.twitter.com/T2XqCzEH89 — ANI (@ANI) July 5, 2023 ఆ డ్రామా ఎందుకు? ఒక ఐఏఎస్ అధికారి 60 ఏళ్లకు రిటైర్ అవుతాడు. ఇతర పార్టీల్లో నేతలకు రిటైర్మెంట్ వయసు ఉంటుంది. బీజేపీనే అందుకు ఉదాహరణగా తీసుకోండి. 75 ఏళ్లు రాగానే అద్వానీ, మురళి మనోహర్ జోషి లాంటి వాళ్లు పక్కకు తప్పుకున్నారు. అప్పుడే కదా కొత్త తరానికి అవకాశం దొరికేది. మరి ఎన్సీపీలో కొత్తవాళ్లకు అవకాశం ఉండదా?. మేం ఏమైనా తప్పు చేసి ఉంటే.. మాకు చెప్పండి సరిదిద్దుకుంటాం. మీ వయసు ఇప్పుడు 83 ఏళ్లు. ఇక రిటైర్ అవ్వారా? మాకు మీ ఆశీస్సులు ఇవ్వరా?.. మేం మీరు ఆయురారోగ్యాలో ఉండాలని ప్రార్థిస్తున్నాం అంటూ బాబాయ్ శరద్ పవార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. తాజాగా శరద్ పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం.. వెంటనే వెనక్కి తీసుకున్న వ్యవహారంపైనా అజిత్ పవార్ సెటైర్లు వేశారు. ఆ సమయంలో ఆయన సుప్రియా సూలేను జాతీయ అధ్యక్షురాలిగా ప్రకటించాలనుకున్నారు. అది మాకు అర్థమైంది. దానికి మేం సిద్ధంగా ఉన్నాం కూడా. వెనక్కి తీసుకునే ఉద్దేశమే ఉంటే రాజీనామా చేయడం ఎందుకని నిలదీశారాయన. ఇక తన సోదరి, ఎంపీ సుప్రియా సూలేకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పజెప్పడంపైనా అజిత్ పవార్ పరోక్షంగా స్పందించారు. పవర్ఫుల్ ఫ్యామిలీలో పుట్టకపోవడం మా తప్పా? అంటూ వ్యాఖ్యానించారాయన. ఏదో ఒక రోజు సీఎం అవ్వాలని.. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మనసులో మాట బయటపెట్టారు. ఏదోఒకరోజు మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవ్వాలన్నదే తన కోరికని.. అది నెరవేర్చుకుని తీరతానని అన్నారాయన. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో 40 మందితో పాటు ఎమ్మెల్సీల మద్దతు కూడా తనకు ఉందని అంటున్నారాయన. ఇదిలా ఉంటే.. ఎన్సీపీ సంక్షోభం కేంద్ర ఎన్నికల సంఘాన్ని చేరింది. శరద్ పవార్ తానే ఎన్సీపీని నడిపిస్తానని చెబుతుండగా.. అజితపవార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్ మాత్రం పార్టీ పేరు, గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిచింది. మరోవైపు శరద్ పవార్ వర్గం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు లేఖ రాసింది. -
మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్పై సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని ఎన్సీపీ చీలికపై.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంక్షోభాలకు శరద్ పవార్ ఆద్యుడని ఆరోపించిన రాజ్ థాక్రే.. తాజా పరిణామాలకు కూడా శరద్ పవారే కారణమంటూ పేర్కొన్నారు. మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాక్రే బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ సంక్షోభం శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారాయన. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అసహ్యమైన రాజకీయం. ఇది ముమ్మాటికీ ఓటర్లను అవమానించడమే అని తీవ్రంగా స్పందించారాయన. అసలు మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు మొదలుపట్టిందే శరద్ పవార్. 1978లో పులోద్(పురోగామి లోక్షాహీ దళ్) పేరుతో చీలిక రాజకీయాలను ప్రదర్శించారు. అప్పటిదాకా మరాఠా రాజకీయం అలాంటి పరిణామాలను చూడలేదు. ఇలాంటివి పవార్తోనే మొదలై.. ఆయనతోనే ముగిసేలా కనిపిస్తున్నాయి. కర్మ ఫలితాన్ని ఆయన అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన చేజేతులారా చేసుకున్నదే అని రాజ్ థాక్రే విమర్శించారు. అలాగే.. ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛాగన్ భుజ్బల్లు అజిత్ పవార్ వెంట వెళ్లే వ్యక్తులు ఏమాత్రం కాదని.. వాళ్లకు కచ్చితంగా శరద్ పవార్ అండదండలు ఉంటాయని ఆరోపించారాయన. ఆనాడు ఏం జరిగిందంటే.. 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. జనతా పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్(ఐ), యశ్వంత్రావు చవాన్ నేతృత్వంలో కాంగ్రెస్(యూ)గా ముందుకు వెళ్లాయి. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి సీఎం శంకర్రావ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో వసంత్దాదా పాటిల్ సీఎం అయ్యారు. అయితే.. శరద్ పవార్ అప్పటి పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. తన రాజకీయ గురువైన యశ్వంత్రావు చవాన్ పంచన చేరి కాంగ్రెస్(యూ)లో కొనసాగారు. అయితే.. అధికారం కోసం కాంగ్రెస్(యూ) నుంచి విడిపోయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీని సొంతంగా ఏర్పాటు చేశాడు శరద్ పవార్. ఆపై జనతా పార్టీ, పీడబ్ల్యూపీలతో కలిసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి) లేదా పురోగామి లోక్షాహీ అగాఢి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 38 ఏళ్ల శరద్ పవార్ ప్రమాణ స్వీకారం చేయగా.. 1978 జులై 18 పీడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే.. ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రభుత్వం రద్దు అయ్యింది. అదే ఏడాదిలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తిరిగి అధికారం కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: శరద్ పవార్కు షాక్ -
అజిత్ పవార్కు చేదు అనుభవం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలికవర్గం నేత అజిత్ పవార్కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్రవాది భవన్ను పార్టీ వ్యవహారాల కోసం నూతన కార్యాలయంగా వాడుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజిత్ పవార్ వర్గం నేతలు మంగళవారం అక్కడికి వెళ్లగా తలుపులకు తాళంవేసి ఉండడంతో నిరాశ చెందారు. కొందరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ లోపలి గదులకు తాళాలు వేసి ఉండడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రవాది భవన్లో గతంలో మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన అంబదాస్ దన్వే నివసించారు. ప్రభుత్వం మరో భవనం కేటాయించడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాఉండగా, అసలైన ఎన్సీపీ తమదేనని అజిత్, శరద్ పవార్ వర్గాలు వాదిస్తున్నాయి. ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
రసకందాయంలో ఎన్సీపీ రగడ.. ఎత్తులు, పై ఎత్తులు
ముంబై/సతారా: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట (ఎన్సీపీ)పై ఆధిపత్యం కోసం అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అజిత్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ పవార్ వర్గం, శరద్ వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అజిత్ వర్గం పట్టుబడుతున్నాయి. శరద్ వర్గం నాయకులను పార్టీ పదవుల నుంచి అజిత్ వర్గం తొలగించింది. అసెంబ్లీలో ఎన్సీపీ పక్షనేతగా అజిత్ పవార్ నియమితులైనట్లు ఆయన వర్గం చెబుతోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్తోపాటు మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్సీపీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చడానికి తగిన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. శరద్ పవార్ వర్గం నేత జితేంత్ర అవద్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ మేరకు స్పీకర్కు విజ్ఞాపన అందించారు. ఇదిలా ఉండగా, అజిత్ పవార్తో సహా 9 మంది ఎమ్మెల్యేలకు శరద్ పవార్ వర్గం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఎన్సీపీతో వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఇక ఏ వేదికపైనా ఎన్సీపీ ప్రతినిధులుగా చెప్పుకోవద్దని వారికి తేల్చిచెప్పింది. పార్టీని ధిక్కరించి బయటకు వెళ్లిపోయిన వారు పార్టీ నేతలమని చెప్పుకోవడం చట్టవ్యతిరేకం అవుతుందని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయడానికి వీలుగా ఎన్సీపీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్సీపీ ఫిర్యాదు తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. పవార్కు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నదీ తనకు తెలియదన్నారు. పటేల్, తత్కారే బహిష్కరణ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, లోక్సభ సభ్యుడు సునీల్ తత్కారేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం తమ పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిపై ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. ఇక మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా లోక్సభ సభ్యుడు సునీల్ తత్కారేను నియమించినట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అసెంబ్లీలో ఎన్సీపీ పక్ష నేతగా అజిత్ వ్యవహరిస్తారని అన్నారు. గరిష్ట సంఖ్యలో ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ అన్నారు. అజిత్ కు బీజేపీ సీఎం పదవి ఎర: కాంగ్రెస్ అజిత్కు సీఎం పదవి కట్టబెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరుతారని ఎప్పుడో తెలుసు. 16 మంది సేన(షిండే) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి షిండేను సీఎం పదవి నుంచి దింపేస్తారు. అజిత్ను కూచోబెడతారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. శివసేన (ఉద్ధవ్) పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలోనూ ఇదే విషయం రాసింది. అజిత్ తిరుగుబాటు వెనుక నా ప్రమేయం లేదు: పవార్ తన ఆశీస్సులతోనే అజిత్ పవార్ తిరుగుబాటు చేశారంటూ వినిపిస్తున్న వాదనలను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఖండించారు. బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరడం వెనుక తన ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు. ఆయన సోమవారం సతారా జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ బలోపేతం కోసం ప్రజల్లోకి వెళ్తానని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. -
మరో ‘మహా’ నాటకం!
కొన్ని సన్నివేశాలు, సంఘటనలు మునుపెన్నడో చూసినట్టు, చిరపరిచితమైనట్టు అనిపిస్తుంటాయి. మహారాష్ట్రలో ఆదివారం నుంచి జరుగుతున్న పరిణామాలు, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ వర్గం మహారాష్ట్ర బీజేపీ సర్కార్లో చేరడం చూస్తే... సరిగ్గా ఏడాది క్రితం సంఘటనలే పునరావృతమవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో శివసేనను చీల్చిన ఏక్నాథ్ శిందే వ్యవహారం గుర్తొస్తుంది. ఇప్పుడు మనుషులు, పార్టీల పేర్లు మారాయి కానీ కథ మాత్రం మళ్ళీ అదే. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే సారథ్య శివసేన, ఇప్పుడు శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ. అక్కడ శిందే, ఇక్కడ అజిత్. కాకపోతే ఈసారి తెలివిగా ‘చీలిక’ అనకుండా, ఎన్సీపీగా తాము ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, మంత్రివర్గంలో చేరుతున్నామంటూ సాంకే తిక చిక్కులు లేకుండా చూసుకుంటున్నారు అజిత్. అంతే తేడా. మొత్తానికి గతంలో కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో లాగా మహారాష్ట్రలోనూ ప్రత్యర్థి పార్టీల్ని చీలికలు పేలికలు చేయడంలో బీజేపీ మరోసారి సఫలమైంది. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతా యత్నానికి గట్టి దెబ్బ కొట్టింది. శరద్ – ఆయన కుమార్తె సుప్రియ ఒకవైపు, అజిత్ వర్గం మరోవైపు నిలవడంతో ఎన్సీపీపై పట్టు కోసం పోరు మరిన్ని మలుపులు తీసుకోనుంది. గత 24 ఏళ్ళలో విడతలు విడతలుగా 17 ఏళ్ళు ఎన్సీపీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. మధ్యలో కొన్నేళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఏడాదిగా గద్దెపై లేదు. ఏళ్ళ తరబడి పవార్ కుటుంబాన్ని కలిపి ఉంచిన అధికార బంధం బలహీనమైంది. అధికారం రుచి మరిగిన అజిత్ దేనికైనా సిద్ధమయ్యారు. అన్న కొడుకులోని అధికార కాంక్షను గుర్తించిన శరద్ కొత్త వ్యూహాలతో చెక్ పెడుతూ వచ్చారు. నెల క్రితం కూడా పార్టీ పగ్గాలు వదిలేస్తున్నట్టు ప్రకటించి, తీరా కార్యకర్తల ఆకాంక్ష అంటూ మళ్ళీ మూడు రోజులకే వెనక్కి తగ్గి, కుమార్తెకు పెత్తనం కట్టబెట్టారు. అజిత్ను రాష్ట్రానికే పరిమితం చేస్తూ చాణక్య నీతి ప్రదర్శించారు. అజిత్కు అది మింగుడు పడలేదు. అదను చూసి, అనుచరులతో కలసి సొంత బాబాయ్ని వదిలేసి, కేంద్రంలో మోదీకి జై కొట్టారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ తమ వైపే ఉన్నారని అజిత్ అంటున్నా, అందుకు లిఖితపూర్వక సాక్ష్యమేమీ ఇప్పటికైతే లేదు. ‘మహారాష్ట్ర పురోభివృద్ధి కోసం, మోదీ సారథ్యంలో దేశ పురోగతి కోసం’ ...ఇలా శరద్ను వదిలిపెట్టి, పార్టీని చీల్చలేదంటూనే చీల్చిన అజిత్ తదితరులు బోలెడు మాటలు చెబుతున్నారు. కానీ, నాలుగేళ్ళలో ముగ్గురు వేర్వేరు సీఎంల హయాంలో మూడోసారి డిప్యూటీ సీఎం అయిన అజిత్ ఆకాంక్షలు బహిరంగ రహస్యం. పైగా, స్వయంగా అనేక భారీ కుంభ కోణాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అజిత్, ఆయన వర్గపు ఎమ్మెల్యేలు బీజేపీలో ఎందుకు చేరారో ఊహించడం కష్టమేమీ కాదు. వారంతా ఇక బీజేపీ వాషింగ్ మెషిన్తో స్వచ్ఛమైపోయినట్టే! రాజకీయ గూగ్లీలతో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించే శరద్ ఈసారి తానే క్లీన్ బౌల్డయ్యారు. ప్రఫుల్ పటేల్ తదితరులు విశ్వాసపాత్రులన్న నమ్మకం నట్టేట ముంచింది. 2019లోనే బీజేపీ వైపు వెళ్ళేందుకు అజిత్ విఫలయత్నం చేసినప్పుడే ముకుతాడు వేయాల్సిన శరద్ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఏకు మేకైంది. తాజా చీలిక కాని చీలికతో ఎవరిది అసలైన పార్టీ, ఎవరిది ఎన్నికల గుర్తన్నది సైతం వివాదాస్పదమే. మనుగడ కోసం 83వ ఏట ఈ మరాఠా యోధుడు ప్రజాక్షేత్రంలో మళ్ళీ పోరుకు దిగాలి. పదవుల్లోని ప్రత్యర్థులపై ఇరువర్గాల పోటాపోటీ వేటు పర్వం సాగుతోంది. ఎన్సీపీ వర్కింగ్ ఛీఫ్ ప్రఫుల్ పటేల్ను పదవి నుంచి, అజిత్ వర్గ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు శరద్ ప్రకటించారు. వచ్చే 3 నెలల్లో మహారాష్ట్రలో పెనుమార్పులు తప్పవంటున్నారు. ఆ మాటేమో కానీ అజిత్ వర్గాన్ని చేర్చుకోవడం వెనుక బీజేపీకి దాని లెక్కలు దానికున్నాయి. గత నెల సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో ఏక్నాథ్ శిందే సారథ్య శివసేన చీలిక ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పకపోవచ్చు. రేపు సాక్షాత్తూ సీఎం శిందే సహా పలువురు చీలిక వర్గపు శివసేన సభ్యులు అనర్హత పాలైనా, కొత్తగా చేరిన అజిత్ వర్గంతో మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ మనుగడకు ఢోకా ఉండదు. కానీ, బహిష్కరణల వేటుతో అజిత్ వర్గం ఎమ్మెల్యేలూ అనర్హత వేటు ఎదుర్కొనే ముప్పు లేకపోలేదు. పాలకపక్ష స్పీకర్ నాన్చకుండా, అంత నిర్ణయం తీసుకుంటారా అన్నది వేరే కథ. వెరసి, సంకీర్ణ రాజకీయాల రచ్చలో పూర్తిగా దెబ్బతిన్నది మహారాష్ట్రలో ప్రజాతీర్పు. అయితే, పార్టీ సంస్థాగత ప్రక్షాళన చేపట్టి, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దిగుతున్న కమలనాథుల గురి మొత్తం రాబోయే ఎన్నికలే. ఠాణేలో శిందే, మరాఠ్వాడాలో అజిత్లకు గట్టి పట్టుంది. బీజేపీకి పట్టు లేని ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ నేతలిద్దరూ ‘మిషన్ 2024’లో అక్కరకు వస్తారనేది లెక్క. అలాగే, శిందే రెక్కలు కత్తిరించడానికీ పక్కనే అజిత్ను కూర్చోబెట్టడం కమలనాథులకి పనికొస్తుంది. 2019 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసి, తీరా గెలిచాక పక్కకు వెళ్ళి అధికారాన్ని దూరం చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పైనా, అలాగే కీలకమైన ప్రతిసారీ ఖంగు తినిపించిన శరద్పవర్ ఎన్సీపీ పైనా బీజేపీ చివరకిలా ప్రతీకారం తీర్చుకుంది. ఎన్నికల కల్లా శిరోమణి అకాలీదళ్ లాంటి ఒకప్పటి మిత్ర పక్షాల్ని ఎన్డీఏలోకి తెచ్చుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇది సంతోష సందర్భం. ఆపసోపాలు పడుతున్న ప్రతిపక్ష ఐక్యతాయత్నానికి మహా కష్టం. ఎన్సీపీలో చీలిక సఫలమైతే బీజేపీకి లాభం. సఫలం కాకున్నా అజిత్కే తప్ప, దానికొచ్చిన నష్టమేమీ లేదు. ఇక బిహార్లోనూ ఇలాంటి ‘ఆపరేషన్’ సిద్ధమవుతోందని వార్త. ఏమైనా, అధికారం కోసం దేనికైనా సిద్ధమై, ప్రజాస్వామ్యాన్ని వట్టి నంబర్ల గేమ్గా మార్చేస్తున్న మన పార్టీల, నేతల నిస్సిగ్గు నగ్నత్వానికి ‘మహా’ నాటకం మరో ప్రతీక. -
శరద్ పవార్ కీలక నిర్ణయం.. తిరుగుబాటు చేసినవారిపై వేటు..
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి అగ్గి మీద గుగ్గిలమవుతూ వేగంగా పావులు కదుపుతున్నారు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్. ఇందులో భాగంగా అజిత్ పవార్ కు తిరుగుబాటులో సహకరించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ప్రఫుల్ పటేల్, సునీల్ తాత్కారేలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరి మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. తమతో ఉంటూనే తమకు వెన్నుపోటు పొడిచిన వారిని విడిచిపెట్టనని, పార్టీని పునర్నిర్మించుకుంటానని ఇదివరకే ప్రకటించిన శరద్ పవార్ కార్యాచరణ మొదలుపెట్టారు. మొదటిగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకున్న 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ నర్వేకర్ ను కోరారు. అనంతరం అజిత్ పవార్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన ముగ్గురు ఎన్సీపీ నేతలు నరేంద్ర రాథోడ్, విజయ్ దేశ్ ముఖ్, శివాజీరావు గార్జే లపై వేటు వేసిన పార్టీ శరద్ పవార్ ఇప్పుడు కీలక నేతలపై కొరడా ఝళిపించారు. జాతీయ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తాత్కారేల పార్టీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్లో రాస్తూ.. ఎన్సీపీ జాతీయాధ్యక్షుడిగా పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటూ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగాను శ్రీ సునీల్ తాత్కారే, ప్రఫుల్ పటేల్ లను పార్టీ నుండి తొలగిస్తున్నామని తెలిపారు. I, as the National President, Nationalist Congress Party hereby order removal of the names of Shri Sunil Tatkare and Shri Praful Patel from the Register of Members of NCP Party for anti-party activities.@praful_patel @SunilTatkare — Sharad Pawar (@PawarSpeaks) July 3, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
వారంతా అవినీతిపరులే.. కేసులు నుండి తప్పించుకోడానికే..
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ క్రీడా వెనుక అసలు సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లంతా అవినీతిపరులే.. వారిపై ఉన్న నేరాలను మాఫీ చేసినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు. అధికారం కోసం అర్రులు చాచి అజిత్ పవార్ చాలా పెద్ద తప్పు చేశారని, ఈ రహస్య ఒప్పందం మొత్తం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్. అజిత్ పవార్, ఛగన్ భుజబల్, హాసన్ ముష్రిఫ్ లతోపాటు మిగిలిన వారిపైన కూడా నేరారోపణలుండటంతో ప్రధాని వారిని బెదిరించి తమ వైపుకు తిప్పుకున్నారని వ్యాఖ్యానించారు. మా పార్టీ నుండి ఫిరాయింపుకు పాల్పడిన వారందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడినవారే. కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ అప్పట్లో భారీ ఎత్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కాక ఒక్కరోజు ముందు అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసులు ఎత్తివేసిందని శరద్ పవార్ తెలిపారు. ఆయనలాగే ఇరిగేషన్ స్కాములో అదితి తాత్కారే తండ్రి సునీల్ తాత్కారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడబ్ల్యుడి మంత్రిగా ఉన్నప్పుడు ఛగన్ భుజబల్ కూడా భారీస్థాయిలో మనీలాండరింగ్ చేసి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ఇక హాసన్ ముఫ్రి విషయానికి వస్తే తన సొంత కంపెనీ కోసం నిధులు మళ్లించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ మీమన్ అలియాస్ మిర్చితో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈడీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీళ్లంతా నేరస్తులు కాబట్టే ప్రధాని పని సులువైందని ఆరోపించారు ఎన్సీపీ అధినేత. మా పార్టీని విడిచి వెళ్లిన వారిని వదలబోమని పార్టీ విధానాలను అనుసరించి వారిపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్ -
Ajit Pawar: ఎన్సీపీలో చీలిక.. బీజేపీ వ్యతిరేక కూటమి యత్నాలకు దెబ్బ!
న్యూఢిల్లీ: ఎన్సీపీలో అనూహ్య చీలిక మహారాష్ట్రలోనేకాదు జాతీయ స్థాయిలో ప్రకంపనలు కలిగిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను అజిత్ తనవెంట తీసుకెళ్లడంతో శరద్ పవర్కు సొంత పార్టీలో బలం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతకు తనవంతు బలం ఇచ్చే స్థాయిలో శరద్ ప్రస్తుతం లేరనే చెప్పాలి. దీంతో గత నెలలో పట్నాలో 15 ప్రతిపక్ష పార్థీలల ఐక్యత కోసం చేసిన యత్నానికి జోరు కాస్తంత తగ్గింది. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రంలో పాలనపై సర్వాధికారం విషయంలో ఆర్డినెన్స్కు సంబంధించి ఆప్, కాంగ్రెస్ మధ్య పొసగలేదు. అటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య బాహాటంగా మాటల తూటాలు పేలాయి. కేరళలోనూ కాంగ్రెస్, సీపీఎంలకూ కుదరట్లేదు. తాజాగా అజిత్ ఇచ్చిన షాక్తో 2024 ఎన్నికల్లో బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఐక్యంగా ఢీకొట్టాలన్న ప్రయత్నాలకు కాస్తంత బ్రేక్ పడినట్లయింది. విపక్షాలను ఏకం చేయడంలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న శరద్ పవార్ మున్ముందు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి ఊపు మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దికాలంగా బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. షిండే ప్రభుత్వంలో చేరాలన్న అజిత్ నిర్ణయంతో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ కీలకంగా మారే సమయం వచ్చింది. లోక్సభ ఎన్నికల సమయానికి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలోని మూడు పార్టీలు మూడు శక్తివంతమైన వర్గాలకు నాయకత్వం సాధించే స్థాయిలో ఉన్నాయి. మహావికాస్ అఘాడి(ఎంవీఏ)పై బీజేపీ పైచేయి సాధించేందుకు అవకాశం చిక్కింది. -
Maharashtra political crisis: ‘మహా కుదుపు’.. నిలువునా చీలిన ఎన్సీపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. ఒక్కరోజులోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నిట్టనిలువునా చీలిపోయింది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ అధినేత శరద్ పవార్కు పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. కాగా, పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చిచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముంబై/పుణే/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్కు పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. అజిత్ పవార్తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విపక్ష నేత పదవికి అజిత్ రాజీనామా అజిత్ పవార్ తొలుత ముంబైలోని తన అధికారిక నివాసం ‘దేవగిరి’లో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో, కొందరు నాయకులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం శానససభలో ప్రతిపక్ష నేత పదవికి అజిత్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత అజిత్ తన ఎమ్మెల్యేలలో కలిసి రాజ్భవన్కు చేరుకొని, ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40 మంది తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే స్పష్టం చేశారు. అయితే, అజిత్ పవార్కు 36 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే చేరాం: అజిత్ æ దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో చేరామని అజిత్ చెప్పారు. ప్రభుత్వంలో చేరాలన్న నిర్ణయానికి పార్టీ ప్రజాప్రతినిధులందరూ మద్దతునిచ్చారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎన్సీపీ పేరుతో, ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తామని అన్నారు. పరిపాలనలో తమకు ఎంతో అనుభవం ఉందని, ప్రజలకు మేలు చేయడానికి ఈ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని వ్యాఖ్యానించారు. తనతోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మందికి త్వరలోనే శాఖలు కేటాయించనున్నట్లు అజిత్ వెల్లడించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉన్నారన్నారు. ప్రధాని∙మోదీ నాయకత్వంపై అజిత్‡ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇప్పుడు త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంగా మారిందని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో అభివృద్ధి ఇక వేగం పుంజుకుటుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీపీ ప్రకటించింది. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతగా పనిచేసిన అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జితేంద్రను నియమించినట్లు పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యేలంతా తాను చేసే విప్నకు కట్టుబడి ఉండాలని జితేంద్ర అవద్ పేర్కొన్నారు. బీజేపీ వాషింగ్ మెషీన్..: కాంగ్రెస్ మహారాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీ వాషింగ్ మెషిన్ మళ్లీ పని ప్రారంభించిందని అన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారని, ఇక వారందరికీ క్లీన్ చిట్ వస్తుందని చెప్పారు. బీజేపీ కబంధ హస్తాల నుంచి మహారాష్ట్రకు విముక్తి కలి్పంచడమే తమ లక్ష్యమని తెలిపారు. శరద్కు ఖర్గే, రాహుల్ గాంధీ మద్దతు ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. ఇద్దరు నేతలు పవార్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితి తెల్సుకున్నారు. పార్టీని ధిక్కరించినవారిపై చర్యలు తప్పవు: శరద్ పవార్ పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తేలి్చచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన ఆదివారం పుణేలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ఇలాంటివి చూడడం తనకు కొత్తేమీ కాదన్నారు. బీజేపీ–శివసేన ప్రభుత్వం చేరాలన్నది తమ పార్టీ నిర్ణయం ఎంతమాత్రం కాదన్నారు. కొందరు నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి ప్రభుత్వంలో చేరినట్లున్నారని అభిప్రాయపడ్డారు. ఇది తన ఇంటి సమస్య కాదని, ప్రజల సమస్య అని చెప్పారు. మద్దతు కోసం సోమవారం నుంచే ప్రజల్లోకి వెళ్తానని, పార్టీని పునర్నిరి్మస్తానని శదర్ పవార్ పేర్కొన్నారు. త్వరలో తమ పార్టీ నాయకులతో సమావేశమవుతానని, పార్టీకి సంబంధించిన నిర్ణయాలపై చర్చిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో త్వరలో జరిగే విపక్షాల సమావేశంలో తాను పాల్గొంటానని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా అస్థిరతే నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల తర్వాత ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే పట్టుబట్టగా బీజేపీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. దాంతో కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత బీజేపీకి అజిత్ అండగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం కేవలం 80 గంటలపాటు మనుగడ సాగించింది. ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్తో చేతులు కలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గత ఏడాది జూన్లో శివసేన నేత షిండే తిరుగుబాటు చేశారు. శివసేనలో చీలిక ఏర్పడింది. ఎంవీఏ ప్రభుత్వం కూలింది. బీజేపీతో మద్దతుతో షిండే గత ఏడాది జూన్ 30న ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఏడాది తర్వాత ప్రభుత్వంలో అజిత్‡ చేరడం ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్లలో మూడుసార్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పొలిటికల్ పవర్ ఇదీ! అజిత్ పవార్.. ఎన్సీపీని నిట్ట నిలువుగా చీల్చి మరోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి కొద్ది రోజులు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన ఇప్పుడు అధినేత శరద్ పవార్కు షాక్ ఇస్తూ పార్టీని చీల్చారు. 2019 నవంబర్ నుంచి 2022 జూన్ వరకు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అజిత్ 2019 తర్వాత ముచ్చటగా మూడోసారి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గతంలో కూడా కాంగ్రెస్–ఎన్సీపీ కలిసి 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్ హయాంలో డిప్యూటీ సీఎంగా చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీలో గట్టి పట్టున్న నాయకుడు. ప్రస్తుతం అజిత్ పవార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు వారి వారి చక్కెర సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణల్ని, ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అజిత్ పవార్ పార్టీని చీల్చడానికి ఈ కేసులు కూడా ఒక కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల కుంభకోణం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కార్యకర్తల ఒత్తిడితో శరద్ పవార్ వెనక్కి తీసుకున్న సమయంలో అజిత్ పవార్ ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలుసుకున్నారు. ఇక శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పడం అజిత్ పవార్కు మింగుడు పడలేదని, అందుకే ఆయ పార్టీని చీల్చారన్నది బహిరంగ రహస్యమే. మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ స్థానాలు బీజేపీ 105 శివసేన 56 ఎన్సీపీ 54 కాంగ్రెస్ 44 ఇతర పార్టీలు+స్వతంత్రులు 29 ఏ మొత్తం అసెంబ్లీ స్థానాలు 288 ప్రస్తుతం పార్టీల బలాబలాలు పార్టీ స్థానాలు బీజేపీ 105 శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 16 శివసేన(షిండే) 40 ఎన్సీపీ(శరద్ పవార్) 18 ఎన్సీపీ(అజిత్ పవార్) 36 కాంగ్రెస్ 44 ఇతర పార్టీలు+స్వతంత్రులు 29 -
ఇలాంటివి చాలా చూశాను.. ఎవ్వరినీ విడిచిపెట్టను..
ముంబై: ఇంతకాలం నమ్మిన బంటుగా ఉన్న అజిత్ పవార్ మరోసారి ప్లేటు ఫిరాయించడంతో ఆత్మరక్షణలో పడింది ఎన్సీపీ నాయకత్వం. ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదంటూనే అజిత్ పవార్ ప్రఫుల్ పటేల్ వంటి కీలక నాయకులతో వెళ్లి షిండే ప్రభుత్వంలో చేరడంపై శరద్ పవార్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటివి నా రాజకీయ జీవితంలో చాలా చూశానని పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్ ఆదివారం 40 మంది ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వానికి మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో హుటాహుటిన ఒకచోట చేరిన ఎన్సీపీ వర్గాలు ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ ధిక్కరణకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. నాకు ఇలాంటివి కొత్తేమీ కాదు. 1980లో కూడా ఇలాగే 58 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీకి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. ఆరోజు నాతో ఆరుగురు మాత్రమే మిగిలినప్పుడు కూడా నేను భయపడకుండా మళ్ళీ పార్టీని యధాస్థితికి తీసుకొచ్చాను. అప్పుడు నన్ను విడిచి వెళ్లిన వారంతా వారి నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరి పైనా కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీని కూడా పునర్నిర్మించుకుంటామని అన్నారు. పార్టీని విడిచి వెళ్లిన వారిలో కొంతమందిపై బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన ఆరోపించారు. అయితే నాతో పాటు చాలాకాలం కలిసి పనిచేసి, నేను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే కూడా వారితో వెళ్లడమే నన్ను కొంచెం బాధించిందని అన్నారు. ఇది కూడా చదవండి: ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్పవార్ -
ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్పవార్
ముంబై: మహా రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు అలకపాన్పుపై ఉన్న ఎన్సీపీ నేత అజిత్ పవార్.. షిండే ప్రభుత్వంలో చేరి మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం ఎన్సీపీ మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ల క్రితం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మరోసారి అదే సీన్ రిపీట్ చేశారు. కాకపోతే ఈసారి వారు షిండే నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో జత కట్టారు. ఆదివారం ఉదయం 40 మంది ఎమ్మెల్యేలతో గవర్నరును కలిసి వెంటవెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మేము అధికారంలో ఉన్న రెండున్నరేళ్లలో మా దృష్టాంతా అభివృద్ధి మీదే ఉంది. మా నిర్ణయంపై విమర్శలు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకి తీసుకెళ్లాలన్న దాని గురించే మా ఆలోచనంతా అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారేమోనన్న ప్రశ్న తలెత్తగా.. మేము ప్రభుత్వంలో చేరామంటే ఎన్సీపీ పార్టీ ప్రభుత్వంతో చేతులు కలిపినట్టే. మేము ఎన్నికల్లో కూడా ఇదే ఎన్సీపీ గుర్తుపై పోటీ చేస్తామని అన్నారు అజిత్ పవార్. ఎన్డీయేతో పొత్తు గురించి ప్రస్తావించగా మూడున్నరేళ్ల క్రితం ఉద్ధవ్ థాక్రేతో కలిసి మహావికాస్ అఘాడి ప్రభుత్వంతో చేతులు కలిపాము. ఆరోజు శివసేనతో కలిసి వెళ్లినపుడు ఈరోజు బీజేపీతో కలిసి ఎందుకు వెళ్ళకూడదు. రాష్ట్రాభివృద్ధే అజెండాగా చేసుకున్నప్పుడు ఎవరితో కలిసినా తప్పులేదని అన్నారు. ట్విట్టర్ లో ప్రమాణస్వీకారం తాలూకు ఫోటోలను జతపరచి.. ఎన్సీపీ సన్నిహితులు, మహారాష్ట్ర ప్రజాభీష్టం మేరకు నేను ఈరోజున మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ పదవి ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. महाराष्ट्रातील जनतेची इच्छा, राष्ट्रवादी काँग्रेस पक्षातील सहकाऱ्यांचा पाठिंबा, विश्वासाच्या बळावर आज राज्याचा उपमुख्यमंत्री म्हणून पद व गोपनीयतेची शपथ घेतली. माझ्या या पदाचा उपयोग जनतेच्या कल्याणासाठी, महाराष्ट्राच्या विकासासाठी होईल असा विश्वास देतो. pic.twitter.com/mvZ2oh7w6u — Ajit Pawar (@AjitPawarSpeaks) July 2, 2023 ఇది కూడా చదవండి: అత్త చేసిన పనికి బిత్తరపోయిన అల్లుడు.. -
ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఉన్నట్టుండి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా ఎన్సీపీలో నాయకత్వ మార్పుపై అసంతృప్తిగా ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి షిండేతో చేతులు కలిపారు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి గవర్నరుని కలవడం, సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా ఆగమేఘాలమీద జరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుప్రియా సూలే తోపాటు నియమితులైన ప్రఫుల్ పటేల్ కూడా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ.. అజిత్ పవార్ చేరికతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే అజిత్ పవర్ తో చేతులు కలిపాము. ఇందులో మా ప్రోద్బలం ఏమీ లేదు. ఆయనంతట ఆయనే వచ్చి మాతో చేతులు కలిపారని తెలిపారు. ఆయనతోపాటు ఎన్డీయేలో చేరిన మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఛగన్ భుజబల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావు బాబా ఆత్రం, అదితి తాత్కరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పుడు ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ఎన్డీయే ప్రభుత్వం మరింత బలోపేతమైంది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్.. డిప్యూటీ సీఎంగా అజిత్పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్.. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్కు మద్దతు ప్రకటించారు. రాజ్భవన్కు చేరుకున్న అజిత్పవార్ గవర్నర్కు మద్దతు లేఖ ఇచ్చారు. షిండే మంత్రివర్గంలోకి చేరిన అజిత్పవార్.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని ప్రకటన చేసిన రోజున మీడియా ముందు ముఖం చాటేసిన అజిత్ పవార్ తర్వాత ఓ సందర్భంలో తాను సంతోషంగానే ఉన్నానని ప్రకటించినా.. ఏదో మూల అసంతృప్తితోనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవర్ అంతలోనే ఇంతటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు ఎన్సీపీ వర్గాలు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి షిండే వర్గం పావులు కదిపి అజిత్ పవార్తో చేసిన సంప్రదింపులు ఫలించాయని దాని ఫలితంగానే ఈరోజు పార్టీలో చీలిక జరిగిందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అంతకుముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారితో చేతులు కలిపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలుపుతోంది షిండే వర్గం. ఇది కూడా చదవండి: SUV పైన బోటు.. అందులో ఎమ్మెల్యే.. వీడియో వైరల్ -
అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం..
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తనను ప్రతిపక్ష నాయకుడి పాత్ర నుండి తప్పించమని పార్టీ అధిష్టానాన్ని కోరిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిస్పందిస్తూ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లో ఒకరైన సుప్రియా సూలే ఆయనకు ఎలా కావాలంటే అలా చేద్దాం కానీ అది నా చేతుల్లో లేదు, పార్టీ నిర్ణయించాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు ఆ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్. అదే సమయంలో పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అజిత్ పవార్ ను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఆరోజునే ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించగా నేను సంతృప్తికరంగానే ఉన్నానని, ఇప్పటికే నాపై అనేక బాధ్యతలు ఉన్నాయని చెప్పిన ఆయన మెల్లగా అలగడం ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయాలన్న కోరిక నాకు లేదు. పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారని నేనా బాధ్యతలను స్వీకరించాను. కానీ ప్రస్తుతానికైతే నన్ను ప్రతిపక్ష నాయకుడిగా తప్పించి మరేదైనా బాధ్యతను అప్పగిస్తే పూర్తి స్థాయి న్యాయం చేయగలుగుతానని పార్టీ అధిష్టానాన్ని కోరారు. దీనిపై స్పందిస్తూ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే.. ఆయన ఎలా కోరితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే అది నా ఒక్కరి చేతుల్లో లేదు. పార్టీ కార్యవర్గం అంతా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒక సోదరిగా ఆయన ఏది కోరితే అది జరగాలనే కోరుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన అమిత్ షా -
కేసీఆర్కు అంత సీన్ లేదు.. పవార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పూణే: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. పలు రాష్ట్రాల్లో పార్టీని విసర్తిస్తూ.. బీఆర్ఎస్లో చేరికలు, పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తున్నారు. ఇక, తాజాగా మహారాష్ట్రలో కొందరు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడంతో కేసీఆర్.. అక్కడి రాజకీయాలపై ఫోకస్ పెంచారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన సక్సెస్ కాలేరని అజిత్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ పార్టీలో చేరుతున్న వారికి ఇక్కడ అవకాశం రాదని తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. మూలయం, మాయవతి కూడా.. కాగా, అజిత్ పవార్ పూణెలో మీడియాతో మాట్లాడుతూ.. మాయావతి, ములాయం సింగ్ వంటి సీనియర్ నేతలు ఇప్పటికే మహారాష్ట్రలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇక్కడ రాజకీయాలు చేయడంలో విఫలమయ్యారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో వారి పార్టీలను విస్తరించాలని ప్లాన్స్ చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో పార్టీలను, ప్రజలను ప్రభావితం చేయడంలో సక్సెస్ కాలేదని వెల్లడించారు. కేసీఆర్.. జాతీయ స్థాయి నాయకుడు కావాలని ఎంతో ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని విస్తరించే పనిలో ఉన్నారని అన్నారు. డబ్బంతా ఎక్కడది.. ఇక, ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్పై అజిత్ పవర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశం, రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాల కోసం హోర్డింగులు, ప్రకటనలు, యాడ్స్, బ్యానర్లు, విపరీతంగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఈ డబ్బంతా కేసీఆర్ కు ఎక్కడ నుంచి వస్తోందనే విషయం గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఇది కూడా చదవండి: మహిళల ఉచిత ప్రయాణంలో మార్పులు.. -
పవార్ ‘పవర్’ గేమ్..!.. ఎన్సీపీలో చీలికలు తెస్తుందా ?
ఒకప్పుడు శరద్ పవార్ వారసుడిగా అజిత్ పవార్నే చూసేవారు. పార్టీలో సెకండ్ పొజిషన్ను అనుభవించారు. వివాదరహితుగా పేరు తెచ్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం బీజేపీలో దూకడానికి అజిత్ పవార్ ఎమ్మెల్యేలతో కలిసి మంతనాలు సాగిస్తుస్నారన్న ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంటూ ముంబై నగర వీధుల్లో పోస్టర్లు వెలిశాయి. రాజకీయాల్లో తలపండిన శరద్ పవార్ ఇవన్నీ పార్టీకి ముప్పు తెస్తాయని భావించి అత్యంత నాటకీయంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కార్యకర్తలు, ఇతర నాయకులు పట్టుబట్టడంతో ఉద్వేగ భరిత వాతావరణంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పార్టీపై ఎప్పటికీ పట్టు తనదేనన్న సంకేతాలను అజిత్ పవార్కు పంపారు. ఇది జరిగిన కొద్ది వారాలకే శరద్ పవార్ తన కుమార్తెకే నేరుగా పార్టీ పగ్గాలు అప్పగించి మరో పవర్ గేమ్ మొదలు పెట్టారు. సుప్రియకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై తనకెలాంటి అసంతృప్తి లేదని అజిత్ పవార్ బయటకి చెబుతున్నప్పటికీ ఆయన రాష్ట్రంలో మరో ఏక్నాథ్ షిండేలా మారే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. అజిత్ పవార్ పార్టీని చీలుస్తారా లేదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది సభ్యుల బలం ఉంది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ కలిసి ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కొనే వ్యూహరచన చేయడంతో శరద్ పవార్ వ్యూహాత్మకంగా అజిత్ను బలహీనపరచడం కోసం పటేల్కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే త్వరలోనే అజిత్ పవార్ తీసుకునే నిర్ణయాలు మహారాష్ట రాజకీయాల్లోనే కీలకమైన మార్పులు తీసుకువస్తాయని రాజకీయ విశ్లేషకుడు విజయ్ క్రోమర్ వ్యాఖ్యనించారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీపై చేసిన తిరుగుబాటు విఫలమైంది. బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పాటైన ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోయిన విష యం తెలిసిందే. కొందరు ఈ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తూ ముఖ్యమంత్రి కావాలన్న అజిత్ పవార్ కల నెరవేరాలంటే ఎన్సీపీలో ఉంటేనే సాధ్యపడుతుందని, బీజేపీతో చేతులు కలిపితే సాధ్యం కాదన్న విషయం ఆయనకీ తెలుసునని అంటున్నారు. మొత్తమ్మీద అజిత్ పవార్ వేసే అడుగులే ఆయన భవిష్యత్, ఎన్సీపీ భవిష్యత్ని నిర్దేశించడంతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని కూడా శాసించబోతున్నాయి. సుప్రియ ఎదుట సవాళ్లు.! సుప్రియ సూలే గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక ఎంపీగా ఆమె జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించారు. అజిత్ పవార్ మాదిరిగా ఆమెకి రాష్ట్ర రాజకీయాల్లో పట్టు లేదు. నాయకత్వ లక్షణాలు కూడా ఇప్పటివరకు ఎక్కడా ప్రదర్శించే అవకాశం రాలేదు. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టిక్కెట్ల పంపిణీ, పార్టీలో అసమ్మతుల బుజ్జగింపు, ఎన్నికల్లో వ్యూహరచనలు వంటివన్నీ ఆమె ఎలా నిర్వహించగలరనే సందేహాలైతే ఉన్నాయి. సుప్రియ నియామకంతో పార్టీకి ఒక అర్బన్ ఇమేజ్ వచ్చిందేమో కానీ, అజిత్ పవార్ మాదిరిగా గ్రామాల్లోకి చొచ్చుకుపోయి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం లేదు. అయితే తండ్రి మాదిరిగానే సుప్రియకు ఎలాంటి సంక్షోభాన్నయినా తట్టుకునే నిలబడే సామర్థ్యం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ క్రౌడ్ పుల్లర్ అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్ అడుగు జాడల్లో నడుస్తూ 1982లో తన 20 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. చక్కెర సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గారు. 1991లో తొలిసారిగా ఎన్సీపీ తరఫున బారామతి నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పవార్ కోసం ఆ సీటుని వదులుకొని మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పట్నుంచి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. బారామతి అసెంబ్లీ సీటు నుంచి ఓటమి లేకుండా ఎన్నికవుతూనే ఉన్నారు. 2012, 2014లో ఉప ముఖ్యమంత్రిగా పని చేసి పాలనలోనూ తన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. కార్యకర్తల్ని ప్రేమగా పలకరించడం, నాయకులతో మంతనాలు, తాను చెప్పదలచుకున్నదేదో సూటిగా స్పష్టంగా చెప్పడం, గ్రామాల్లో ఉన్న పట్టు వంటివెన్నో ఆయనను క్రౌడ్ పుల్లర్గా మార్చాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
శరద్ పవార్ నిర్ణయంపై అజిత్ అసంతృప్తి.. స్పందించిన సుప్రియా సూలే
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తాజా నిర్ణయంపై అజిత్ పవార్ అసంతృప్తి ఉన్నారంటూ వస్తున్న వార్తలపై పార్టీకి కొత్తగా నియమితులైన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సులే స్పందించారు. తన పదవి పట్ల అజిత్ పవార్ సంతోషంగా లేరన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. అవన్నీ పుకార్లేనని బారామతి ఎంపీ కొట్టిపారేశారు. కాగా జూన్ 10న ఎన్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తన అన్న కొడుకు అజిత్ పవార్కు షాక్ ఇస్తూ కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ ప్రకటన వెలువడింది. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు సూప్రియా సూలేతోపాటు సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేళ్లను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఖండ్, గోవాతోపాటు పార్టీ రాజ్యసభ వ్యవహారాలను ప్రఫుల్ పటేల్ చూస్తారు. కూతురికి లోక్సభ, పార్టీ వ్యవహారాలతోపాటు మహిళలు, యువత, విద్యార్థి విభాగాలు, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్ ఇంచార్జ్గా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే మహారాష్ట్ర వ్యవహరాలను ఇప్పటికీ వరకు అజిత్ పవార్ చూసుకుంటున్నారు. తాజాగా సుప్రియా సూలేకు అ భాద్యతలు ఇవ్వడంతో అజిత్ను పక్కకు పెట్టినట్లు అయ్యింది. బంధుప్రీతితోనే బాధ్యతలు! ఇక పార్టీ వ్యవహారాల విషయంలో అన్న కొడుకు, ముఖ్యనేత అజిత్ పవార్ను పక్కన పెట్టడం హాట్టాపిక్గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పవార్ నిర్ణయం అజిత్ను పక్కకు పెట్టిన్నట్లు కనిపిస్తుందని, ఎన్సీపీలో విభేదాలు బయపడ్డాయని మండిపడుతున్నాయి. కేవలం బంధుప్రీతితోనే సుప్రియా సూలేకు కీలక బాధ్యతలు అప్పగించారని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై సుప్రియా సులే స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. आपल्या बारामती लोकसभा मतदारसंघातील न्हावी ता. इंदापूर येथे गावभेट उपक्रमाअंतर्गत भेट देऊन ग्रामस्थांशी संवाद साधला. याप्रसंगी राष्ट्रवादी काँग्रेसचे इंदापूर तालुकाध्यक्ष हनुमंत कोकाटे, सचिन सपकाळ, अतुल झगडे, प्रताप पाटील, प्रवीण माने, विजय शिंदे, रेहना मुलाणी यांच्यासह… pic.twitter.com/3TvsguW44H— Supriya Sule (@supriya_sule) June 12, 2023 అజిత్ను బీజేపీ టార్గెట్ చేసింది అజిత్ పవార్ సంతోషంగా లేరని ఎవరూ చెప్పారు? ఎవరైనా అతన్ని అడిగారా? ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ మాత్రమే. దాదా అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన స్థానం ముఖ్యమంత్రితో సమానం. అజిత్ పవార్ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. కొన్నిసార్లు నన్ను టార్గెట్ చేస్తోంది’ మండిపడ్డారు. బంధుప్రీతి’ లేని పార్టీ ఏదీ? అదే విధంగా వారసత్వ రాజకీయాలపై ఆమె ఘాటుగా స్పందించారు.‘ అవును బంధుప్రీతి రాజకీయాలు ఉన్నాయి. ‘బంధుప్రీతి’ లేని పార్టీ ఏదైనా ఉందా? శరద్ పవార్ కూతురిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. బంధు ప్రీతి గురించి మాట్లాడినప్పుడు పని తీరు గురించి, ప్రతిభ గురించి ఎందుకు మాట్లాడరు. నేను సంసద్ రత్న అవార్డు కూడా అందుకున్నాను. అయితే నాకు ఆ అవార్డు పార్లమెంట్లో చేసిన కృషికి దక్కింది. శరద్ పవార్ కూతుర్ని కావడం వల్ల కాదు’ అని పేర్కొన్నారు. అజిత్ పవార్ ఏమన్నారంటే.. అంతకుముందు ఆదివారం ఆమె పుణెలో పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెండ్గా ఎన్నికైనందుకు ఎన్సీపీ శ్రేణులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే పుణెలోని గాంధీ భవన్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇక శరద్ పవార్ నిర్ణయంపై తాను సంతోషంగా ఉన్నట్లు అజిత్ పవార్ సైతం వెల్లడించారు. దీనిపై తాను అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న ప్రచారాలన్నీ పుకార్లేనని తెలిపారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నాం.. ‘పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో నేను సంతోషంగా లేనంటూ కొన్ని వార్త కథనాలు వెలువడుతున్నాయి. అవన్నీ అబద్ధాలే. శరద్ పవార్ రాజీనామా చేసిన సమయంలో కమిటీ ఏర్పడింది. అరోజే రెండు నిర్ణయాలు తీసుకున్నాం. శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవడం ఒకటి.. సుప్రియా సూలేను వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించాలని కమిటీ ఏర్పడినప్పుడే సూచించాం. అయితే మిగిలిన కమిటీ సభ్యులు శరద్ పవార్ను ఒప్పించి రాజీనామా ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని చెప్పారు’ అని అజిత్ పవార్ విలేకరులతో అన్నారు. శరద్ పవార్ గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే మే 5న ఎన్సీపీ కమిటీ శరద్రా జీనామాను తిరస్కరిస్తూ తీర్మానం చేయసింది.అలాగే తను స్థాపించిన పార్టీకి నాయకత్వం వహించాల్సిందిగా అభ్యర్థించడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. -
అజిత్ పవార్ను పక్కన పెట్టేశారు.. ఇక జూనియర్ పవార్ ఎటువైపు?
అన్న కొడుకు అజిత్ పవార్కు షాక్ ఇచ్చారు NCP అధినేత శరద్ పవార్. కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అజిత్ను పక్కనపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి..? జూనియవ్ పవార్ ఏం చేయబోతున్నారు..? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. NCPకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. కూతురు, ఎంపీ సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేళ్లకు కార్యనిర్వహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు శరద్ పవార్. అయితే పార్టీ వ్యవహారాల విషయంలో అన్న కొడుకు, ముఖ్యనేత అజిత్ పవార్ను పక్కన పెట్టడం హాట్టాపిక్గా మారింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, విమెన్ యూత్, లోక్సభ కోఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా వ్యవహారాలు, NCP రాజ్యసభ ఎంపీలను పర్యవేక్షించనున్నారు ప్రఫుల్ పటేల్. ఎన్సీపీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్స్ పేర్లను ప్రకటించారు శరద్ పవార్. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ప్రకటన వెలువడింది. కానీ ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాలపై ట్విట్టర్లో స్పందించిన అజిత్ పవార్.. నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. అజిత్ పవార్ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ గతకొంతకాలంగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో NCP అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు శరద్ పవార్. పార్టీ నేతలు, కార్యకర్తల విజ్ఞప్తితో వెనక్కి తగ్గారు. అప్పుడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటుచేయాలనే తీర్మానం జరిగింది. దీంతో అజిత్ పవార్కు రాష్ట్ర పార్టీ బాద్యతలు అప్పగిస్తారని, సుప్రియా సూలే జాతీయ రాజకీయాలు పర్యవేక్షిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా అజిత్ పవార్ను పక్కనపెట్టడం చర్చనీయాంశం అయ్యింది. పవార్ బంధుప్రీతి అంటూ బీజేపీ విమర్శలు గుప్పించగా.. అజిత్ పవార్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
బీజేపీపై వ్యతిరేకత ఉంది
ఔరంగాబాద్: ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇదే కొనసాగితే దేశం రాబోయే ఎన్నికల్లో మార్పును చూస్తుందన్నారు. ఈ విషయం చెప్పడానికి జ్యోతిష్యుని అవసరం లేదని, కర్ణాటక ఫలితాలు పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. లోక్సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే విషయమై ప్రశ్నించగా తనతోపాటు తమ పార్టీ మిత్రపక్షాలు కూడా అదే కోరుకుంటున్నాయని తెలిపారు. అయితే.. కర్ణాటక ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఒకేసారి రెండు ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ సిద్ధపడ దని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు పెట్టుబడి సాయంలో ‘తెలంగాణ మోడల్’పై ఆయన స్పందిస్తూ.. చిన్న రాష్ట్రం కాబట్టి అది సాధ్యమయ్యిందని, దానికి బదులుగా రైతులకు మౌలిక వసతుల కల్పనకు నిధులను వెచ్చిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ప్రతి చిన్న ఘటనకూ మతం రంగు పులుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి సంకేతం కాదన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై శరద్పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఇంతవరకూ ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయలేదని, చెరుకు రైతులకు మద్దతు ధరలేదని, ఈ విషయంలో రైతుల పోరాటానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. -
ఒకవేళ ఏకం చేయలేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ మళ్లీ రాజీనామా చేయరుగా!
ఒకవేళ ఏకం చేయలేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ మళ్లీ రాజీనామా చేయరుగా! -
మహారాష్ట్రపై కేసీఆర్ నజర్.. బీఆర్ఎస్తో టచ్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రంలో విస్తరణ దిశగా బీఆర్ఎస్ను పరుగులు పెట్టేంచేలా ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలోని ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి సారించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల నుంచి వివిధ పారీ్టల మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), శివసేన(థాక్రే, షిండే) వర్గాల్లో నెలకొన్న పరిస్థితిని అనువుగా మలుచుకుని చేరికల జోరు పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన అభ్యర్థులు బీఆర్ఎస్లో చేరారు. ఎన్సీపీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఎన్సీపీ ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మూడురోజుల క్రితం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఎన్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల చేరిక వ్యవహారంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఎన్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల చేరిక ఖాయమైన తర్వాత మహారాష్ట్రలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? ‘మహా’పాలిటిక్స్పై కేసీఆర్ లెక్కలు మహారాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్ విస్తరణకు అనుకూలంగా ఉన్నాయనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు, పార్టీల సంస్థాగత లోపాలను అనువుగా మలుచుకుని బీఆర్ఎస్ బలోపేతానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఎన్సీపీ, శివసేన(థాక్రే, షిండే) వర్గాల్లో నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ విస్తరణకు అనుకూలంగా ఉందనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలను ప్రోత్సహించేలా కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ నెల 2న తెలంగాణ భవన్లో మహారాష్ట్ర నేతలతో జరిగిన భేటీలో బీఆర్ఎస్ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరించడంతోపాటు చేరికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అనేక అంశాలపై చర్చించారు. మహారాష్ట్రకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్లో ఉన్నారనే విషయాన్ని వెల్లడించారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్పవార్ రాజీనామా ప్రకటన, తర్వాత వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీలో మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీ సుప్రియా సూలే మధ్య ఆధిపత్యపోరుతో పార్టీలో చీలిక అనివార్యమనే అంశాన్ని అక్కడి నేతలు కేసీఆర్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఎన్సీపీకి 50కిపైగా మంది శాసనసభ్యులు ఉండగా, ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్పవార్ వర్గంలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. శివసేన రెండువర్గాల నేతలు కూడా కేసీఆర్కు టచ్లోకి వచ్చినట్లు మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ తరఫున పర్యవేక్షిస్తున్న నేత ఒకరు వెల్లడించారు. ఇప్పటికే పలువురు మాజీల చేరిక నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నాసాహెబ్ మానే, హర్షవర్దన్ జాదవ్, శంకరన్న దోంగ్డె, రాజు తొడ్సమ్ గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు ఔరంగాబాద్ జెడ్పీ చైర్మన్, గత ఎన్నికల్లో పోటీ చేసిన సంతోష్ కుమార్ వంటి నేతలు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల రాకతో చేరికల వేగం మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ మోడల్పై చర్చకు షిండే హామీ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని వినాయక్ పాటిల్ అనే మహారాష్ట్రవాసి ఐదురోజులుగా ఆమరణదీక్ష చేస్తున్నారు. వినాయక్ పాటిల్ అరోగ్యం విషమించడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోన్ చేశారు. మే 9న తెలంగాణలో అమలవుతున్న పథకాలు, తెలంగాణ మోడల్పై చర్చిద్దామని సీఎం షిండే హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: నా గొంతులో ప్రాణమున్నంత వరకు రామన్న చెయ్యి వదిలేది లేదు.. తెలంగాణ జాతిపితకే జీవితం అంకితం -
Sharad Pawar: శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ
ముంబై: శరద్ పవార్ రాజీనామా ప్రకటనతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న దుమారం మరింత తీవ్రమవుతోంది. తదుపరి ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. రద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్పవార్ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్ను కోరింది. కాగా దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉంది ఆ పార్టీ సినియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు. 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న శరద్ పవార్కు నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలు ఫోన్ చేసి అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయంపై చర్చించారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, సీపీఐకి చెందిన డి రాజా తదితరులు ఎన్సీపీ అధినేతతో మాట్లాడారు. చదవండి: Video: పాక్ మంత్రికి నమస్కారంతో స్వాగతం పలికిన జైశంకర్ కాగా 24 ఏళ్ళుగా ఎన్సీపీకి పెద్ద దిక్కూ అయిన శరద్ పవార్ తన సొంత పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి షాక్కు గురిచేసిన విషయం తెలిసిందే. తన ఆత్మకథ రెండో ముద్రణ ఆవిష్కరణ వేదికగా శరద్ చేసిన ఆకస్మిక ప్రకటన కొందరిని కన్నీరు పెట్టించింది. పవార్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటూ అభిమానులు, కార్యకర్తలు భారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ చీఫ్కు రాజీనామా ప్రకటించడంతో పార్టీ జాతీయ కార్యదర్శి సహా మరికొందరునేతలు కూడా తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య కొద్ది గంటల వ్యవధిలోనే తన నిర్ణయంపై పునరాలోచిస్తానని ఇందుకు రెండు, మూడు రోజుల సమయం కావాలని శరద్ కోరారు. కాగా ఎన్సీపీ నేత, శరద్ సోదరుడి కుమార్ అజిత్పవార్ బీజేపీలో చేరనున్నట్లు కొన్ని వారాలుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పైకి ఆ వాదనను అజిత్ సహా అందరూ కొట్టిపారేసినా, శరద్ హఠాత్ ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలో అజిత్ను కాషాయ పార్టీలోకి వెళ్లనివ్వకుండా ఆపేందుకు ఎన్సీపీలో చీలిక ఏర్పడకుడదనే ఉద్దేశ్యంతో శరద్ ఈ నిర్ణయం తీసుకుఒని ఉంటారని భావిస్తున్నారు. చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ -
శరద్ పవార్ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్గా సూలేనా?.. అజిత్ పవార్?
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తదుపరి చీఫ్గా ఎవరు నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే తదుపరి వారుసుడిని ఎంపిక చేసేందుకు పవార్ ఏర్పాటు చేసిన కమిటీ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుందని ఎన్పీపీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ సభ్యుల్లో కమిటీ సభ్యుల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆయన మేనల్లుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ తదితరులు ఉన్నారు. ఐతే పార్టీ జాతీయాధ్యక్షుడిగా పవార్ స్థానంలో కూతురు సుప్రియా సూలే ముందున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర చీఫ్గా అజిత్ పవార్ ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు చగ్గన్ భుజ్బల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇష్టపడినట్లయితే.. అజిత్ పవార్ రాష్ట్రాన్ని చూసుకుంటారని, సుప్రియా సూలే జాతీయ రాజకీయాలను చూసుకుంటారని చెప్పారు. అలాగే పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల విజ్ఞప్తుల మేరకు పవార్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి అంగీకరించారని ఎన్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ చెప్పడం విశేషం. అంతేగాదు శరద్ పవార్ పదవికి రాజీనామా చేసే ప్రకటనపై తుది నిర్ణయం వెలువడేంత వరకు ఆయన వారసుడిగా పార్టీ చీఫ్ని ఎంపిక చేసే ప్రశ్నే లేదని పటేల్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవార్ నిర్ణయానికి నిరసనగా పార్టీ నేతలు మూకుమ్ముడిగా రాజీనామాలు చేయడం మానుకోవాలని అన్నారు. పార్టీ పవార్ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించేందుకు యత్నిస్తోంది, కాబట్టి కార్యకర్తలంతా కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు. ఇదిలా ఉండగా..అజిత్ పవార్ పార్టీని చీల్చి, అధినేతగా బాధ్యతలు చేపట్టాలని యోచిస్తున్నారనే ఊహాగానాల మధ్య శరద్ పవార్ ఈ అనూహ్య చర్య తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో తిరుగుబాటు తలెత్తకుండా ఉండేలా ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్ వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, శరద్ పవార్ మాత్రం కొత్తతరం పార్టీకి మార్గనిర్దేశం చేయాల్సిన సమయం ఆసన్నమైందని , అత్యాశ ఉండకూదని చెబుతూ..జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. (చదవండి: శరద్ పవార్ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మోదీకి అప్పుడే చెప్పా అది కుదరని!) -
శరద్ పవార్ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మోదీకి అప్పుడే చెప్పా!
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత శరద్ పవార్ తాను అప్పుడే ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విషయం సూటిగా చెప్పినట్టు తన ఆత్మకథ 'లోక్ మాఝే సంగతి' పుస్తకంలో కొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. పవార్ ఆత్మకథ బుధవారం విడుదలైన సందర్భంగా అందులోని విషయాలు తెరపైకి వచ్చాయి. ఆ పుస్తకంలో పవార్ తాను 2019 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోదీని కలిశానని రాశారు. అప్పుడూ బీజేపీ ఎన్సీపీతో పొత్తుకు అవకాశం ఉందా? అనే దాని గురించి అన్వేషించిందని, కానీ తాను ఆసక్తి కనబర్చ లేదన్నారు పవార్. ఐతే బీజేపీతో మాత్రం అధికారిక చర్చలు జరగలేదని, కేవలం బీజేపీ మాత్రమే బంధాన్ని కోరుకున్నదని చెప్పారు. కానీ ఇరు పార్టీల నుంచి ఎంపిక చేసిన నాయకుల మధ్య మాత్రం అనధికారిక చర్చలైతే జరిగాయని పవార్ పుస్తకంలో తెలిపారు. తాను ఆ సమావేశం సమయంలోనే మోదీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లీయర్గా చెప్పేశానని పుస్తకంలో పేర్కొన్నారు. అంతేగాదు మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వంపై అనిశ్చిత ఏర్పడిన తర్వాత ఎన్సీపీ, బీజేపీ నేతల మధ్య చర్చలు జరిగాయని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కూడా.. అంతేగాదు అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో కూడా ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవాని బీజేపీ కోరుకున్నట్లు పేర్కొన్నారు. 2014లో కాషాయ పార్టీ అసలు రంగు బయటపడిందని తెలిపారు. అందుకే ఆ పార్టీని విశ్వసించలేమని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కానీ మెజార్టీకి దూరమైందన్నారు. ఆ సమయంలోనూ బీజేపీ తమ పార్టీతో చర్చలు జరిపిందని, అయితే, ఆ సమయంలో తాను లేనని చెప్పుకొచ్చారు పవార్. ఈక్రమంలోనే ప్రభుత్వంలో భాగమైన శివసేనతో హఠాత్తుగా బీజేపీ బంధాన్ని ఏర్పరుచుకుందని చెప్పారు. ఈ పరిణామాల తర్వాత మా నాయకులు రియలైజ్ అయ్యి బీజేపీని విశ్వసించమని చెప్పినట్లు పుస్తకంలో వెల్లడించారు శరద్ పవార్. (చదవండి: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా? కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్) -
ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. స్పందించిన అజిత్ పవార్
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి నుంచి శరద్ పవార్ తప్పుకోవడంపై ఆ పార్టీ నేత అజిత్ పవార్ స్పందించారు. పవార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. కొత్తగా ఎన్నికయ్యే తదుపరి పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆధ్వర్యంలోనే పనిచేస్తారని తెలిపారు. శరద్ పవార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేస్తున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో అజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ కుటుంబానికి పవార్ సాహెబ్(శరద్ పవర్) ఎప్పుడూ అధిపతిగా ఉంటారని, ఆయన మార్గదర్శకత్వంలోనే కొత్త అధ్యక్షులు పనిచేస్తారని అజిత్ పవార్ తెలిపారు. శరద్ నిర్ణయంపై ఎమోషనల్ అవ్వద్దంటూ పార్టీ కార్యకర్తలకు, నేతలకు సూచించారు. ఎన్సీపీ నాయకత్వంలో మార్పు ఆవశ్యకత గురించి కొన్ని రోజుల క్రితమే పవార్ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. ఆయన వయస్సు, ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్గాంధీకి ఎదురుదెబ్బ అయితే పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడంపై తన దిగ్భ్రాంతికరమైన నిర్ణయాన్ని పునరాలోచించుకోవడానికి శరద్ పవార్ అంగీకరించారని, ఇందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని అడిగినట్లు అజిత్ పవార్ తెలిపారు. ఈ మేరకు అజిత్ పవార్.. సుప్రియా సూలే ఇతర పార్టీ నాయకులతో కలిసి మంగళవారం సాయంత్రం శరద్పవార్ను కలిశారు. ఒకవేళ తదుపరి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వస్తే శరద్ పవార్ సూచించిన కమిటీలోని సభ్యులు ఎన్సీపీ కుటుంబంలోనే ఉన్నారని, బయట నుంచి కాదని స్పష్టం చేశారు. కాగా ఎన్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 82 ఏళ్ల పవార్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవార్ నిర్ణయంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది కార్యకర్తలయితే కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా కాంగ్రెస్తో విభేదాలతో 1999లో ఎన్సీపీని స్థాపించిన శరద్ పవార్.. అప్పటి నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడి పదవిలో కానసాగుతూ వచ్చారు. దాదాపు 24 ఏళ్లపాటు అధక్ష పదివి బాధ్యతలు చేపట్టిన పవార్.. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా వెల్లడించారు.సరిగ్గా 1960 మే 1వ తేదీన మే డే నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైంద, మనిషికి అత్యాశ ఉండకూడదని, ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చదవండి: కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు! అయితే పవార్ అన్న కొడుకు అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి.. తన అనుచరులతో బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. -
ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, విపక్షాల ముఖ్యనేత శరద్ పవార్ తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన ఆత్మకథ పుస్తకం రెండో ఎడిషన్ రిలీజ్ కార్యక్రమంలో.. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనన్న పవార్.. ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పవార్ తన రాజీనామా ప్రకటించగానే.. ఎన్సీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆయన రాజీనామా చేయొద్దంటూ వేదిక మీదకు ఎక్కి నినాదాలు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజీనామా వెనక్కు తీసుకోవాలంటూ కోరారు. అయితే ఆయన మాత్రం రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారు. 👉 ‘‘రాజ్యసభ సభ్యుడిగా ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. అంతదాకా కొనసాగుతా. కానీ, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోను అని ఆటోబయోగ్రఫీ ‘లోక్ మజే సంగతి’ సెకండ్ ఎడిషన్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘సరిగ్గా 1960 మే 1వ తేదీన మే డే నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసుకున్న ఆయన.. మనిషికి అత్యాశ ఉండకూడదని, ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందేనని 83 ఏళ్ల పవార్ వ్యాఖ్యానించారు. 👉 అయితే తర్వాతి అధ్యక్ష పదవి కోసం పార్టీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందన్న ఆయన.. ఎన్సీపీ సీనియర్ నేతలతో కూడిన కమిటీని తాను రికమండ్ చేస్తానని, వాళ్లే తర్వాతి పార్టీ చీఫ్ ఎంపిక బాధ్యత చేపడతారని వెల్లడించారు. ఆ కమిటీ ప్రఫుల్ పటేల్, సునీల్ తాట్కరే, పీసీ చాకో, అజిత్ పవార్, సుప్రియా సులే, జయంత్పాటిల్, అనిల్ దేశ్ముఖ్ తదితరులు ఉంటారని ఆయన తెలిపారు. 👉 గత కొంతకాలంగా.. మహారాష్ట్రలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జోరుగా నడుస్తోంది. పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి వెళ్లబోతున్నాడంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే అజిత్ పవార్ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. 👉 మరోవైపు ఈ బాబాయ్-అబ్బాయ్ నడుమ గ్యాప్ గురించి, హఠాత్తుగా ఏం పరిణామం జరగబోతుందా? అనే ఆసక్తికర చర్చ మహా రాజకీయాల్లో నడుస్తుండగానే పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటించారు. పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యంపై అజిత్ అసంతృప్తిగా ఉన్నారని, పవార్ యువనాయకత్వాన్ని ప్రొత్సాహించడం అజిత్కు నచ్చడం లేదనే టాక్ మరోవైపు నడుస్తోంది. 👉 వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కోసం.. విపక్షాలను ఒకే తాటి మీదకు తెచ్చేందుకు జరుగుతున్న కృషిలో పవార్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటోంది కూడా. ఇలాంటి టైంలో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/h6mPIk4wgJ — ANI (@ANI) May 2, 2023 పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ 👉 జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 👉 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. 👉 పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఏక పక్షంగా ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జయంత్ పాటిల్ మాత్రం మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 👉 ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో సోనియా గాంధీ అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తోంది. 👉 ప్రభుత్వాలతో దోస్తీ కొనసాగించిన శరద్ పవార్.. కేంద్ర మంత్రి పదవులను సైతం చేపట్టారు. ప్రతిపక్షంలోనూ ఆయన రాజకీయంలో తన మార్క్ ప్రదర్శించేవారు. 👉 మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఎన్సీపీ.. నాగాలాండ్లోనూ ప్రభావం చూపెడుతూ వస్తోంది. ఈ తరుణంలోనే ఈసీ నిబంధనలకు లోబడి.. చాలా ఏళ్ల కిందటే జాతీయ పార్టీ హోదా పొందింది ఎన్సీపీ. కానీ, తాజాగా ఆ హోదాను కోల్పోవడం గమనార్హం. 👉 పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. చీలిక వర్గాలు, అసంతృప్తులు, వెన్నుపోటులు ఎదురైనా.. పవార్ నాయకత్వం వాటిన్నింటికి చెక్ పెడుతూ నిలకడగా ఎన్సీపీ నావను ముందుకు నడిపింది. ఇదీ చదవండి: మన్ కీ బాత్@100.. ఒక్కో ఎపిసోడ్కు 8.3 కోట్లు? -
మాటల్లో మార్పు.. వెన్నుపోటుకి అజిత్ పవార్ రెడీనా?
పుణే: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. బాల్ థాక్రే విషయంలో రాజ్ థాక్రే ఎలాంటి దృష్టి పెట్టాడో.. తానూ తన బాబాయ్ శరద్ పవార్ విషయంలో అలాంటి దృష్టే సారిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సంగతి పక్కనపెట్టినా.. బాబాయ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్-అబ్బాయి అజిత్ పవార్ల మధ్య అగాధం తారాస్థాయికి చేరుకుంటోందని వాళ్ల మాటల్లో మార్పుని బట్టి తెలుస్తోంది!. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత, ఎన్సీపీ ఎంపీ అమోల్ ఖోల్హే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేలు తాజాగా ఒక వేదికపై చిట్చాట్లో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో రాజ్ థాక్రే మాట్లాడుతూ.. అజిత్ పవార్ బయట ఎలాగైతే తన బాబాయ్(శరద్ పవార్)ను గౌరవిస్తాడో, పార్టీలో అంతర్గతంగానూ అలాగే గౌరవించాలని సలహా ఇచ్చాడు. అయితే ఆ సలహాపై మీడియా అజిత్ పవార్ను స్పందించాలని కోరింది. దానికి ఆయన అంతే తేడాగా స్పందించారు. రాజ్ థాక్రే ఇచ్చిన సలహా గురించి తెలిసింది. తన పెద్దనాన్న అయిన బాల్ థాక్రే విషయంలో రాజ్ థాక్రే ఎలాంటి వైఖరి అవలంభించారో, ఎంతగా దృష్టిసారించారో.. తాను తన బాబాయ్ శరద్ పవార్ విషయంలో అలాంటి దృష్టిసారిస్తానంటూ వ్యాఖ్యానించారు. బాల్ థాక్రే చిన్న సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడు రాజ్ థాక్రే. అయితే.. తన పెదనాన్నతో విబేధాలు రావడంతో.. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీని నెలకొల్పారు రాజ్థాక్రే. అజిత్ పవార్, రాజ్ థాక్రే వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే.. తన మనసులోని మాట బయటపెట్టారా?. ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అజిత్ పవార్ బయటకు వస్తారని, బీజేపీతో కలిసి జట్టు కడతాడంటూ గత కొంతకాలంగా మహా రాజకీయాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి వైదొలుగుతామంటూ బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది షిండే శివసేన వర్గం. కానీ, తాను జీవితాంతం ఎన్సీపీ, బాబాయ్ శరద్ పవార్ వెంటనే నడుస్తానని ఆ ప్రచారాన్ని అజిత్ పవార్ ఖండించారు. అయినప్పటికీ మహారాష్ట్ర రాజీకీయాల్లో రాబోయే రోజుల్లో రాజకీయ కుదుపు ఉండొచ్చని, అజిత్ పవార్ వెన్నుపోటు అస్త్రం ప్రయోగించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవార్ రోటీ వ్యాఖ్యల దుమారం అజిత్ పవార్ తర్వాత రాజకీయ అడుగుల గురించి చర్చ నడుస్తున్న వేళ.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. పార్టీ యూత్ వింగ్ సమావేశంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ.. రోటీలను సమాయానికి పెనం మీద తిప్పి వేయాలి. లేకుంటే అవి తినడానికి పనికి రాకుండా పోతాయని నాకు కొందరు చెప్పారు. అలాగే పార్టీలో కూడా సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. దీంతో.. బీజేపీకి మళ్లీ అజిత్ పవార్ చేరువవుతున్న కమ్రంలో ఎన్సీపీని నుంచి ఆయన్ని దూరం చేయాలని శరద్ పవార్ భావిస్తున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ రోటీ వ్యాఖ్యలపైనా అజిత్ పవార్ స్పందించారు. పవార్ సాబ్ తన 55, 60 ఏళ్ల కెరీర్లో ఎన్నోసార్లు పార్టీని పునరుద్ధరించారు. ఎన్నో కొత్త ముఖాలు పార్టీలోకి వచఆచయి. మరెందరికో ప్రమోషన్లు లభించాయి. నాతో పాటు ఆర్ఆర్ పాటిల్, దిలీప్ వాల్సే పాటిల్, చగ్గన్ భుజ్బల్, సునీల్ తాట్కరే.. లాంటి నేతలం అలా పైకి వచ్చినవాళ్లమే. మీ వృత్తిలో కూడా రాణిస్తే ప్రమోషన్లు, ఉన్నత పదవులు ఇస్తారు కదా అని అజిత్ పవార్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే.. ఎన్సీపీలోనూ కొత్త వాళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావడం సాధారణం. అదే సమయంలో పాత ముఖాలను పక్కనపెట్టడమూ సాధారణమే అని వ్యాఖ్యానించారాయన. షిండే వర్గం స్పందన.. అయితే.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ‘పవార్ రోటీ’ కామెంట్లపై స్పందించింది. అజిత్ పవార్ను పక్కనపెట్టే క్రమంలోనే శరద్ పవార్ ఆ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఇదీ చదవండి: మోదీపై ఖర్గే వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం -
మనం అనుకుంటున్నాం.. కానీ బీజేపీ 50శాతం మాత్రమే ఇస్తుందేమోననిపిస్తుంది సార్!
మనం అనుకుంటున్నాం.. కానీ బీజేపీ 50శాతం మాత్రమే ఇస్తుందేమోననిపిస్తుంది సార్! -
ఆయన బీజేపీతో కలిస్తే.. మేం నిష్క్రమిస్తాం
ముంబై: పవా(వ)ర్ హీట్తో.. మహారాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కింది. వచ్చే పది, పదిహేను రోజుల్లో రాజకీయ కుదుపులకు హస్తినతో పాటు మహారాష్ట్ర సైతం వేదిక అవుతుందంటూ ప్రచారం మొదలైన నేపథ్యంలో.. ఏం జరగనుందా? అనే చర్చ జోరుగా అక్కడ నడుస్తోంది. ఈ తరుణంలో.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ హాట్ టాపిక్గా మారారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్.. మద్దతు ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి సిద్ధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని, తాను ఎన్సీపీతోనే ఉంటానని తాజాగా స్పష్టమైన ప్రకటన చేశారు ఆయన. అయినప్పటికీ అజిత్ పవార్ తీరుపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీతో దోస్తీ ప్రచారం అట్లాగే చర్చల్లో ఉండిపోయింది. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన వర్గం స్పందించింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ గనుక బీజేపీతో చెయ్యి కలిపితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని షిండే వర్గం హెచ్చరించింది. ఈ మేరకు షిండే తాజాగా నియమించిన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మీడియాతో మాట్లాడారు. మా సిద్ధాంతం స్పష్టంగా ఉంది. ఎన్సీపీ అనేది వెన్నుపోటు పార్టీ. అలాంటి పార్టీతో అంటకాగే దుస్థితిలో మేం లేం. యావత్ మహారాష్ట్ర ఈ పరిణామాన్ని ఇష్టపడదు కూడా. కాంగ్రెస్-ఎన్సీపీలతో కూటమిలో కొనసాగకూడదనే కదా బయటకు వచ్చేం. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో ఎలా జట్టు కడతాం? అని శిర్సత్ మీడియా ద్వారా తెలియజేశారు. బీజేపీతో ఎన్సీపీ నేరుగా జత కట్టే అవకాశం లేదని.. ఒకవేళ అలాంటిదే జరిగితే మాత్రం తాము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని శిర్సత్ సంకేతాలు పంపారు. అజిత్ పవార్ ఎప్పటి నుంచో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన తనయుడు పార్థా పవార్ ఓటమిని ఆయన తట్టుకోలేకపోయాడు. పైగా ఇప్పుడు ఎన్సీపీలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ లేదు. ఈ పరిణామాలతోనే ఆయన ఆ పార్టీని వీడాలనుకుంటున్నారు. అజిత్ పవార్ ఎన్సీపీని వీడాలనే నిర్ణయాన్ని మేం స్వాగతిస్తాం. కానీ, ఎన్సీపీ నేతలతో గుంపుగా బీజేపీకి స్నేహ హస్తం చాచితే మాత్రం.. మేం ప్రభుత్వంలో కొనసాగబోం అని శిర్సత్ స్పష్టం చేశారు. 2019లో జరిగిన పరిణామాన్ని ఎవరూ మరిచిపోరు. ఫడ్నవిస్-అజిత్ పవార్ సాయంతో ఆఘమేఘాల మీద తెల్లవారుజామున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మూడే రోజుల్లో ఆ ప్రభుత్వం కుప్పకూలింది. దీనిపై శరద్ పవార్.. రాష్ట్రపతి పాలనను వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయోగమంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ, అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్లు గడిచినా నాటి పరిణామాలపై మౌనంగా ఉన్నారు అంటూ శిర్సత్ నాటి విషయాలను గుర్తు చేశారు. ఇదీ చదవండి: బాంబే హైకోర్టులో షిండే సర్కార్కు ఊరట -
Ajit Pawar: అదంతా జస్ట్ రూమర్
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మద్దతుదారులతో సహా బీజేపీలోకి మారతారంటూ వస్తున్న ప్రచారంపై స్పందించారు. ఈ అంశం ఇప్పుడు మహా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించిన ఆయన.. ఏ కారణం లేకుండా రూమర్లను ప్రచారం చేస్తున్న మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. పుకార్లలో ఏదీ నిజం కాదు. ఎన్సీపీలోనే ఉంటా. ఎన్సీపీతోనే నా ప్రయాణం కూడా అని పేర్కొన్నారు. ఎన్సీపీలో ముసలం, ప్రతిపక్షాల కూటమిలో చీలిక వచ్చిందన్న ప్రచారాల్ని ఆయన ఖండించారు. ఇలాంటి ప్రచారాల వల్ల ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే. ఎలాంటి ఆందోళన చెందకండి. ఎన్సీపీ అనేది శరద్ పవార్ నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మన ఉనికి మనదే అజిత్ పవార్ ప్రకటించారు. పవార్ తర్వాత నెంబర్ టూగా ఎన్సీపీలో ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ హవా నడుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు సైతం ఆయన వెంట ఉన్నారు. అయితే.. పవార్ కూతురు సుప్రియా సూలే ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. వచ్చే పదిహేను రోజుల్లో రెండు పెద్ద రాజకీయ కుదుపులకు వేదిక కానుందని వ్యాఖ్యానించారామె. ఒకటి ఢిల్లీ స్థాయిలో, మరొకటి మహారాష్ట్రలో రాజకీయ కుదుపులు ఉండనున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే అవేంటని మీడియా ఆమెను ఆరా తీయగా.. దాటవేత సమాధానం ఇచ్చారు. అది అజిత్ పవార్ పార్టీ మారడం గురించేనా అని అడగ్గా.. ఆ విషయాన్ని అజిత్ దాదా(అజిత్ పవార్ను ఉద్దేశించి)నే అడగాలని రిపోర్టర్లకు సూచించారామె. ప్రజాప్రతినిధిగా తనకు చాలా పని ఉందని, ఉత్తినే మాట్లాడేందుకు తనకు సమయం లేదన్నారు. అంతకు ముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ఎన్సీపీ ఎమ్మెల్యేల చీలిక, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వచ్చిన కథనాలను ఖండించారు. ‘పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఎలాంటి సమావేశానికి పిలుపు ఇవ్వలేదు. అతను ఎన్సీపీ కోసమే పని చేస్తున్నాడు. ఇంతా మీ బుర్రలోంచి పుట్టిందేమో అంటూ మీడియాకు చురకలు అంటించారు. -
కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్కు భారీ ఝలక్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. విపక్షాల ఐక్యత పేరిట కాంగ్రెస్తో దోస్తీలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP).. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ కీలక నేతలతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ, తామంతా ఒక్కటేనంటూ ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన ఎన్సీపీ.. 40 నుంచి 45 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అక్కడ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ తరుణంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఆశ్చర్యకర రీతిలో ఎన్సీపీ పోటీలోకి దిగుతోంది. ఈ పోటీ మిత్రపక్షం కాంగ్రెస్ అవకాశాలపై ప్రభావం చూపించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా జాతీయ పార్టీ హోదా కోల్పోయిన ఎన్సీపీకి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ క్లాక్ సింబల్నే కేటాయించడం విశేషం. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో మరాఠా జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి భాగస్వామ్యంతో ఎన్సీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ డిమాండ్ విషయంలో పవార్, విపక్షాల(కాంగ్రెస్ నేతృత్వంలోని) నుంచి విభేదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం పవార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. బీజేపీపై పోరుకు విపక్షాల ఐక్యత పేరిట ఒక్కటిగా ముందుకు సాగాలని ఈ భేటీలో తీర్మానించుకున్నారు కూడా. ఈలోపే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టే నిర్ణయం ఎన్సీపీ తీసుకోవడం గమనార్హం. -
దేశంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయంటే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: సీపీఐకి జాతీయ హోదాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. దీనిపై అప్పీలుకు వెళతామని ప్రకటించారు. త్వరలో జాతీయ హోదా పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న సీపీఐ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నదని, ఈసీ నిర్ణయం విచారకరమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈసీ కేవలం సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకుందన్నారు. అయినా సీపీఐ ప్రజల్లో ఉంటుందని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటుందని ప్రకటించారు. ఇక సీపీఐకి జాతీయ హోదా రద్దు, ఆప్కు హోదా ఇవ్వడంలో రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఆప్కు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారని ఆరోపించారు. జాతీయ పార్టీగా సీపీఐకి ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, దాన్ని ఎవరూ చెరిపివేయలేరని పేర్కొన్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కనబర్చిన పనితీరు ఆధారంగా ఆప్కు జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు ఇప్పటిదాకా ఉన్న జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కు, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ, మణిపూర్లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్లో ఆర్ఎస్సీ, మణిపూర్లో ఎంపీసీ పార్టీలకు ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నాగాలాండ్లో ఎన్సీపీ, మేఘాలయలో టీఎంసీలకు త్వరలో రాష్ట్ర పార్టీ హోదా కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. నాగాలాండ్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్), మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ, త్రిపురలో తిప్రా మోతా పార్టీలకు ‘గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీ’ హోదా ఇస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు, సమీక్షల తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం జాతీయ పార్టీలు ఆరు ఎన్నికల సంఘం తాజా చర్యల మేరకు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉన్నట్టయింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. ► జాతీయ హోదా పొందిన ఆప్ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. అతి తక్కువ సమయంలోనే తమ పార్టీకి జాతీయ హోదా దక్కడం పట్ల కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ►1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. ►జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచి్చంది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. ►శరద్పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్సరంలో జాతీయ హోదా లభించింది. తర్వాత ప్రభావం తగ్గిపోయింది. ఏపీలో పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్కు హోదా రద్దు తెలంగాణ ఏర్పాటు నినాదంతో 2001లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ఏర్పాటైంది. 2004 సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ హోదా కోసం తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ 16 చోట్ల బరిలోకి దిగింది. తెలంగాణలో ఐదు లోక్సభ స్థానాలను గెలుచుకోవడంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకశాతం ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల తర్వాత రాష్ట్ర పార్టీ హోదా దక్కింది. 2009 సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఇతర ఎన్నికల్లోనూ ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంనాటి రాష్ట్ర హోదా గుర్తింపు.. విభజన తర్వాత కూడా ఏపీలో కొనసాగింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం సమీక్షలో ఆ హోదాను కోల్పోయింది. -
EC: ఆప్కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆప్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది. ఇదే సమయంలో మరో మూడు జాతీయ హోదా కలిగిన పార్టీలకు షాకిచ్చింది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. ఇక, ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. అయితే, 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది. Election Commission of India recognises Aam Aadmi Party (AAP) as a national party. Election Commission of India derecognises CPI and TMC as national parties. pic.twitter.com/9ACJvofqj6 — ANI (@ANI) April 10, 2023 -
NCP: జాతీయ పార్టీ హోదా కోల్పోనున్న పవార్ పార్టీ?
న్యూఢిల్లీ: సీనియర్ పొలిటీషియన్ శరద్ పవార్కు షాక్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైందా?. ఆయన స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి ఉన్న జాతీయ పార్టీ హోదాను పునఃపరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. జాతీయ హోదా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ అంశంపై ఎన్సీపీ నుంచి ప్రతినిధి వివరణ కోరింది ఈసీ. ఒకవేళ ఎన్సీపీ ప్రతినిధి ఇచ్చిన వివరణను.. ఈసీ అంగీకరించని పక్షంలో పవార్ పార్టీకి షాక్ తగలనుంది. జాతీయ పార్టీ హోదాను కోల్పోతుంది ఎన్సీపీ. అప్పుడు అది ఒక ప్రాంతీయ పార్టీగానే.. వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందంతే. జాతీయ పార్టీ హోదా కారణాంగా.. అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పలు రాష్ట్రాలలో పార్టీకి ఉమ్మడి గుర్తు, న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలంతో పాటు ఎన్నికల సమయంలో ఉచితంగా పబ్లిక్ బ్రాడ్కాస్టర్లలో ప్రసార సమయం లభిస్తాయి. ఎన్నికల సంఘం 2016లో రాజకీయ పార్టీల జాతీయ పార్టీ హోదా స్థితిని సమీక్షించే విధానాన్ని సవరించింది. అప్పటిదాకా ఐదు సంవత్సరాలకొకసారి సమీక్షిస్తుండగా.. దానిని ప్రతి 10 సంవత్సరాలకు సమీక్షించేలా రూల్స్ మార్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఎన్సీపీతో పాటు సీపీఐ, టీఎంసీల జాతీయ పార్టీ హోదా వ్యవహారం ఎన్నికల సంఘం ముందు సమీక్షకు వచ్చింది. అయితే అప్పటి నుంచి వరుసగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో.. యథాతథ స్థితిని కొనసాగించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పుడు ఆ అంశమే మళ్లీ తెర మీదకు వచ్చింది. సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం.. జాతీయ హోదాను కోల్పోయిన పార్టీకి దేశవ్యాప్తంగా ఉమ్మడి గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. 1999 జూన్ 10వ తేదీన ఆవిర్భవించింది. శరద్ పవార్, పీఏ సంగ్మా, తారీఖ్ అన్వర్లు ఈ పార్టీ వ్యవస్థాపకులు. సోనియా గాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నేతలైనా ఈ ముగ్గురు తిరుగుబావుటా ఎగరేయడంతో పార్టీ వీళ్లను బహిష్కరించింది. ఆపై వీళ్లు ఎన్సీపీని స్థాపించగా.. అటుపై ఇండియన్ కాంగ్రెస్(సోషలిస్ట్)-శరత్ చంద్ర సిన్హా పార్టీ, ఎన్సీపీలో విలీనం అయ్యింది. మహారాష్ట్రలో ఎన్సీపీ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అలారం క్లాక్ ఈ పార్టీ గుర్తు. త్రివర్ణ పతాకం మధ్యలో అలారం క్లాక్.. పార్టీ జెండాగా ఉంది. జాతీయ స్థాయిలో యూపీఏతో పొత్తు నడిపించిన ఈ పార్టీ.. కేరళలో ఎల్డీఎఫ్Left Democratic Front, మహారాష్ట్రలో Maha Vikas Aghadi కూటమి, యూపీలో సమాజ్వాదీ పార్టీ, జార్ఖండ్లో మహాఘట్బంధన్, నాగాలాండ్లో ఎన్డీపీపీతో పొత్తు సాగిస్తోంది. ఒక పార్టీ.. రాష్ట్ర/ప్రాంతీయ పార్టీ గుర్తింపు ఉండాలంటే.. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలి. లేదంటే లోక్సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో 6 శాతం ఓట్లు, ఒక ఎంపీ సీటు సాధించాలి. లేకుంటే.. గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడు శాతం సీట్లు లేదా మూడు సీట్లు(ఏది ఎక్కువగా అయితే అది)గెలవాల్సి ఉంటుంది. ఇది కాకుంటే.. అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కనీసం 8 శాతం ఓట్లు పొందాలి. ఇలా ఈసీ రూల్స్ ప్రకారం.. ఆ పార్టీ రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. మరి జాతీయ పార్టీ గుర్తింపు కోసం.. రాష్ట్రంలో క్రియశీలంగా ఉన్న పార్టీ.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే.. ఎన్నికల సంఘం పరిధిలోని అర్హతలను అందుకోవాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి. లేదంటే.. దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ 2 శాతం చొప్పున ఓట్లు పొందాలి. కుదరకుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో(అసెంబ్లీ లేదా లోక్సభ) నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లు సాధించాలి. దేశంలో ప్రస్తుతం 8 జాతీయ పార్టీలు 1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2. భారతీయ జనతా పార్టీ 3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐ 4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - సీపీఎం 5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ( నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది కాబట్టి జాతీయ పార్టీగా అవతరించింది) 6. బహుజన్ సమాజ్ పార్టీ 7. నేషనలిస్ట్ కాంగ్రెస్ 8. నేషనల్ పీపుల్స్ పార్టీ ఇదీ చదవండి: సీల్డ్ కవర్ సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం కామెంట్లు ఇవి! -
ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు
ముంబై: ఎన్సీసీ ఎంపీ సుప్రియా సూలేకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర పుణెలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె చీరకు నిప్పంటుకుంది. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. అక్కడున్న దీపం ఆమె చీరకు అంటుకుని మంట వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. మంటను వెంటనే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. పుణెలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. सुप्रिया की साड़ी में लगी आग पुणे में एक कार्यक्रम के दौरान एनसीपी नेता और सांसद सुप्रिया सुले जब शिवाजी की प्रतिमा पर हार चढ़ा रही थी तो उनकी साड़ी दिए कि लौ के बीच आ गयी और साड़ी में आग पकड़ लग गयी फिलहाल सुप्रिया सुरक्षित है pic.twitter.com/juGQjkTswO — Rajiv Singh (@indiatvrajiv) January 15, 2023 చదవండి: రాష్ట్రపతి ముర్ము ఆశీస్సుల కోసం ప్రయత్నించింది.. విషయం తెలియక సస్పెన్షన్కు గురైంది! -
క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్సభ సభ్యత్వం రద్దు..
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్లు జైలు శిక్షపడిన లక్ష్యద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వం రద్దయింది. లోక్సభ సెక్రటేరియట్ ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహమ్మద్ ఫైజల్ ఎన్సీపీ ఎంపీ. 2009లో కాంగ్రెస్ నేత మహమ్మద్ సాలిపై కొంతమంది సమూహంతో వెళ్లి దాడి చేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫైజల్ సహా మొత్తం 32 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఫైజల్కు 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది సెషన్స్ కోర్టు. బుధవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఆయన కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్సభ రద్దు చేసింది. చదవండి: మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. -
మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ
ముంబై: ఏక్నాథ్ షిండే– బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రపాలనను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ (మహా వికాస్ అఘాడీ–ఎంవీఏ) కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఛత్రపతి శివాజీ మహరాజ్, మహా త్మా ఫూలే వంటి మహనీయులను మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ అవమానించడాన్ని ఎంవీఏ కూటమి తీవ్రంగా తప్పబట్టింది. కోష్యారీని గవర్నర్ పదవి నుంచి వెంటనే తప్పించాలని కూటమి అగ్రనేతలు డిమాండ్చే శారు. ముంబైలోని బైకుల్లాలో ప్రారంభమైన ‘హల్లా బోల్’ నిరసన ర్యాలీ.. నాలుగు కిలో మీటర్లు కొనసాగి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ వద్దకు చేరుకున్నాక ఉద్ధవ్ ఠాక్రేసహా కూటమి నేతలు ర్యాలీ వేదికపై ప్రసంగించారు. ‘ గవర్నర్ను పదవి నుంచి వెంటనే తప్పించాలి. లేదంటే మీకు గుణపాఠం నేర్పిస్తాం’ అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరించారు. -
'హర్ హర్ మహాదేవ్' ప్రదర్శన నిలిపివేత.. ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరాఠీ చిత్రం ‘హర్ హర్ మహదేవ్’ సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించినందుకు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్సీపీ నేత అవద్, తన అనుచరులతో కలిసి థానే నగరంలోని ఓ మల్టిప్లెక్స్లోకి బలవంతంగా ప్రవేశించారు. ‘హర్ హర్ మహాదేవ్’ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ ఆరోపిస్తూ స్క్రీనింగ్ను అడ్డుకున్నారు. అంతేగాక సినిమా చూస్తున్న ప్రేక్షకులపై దాడి చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. హర్ హర్ మహాదేవ్ చూసినందుకు సినిమా ప్రేక్షకులను కొట్టడాన్ని సహించేది లేదని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తాను సినిమా చూడలేదని, ఈ వివాదం గురించి తెలియదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు అనుమతి ఉంది కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని ఫడ్నవీస్ హెచ్చరించారు. చదవండి: Gyanvapi Mosque Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం -
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు అస్వస్థత
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించటంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పవార్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసింది ఎన్సీపీ. కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్ నవంబర్ 2న డిఛార్జి కానున్నారని పార్టీ తెలిపింది. నవంబర్ 4 నుంచి 5 వరకు రెండు రోజుల పాటు శిరిడిలో నిర్వహించ తలపెట్టిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष आदरणीय शरद पवार साहेब यांची प्रकृती ठीक नसल्यामुळे पुढील तीन दिवस पवार साहेबांना मुंबईतील ब्रीज कॅन्डी रुग्णालयात उपचारासाठी दाखल करण्यात येणार आहे. #NCP pic.twitter.com/YpjqjcFw1E — NCP (@NCPspeaks) October 31, 2022 -
‘మహా’ పాలిటిక్స్లో మరో ట్విస్ట్.. శరద్ పవార్కు బిగ్ షాక్!
శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పటికీ శివసేన వర్సెస్ శివసేన రెబల్స్ అన్నట్టుగా రాజకీయం కొనసాగుతోంది. కాగా, మహా పాలిటిక్స్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత శరద్ పవార్ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీకి భారీ షాక్ తగిలింది. నవీ ముంబై మున్సిపల్ ఎన్నికల ముందు పవార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ సీనియర్ నాయకుడు అశోక్ గావ్డే సీఎం ఏక్నాథ్ షిండేను కలిశారు. ఈ క్రమంలో ఎన్సీపీకి గుడ్బై చెప్పి.. షిండే వర్గంలో చేరేందుకు సిద్దమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, అశోక్తో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా ఎన్సీపీని వీడుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. నవీ ముంబై జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గావ్డేను ఇటీవలే ఎన్సీపీ తొలగించింది. ఆ స్థానంలో నామ్ దేవ్ భగత్ ను ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ నియమించారు. దీంతో, మనస్థాపానికి గురైన అశోక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అశోక్ గావ్డే అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. ఇక, తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి గావ్డే ఇటీవలే తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ స్థానిక యూనిట్లో గ్రూపులు ఉన్నాయి. కొంత మంది సీనియర్ పార్టీ కార్యకర్తలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించినట్టు సమాచారం. Big Jolt to #NCP ahead of #NaviMumbai civic polls as party's erstwhile district president, Ashok Gawde along with six other corporators expected to join CM Eknath Shinde's camp@MalhotraShivya & @Aruneel_S with more on the same pic.twitter.com/DZMgWW4pDJ — TIMES NOW (@TimesNow) September 11, 2022 -
థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు బిహార్ సీఏం నితీశ్ కమార్. ఇందులో భాగంగనే బుధవారం ఎన్సీపీ అధినేత శరద్పవార్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాని, ప్రధాని అభ్యర్థి కావాలనే ఆలోచన లేదని నితీశ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. అందుకే అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మెయిన్ ఫ్రంట్.. తాము థర్డ్ ఫ్రంట్ కోసం కాదు మెయిన్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు నితీశ్ వ్యాఖ్యానించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు 2024లో భిన్నంగా ఉంటాయన్నారు. ప్రధాని మోదీకి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారని మీడియా ప్రశ్నించగా.. నితీశ్ స్పందించారు. ప్రకటనలు, పేర్లు మార్చడం తప్ప బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నితీశ్ సన్నిహిత వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి విపక్షాలను ఏకం చేయడంపైనే ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీకి కలిసొచ్చిందని ఆయన భావిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై ఇప్పటివరకైతే పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్లను పరిశీలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. నితీశ్ కుమార్ పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. చదవండి: భారత్ జోడో యాత్ర షురూ -
గడ్కరీ ఇమేజ్ను బీజేపీ ఓర్వలేకపోయిందా?
ముంబై: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని.. అనూహ్యంగా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది బీజేపీ. ఈ నిర్ణయం సొంత పార్టీ నేతలనే కాదు.. ఆయనతో దగ్గరి సంబంధాలు ఉన్న విపక్ష నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఈ పరిణామాన్ని ఆధారంగా చేసుకుని.. బీజేపీపై విమర్శలు సంధించింది ఎన్సీపీ. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడంపై స్పందించింది. ప్రజల్లో గడ్కరీ ఇమేజ్ నానాటికీ పెరిగిపోతోందని, అది భరించలేకే బీజేపీ ఆయన్ని పక్కన పెట్టిందని ఆరోపించింది. అంతేకాదు గడ్కరీని బీజేపీలో విచక్షణ, వివేకం ఉన్న నేతగా అభివర్ణించింది శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ. మీ శక్తిసామర్థ్యాలు, వ్యక్తిగత ఇమేజ్ పెరిగినప్పుడు.. ఉన్నత స్థాయికి సవాలుగా మారినట్లే లెక్క. అప్పుడు BJP మీ స్థాయిని అమాంతం తగ్గిస్తుంది. కళంకం ఉన్నవాళ్లు ఆ స్థానంలో అప్గ్రేడ్ అవుతారు అంటూ ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో.. గడ్కరీని పక్కనపెట్టడాన్ని ఉద్దేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నితిన్ గడ్కరీకి మహా రాజకీయాల్లో సొంత పార్టీ నుంచే ప్రత్యర్థిగా భావించే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కేంద్ర ఎన్నికల కమిటీలో చేర్చింది బీజేపీ . గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను సైతం బీజేపీ తన పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం గమనార్హం. మరోవైపు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే రాజకీయాలను వదిలేయాలని అనిపిస్తోందంటూ గడ్కరీ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలే చేశారు కూడా. ఇదీ చదవండి: అనూహ్యం.. బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డు ఇదే! -
బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్!
సాక్షి ముంబై: బీజేపీకి వ్యతిరేకంగా ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. ‘బీజేపీ నాయకులపై ఈడీ, సీబీఐ, ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందా? ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారిపై ఇంతవరకు చర్యలు కొనసాగుతున్నాయా? ఒకవేళ చర్యలు కొనసాగుతున్నాయని తెలిస్తే వివరాలు చెప్పండి.. అక్షరాల ఒక లక్ష రూపాయలను గెలుపొందండి’ అంటూ ఔరంగాబాదు ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ బ్యానర్ కట్టాడు. ఈ బ్యానర్ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. అందిన వివరాల మేరకు ఔరంగాబాదు ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ ఈ బ్యానర్ను ఔరంగాబాదులోని క్రాంతిచౌక్ పరిసరాల్లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజీపీలో చేరిన వారిపై ఎలాంటి చర్యలుండవని, కేవలం ఈడీ, సీబీఐల పేర్లతో బెదిరించి ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని వివరించేందుకే ఈ బ్యానర్ ఏర్పాటు చేశానని పాటిల్ చెప్పారు. చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? VIDEO: भाजपा नेत्यांवर 'ईडी'ची कारवाई झाल्याचे दाखवा, १ लाख मिळवा; औरंगाबादमध्ये बॅनर झळकले! pic.twitter.com/7OhpdbS7fz — Lokmat (@lokmat) August 1, 2022 -
ప్రతిపక్ష పదవి మాకే కావాలి.. ఎన్సీపీ, కాంగ్రెస్పై శివసేన ఒత్తిడి
సాక్షి, ముంబై: రాష్ట్ర విధాన పరిషత్లో ప్రతిపక్ష నేత పదవి కావాలని శివసేన డిమాండ్ చేస్తోంది. అందుకు మహా వికాస్ ఆఘాడిలో శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లపై ఒత్తిడి చేయనున్నట్లు విధాన పరిషత్తో శివసేనకు చెందిన నూతన సభ్యుడు సచిన్ అహిర్ వెల్లడించారు. ఇటీవల శివసేన నేత ఏక్నాథ్ శిందే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తరువాత విధాన మండలి (అసెంబ్లీ)లో ప్రతిపక్ష పదవి నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో విధాన్ పరిషత్లో ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలని శివసేన డిమాండ్ చేస్తోంది. విధాన పరిషత్లో కాంగ్రెస్, ఎన్సీపీతో పోలిస్తే శివసేనకు సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ప్రతిపక్ష నేత పదవి కోసం పట్టుబట్టేందుకు శివసేనకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇరు పార్టీల కంటే శివసేనకు 13 మంది ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ఈనెల చివరి వారంలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత పదవి తమకే కావాలని డిమాండ్ చేయనున్నట్లు అహిర్ పేర్కొన్నారు. చదవండి: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ శిందే, ఆయన మద్దతుదారులు ఎన్ని కుయుక్తులు పన్నినా విల్లు, బాణం (ధనుశ్య, బాణ్) గుర్తు అసలైన శివసేన వద్ద అంటే సుమారు 55 ఏళ్ల కిందట హిందు హృదయ్ సమ్రాట్ దివంగత బాల్ ఠాక్రే స్ధాపించిన శివసేన వద్ద, ఆయన వారసులైన ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే వద్దే శాశ్వతంగా ఉంటుందని అహిర్ స్పష్టం చేశారు. శిందే తిరుగుబాటుతో పార్టీలో నెలకొన్న గందరగోళంవల్ల అనేక మంది శివసైనికుల ఆత్మస్ధైర్యం దెబ్బతింది. దీంతో అదే దూకుడు, ఉత్సాహం, ఊపుతో, మానసికంగా బలపడి శివసేన కొత్త పుంతలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తుందని సచిన్ అహిర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: వివాదాస్పద వీడియో.. బీజేపీ మహిళా నేత అరెస్ట్ -
రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్
రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్లకు రాజ్యసభ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించింది ముంబై కోర్టు. ఈ మేరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఈ ఇద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(PMLA)యాక్ట్ ప్రకారం వేర్వేరు కేసుల్లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి దేశ్ముఖ్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా.. కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం అనారోగ్యకారణంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం(జూన్ 10న) రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాలని, ఒక్కరోజు ఎస్కార్ట్తో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూర్ చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. బుధవారం ఈ పిటిషన్కు సంబంధించి సుదీర్థ వాదనలు జరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైల్లో ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదని వాదించారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ఎస్ రోకడే.. బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో మనీల్యాండరింగ్ కేసులో శిక్ష అనుభవించిన ఆనాటి కేబినెట్ మంత్రి చగ్గన్ భుజ్బల్.. కోర్టు అనుమతి ద్వారా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓటు వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు దేశ్ముఖ్ తరపు న్యాయవాది. అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్.. మంత్రిగా ఉన్న సమయంలో వివిధ పబ్ల నుంచి పోలీసుల ద్వారా నాలుగున్నర కోట్ల రూపాయలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ నవంబర్ 2021లో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మహారాష్ట్ర మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ను ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. -
భీమా–కోరేగావ్ కేసులో పవార్కు సమన్లు
ముంబై: 2018 జనవరి 1న చోటుచేసుకున్న భీమా–కోరేగావ్ హింసాకాండ కేసులో దర్యాప్తు కమిషన్ నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్కు సమన్లు జారీ చేసింది. మే 5, 6న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆయన సాక్ష్యాన్ని నమోదు చేస్తామని తెలిపింది. దర్యాప్తు కమిషన్కు శరద్ పవార్ ఏప్రిల్ 11న సమర్పించిన అదనపు అఫిడవిట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ సంఘటన విషయంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన జరగడానికి దారితీసిన పరిస్థితుల గురించి తనకు సమాచారం లేదన్నారు. భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ(దేశద్రోహానికి సంబంధించినది) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని శరద్ పవార్ కోరారు. ఈ సెక్షన్ను పూర్తిగా రద్దు చేయాలని లేదా ఇందులో మార్పులు చేయాలని విన్నవించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి 1870లో బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన సెక్షన్ 124ఏను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశ సమగ్రతను కాపాడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సరిపోతుందని సూచించారు. భీమా–కోరేగావ్ కేసులో దర్యాప్తు కమిషన్ 2020లో శరద్ పవార్కు సమన్లు జారీ చేసింది. కానీ, అప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆయన హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సమన్లు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. -
ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్
-
ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్టు
ముంబై: మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్ను అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి బుధవారం ఉదయం 8 గంటలకు మాలిక్ను తీసుకువచ్చిన ఈడీ అధికారులు ఆయన్ను దాదాపు 6 గంటలు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కస్టడీలోకి తీసుకొని బందోబస్తుతో వైద్య పరీక్షలకు పంపారు. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్ను ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. ఆయనకు ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3వరకు ఈడీ కస్టడీ విధించింది. అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. దావూద్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. అఘాడీలో ఆందోళన నవాబ్ మాలిక్ అరెస్టుతో అధికార మహా అఘాడీ కూటమిలో కలకలం రేగింది. ఎన్సీపీకి చెందిన మంత్రులు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్, హసన్ ముషరిఫ్, రాజేశ్ తోపె తదితరులు అధినేత శరద్ పవార్తో సమావేశమయ్యారు. మాలిక్ అరెస్టు తర్వాత పరిణామాలపై చర్చలు జరిపారు. మాలిక్ రాజీనామా చేస్తే ఆయన పోర్టుఫోలియోలను ఎవరికివ్వాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మాలిక్ మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బాలాసాహెబ్, అశోక్, సునీల్ శరద్ పవార్తో సమావేశమయ్యారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని ఈ సందర్భంగా కూటమి నేతలు ఆరోపించారు. గతేడాది మాలిక్ అల్లుడు సమీర్ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్టు చేసింది. అప్పటి కేసు ఈ నెల 15న ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్తో మాలిక్కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. 2.86 ఎకరాల భూమిన కారుచౌకగా మాలిక్ దక్కించుకున్నారని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. కక్షపూరిత చర్య: ఎన్సీపీ కొందరు చేసిన తప్పులు బయటపెడుతున్నందుకే నవాబ్ మాలిక్ను కేంద్రం అరెస్టు చేయించిందని, కేంద్ర అధికార దుర్వినియోగానికి ఈ అరెస్టు నిదర్శనమని ఎన్సీపీ విమర్శించింది. ఇలాంటి రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తామని శివసేన, కాంగ్రెస్ ప్రకటించాయి. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి శివసేన, కాంగ్రెస్ మహా అఘాడీ కూటమి పేరిట అధికారంలో ఉన్నాయి. కేంద్ర ఏజెన్సీలు మాఫియాలాగా బీజేపీ వ్యతిరేకులను టార్గెట్ చేస్తున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. 2024 వరకు ఈ ధోరణి కొనసాగుతుందని, తర్వాత వారు ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. అండర్వరల్డ్తో సంబంధం లేని ఒక ముస్లిం యాక్టివిస్టును అరెస్టు చేయాలంటే దావూద్ పేరు తీసుకువస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. సదరు కేసు నమోదై 25ఏళ్లు గడిచిపోయాయని, కానీ ఇప్పటికీ తమ వ్యతిరేకులను ఇబ్బంది పెట్టేందుకు ఆ కేసులో పేర్లను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మాలిక్ అరెస్టును నిరసిస్తూ ఎన్సీపీ కార్యకర్తలు ఈడీ ఆఫీసుకు దగ్గర్లోని ఎన్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అరెస్టైన మాలిక్కు మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని, రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ డిమాండ్ చేశారు. మాలిక్ అరెస్టును టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఖండించారు. -
మోదీ ఆలోచించమన్నారు.. సాధ్యం కాదని చెప్పా: శరద్ పవార్
పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, ఎన్సీపీ కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరినట్లు తెలిపారు. మరాఠీ దినపత్రిక బుధవారం నిర్వహించిన 'లోక్సత్తా' కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ.. 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు చర్చల సమయంలో ఎన్సీపీ, బీజేపీ కలిసిరావాలని మోదీ తనతో చర్చించిన విషయం నిజమేనని తెలిపారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన సీఎం పదవికి సంబంధించిన విషయంలో బీజేపీతో విడిపోయిన విషయం తెలిసిందే. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సుమారు 90 రోజుల వరకూ నూతన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రధాని మోదీతో చర్చ జరిగిన సమయంలో.. ఎన్సీపీ, బీజేపీలు కలసి రావాలని మోదీ అన్నట్లు తెలిపారు. అయితే తాను అది సాధ్యం కాదని స్పష్టం చేశానని పేర్కొన్నారు. తమ వైఖరి భిన్నమైందని తెలిపినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆ విషయం గురించి ఆలోచించమని మోదీ అన్నారని పేర్కొన్నారు. శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన నేత సంజయ్రౌత్ మాట్లాడుతూ.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ‘మహావికాస్ అగాడీ కూటమి’గా ఏర్పడి ఉద్దవ్ థాక్రే సీఎంగా ఎంపికయ్యారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించిందని కానీ సాధ్యం కాలేదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాలేదని తెలిసి ఎవరితోనైనా జట్టుకట్టడానికి సిద్ధపడిందని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. -
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మొదలైన ఫిరాయింపుల పర్వం?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో వివిధ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైనట్లే కనిపిస్తోంది. గురువారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మహిళా నేత రూపాలీ పాటిల్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజయ్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. రూపాలీ పాటిల్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్ సమక్షంలో ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పుణేలో అజిత్ పవార్ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు తాను ఆకర్శితురాలిని అయ్యానని, అందుకే ఎన్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా రూపాలీ వెల్లడించారు. తాను ఎమ్మెన్నెస్లో ఉన్నప్పటికీ మరో పార్టీ అనే భేదం లేకుండా పవార్ తనతో సంప్రదింపులు జరిపేవారని, సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అజిత్ పవార్ పనితీరును ఆమె మెచ్చుకున్నారు. చదవండి: (ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి..) మారుతున్న కాలాన్ని బట్టి మనమూ మారాలని, ఈ విషయాన్ని తాను అనేకసార్లు రాజ్ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ, పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెన్నెస్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. త్వరలో పుణేలో జరగనున్న భారీ సదస్సులో మరింత మంది మహిళా నేతలు ఎన్సీపీలో చేరతారని చెప్పారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. రూపాలీ చేరికతో పుణేలో ఎన్సీపీ మహిళా విభాగం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. తమ పార్టీ కుల, మత భేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరినీ కలుపుకొని ముందుకు పోతుందని స్పష్టం చేశారు. కాగా, రూపాలీ ఎన్సీపీలో చేరడంతో పుణేలో ఎమ్మెన్నెస్కు గట్టి దెబ్బ తగలనుందని చెప్పవచ్చు. సంజయ్కు కండువా కప్పిన భుజ్బల్ నాంద్గావ్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన సంజయ్ పవార్ గురువారం నాసిక్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఛగన్ భుజ్బల్ సమక్షంలో ఎన్సీపీలో చేరారు. ఈ సందర్భంగా భుజ్బల్ ఆయనకు ఎన్సీపీ ఖండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, 2004–2009 మధ్య కాలంలో శివసేన ఎమ్మెల్యేగా పని చేసిన సంజయ్ పవార్, తదనంతర కాలంలో శివసేన నుంచి బయటకు వచ్చి ఎన్సీపీలో చేరారు. ఆ తరువాత మళ్లీ శివసేనలో చేరిన ఆయన, ఆ తరువాత బీజేపీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. అక్కడ కూడా ఇమడలేక తాజాగా ఎన్సీపీలో చేరిన సంజయ్ పవార్.. ఇకపై తాను పార్టీలు మారనని, కడ వరకు ఎన్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. -
MLC: వచ్చే ఏడాది 17 ఎమ్మెల్సీలు ఖాళీ.. గెలుచుకునే అవకాశాలు ఇలా..
ముంబై: మహరాష్ట్ర శాసన మండలిలో వచ్చే ఏడాది 17 స్థానాలు ఖాళీ కానున్నాయి. 2016లో ఎన్నికైన 17 మంది ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఈ 17 మందిలో పదిమంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడిన వారు కాగా, మిగతా ఏడుగురు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ముగియనుండటంతో వచ్చే ఏడాది జరిగే మండలి ఎన్నికల తర్వాత మహరాష్ట్ర శాసన మండలి రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శాసన సభలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం బీజేపీ నాలుగు ఎమ్మెల్సీలు, శివసేన, ఎన్సీపీలు చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే అవకాశాలుండగా, కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని గెలుచుకునే అవకాశముంది. ఇలా తొమ్మిది సీట్లు బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు గెలుచుకున్నా పదవ సీటు కోసం మాత్రం గట్టి పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వతంత్రులు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికితే పదో స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రకంగా మహా ఆఘాడికి చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా గెలిచే అవకాశాలున్నాయి. పదవీ కాలం ముగియనున్న సభ్యుల్లో రామ్రాజే నాయిక్ నింబాల్కర్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్కి మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి వయస్సు ఎక్కువగా ఉండటం వల్ల మళ్లీ అవకాశం దక్కకపోవచ్చని, వారిద్దరికి ఉన్న రాజకీయ అనుభవాన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చినా ఇవ్వొచ్చని పలువురు విశ్లేషణలు చేస్తున్నారు. చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయిన ప్రియుడు) బీజేపీ నుంచి ఎనిమిదిమంది.. పదవీకాలం ముగియనున్న సభ్యుల్లో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారుకాగా, శివసేనకు చెందిన నలుగురు, ఎన్సీపీకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్కు చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. తన సంఖ్యాబలాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నించవచ్చు. శాసన సభ సభ్యుల ద్వారా బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎన్నిక కావొచ్చు. స్థానిక స్వపరిపాలనా సంస్థల నియోజక వర్గాల సంఖ్యాబలం కాగితాలపై కనిపించదు. ఎక్కువ ప్రభావం కలిగిన వ్యక్తులు గెలుస్తారు. గవర్నర్ కోటాలో నియమించే 12 మంది సభ్యుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొత్త ఏడాదిలో మరో 17 మంది నూతనంగా ఎన్నిక కానున్నారు. దీంతో శాసన మండలి ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి: (రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్) ఎవరెవరి పదవీ కాలం ముగియనుందంటే.. వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలలో బీజేపీకి చెందిన ప్రవీణ్ దరేకర్, సదాభావు ఖోత్, సుజీర్త్సహ్ ఠాకూర్, వినాయక్ మోరే, ప్రసాద్ లాడ్, రామ్నివాస్ సింగ్, చందూభాయి పటేల్, పరిణయ్ ఫుకే ఉన్నారు. శివసేనకు చెందిన ఎమ్మెల్సీల్లో సుభాశ్ దేశాయ్, దివాకర్ రావ్తే, రవీంద్ర ఫాటక్, దుష్యంత్ చతుర్వేది తదితరుల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఎన్సీపీ నుంచి సంజయ్ ధౌండ్, రామ్రాజే నాయిక్ నింబాల్కర్, అనిల్ భోంస్లేల పదవీ కాలం ముగియనుండగా.. కాంగ్రెస్ నుంచి మోహన్ కదం, అమర్ రాజుర్కర్ల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. -
బాంబే హైకోర్టుకు నవాబ్ మాలిక్ క్షమాపణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టుకు శుక్రవారం క్షమాపణ చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖెడే, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తాను హామీ ఇచ్చినప్పటికీ బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను ఈ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అస్పీ చినోయ్ కోర్టులో అఫిడవిట్ వేశారు. నవంబర్ 29న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. కోర్టును అగౌరవపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. వాంఖెడేపై తన క్లయింట్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చినోయ్ వివరించారు. మాలిక్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. మాలిక్పై వాంఖెడే తండ్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణకు వచ్చేదాకా వాంఖెడే కుటుంబంపై విమర్శలు చేయనంటూ మాలిక్ హామీ ఇచ్చారు. కానీ, విమర్శలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెయిల్ నిబంధనలు మార్చండి: ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ విధించిన నిబంధనలు మార్చాలని షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బాంబే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాడు. ప్రతి శుక్రవారం దక్షిణ ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కార్యాలయంలో హాజరు కావాలంటూ విధించిన నిబంధనను మార్చాలని అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు వచ్చేవారం విచారణ చేపట్టనుంది. -
ఆర్యన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు
ముంబై: ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని పెంచుతోంది. షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ని కిడ్నాప్ చేసి కోట్లు దండుకోవాలని కుట్రపన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రకి బీజేపీ నేత మోహిత్ భారతీయ ప్రధాన సూత్రధారని ఆరోపించారు. మాలిక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే కూడా కుట్రలో భాగస్వామేనని అన్నారు. క్రూయిజ్ నౌకపై దాడి జరగడానికి ముందు ఒషివరలోని ఒక శ్మశాన వాటిక వద్ద మోహిత్ను వాంఖెడే కలిశారన్నారు. అయితే వాంఖెడేకి అదృష్టం కలిసి వచ్చి సీసీటీవీ ఫుటేజీ దొరకలేదన్నారు. అయితే తనను ఎక్కడ ఇరికిస్తారోనన్న భయంతో వాంఖెడే డ్రగ్స్ కేసును ఆర్యన్పై బనాయించారన్నారు. వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో మోహిత్ కూడా ఒక సభ్యుడని మాలిక్ ఆరోపించారు. జర్నలిస్టు ఆర్కె బజాజ్, అడ్వకేట్ ప్రదీప్ నంబియార్లు వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో ఉన్నారన్నారు. ‘‘ఆర్యన్ని విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు అడిగారు డీల్ రూ.18 కోట్లకు కుదిరింది. రూ.50 లక్షలు షారూక్ ఇచ్చారు. కానీ కిరణ్ గోసవితో ఆర్యన్ సెల్ఫీ బయటకొచ్చి వారి కుట్ర భగ్నమైంది’’ అని మాలిక్ చెప్పుకొచ్చారు. ‘సిట్’ విచారణకు ఆర్యన్ ఖాన్ గైర్హాజరు డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట ఆదివారం విచారణకు హాజరు కాలేదు. జ్వరంతో బాధ పడుతున్నానని, అందుకే హాజరు కాలేకపోతున్నారని ఆర్యన్ వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్యన్ సోమవారం ‘సిట్’ ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహనిందితుడైన అర్బాజ్ మర్చంట్ను ఆదివారం సిట్ దాదాపు 9 గంటలు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో మాస్టర్మైండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై బీజేపీ యువ నేత సునీల్ పాటిల్ ఆదివారం పోలీస్ ‘సిట్’ ముందు విచారణకు హాజరయ్యాడు. -
ఆర్యన్ డ్రగ్స్ కేసు సూత్రధారి సునీల్: బీజేపీ
న్యూఢిల్లీ: ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో బీజేపీ సరికొత్త ఆరోపణలకు తెర తీసింది. డ్రగ్స్ క్రూయిజ్ కేసు వెనుక సూత్రధారి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో సన్నిహిత సంబంధాలున్న, ధూలెకి చెందిన సునీల్ పాటిల్ అనే వ్యక్తి అని ఆరోపించింది. మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని మహారాష్ట్ర బీజేపీ నాయకుడు మోహిత్ భారతీయ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నిజం బయటపడకుండా ఉండడం కోసమే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మీద ఆరోపణ చేస్తున్నారని అన్నారు. ఆర్యన్ విడుదల కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ఖాన్ నుంచి డబ్బులు దండుకోవడానికి సునీల్ స్కెచ్ వేశారని ఆరోపించారు. ఈ కేసులో ఎన్సీబీ సాక్షి అయిన ప్రైవేటు డిటెక్టివ్ కిరణ్ గోసావితో సునీల్కి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. క్రూయిజ్ నౌకపై ఎన్సీబీ దాడి చేయడానికి ముందు నుంచే గోసావి, శామ్ డిసౌజాతో సునీల్ పాటిల్ టచ్లో ఉన్నారని ఆరోపించారు. కాగా, ఆర్యన్కేసు విచారించడానికి ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం న్యూఢిల్లీ నుంచి శనివారం ముంబైకి చేరుకుంది. ఐపీఎస్ అధికారి సంజయ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. -
రాజకీయ భేటీ కాదు!.. ఎన్సీపీ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాల మధ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ నివాసంలో రాష్ట్రీయ మంచ్ కీలక భేటీ జరిగింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయమంచ్ వ్యవస్థాపకుడు యశ్వంత్ సిన్హా అధ్యక్షత వహించారు. ఇది రాజకీయ భేటీ కాదని, భావసారూప్యం కలిగిన పార్టీలు, మేధావుల భేటీగా ఎన్సీపీ పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారి పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సమాజంలోని కీలక వ్యక్తులు రాష్ట్రీయ మంచ్ వేదికపై ప్రత్యక్షంగా ఒకేచోట సమావేశమయ్యారు. ఈ భేటీలో శరద్ పవార్ (ఎన్సీపీ), యశ్వంత్ సిన్హా (తృణమూల్ కాంగ్రెస్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఘన్శ్యామ్ తివారీ (సమాజ్వాదీ పార్టీ), జయంత్ చౌధరి (రాష్ట్రీయ లోక్దళ్), సుశీల్ గుప్తా (ఆప్), బినోయ్ విశ్వం (సీపీఐ), నీలోత్పల్ బసు( సీపీఎం), సంజయ్ ఝా (కాంగ్రెస్ మాజీ నేత), సుప్రియా సులే (ఎన్సీపీ) వంటి నాయకులతో పాటు జావేద్ అక్తర్, మాజీ బ్యూరోకాట్ కేసీ సింగ్, రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా వంటి మేధావులతో కలిపి మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్రోల్ – డీజిల్ ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కోవిడ్ మేనేజ్మెంట్, వ్యవస్థలపై దాడి, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను చర్చకొచ్చాయని భేటీలో పాల్గొన్న వారు తెలిపారు. ఈ భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఈ సమావేశం రెండున్నర గంటల పాటు జరిగిందని, అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా... కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనను ఎన్సీపీ నాయకుడు మజీద్ మెమన్ తిరస్కరించారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ మంచ్ చీఫ్ యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేశారని, పవార్ కాదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కపిల్సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మనీష్ తివారీలకు కూడా ఆహ్వానించామని, ఇతర కారణాల వల్ల వారు హాజరుకాలేదని తెలిపారు. సీపీఎం నేత నీలోత్పల్ బసు కూడా ఇది భావసారూప్యత కలిగిన వ్యక్తుల మధ్య సమావేశమేనని, దీన్ని రాజకీయ భేటీగా చూడకూడదని అన్నారు. -
‘అందుకే ముందే ఓ నిర్ణయానికి రాకూడదు’
ముంబై: మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండేపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడంటూ సదరు మహిళ జనవరి 11న ధనుంజయ్ ముండేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒశివారా పోలీస్ స్టేషనులో ఈ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇందుకు స్పందించిన మంత్రి ఫిర్యాదుదారు సోదరి, తాను రిలేషన్షిప్లో ఉన్నామని, తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.(చదవండి: అత్యాచారం చేయలేదు.. రిలేషన్లో ఉన్నాం: మంత్రి) ఈ క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే, సామాజిక న్యాయ, సాధికారికత మంత్రి ధనుంజయ్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం.. ఆరోపణలు వాస్తవాలు తేలితేనే ఆయనపై చర్యలు ఉంటాయని, అంతవరకు పదవిలో కొనాసాగుతారంటూ మద్దతుగా నిలిచారు. ఇక మహిళ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంపై తాజాగా స్పందించిన పవార్.. ‘‘ నాకైతే పూర్తి వివరాలు తెలియదు గానీ ఆమె తన కంప్లెంట్ వాపసు తీసుకున్నారు. ముండే, అధికారులతో నేను మాట్లాడాను. ఓ వ్యక్తి చెబుతున్నది నిజమో కాదో తెలియకుండా ముందే ఒక నిర్ణయానికి రావడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మంగల్వెడా బరిలో పార్థ్ పవార్
సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ మరోసారి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందిన వివరాల మేరకు కొల్హపూర్ జిల్లా మంగల్వెడా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో పార్థ్ పవార్ను బరిలోకి దింపేందుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ కొల్హపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పడం విశేషం. దీన్నిబట్టి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయంతో రాజకీయాల్లో అంతగా క్రియశీలకంగా లేని పార్థ్ పవార్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వె లువడలేదు. అదేవిధంగా ఈ విషయంపై పార్థ్ పవార్తో కూడా ఎలాంటి చ ర్చలు జరగలేదని కూడా జయంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ విషయంపై తొం దర్లోనే పార్టీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా వెళితే వారి వెనుకాల ఈడీని పురమాయిస్తుందని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఆరోపించారు. బీజేపీ నుంచి ఎన్సీపీలోకి చేరిన ఏక్నాథ్ ఖడ్సేకు ఈడీ ద్వారా నోటీసులు పంపించారని మండిపడ్డారు. -
‘నాడు పవార్కు దక్కని ప్రధాని పదవి’
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (79)కు శనివారం పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 1990వ దశకంలో పవార్కు ప్రధానమంత్రి పదవి రెండుసార్లు అందినట్టే అంది దక్కకుండా పోయిందని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు. చదవండి: యూపీఏ చైర్మన్గా పవార్ మాకు ఓకే : సంజయ్రౌత్ కాంగ్రెస్లోని దర్బార్ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేకపోయారని వెల్లడించారు. పవార్ తమ పార్టీకి విధేయుడు కాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. దీనిపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రతిభ లేని కొందరు వ్యక్తులకు పవార్ అంటే భయమని, ఆందుకే ప్రధాని పదవి దక్కకుండా చేశారని విమర్శించారు. -
‘నాడు పవార్కు దక్కని ప్రధాని పదవి’
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (79)కు శనివారం పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 1990వ దశకంలో పవార్కు ప్రధానమంత్రి పదవి రెండుసార్లు అందినట్టే అంది దక్కకుండా పోయిందని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు. కాంగ్రెస్లోని దర్బార్ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేకపోయారని వెల్లడించారు. పవార్ తమ పార్టీకి విధేయుడు కాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. దీనిపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రతిభ లేని కొందరు వ్యక్తులకు పవార్ అంటే భయమని, ఆందుకే ప్రధాని పదవి దక్కకుండా చేశారని విమర్శించారు. -
‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’
ముంబై : మహారాష్ట్రలో ‘మూడు రోజుల బీజేపీ ప్రభుత్వం’ కుప్పకూలి నేటికి ఏడాది గడిచిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గుర్తుచేశారు. నేటితో మొదటి వర్ధంతి పూర్తిచేసుకుందని ఎద్దేవా చేశారు. గత ఏడాది నవంబర్ 23న మాజీ బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నాటకీయ పరిణామాల మధ్య ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్కు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో మూడు రోజులకే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్ కేవలం 80 గంటల్లోనే రాజీనామా సమర్పించారు. చదవండి: ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం? దీనిపై సోమవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తికాలం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం మరో నాలుగు ఏళ్లు విజయవంతంగా పాలన పూర్తి చేస్తుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు విఫలమవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని వారికి బాగా తెలుస్తోంది’ అని ఆయన అన్నారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి రావ్ సాహెబ్ ఇటీవల మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రస్తావిస్తూ.. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోతుందని, వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది జోస్యం చెప్పారు. చదవండి: 'పాక్, బంగ్లాదేశ్లను భారత్లో కలపాలి' కాగా గత ఏడాది అనేక ఉత్కంఠ పరిణామాల నడుమ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. తిరగి ఎన్సీపీలోకి రావటంతో నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ డీప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు, ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పవార్ వాఖ్యలను ఖండించిన యడియూరప్ప -
బీజేపీకి ఏక్నాథ్ ఖడ్సే గుడ్బై
ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే పార్టీని వీడారు. శరద్ పవార్ నాయకత్వంలో పని చేసేందుకు ఆయన ముందుకొచ్చారని, శుక్రవారం తమ పార్టీలో చేరబోతున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో నంబర్ 2గా గుర్తింపు పొందిన ఖడ్సే 2016లో భూకబ్జా ఆరోపణలతో రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయనకు బీజేపీలో ప్రాధాన్యం లభించడం లేదు. ఖడ్సే లాంటి ప్రముఖ నాయకుడి చేరికతో మహారాష్ట్రలోని ఖాందేష్ ప్రాంతంలో తమ పార్టీ(ఎన్సీపీ) మరింత బలోపేతం అవుతుం దని జయంత్ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖడ్సేతోపాటు ఎంతోమంది బీజేపీలో ఎమ్మెల్యేలు ఎన్సీపీలో చేరేందుకు అసక్తి చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం చాలా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతుందని జయంత్ తేల్చిచెప్పారు. ఏక్నాథ్ ఖడ్సే నిర్ణయంపై బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. ఖడ్సే రాజీనామాను ఊహించలేదన్నారు. ఖడ్సే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోతుండడం తమకు ఒక చేదు నిజం అని వ్యాఖ్యానించారు. -
బీజేపీకి సీనియర్ నేత ఖడ్సే రాంరాం!
సాక్షి, ముంబై: బీజేపీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఎన్సీపీలో చేరడం దాదాపు ఖారారైంది. ఈ నెల 22వ తేదీన పవార్ సమక్షంలో ఎన్సీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆయన మద్దతుదారులు ఆనందంలో మునిగిపోయారు. ముంబైలోని ఎన్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీలో చేరుతారని సమాచారం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవి విగ్రహం ప్రతిష్టించే రోజు అంటే ఈ నెల 17వ తేదీన ఆయన ఎన్సీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. చివరకు అదికూడా వాయిదా పడింది. (చదవండి: పార్టీ ఎమ్మెల్యేకు జేపీ నడ్డా స్ట్రాంగ్ వార్నింగ్) మళ్లీ ఈ నెల 22న ముహూర్తం ఖరారైనట్లు సమాచారం రావడంతో ఇప్పుడైనా కార్యరూపం దాలుస్తుందా..? లేదా..? అని ఇరు పార్టీల కార్యకర్తలు ఆయోమయంలో ఉన్నారు. కాగా, ఇంతవరకు తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ముహూర్తం ఎప్పడనేది అధికారికంగా తను ప్రకటించకుండానే మీడియా వదంతులు లేవనెత్తిందని ఖడ్సే దుయ్యబట్టారు. అదేవిధంగా ఖడ్సే రాజీనామా విషయం తనకు తెలియదని, రాజీనామా లేఖ తన వద్దకు ఇంతవరకు రాలేదని బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా ఖడ్సే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, గురువారం ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైందనిసోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఖడ్సే మద్దతుదారులు ఏర్పాట్లు చేయడానికి ముంబైకి బయలుదేరినట్లు సమాచారం. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయిన ఖడ్సే మద్దుతుదారులు, ఎన్సీపీ పదాధికారులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి అయోమయానికి గురిచేస్తున్నారని రాజకీయ పారీ్టలు అంటున్నాయి. ఫడ్నవిస్తో కుదరక.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హయాంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏక్నాథ్ ఖడ్సే తరుచూ బీజేపీపై వ్యాఖ్యలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అభ్యరి్థత్వం ఇవ్వకుండా పక్కన బెట్టడానికి ఫడ్నవిస్ కారణమని ఆరోపనలు గుప్పించారు. కనీసం విధాన్ పరిషత్కు వెళ్లేందుకు కూడా అవకాశమివ్వలేదు. అందుకు ఫడ్నవిస్ ప్రధాన కారణమని ఆరోపించారు. దీంతో ఖడ్సే, ఫడ్నవీస్ మ«ధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైంది. ఫడ్నవీస్ హాజరైన పార్టీ కార్యక్రమాలకు ఖడ్సే గైర్హాజరయ్యేవారు కాదు. చాలా రోజులుగా ఒకే వేదికపై ఇద్దరు దర్శనమివ్వలేదు. ఇక ఖడ్సే వేరే పార్టీలో చేరతారని అనుకున్నా.. ఏ పారీ్టలో చేరుతారనే దానిపై స్పష్టత రాలేదు. కొద్ది రోజులుగా ఆయన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో భేటీ కావడంతో అనుమానాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉద్ధవ్ ఠాక్రే ‘మహా’ భేటీ
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మిత్రపక్షాలతో సమావేశం కానున్నారు. సీఎం అధికారిక నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటుచేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందనే వార్తలను ఎన్సీపీ, శివసేన ఇదివరకే ఖండించిన సంగతి తెలిసిందే. కాగా, కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు నారయణ రాణే గవర్నర్ భగత్సింగ్ కోష్యారితో భేటీ అయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో ఉద్దవ్తో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసంతృప్తితో ఉన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని.. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను లాక్కోవాలని చూస్తే.. ప్రజలే తిరగబడతారని అన్నారు. అంతకుముందు లాక్డౌన్ ఎత్తివేతపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే భినాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే లాక్డౌన్ను ఎత్తివేయక తప్పదని పవార్ సూచించగా.. వైరస్ను కట్టడి చేయాలంటే లాక్డౌన్ఒక్కటే మార్గమని ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే ఆంక్షల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ సర్కార్లోని నేతల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. -
అద్నాన్ సమీకి పద్మశ్రీనా?
ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి తాజాగా పద్మశ్రీ ప్రకటించడంపై మాటల యుద్ధం ప్రారంభమైంది. బ్రిటన్లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. విమర్శకులపై సమీ ఘాటుగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ చేసిన ట్వీట్పై స్పందిస్తూ.. ‘పిల్లవాడా..! నీ బ్రెయిన్ను క్లియరెన్స్ సేల్లో కొనుక్కున్నావా? లేక సెకండ్ హ్యాండ్ స్టోర్లో కొనుక్కున్నావా? తల్లిదండ్రుల చర్యలకు పిల్లలను బాధ్యులను చేయాలని నీకు బర్కిలీ వర్సిటీలో నేర్పించారా?’ అని మండిపడ్డారు. దీనికి షేర్గిల్ ట్విటర్ వేదికగానే జవాబిచ్చారు. ‘అంకుల్జీ! ట్విట్టర్లో కొన్ని అభినందనల కోసం సొంత తండ్రినే దూరం పెట్టిన వ్యక్తి నుంచి భారతీయ సంప్రదాయం గురించి పాఠాలు నేర్చుకునే అవసరం నాకు లేదు’ అని ట్వీట్ చేశారు. గత ఐదేళ్లలో భారత్కు చేసిన ఐదు సేవలను చెప్పాలని సమీకి సవాలు చేశారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్తో పోరాడారు. భారత్కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తండ్రికి నియంతలు ముస్సోలినీ, హిట్లర్లతో సంబంధాలున్నాయన్న వార్తలను గుర్తు చేస్తూ.. ఆమెకు భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘భారతదేశాన్ని, ప్రధాని మోదీని, దేశ వ్యవస్థలను వ్యతిరేకించే ముస్లింలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని విపక్షాలు కోరుకుంటున్నాయి’ అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి సమీ పూర్తిగా అర్హుడని సమర్ధించారు. అద్నాన్ సమీ తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ‘ఆ ప్రాంత ముస్లిం మహిళలపై కాంగ్రెస్కు గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. లోక్జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా సమీకి పద్మశ్రీ ప్రకటించడాన్ని సమర్ధించారు. తన ప్రతిభతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఆ పురస్కారానికి సమీ అన్నివిధాలా అర్హుడేనని పేర్కొన్నారు. సోనియాగాంధీపై పాత్రా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించలేదు. కాగా, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై వెల్లువెత్తుతున్న నిరసనల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే చర్యల్లో భాగంగానే అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారని ఎన్సీపీ విమర్శించింది. ఇది 130 కోట్ల భారతీయులను అవమానించడమేనని పేర్కొంది. ‘జై మోదీ’ అని నినదించిన పాక్ పౌరుడెవరైనా భారత పౌరసత్వం పొందొచ్చని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. -
‘అలా చేస్తే.. ఉద్ధవ్ రాజీనామా చేస్తారు’
ముంబై : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యశ్వంత్రావు గడఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల విషయంలో పంతానికి పోకూడదని కూటమి నేతలను హెచ్చరించారు. ఇలా చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి విస్తరణపై పలువురు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్లో కొందరు నాయకులు కేబినెట్ బెర్త్ దక్కకపోవడం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన గడఖ్.. ఉద్ధవ్ సాధారణ రాజకీయనాయకుడు కాదని.. అతనిది కళాకారుడి మనస్తత్వం అని పేర్కొన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంత్రిపదవులకు సంబంధించి ఫిర్యాదులు చేయడం ఆపాలని సూచించారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తరువాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కూటమి ప్రభుత్వంలో విభేదాలు తలెత్తడం ఖాయమని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజుల సమయం తీసుకుందని విమర్శించారు. ఆ తర్వాత శాఖల కేటాయింపులకు మరో వారం రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు. -
ఎన్సీపీకే పెద్ద పీట
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు శాఖల్ని కేటాయించారు. ముఖ్యమైన శాఖలెన్నో సంకీర్ణ భాగస్వామ్య పక్షం ఎన్సీపీకే దక్కాయి. శాఖల కేటాయింపులో మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన మూడు రోజులకి కానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. మహారాష్ట ఉప ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్కు ఆర్థిక, ప్రణాళిక శాఖ, ఆయన పార్టీ సహచరుడు అనిల్ దేశ్ముఖ్కు హోంశాఖని కేటాయించినట్టు ఆదివారం ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన తరఫున తొలిసారిగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రేకి పర్యావరణం, పర్యాటకం, ప్రొటోకాల్ వ్యవహారాల శాఖ దక్కింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరాత్కు రెవెన్యూ, అశోక్ చవాన్కు ప్రజాపనుల శాఖలు దక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ధనుంజయ్ ముండే, జితేంద్ర అవ్హాద్లకు వరసగా సామాజిక న్యాయశాఖ, గృహనిర్మాణ శాఖలు కేటాయించారు. దీంతో ఎన్సీపీకే కీలక శాఖలు దక్కినట్టయింది. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సాధారణ పరిపాలన, ఐటీ, న్యాయశాఖల్ని తన వద్ద ఉంచుకున్నారు. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిందేకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. ప్రభుత్వం పంపిన ఈ శాఖలకి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్లో అసంతృప్తి శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని కాంగ్రెస్లో అసంతృప్తి మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరాత్ కారణమని కొందరు నేతలు నిందిస్తున్నారు. ఎన్సీపీతో పోలిస్తే అప్రాధాన్య శాఖలు కేటాయించారని అంటున్నారు. మరికొందరు సంకీర్ణ భాగస్వామ్య పక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధ్యక్షుడు పవార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, గృహనిర్మాణం, రవాణా శాఖల్లో కనీసం రెండయినా కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టినా శివసేన, ఎన్సీపీ తిరస్కరించడంతో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాజుకుంటోంది. కాగా, శివసేన పార్టీని వీడడం లేదని మంత్రి అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంతో సమావేశమైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తాను శివసేనతోనే కొనసాగుతానన్నారు. -
రాజకీయాలకు పనికిరానంటూ ఎమ్మెల్యే రాజీనామా!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తాను రాజకీయాలకు పనికిరానంటూ రాజీనామా చేశారు. బీద్ జిల్లా మజల్గాన్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సోలంకే సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రి వర్గ విస్తరణలో ఎన్సీపీ నేత అజిత్ పవార్కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆయనతో పాటుగా 36 మంది కొత్త మంత్రులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీల నుంచి పలువురికి మంత్రి పదవులు లభించగా ఆశించిన వారికి మాత్రం ఫలితం దక్కలేదు. చదవండి: 'సీడీఎస్గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్' ఈ సందర్భంగా ప్రకాష్ సోలంకే మాట్లాడుతూ.. మంగళవారం నేను నా రాజీనామా సమర్పించనున్నాను. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్న. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న నా నిర్ణయాన్ని ఇప్పటికే ఎన్సీపీ అధీష్టానానికి తెలియజేశాను. మంగళవారం సాయంత్రం ముంబైలో అసెంబ్లీ స్పీకర్ని కలిసి రాజీనామా లేఖను అందిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తాను రాజకీయాలకు పనికిరానంటూ రుజువైందని ప్రకాశ్ సోలంకే పేర్కొనడం గమనార్హం. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు గానూ ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ చాలా కీలకంగా ఉంది. ఈ తరుణంలో ఆయన రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. చదవండి: '3కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా' -
‘మహా’ డిప్యూటీ అజిత్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే విషయంలో ఉత్కంఠ వీడింది. శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్పవార్ ఉప ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల అనంతరం సోమవారం మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. వీరితో విధాన భవన్ ప్రాంగణంలో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా విస్తరణలో ఎన్సీపీకి 10 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, శివసేనకు 8 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, కాంగ్రెస్కు 8 కేబినెట్, 2 సహాయమంత్రి పదవులు లభించాయి. ఈ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రితో కలుపుకుని, మొత్తం మంత్రుల సంఖ్య 43కి చేరింది. 15% నిబంధన మేరకు.. 288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర మంత్రివర్గ సంఖ్య 43కి మించకూడదు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేసిన సమయంలోనే ఈ మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్కు తాజా విస్తరణలో చోటు దక్కలేదు. ఆయనకు రాష్ట్ర పీసీసీ పీఠం అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. మిత్ర పార్టీ క్రాంతికారీ షేట్కారీ ప„Š నుంచి శంకర్రావు గడఖ్కు కేబినెట్ హోదాతో మంత్రిపదవి, మరో మిత్రపక్షం ప్రహార్ జనశక్తి పార్టీ నుంచి బచ్చు కడుకు సహాయమంత్రి పదవి లభించాయి. ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజేంద్ర పాటిల్కు కూడా సహాయమంత్రి పదవి లభించింది. ఎన్సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్, దిలిప్ వాల్సే పాటిల్, ధనుంజయ ముండే, కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడెట్టివర్లకు కూడా తాజాగా మంత్రివర్గంలో స్థానం లభించింది. సంజయ్ రౌత్కు కోపమొచ్చింది!: కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. తన సోదరుడు, సేన ఎమ్మెల్యే సునీల్ రౌత్కు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగానే సంజయ్ హాజరుకాలేదని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేసి పడవీపై గవర్నర్ ఆగ్రహం: తొలిసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి పడవీపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం చేసేటపుడు స్క్రిప్ట్లో ఉన్నదే చదవాలని, లేనిది చదవొద్దని పడవీని మందలించారు. ‘సీనియర్ నేతలు శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే ఇక్కడే ఉన్నారు.కావాలంటే వారిని అడగండి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం పడవీ చేత మళ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. నాలుగోసారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేయడం దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా నవంబర్ 23న ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఎన్సీపీ తిరుగుబాటు నేతగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణంచేశారు. తర్వాత ఆయన మనసు మార్చుకుని మళ్లీ సొంత గూటికి వెళ్లడంతో ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలింది. దాంతో 80 గంటల సీఎంగా ఫడ్నవీస్, 80 గంటల డిప్యూటీ సీఎంగా అజిత్ చరిత్రకెక్కారు. అయితే, అజిత్పవార్ గతంలో రెండు పర్యాయాలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలిసారి 2010 నవంబర్లో, ఆ తరువాత 2012లో అజిత్పవార్ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర ప్రజలకు దాదాగా చిరపరిచితుడైన అజిత్పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ సోదరుడి కుమారుడు. 1980వ దశకంలో శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి ఏడు సార్లు ఆ స్థానం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో 1.65 లక్షల భారీ మెజారిటీ సాధించారు. తొలిసారి 1991 జూన్లో సహాయమంత్రి పదవి స్వీకరించారు. -
నేడే ‘మహా’ మంత్రివర్గ విస్తరణ!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ సీఎంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, డిసెంబర్ 30న ఉద్ధవ్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని ఒక వార్తా చానెల్ వెల్లడించింది. ఆ చానెల్ ప్రకారం.. శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. శివసేన, ఎన్సీపీలకు 10 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు ..కాంగ్రెస్ నుంచి 8 మంది కేబినెట్, ఇద్దరు సహాయ మంత్రులు కానున్నారు. అయితే, ఉద్ధవ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుందనే విషయంపై స్పష్టత రాలేదు. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్ల పేర్లు వినిపిస్తున్నాయి. -
సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. కీలక హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్ద అంటిపెట్టుకుంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేకు హోంతో పాటు పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖలు, మరో శివసేన మంత్రి సుభాష్ దేశాయ్కి పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్కు ఆర్థిక శాఖను, గృహనిర్మాణం, మరికొన్ని శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్భల్కు నీటి పారుదల, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ మంత్రి బాలాసాహెబ్ తోరట్కు రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలు ఇచ్చారు. మరో కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్కు పీడబ్ల్యూడీ, గిరిజనాభివృద్ధి శాఖలు అప్పగించారు. కాగా. గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 79వ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన నివాసంలో పూలగుచ్ఛం అందజేశారు. -
‘ఎన్సీపీని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు’
ముంబై: ఎన్సీపీని ప్రలోభపెట్టడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ బుధవారం శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కవద్దనే అక్కసుతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్సీపీ అధినేత శరద్పవార్తో కలిసి పనిచేద్దామంటూ వివాదం సృష్టించే ప్రయత్నం చేశారంటూ మండిపడింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్పవార్ను మహారాష్టకు ఏం చేశావంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించడాన్ని సామ్నా గుర్తు చేసింది. అమిత్ షా వ్యాఖ్యలపై పవార్ దీటుగా స్పందించారని తెలిపింది. శరద్ పవార్ ఓ మరాఠా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మోదీ, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి బయటపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పవార్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలు, అభివృద్ధి పరంగా తాను మోదీని సమర్థిస్తానని చెప్పుకొచ్చారు. తాము వ్యక్తిగతంగా మంచి స్నేహితులమని కానీ.. పార్టీ సిద్దాంతాల పరంగా బీజేపీలో చేరబోనని పవార్ స్పష్టం చేశారు. కాగా, కొద్దికాలంగా మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన సంగతి తెలిసిందే. మహా వికాస్ ఆఘాడి తరఫున శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మహా హైడ్రామాకు తెరపడింది. అనంతరం జరిగిన బల పరీక్షలో ఉద్ధవ్ ఠాక్రే తన మెజారిటీని నిరూపించుకున్నారు. -
సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం పెద్ద డ్రామా..!
బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని, మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించేందుకే ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారంటూ విస్మయపరిచే వ్యాఖ్యలు గుప్పించారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈ కర్ణాటక ఎంపీ.. శనివారం తన నియోజకవర్గం ఉత్తర కన్నడలోని యెల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులను సురక్షితంగా మళ్లీ కేంద్రానికి చేర్చడానికి ఫడ్నవిస్కు 15 గంటల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ‘మహారాష్ట్రలో మా పార్టీ వ్యక్తి కేవలం 80 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఫడ్నవిస్ రాజీనామా చేశారు. మేం ఎందుకీ డ్రామాను చేయాల్సి వచ్చింది? మాకు తెలియదా? మెజారిటీ లేదని మాకు తెలిసినా.. ఆయన ఎందుకు సీఎం అయ్యారు? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. దీనికి కారణం రూ. 40వేల కోట్లే. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ 40వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కాకుండా దుర్వినియోగమయ్యేవి. అందుకే పక్కా ప్లానింగ్తో ఏదైతే అదయిందని పెద్ద డ్రామాకు తెరతీశాం. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 15 గంటల్లో ఫడ్నవిస్ డబ్బులు తిరిగి సురక్షితంగా ఉండోచోటుకు పంపించారు. అవి కేంద్రానికి వెళ్లిపోయాయి. అవి ఉన్నచోటే ఉంటే తదుపరి సీఎం ఆ నిధులను ఏం చేసేవారో మనందరికీ తెలిసిందే’ అని అనంత్కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇటు బీజేపీని, అటు ఫడ్నవిస్ను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపారు. ‘అలాంటిదేమీ జరగలేదు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. నిజానికి ఇలా జరగడానికి ఆస్కారం లేదు. కావాలంటే ప్రభుత్వ ఆర్థిక విభాగం ఈ అంశంపై దర్యాప్తు చేపట్టవచ్చు’అని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. -
విశ్వాసం పొందిన ఉద్ధవ్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గింది. శనివారం జరిగిన ప్రత్యేక భేటీలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం సభ విశ్వాసం పొందింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాషాయ తలపాగాతో ఉద్ధవ్ రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సీఎం ఉద్ధవ్తోపాటు సేన ఎమ్మెల్యేలంతా కాషాయ రంగు తలపాగా ధరించి సభకు వచ్చారు. ఉద్ధవ్ వెనుక ఆయన కొడుకు, ఆదిత్య ఠాక్రే మిగతా సేన ఎమ్మెల్యేలతోపాటు కూర్చున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ కొలాంబ్కర్ను తొలగించి ఎన్సీపీకి చెందిన వల్సే పటిల్ను అధికార పక్షం ఎన్నుకుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభలో విశ్వాస పరీక్ష కార్యక్రమం మొదలైంది. పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించగానే ఉద్ధవ్ లేచి సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వాకౌట్ ఠాక్రే ప్రభుత్వంపై కాంగ్రెస్కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ ఆఘాడి 3, సమాజ్వాదీ పార్టీ 2, స్వాభిమాని శేట్కారి పార్టీ 1, శేత్కరి కామ్గార్ పార్టీ 1, క్రాంతికారి శేత్కరీ పార్టీ 1, ఇతరులు, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒకరు, రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే: బీజేపీ అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు. అలాగైతే పార్లమెంట్ సగం ఖాళీ: ఎన్సీపీ నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అధికార పక్షం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదన్న శివసేన ఆరోపణలపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘పార్లమెంట్లో బీజేపీ సభ్యులు కూడా ఫార్మాట్ను పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రకాంత్ పాటిల్ చెబుతున్న నియమాన్ని వారికి కూడా వర్తింపజేస్తే లోక్సభ సగం ఖాళీ అవుతుంది’అని పేర్కొన్నారు. అధికార కూటమి తరఫున నానా పటోలే, బీజేపీ నుంచి కిసాన్ కతోరే స్పీకర్ పదవికి పోటీ చేయనున్నారు. అసెంబ్లీలో బలాబలాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 మంది సభ్యుల బలముంది. నవంబర్ 28వ తేదీన శివాజీ పార్క్లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహా వికాస్ ఆఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమయ్యారు. నవంబర్ 30 మధ్యాహ్నం అసెంబ్లీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుందని అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ను కొత్త ప్రొటెం స్పీకర్గా నియమించారు. ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ స్థానంలో పాటిల్కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది. రాజకీయ, రాజ్యాంగ నైతికతలు వేరువేరు: సుప్రీంకోర్టు ఇతర రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకున్న ఆ హక్కును తొలగించలేమని వ్యాఖ్యానించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేన, బీజేపీ ఎన్డీయే భాగస్వామ్యులుగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయని పిటిషన్దారు అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది బీకే సిన్హా తెలిపారు. ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరికాదని ఆయన వాదించగా తమ పరిధిలోకి రాని ఎన్నికల అనంతర పొత్తుల్లోకి లాగవద్దని దర్మాసనం తెలిపింది. మేనిఫెస్టోలను అమలు చేయాలంటూ పార్టీలను కోర్టులు ఆదేశించలేవని కూడా పేర్కొంది. మహారాష్ట్ర తరువాత గోవానే! మహారాష్ట్ర తరువాత తమ తదుపరి లక్ష్యం గోవాయేనని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ) నేతలతో శుక్రవారం రౌత్ చర్చలు జరిపారు. పైన పేర్కొన్న రెండు పార్టీలు కూడా గతంలో బీజేపీ మిత్రపక్షాలే కావడం విశేషం. జీఎఫ్పీ చీఫ్ విజయ్ సర్దేశాయితో భేటీ అనంతరం రౌత్ మాట్లాడుతూ.. ‘త్వరలో పెద్ద భూకంపం రానుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడే ఉన్నారు. గోవాలో బీజేపీకి మద్దతిస్తున్న మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర తరువాత గోవానే. ఆ తరువాత వేరే రాష్ట్రాలపై దృష్టి పెడతాం’ అని రౌత్ తెలిపారు. -
కొలువుతీరిన ఠాక్రే సర్కార్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: అనేకానేక ఉత్కంఠభరిత మలుపుల అనంతరం, మహారాష్ట్ర రాజకీయ డ్రామా ప్రస్తుతానికి ముగిసింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి మహా వికాస్ ఆఘాడి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శివాజీ పార్క్ గ్రౌండ్లో భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానుల మధ్య, అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ, తన తండ్రి బాల్ ఠాక్రేలను స్మరిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం అనంతరం శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్లతో మంత్రులుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు ఉద్ధవ్ శిరసు వంచి నమస్కరించారు. తర్వాత తల్లి మీనాతాయి సొంత చెల్లెలు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తల్లి కుందాతాయి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్, మహా వికాస్ ఆఘాడి ఏర్పాటు సూత్రధారి శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ నేత అజిత్పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్∙ముకేశ్ అంబానీ, భార్య నీతా, కొడుకు అనంత్ వచ్చారు. బంతిపూల రహదారి ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతుండటంతో ప్రమాణ స్వీకారం కోసం శివాజీ పార్క్లో భారీ వేదికను ఏర్పాటు చేశారు. వేదికపైననే కీలక నేతలు కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే భారీగా హాజరైన శివసైనికులు నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. భారీగా బాణాసంచా పేల్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ నుంచి శివాజీపార్క్ వరకు రహదారి పొడవునా బంతిపూలు చల్లి శివసేన అభిమాని ఒకరు తన అభిమానం చాటుకున్నాడు. మోదీ, సోనియా అభినందనలు మహారాష్ట్ర కొత్త సీఎం ఉద్ధవ్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్ధవ్ అవిరళ కృషి చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ చీఫ్ లేఖ పంపించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలను సైతం ఆమె అభినందించారు. ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరుకాలేకపోయిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఉద్ధవ్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నానన్న రాహుల్.. ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన కొత్త బాధ్యతల ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేందుకు ప్రయత్నించిన బీజేపీని ఎదుర్కొని మహా వికాస్ ఆఘాడీని ఏర్పాటు చేసినందుకు మూడు పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధి వినాయకుడికి విశేష పూజలు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఠాక్రే భార్య రష్మీ, వారి ఇద్దరు కుమారులు కూడా పూజల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్ విషయంలో ఉత్కంఠ ఉద్ధవ్తో పాటు ఎన్సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారని గురువారం ఉదయం వరకు అంతా భావించారు. అయితే, తాను ప్రమాణ స్వీకారం చేయబోవడం లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల తరఫున ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారని అజిత్ గురువారం ఉదయం మీడియాకు చెప్పారు. అయితే, త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. తొలి కేబినెట్ భేటీ ప్రమాణ స్వీకారం తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే గురువారం రాత్రి తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందిన నూతన మంత్రులు సహ్యాద్రి గెస్ట్హౌజ్లో జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా సహ్యాద్రి గెస్ట్హౌజ్కు అజిత్ పవార్ కూడా రావడం విశేషం. ఉద్ధవ్ నంబర్ 8 మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయినవారిలో ఉద్ధవ్ ఠాక్రే 8వ నేత. అంతకుముందు, కాంగ్రెస్ నేతలు ఏఆర్ ఆంతూలే, వసంతదాదా పాటిల్, శివాజీరావు నిలాంగేకర్ పాటిల్, శంకర్రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్లు కూడా ఏ సభలోనూ సభ్యులు కాకుండానే సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుత ఎన్సీపీ చీఫ్, అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన శరద్పవార్ కూడా ఉండటం విశేషం. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న శరద్ పవార్ను 1993లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పంపించారు. ముంబై అల్లర్ల నేపథ్యంలో అప్పటి సీఎం సుధాకర్ రావు నాయక్ను తొలగించి శరద్ పవార్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అజిత్ అసమ్మతికి ‘పవార్’ కారణమా? వారం రోజుల క్రితం శుక్రవారం రాత్రి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ‘మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్)’ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చర్చించేందుకు సమావేశమయ్యేంత వరకు అంతా బాగానే ఉంది. అయితే సాయంత్రం అయ్యేకొద్దీ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మొహంలో మారుతున్న రంగులను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు.. సమావేశం నుంచి హఠాత్తుగా అజిత్ వెళ్ళిపోయిన సంగతిని కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెల్లవారాక కానీ గత రాత్రి అజిత్పవార్లో కనపడిన అసహనానికి పర్యవసానం ఏమిటో వారికి అర్థమైంది. శనివారం తెల్లవారుజామున.. దేశమింకా పూర్తిగా నిద్రలేవకముందే.. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటి నుంచి అజిత్ పవార్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిపై నోరు విప్పని శరద్ శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలను కున్నప్పుడు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతనైన తనకు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని అజిత్ ఆశించారు. అయితే, కూటమి చర్చల్లో ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఈ విషయం లేవనెత్తక పోవడం అజిత్ని బాగా గాయపరిచింది. అయితే వీరిద్దరి మధ్యా కోల్డ్ వార్ ఇప్పటిది కాదు. 2009లో మహారాష్ట్రకు అశోక్ చవాన్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు పవార్ల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కి 82, ఎన్సీపీకి 62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకునే అవకాశం శరద్ పవార్కి వచ్చింది. అయితే అనూహ్యంగా, అజిత్ను కాదని డిప్యూటీ సీఎం పదవిని చగన్ భుజ్బల్కి శరద్ కేటాయించారు. ఇప్పుడు, 2019లో కూడా అదే పరిస్థితి ఎదురవనుందా? అనే అనుమానమే అజిత్ పవార్ను బీజేపీకి దగ్గర చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్తో ఎన్నికల పొత్తుకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆర్ఆర్ పాటిల్, జయంత్ పాటిల్, ధనుంజయ్ ముండే, సుప్రియాసూలే వంటి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులతో సమానంగా అజిత్ పవార్ని చూశారు. దీంతో ఎన్సీపీలో తాను నంబర్ 2 కావడంపై అజిత్ పవార్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అజిత్ కుమారుడికి ఇస్తానన్న ఎంపీ సీటు ఆలస్యంగా ఇవ్వడం, ఆ తరువాత అతను ఓడిపోవడం కూడా అజిత్లో అసహనానికి మరో కారణంగా భావిస్తున్నారు. కాషాయం మసకబారుతోంది! న్యూఢిల్లీ: కాషాయ వికాసం క్రమేపీ మసకబారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠం కూడా ప్రతిపక్షం చేతుల్లోకి వెళ్లిపోవడంతో దేశంలో బీజేపీ పాలిత ప్రాంతం మరింత తగ్గిపోయింది. 2018 మార్చిలో బీజేపీ పలుకుబడి పతాకస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలోని 76 శాతం భూభాగాన్ని, 69 శాతం ప్రజలను పరిపాలించాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. తాజాగా, 2019 నవంబర్లో మహారాష్ట్రలోనూ కాషాయ దళం అధికారానికి దూరమయింది. ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతం దేశంలో వైశాల్యం రీత్యా 37.4 శాతం, జనాభాపరంగా చూసుకుంటే 45.6 శాతానికి పడిపోయింది. -
అజిత్ చుట్టూ హైడ్రామా?
ముంబై : పార్టీపై తిరుగుబాటు చేసి.. తిరిగి సొంత గూటికే చేరుకున్న నాయకుడు అజిత్ పవార్. ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేల అండ లేకపోవడం, పవార్ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్ శరద్ పవార్ కూడా క్షమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ ఏమేరకు సర్దుకుపోతారన్నది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఆయన సీఎం పదవిపై కన్నేసినట్టు వార్తలు వస్తుండటంతో హైడ్రామా నెలకొంది. సంకీర్ణ పొత్తుల్లో భాగంగా రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని తమకు అప్పగించాలని ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్ కామెంట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే అజిత్ పవార్ ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో హైడ్రామా నెలకొంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైన వేళ అజిత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. అజిత్ ప్రస్తుతం తమకు అందుబాటులోనే ఉన్నారని, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారని తెలిపారు. తరచూ కాల్స్ వస్తుండటంతో ఫోన్ స్విచ్చాప్ చేశారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అజిత్ సొంత నియోజకవర్గమైన బారామతిలో వెలిసిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భావి ముఖ్యమంత్రి అజిత్ పవారేనంటూ ఆయన మద్దతుదారులు బారామతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయడం గమనార్హం. మరోవైపు ఉద్ధవ్ సర్కార్లో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్కు దక్కవచ్చునని వినిపిస్తోంది. పదవుల పంపకాలు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కూటమి పార్టీలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పదవుల పంపకంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి నాయకుడైన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశముందని తెలుస్తోంది. పదవుల పంపకంలో భాగంగా ఎన్సీపీకి డిప్యూటీ చీఫ్ మినిష్టర్, కాంగ్రెస్కు స్పీకర్ పదవులు ఖరారైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పీకర్ పృథ్వీరాజ్ చౌహాన్, ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు నేడు మంత్రులుగా ప్రమాణం చేస్తారని కూటమి వర్గాలు తెలిపాయి. -
ఉద్ధవ్-ఆదిత్యల అరుదైన ఘనత
ముంబై: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన చరిత్రను సృష్టించబోతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేడు పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల్లో ఆయన శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర శాసనసభలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకే సభలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా తొలిసారి కనిపించబోతున్నారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించినంతవరకు ఇలాంటి రికార్డు నమోదుకావడం ఇదే తొలిసారి. ‘రాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి. ఇది అరుదైన రికార్డుగా చెప్పవచ్చు’ అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్ కల్సే తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే, సోదరుడు రాజ్ ఠాక్రే ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య కాగా.. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక, తండ్రీకొడుకులైన కాంగ్రెస్ నేతలు శంకర్రావు చవాన్, అశోక్ చవాన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి మహారాష్ట్రకు ఎక్కువమంది సీఎంలు పనిచేశారు. ఇప్పటివరకు బీజేపీ నుంచి శివసేన నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు ఉద్ధవ్ శివసేన నుంచి సీఎం అయిన మూడో నేత కానున్నారు. ఇక, ఎన్సీపీ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ సీఎం పగ్గాలు చేపట్టలేదు. -
సర్వాంగ సుందరంగా శివాజీ పార్క్
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం జరగనున్న శివాజీ పార్క్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైనే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతోపాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను కూడా శివసేన ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుపై వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి భారీ బహిరంగ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరాదని కోరుకుంటునట్టు పేర్కొంది. -
ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్కు స్పీకర్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే(59) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్కు స్పీకర్ పదవి లభించనున్నట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ బుధవారం రాత్రి వెల్లడించారు. ఉద్ధవ్తో పాటు మూడు పార్టీలకు చెందిన ఒకరిద్దరు ముఖ్యులూ ప్రమాణం చేస్తారు. ఉద్ధవ్ ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో బుధవారం కూటమి ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. మంత్రిమండలిలో ఒక్కో పార్టీకి లభించే ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులు చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆ తరువాత వారితో కాంగ్రెస్ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఖర్గే కలిశారు. శివసేనకు సీఎం సహా 15, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 15, కాంగ్రెస్కు స్పీకర్ కాకుండా 13 మంత్రి పదవులు ఇవ్వాలనే సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సేన వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఉదయం గవర్నర్ భగత్ కోశ్యారీని ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 20 ఏళ్ల తరువాత శివసేన నేత సీఎం అవుతున్నారు. మహారాష్ట్రలో శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా 1995లో మనోహర్ జోషి బాధ్యతలు చేపట్టగా, 1999లో నారాయణ రాణె శివసేన తరఫున సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు మహారాష్ట్రలో తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీ పార్క్లో నేటి సాయంత్రం అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైననే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.కాంగ్రెస్ చీఫ్ సోనియాను ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను శివసేన ఆహ్వానించిందని సమాచారం. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. అజిత్కు డిప్యూటీ సీఎం? అజిత్ పవార్కి ఇచ్చే పదవిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ను మరోసారి ఎన్నుకుంటారని, ఉప ముఖ్యమంత్రి పదవీ రావొచ్చని తెలుస్తోంది. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ వెంటే.. బీజేపీకి మద్దతునివ్వడం ద్వారా నాలుగు రోజుల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగి ఫ్యామిలీ సెంటిమెంట్తో వెనక్కి తగ్గిన అజిత్ పవార్ తాను ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణం చేశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి నేను కొత్తగా చెప్పడానికేమీ లేదు. సమయమొచ్చినపుడు చెప్తాను. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు’ అని చెప్పారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే తాను నిర్ణయం మార్చుకొని, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని అజిత్ పవార్ చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అజిత్ పవార్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయనకు సముచిత స్థానమే లభిస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం చేపట్టనున్న శివసేన భవిష్యత్తులో కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని రౌత్ వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా శివసేన తరఫున వ్యూహకర్తగా, మీడియా ప్రతినిధిగా వ్యవహరించిన రౌత్.. ఇకపై తాను పార్టీ పత్రిక ‘సామ్నా’ పనుల్లో నిమగ్నమవుతానన్నారు. అజిత్కు సుప్రియా ఆత్మీయ ఆహ్వానం మహారాష్ట్ర నూతన ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 285 ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కొలంబ్కర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన అజిత్ పవార్కు అనూహ్యమైన రీతిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఆయన సోదరి, లోక్సభ ఎంపీ సుప్రియా సూలే, అజిత్ పవార్కు ఎదురై నవ్వుతూ పలకరించి, ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే విధాన సభ ముఖద్వారం దగ్గరే నిల్చొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ స్వాగతం పలికారు. రాజకీయ ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల మరాఠాయోధుడు ఛత్రపతి గుర్తుగా శివాజీ పార్కు రాజకీయ ఉద్దండులెందరినో పరిచయం చేసిన వేదికది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుల ఆశలకూ, ఆకాంక్షలకూ ఊతమిచ్చిన క్రీడాప్రాంగణమది. యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను అనునిత్యం గుర్తుచేసే మరాఠాల పోరాటాలకు పురిటిగడ్డ కూడా అదే ప్రాంతం. అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే అంతిమ సంస్కారాలకు వేదికగా నిలిచింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతోన్న ఉద్ధవ్ ఠాక్రే నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిటీలోనే అతిపెద్ద పార్కు ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్కు సిటీలోనే అతిపెద్ద పార్కు. ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన పార్కు వైశాల్యం దాదాపు 28 ఎకరాలు. ఈ పార్కు క్రికెట్ క్రీడాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. 1927 వరకు బ్రిటిష్ ఇండియాలో 1925లో ప్రారంభించిన ఈ పార్కు అనంతర కాలంలో ముంబైలోని ఎన్నో స్వాతంత్య్రోద్యమాలకు కేంద్రబిందువైంది. 1947 స్వాతంత్య్ర కాలం నుంచి సంయుక్త మహారాష్ట్ర చాల్వాల్ (మహారాష్ట్ర ఏకీకరణ) ఉద్యమానికి ఇదే పార్కు వేదికయ్యింది. ప్రముఖ పాత్రికేయులు, నాటకరచయిత, కవి, సామాజిక నేత ఆచార్య ప్రహ్లద్ కేశవ్ అత్రే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం 1960 మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది. ఆ తరువాత శివసేన నడిపిన ఎన్నో రాజకీయ ఉద్యమాలు ఈ వేదికగా ప్రారంభించారు. మహిమా పార్కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ కాలంలో ఈ పార్కుని ఏర్పాటు చేశారు. 1927 వరకు ఈ పార్కుని మహిమా పార్కుగా పిలిచేవారు. మున్సిపల్ కౌన్సిలర్ అవంతీ గోఖలే ఆదేశాల మేరకు ఛత్రపతి శివాజీ పేరుని పెట్టారు. పార్కులోపలి వైశాల్యం 1.17 కిలోమీటర్లు. మొత్తం మైదానం 112,937 చదరపు మీటర్లు. ఈ ప్రాంగణంలో టెన్నిస్ కోర్టు, వ్యాయామశాల, పిల్లల, వృద్ధుల పార్కులు, లైబ్రరీలు ఉన్నాయి. సైలెన్స్ జోన్గా ప్రకటించిన కోర్టు నిత్యం రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఈ పార్కు వల్ల ధ్వని కాలుష్యం ఎక్కువైందంటూ స్థానికులు 2009లో కోర్టుకి వెళ్ళారు. దీంతో మే, 2010లో బాంబే హైకోర్టు ఈ ప్రాంగణాన్ని సైలెంట్ జోన్గా ప్రకటించింది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్ను ఆత్మీయంగా పలకరిస్తున్న సుప్రియా సూలే. -
అజిత్కు షాకిచ్చిన అమిత్ షా!
న్యూఢిల్లీ: ఎన్సీపీలో తిరుగుబాటు తెచ్చి బీజేపీతో జట్టుకట్టి.. ఆదరాబాదరాగా ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆయన ఆరోపణలెదుర్కొంటున్నారు. ఈ కేసులను సాకుగా చూపి బీజేపీ అజిత్ను తమవైపు తిప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి. అజిత్తో కలిసి దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక.. ఈ కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ. 70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్ కేసులో అజిత్ పవార్కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీకి మద్దతునిచ్చినందుకు ప్రతిఫలంగా ఆయనను కేసుల నుంచి విముక్తి కల్పించినట్టు ఆరోపణలు కూడా గుప్పుమన్నాయి. అజిత్పై ఏసీబీ కేసుల ఎత్తివేత మీద శివసేన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. చదవండి: శరద్ పవార్ క్షమించేశారు!! అయితే, శరద్ పవార్ చాణక్యం ముందు ఫడ్నవిస్ ప్రభుత్వం నిలదొక్కుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం, పవార్ కుటుంబసభ్యులు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేయడంతో అజిత్ ఎట్టకేలకు దిగివచ్చి.. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. తిరిగి ఆయన ఎన్సీపీ గూటికి చేరుకున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అవినీతి కేసుల విషయంలో అజిత్కు క్లీన్చిట్ ఇవ్వలేదంటూ షాక్ ఇచ్చారు. అజిత్పై కేసులు ఎత్తివేయలేదని ఆయన స్పష్టం చేశారు. అజిత్ పవార్ వెంట బీజేపీ నడవదని, బీజేపీ వెంటే అజిత్ వస్తారని అమిత్ షా జోస్యం చెప్పారు. చదవండి: అజిత్కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా -
శరద్ పవార్ క్షమించేశారు!!
ముంబై: ఎన్సీపీ రెబల్ నేత, శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎన్సీపీతోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ‘నేను పార్టీని ఎప్పుడూ వీడలేదు. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అలాంటిదేమీ లేదు కదా. మీడియా నా విషయంలో తప్పుగా కథనాలు రాసింది. వాటిపై సరైన సమయంలో స్పందిస్తాను’ అని అజిత్ బుధవారం మీడియాకు తెలిపారు. సోదరుడిని ఆలింగనం చేసుకున్న సుప్రియా పార్టీ అధినేత శరద్ పవార్కు వ్యతిరేకంగా అజిత్ పవార్ తిరుగుబాటు లేవనెత్తిన సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శరద్ సిద్ధమవుతుండగా అనూహ్యంగా చివరినిమిషంలో అజిత్ ప్లేటు ఫిరాయించి బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తున్నట్టు గవర్నర్కు లేఖ ఇచ్చి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్కే పూర్తి అండగా నిలువడం.. తన వర్గం ఎమ్మెల్యేలు కూడా ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో అజిత్ వెనుకకు తగ్గారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కూడా దిగిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ తిరిగి ఎన్సీపీ గూటికే చేరుకున్నారు. ఈ తిరుగుబాటు విషయంలో పవార్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు కూడా సమసిపోయినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్ను సుప్రియా సూలె ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. తద్వారా తమ మధ్య విభేదాలు లేవని చాటారు. చదవండి: అజిత్కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా క్షమించేసిన శరద్ పవార్! తిరుగుబాటు లేవనెత్తి బీజేపీకి సపోర్ట్ చేసిన అజిత్ పవార్ను పార్టీ అధినేత శరద్ పవార్ క్షమించేశారట. ఈ విషయాన్ని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ మీడియాతో తెలిపారు. ‘చివర్లో అజిత్ తన తప్పు తాను తెలుసుకున్నారు. తప్పు చేసినట్టు అంగీకరించారు. ఇది కుటుంబ వ్యవహారం. పవార్ సాహిబ్ అజిత్ను క్షమించారు. ఆయన పార్టీలోనే ఉన్నారు. పార్టీలో ఆయన స్థానం ఏమాత్రం మారలేదు’ అని నవాబ్ మాలిక్ క్లారిటీ ఇచ్చారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం!
ముంబై: మహారాష్ట్ర 14వ శాసనసభ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీలో పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కోలంబర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మాజీ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ (ఎన్సీపీ), హరిభావు భగడే (బీజేపీ) తదితరులు ప్రమాణం చేశారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే, ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయకముందే అసెంబ్లీ కొలువుదీరి.. ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేస్తుండటం గమనార్హం. ‘గత కొన్ని దశాబ్దాలుగా అసెంబ్లీలో మొదట ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేసేవారు. ఆ వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుత సభలో ముఖ్యమంత్రి లేరు. సీఎం ప్రమాణం చేయకుండానే ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది అరుదైన దృశ్యం’ అని మహారాష్ట్ర అసెంబ్లీ తాత్కాలిక కార్యదర్శి రాజేంద్ర భగవత్ మీడియాకు తెలిపారు. -
మూడున్నర రోజుల ముఖ్యమంత్రి!
సాక్షి ముంబై: ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ వినూత్న రికార్డులు సాధించారు. వీటిలో ఒకటి అత్యధిక కాలం(ఐదేళ్లు) ముఖ్యమంత్రిగా కొనసాగడం మరొకటి అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం. రెండో సారి ఫడ్నవిస్ మూడున్నర రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ రెండు రికార్డులతోపాటు సుమారు 20 రోజులలోపాటు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరో రికార్డు కూడా సృష్టించారు. మహారాష్ట్ర అవతరించిన అనంతరం ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. గతంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్రావు చవాన్ అయిదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. అనంతరం 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ అయిదేళ్ల పాలన పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా రికార్డు సాధించారు. ఇలాంటి రికార్డు సృష్టించిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన అనంతరం మళ్లీ నవంబర్ 23వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: అజిత్కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా అయితే ప్రమాణస్వీకారం చేసి 80 గంటలు (మూడున్నర రోజులు)లోనే దేవేంద్ర ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ రికార్డు కెక్కారు. గతంలో 1963లో ముఖ్యమంత్రి మారోతరావ్ కన్నంవార్ మరణానంతరం 1963 నవంబరు 25వ తేదీ సావంత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా సావంత్ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరోసారి నవంబర్ నెలలోనే 23వ తేదీన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ అత్యల్పంగా కేవలం మూడున్నర రోజులలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇద్దరిదీ ఒకే తీరు.. దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. అయితే వీరిద్దరి జన్మదినం ఒకే రోజు కావడం విశేషం. దేవేంద్ర ఫడ్నవీస్ జన్మదినం 1970 జూలై 22 కాగా, అజిత్ పవార్ జన్మదినం 1959 జూలై 22. దీంతో ఒకే తేదీన జన్మించిన వీరిద్దరు 2019 నవంబర్ 23వ తేదీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా నవంబరు 26వ తేదీన ఇద్దరూ రాజీనామాలు చేయడం విశేషం. మహారాష్ట్రలో ఎప్పుడేం జరిగిందంటే.. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తరువాత రోజురోజుకు మారిన రాజకీయ పరిణామ క్రమం ఇలా.. అక్టోబర్ 21, 2019: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. అక్టోబర్ 24: ఎన్నికల ఫలితాల ప్రకటన. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 స్థానాలు. నవంబర్ 9: ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించిన గవర్నర్. మెజారిటీ నిరూపణకు 48 గంటల సమయం. నవంబర్ 10: ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ప్రకటించిన బీజేపీ. శివసేనను ఆహ్వానించిన గవర్నర్. నవంబర్ 11: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనన్న శివసేన. బల నిరూపణకు 3 రోజుల గడువు కోరింది. తిరస్కరించిన గవర్నర్. ఎన్సీపీకి ఆహ్వానం. నవంబర్ 12: తమ వినతిని గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన నవంబర్ 22: శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 23: రాష్ట్రపతి పాలన ఎత్తివేత. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం నవంబర్ 23: గవర్నర్ నిర్ణయంపై మళ్లీ సుప్రీంను ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నవంబర్ 24: రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గవర్నర్ కోరిన లేఖను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం ఆదేశం నవంబర్ 26: నవంబర్ 27న బలనిరూపణ చేపట్టాలని గవర్నర్ను ఆదేశించిన సుప్రీంకోర్టు అజిత్పవార్ రాజీనామా, దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా. నవంబర్ 27: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం -
అజిత్కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కోలాహలం నెలకొంది. ముందుగానే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న ఎన్సీపీ నేత సుప్రియా సూలె పలువురు నేతలకు సాదర స్వాగతం పలికారు. మొదట శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు ఆమె స్వాగతం పలికారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడంతో ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎన్సీపీ సీనియర్ నేత, తన సోదరుడు అజిత్ పవార్ వచ్చారు. అజిత్ను కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ స్వాగతం పలికారు. పార్టీ అధినేత శరద్ పవార్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ చివరినిమిషంలో మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఫడ్నవిస్తో మర్యాదపూర్వకంగా సుప్రియా సూలె కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సుప్రియా సూలె మాట్లాడుతూ.. తమ సంకీర్ణ ప్రభుత్వం మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలంతా తమకు అండగా నిలబడ్డారని అన్నారు. చదవండి: ఉద్దవ్ ఠాక్రేకే పీఠం.. -
రంగంలోకి దిగిన శరద్ పవార్ భార్య
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బలపరీక్షను ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు వేగంగా సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో బీజేపీ కోర్కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం బీజేపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారిచేసింది. రేపటి బలపరీక్షలో విజయం సాధిస్తామని బీజేపీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఫడ్నవిస్తో ఎన్సీపీ రెబల్ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని లెమన్ ట్రీ హోట్లో శివసేన నేతలు, మరియట్ హోటల్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అజిత్ పవార్పై ఎన్సీపీ ఒత్తిడి శివసేన, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్సీపీకి ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ చివరిక్షణంలో ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్.. రేపటి బలపరీక్షలో కీలకం కానున్నారు. అజిత్ పవార్పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అజిత్ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అజిత్ పవార్తో మంగళవారం శరద్ పవార్ కుటుంబసభ్యులు మంతనాలు జరిపారు. శరద్ పవార్ భార్య రంగంలోకి దిగి.. అజిత్తో మాట్లాడారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి.. తిరిగి ఎన్సీపీ గూటికి వస్తే.. శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అజిత్కు వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఎన్సీపీ నేతలు ఒత్తిడి.. అటు బీజేపీ నేతలు ఆశల నేపథ్యంలో అజిత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. బుధవారం నాటి బలపరీక్షలో అజిత్ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అజిత్ బీజేపీ సర్కారును కూల్చుతారా? లేక నిలబెడతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. -
మా బలం 162
సాక్షి, ముంబై: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ గ్రాండ్ హయత్ సోమవారం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి బలప్రదర్శనకు వేదికైంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చే రోజుకు ఒక రోజు ముందు.. సోమవారం సాయంత్రం మూడు పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ తమ ఎమ్మెల్యేలతో గ్రాండ్ హయత్ హోటల్లో పరేడ్ నిర్వహించింది. 162 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, ఇది గవర్నర్ కోశ్యారీ చూస్తున్నారనే భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. శివసేనకు చెందిన 56, ఎన్సీపీకి చెందిన 51, కాంగ్రెస్కు చెందిన 44, మిత్రపక్షాలు, ఇతరులు 11 మంది.. మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆసక్తి సృష్టించిన ఈ ‘మహా పరేడ్’లో శివసేన నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఛగన్ భుజ్బల్, జయంత్ పాటిల్, సునీల్ తట్కరే, సుప్రియా సూలే, కాంగ్రెస్ నేతలు ఖర్గే, అశోక్ చవాన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు సమాజ్వాదీ నేత అబూ ఆజ్మీ, ‘స్వాభిమాని షెట్కారీ సంఘటన్’ చీఫ్ రాజు శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో ‘ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, తమ పార్టీ నేతల ఆదేశానుసారమే నడుచుకుంటామని’ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలు సైతం ప్రతిజ్ఞ చేశారు. పరేడ్ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు, ఈ మూడు పార్టీల నేతలు గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సభ్యత్వంపై నాదీ భరోసా ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ కనుక, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలంటూ ఆయన జారీ చేసే విప్ను ధిక్కరిస్తే శాసనసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందనే భయాలు అక్కర్లేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేల సభ్యత్వానికి తనదే బాధ్యత అని శరద్ పవార్ హామీ ఇచ్చారు. విప్ను ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందంటూ తమ ఎమ్మెల్యేలను బీజేపీ భయాందోళనలకు గురి చేస్తోందని పవార్ విమర్శించారు. ‘రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించాను. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను పరిశీలించాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ను తొలగించాం. కాబట్టి, పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం తనకు లేదు. జారీ చేసినా ఆ విప్ చెల్లదు’ అని పవార్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. ‘భయం, ఆందోళన వద్దు. మీ సభ్యత్వానికి నాదీ భరోసా. అక్రమంగా అధికారంలోకి వచ్చినవారిని గద్దె దింపాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై శరద్ పవార్ నిప్పులు చెరిగారు. ‘అక్రమంగా, మెజారిటీ లేకున్నా అధికారంలోకి రావడానికి ఇది గోవా కాదు.. మహారాష్ట్ర. ఈ విషయం బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ఇక్కడున్న 162 మంది ఎమ్మెల్యేలే కాదు.. తమ వెనుక ఇంకా ఎక్కువ మంది శాసన సభ్యులే ఉన్నారన్నారు. ‘కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం. బీజేపీని అడ్డుకునే దిశగా ఈ అవకాశం మాకు కల్పించిన మా పార్టీ చీఫ్ సోనియాకు కృతజ్ఞతలు’ అన్నారు. నేరస్తుల్లా పరేడ్: బీజేపీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నిర్వహించిన బల ప్రదర్శనపై బీజేపీ మండిపడింది. నేరస్తుల తరహాలో పరేడ్ నిర్వహించి, దేశం ముందు మహారాష్ట్ర పరువు తీశారని బీజేపీ నేత ఆశిశ్ షెలార్ విమర్శించారు. పరేడ్లో 162 కాదు.. 145 మంది కూడా లేరని వ్యాఖ్యానించారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంతో రాష్ట్రంలో అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. అయితే, ఈ పరేడ్కు 137 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని సమాచారం. అడ్డు తొలగండి – ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డు తొలగాలని బీజేపీని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ‘మళ్లీ వస్తాను’ అనే ఫడ్నవీస్ ఎన్నికల ప్రచార నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘మేం ఆల్రెడీ వచ్చేశాం’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అధికారం కోసం బీజేపీ అత్యంత హేయంగా వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన చెక్కుపై తొలి సంతకం చేస్తున్న ఫడ్నవీస్ -
మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే బీజేపీ-ఎన్సీపీ (అజిత్ వర్గం) బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో అజిత్ పవార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి.. కాసేపు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత శరద్ పవార్తో మాట్లాడించినట్టు సమాచారం. అజిత్ను బుజ్జగించి తిరిగి తనవైపు తిప్పుకునేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్ అజిత్తో భేటీ అయి చర్చలు జరిపారు. శరద్ పవార్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతునివ్వబోరని ఛగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి వస్తారా? లేక బీజేపీతో ముందుకు సాగుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించిన అజిత్కు ఎమ్మెల్యేలెవరూ మద్దతునివ్వడం లేదని, ఎన్సీపీకి 54మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 53మంది శరద్ పవార్ వెంటే ఉన్నారని, స్వయంగా ఎమ్మెల్యే అయిన అజిత్ ఒక్కడే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. -
మాకు 162మంది ఎమ్మెల్యేల మద్దతుంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్సీపీ ముఖ్య నేత అజిత్ పవార్ ఒక్కసారిగా తిరుగుబాటు చేసి.. బీజేపీతో చేతులు కలుపడంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహరాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష విషయమై సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం తీర్పు వెలువరించనుండగా.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు సోమవారం గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని కలిశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 162మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు తెలిపారు. గవర్నర్ను కలిసిన అనంతరం ఎన్సీపీ నాయకుడు జయంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు ఉదయం 10 గంటలకు నేను, షీండే, చవాన్, వినాయక్ రావత్ తదితర నేతలతో కలిసి గవర్నర్ను కలిశాం. మా కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ తరఫున లేఖ ఇచ్చాం. గవర్నర్ ఎప్పుడు కోరితే అప్పుడు 162 మంది ఎమ్మెల్యేలను ఆయన ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ప్రకటించారు. తప్పుడు పత్రాలతో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైందని, కానీ తమ కూటమికి పూర్తి మెజారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్రలోని రాజకీయ డ్రామాపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. బీజేపీకి మెజారిటీ లేదనే విషయం అందరికీ తెలిసిందేనని, గతంలో తమకు మెజారిటీ లేదనే విషయాన్ని అంగీకరిస్తూ బీజేపీ గవర్నర్కు లేఖ కూడా రాసిందని గుర్తు చేశారు. ఇక, అజిత్ పవార్ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ విషయమై పార్టీ నేతలు తగిన సమయంలో సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు అజిత్ వర్గం ఎమ్మెల్యేలు క్రమంగా తమవైపు చేరుతున్నారని, ప్రస్తుతం 53మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ఎన్సీపీ నేత నవాజ్ మాలిక్ తెలిపారు. -
వెంటనే బలపరీక్ష జరగాలి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుబట్టాయి. బీజేపీ ఉద్దేశపూరితంగానే బలపరీక్షను జాప్యం చేయాలని చూస్తోందని, ఈ రోజు లేదా రేపటిలోగా బలపరీక్షకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాయి. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా శివసేన పార్టీ తరఫున కపిల్ సిబల్, ఎన్సీపీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మహారాష్ట్రలో హడావిడిగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించడం ద్వారా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారని సింఘ్వీ దుయ్యబట్టారు. అజిత్ పవార్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు ధ్రువీకరిస్తూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వారు లేఖ ఎంతమాత్రం ఇవ్వలేదని సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అజిత్ వద్ద ఉన్న లేఖతో బీజేపీ అతి తెలివి ప్రదర్శించిందని, గవర్నర్ ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారు సంతకాలు చేసిన అఫిడవిట్లను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, విచారణ పరిధిని పెంచడం ఇష్టంలేని సుప్రీంకోర్టు ఈ అఫిడవిట్లను స్వీకరించడానికి నిరాకరించింది. ఉద్ధవ్ ఠాక్రేకు 48మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 56మంది శివసేన ఎమ్మెల్యేలు, 44మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతునిస్తున్నారని సింఘ్వీ స్పష్టం చేశారు. చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు, బేరసారాలను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష జరగాలని, 24 గంటల్లో అసెంబ్లీ బలనిరూపణ చేసుకునేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సింఘీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇవ్వవద్దని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం శివసేన కూటమికి ఉందని తెలిపారు. బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ కూడా పేర్కొంటున్నదని, ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా జాప్యమెందుకని, వీలైనంత త్వరగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బలపరీక్ష జరగడం ముఖ్యమని, గెలుపోటములు కాదని అన్నారు. చదవండి: ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో! శివసేన తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందన్న అజిత్ పవార్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తున్నట్టు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఏదని ప్రశ్నించారు. తమ వద్ద 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి అఫడవిట్లు ఉన్నాయని, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని స్పష్టం చేశారు. కేవలం శాసనసభాపక్ష నేత అజితే ఫిరాయించారని ఆరోపించారు. సభలో బలముంటే నిరూపించుకోవడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని సిబల్ నిలదీశారు. తెల్లవారుజామునే హడావిడిగా రాష్ట్రపతి పాలన ఎందుకు ఎత్తివేశారని, చడీచప్పుడు లేకుండా హడావిడిగా ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని విమర్శించారు. సభలో వీడియో రికార్డింగ్ ద్వారా బలపరీక్ష జరగాలని కోరారు. ఉత్తరాఖండ్, కర్ణాటకలో జరిగిన తీరుగానే మహారాష్ట్రలోనూ బలపరీక్ష జరగాలని కోర్టును కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది. -
ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు మిత్రపక్షంగా ఉండి కలిసి పోటీ చేసిన శివసేన.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించిందని బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. శివసేన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శివసేన తీరుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, అనంతర పరిణామాల్లో ఒక పవార్ బీజేపీతో ఉండగా.. మరొక పవార్ శివసేనతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న శివసేన కూటమే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖలపై గవర్నర్ను అనుమానించాల్సిన అవసరం లేదని, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ కలిసి సమావేశమైన తర్వాతే గవర్నర్కు లేఖ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారని చెప్పారు. చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని.. ఫడ్నవిస్కు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా? అంటూ ప్రశ్నించింది. దీనికి రోహత్గి స్పందిస్తూ.. అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఫడ్నవిస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ విచణతోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటకలో యెడియూరప్ప సర్కారు ఏర్పాటు వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఎప్పటిలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలో సుప్రీంకోర్టు చెప్పజాలదని రోహత్గి వాదించారు. చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి? ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ తరఫు లాయర్ మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. తమదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని చెప్పుకొచ్చారు. ఎన్సీఎల్పీ నాయకుడిగా తమ పార్టీకి చెందిన 54మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు ఇచ్చానని తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్కు లేఖ ఇచ్చానని సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పార్టీలోనే పరిష్కరించుకుంటామని, వెంటనే ఈ పిటిషన్పై విచారణ నిలిపివేయాలని అజిత్ లాయర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది. -
బీజేపీ టార్గెట్ 180.. ఆ నలుగురిపైనే భారం!
ముంబై : బలపరీక్షలో తన ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బంపర్ మెజారిటీతో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు తెరలేపినట్టు తెలుస్తోంది. మీడియా కంటపడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 145. కానీ, బీజేపీ 170 నుంచి 180 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రధానంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. ఇటీవలికాలంలో బీజేపీలో చేరిన నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్రావు లోనికర్లకు ‘ఆపరేషన్ ఆకర్ష’ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో వీరికి ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఇక, గణేశ్ నాయక్, బాబన్రావు ఎన్సీపీ మాజీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వీరికి మంచి సంబంధాలున్నాయి. వీరి ద్వారా పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నలుగురు నేతలు పలువురు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలతో టచ్లోకి వచ్చారని అంటున్నారు. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్నట్టు చెప్తోంది. ఈ 15మంది స్వతంత్రుల్లో 11మంది ఇప్పటికే మద్దతు లేఖలు ఇచ్చారు. ఇక, ఇటీవల చేతులు కలిపిన అజిత్ పవార్ 27 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను తనవెంట తీసుకొచ్చే అవకాశముందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇదే జరిగితే 143 నుంచి 146 మంది మద్దతు బీజేపీకి దక్కినట్టు అవుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగే స్పీకర్ ఎన్నికలో తమ నేతను సభాపతిగా ఎన్నుకుంటే.. సగం బలపరీక్ష నెగ్గినట్టేనని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకునేందుకు అటు శరద్ పవార్ కూడా శాయశక్తులా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక, బీజేపీ అజిత్పైనే గట్టి నమ్మకమే పెట్టుకుంది. ‘అజిత్ వెంట 27 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముంది. ఎన్నికల్లో పార్టీ రోజువారీ వ్యవహారాలు చూసుకోవడమే కాదు.. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఖర్చులను పూర్తిస్థాయిలో అజితే భరించారు. ఇటు కాంగ్రెస్, సేన ఎమ్మెల్యేలకు కూడా ఆయన సాయం చేశారు. కాబట్టి ఆయన వెంట పెద్దఎత్తున ఎమ్మెల్యేలు కలిసివచ్చే అవకాశముంది’ అని ఒక బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. మొత్తం 29 మంది (16 మంది చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, 13 మంది స్వతంత్రులు)లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతునిస్తున్నారు. వీరిలో చాలామందికి బీజేపీ గట్టిగానే గాలం వేస్తోంది. వీరిలో ఎక్కువమంది బీజేపీలో చేరే అవకాశముందని భావిస్తున్న కమలదళం.. శివసేన ఎమ్మెల్యేల్లో కూడా కొందరిని తనవైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. స్వతంత్ర, చిన్న పార్టీల ఎమ్మెల్యేల్లో ఎస్పీ, ఎంఐఎం మినహా మిగతా 19, 20 మంది మద్దతు తనదేనని బీజేపీ ధీమాగా ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యేల డిమాండ్లకు అంగీకరించడమే కాదు.. ఫిరాయింపునకు సిద్ధపడితే మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమంటూ బీజేపీ ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఆపరేషన్ ఆకర్ష ఫలిస్తే బలపరీక్షలో నెగ్గడం చాలా సులభమని కాషాయ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. -
మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సంక్షోభంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్ వద్ద కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్భవన్ మెజారిటీని నిరూపించజాలదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపులు నిరోధించాలంటే వెంటనే బలపరీక్ష జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. 24 గంటల్లోగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వరాదని, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం కనీసం 7రోజుల గడువు ఇవ్వాలని బీజేపీ తరఫు న్యాయవాది కోరగా.. 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం చేయరాదని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ధర్మసనాన్ని అభ్యర్థించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తన తీర్పును వెలువరించనుంది. చదవండి: ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో! గవర్నర్ నిర్ణయంలో తప్పేముంది? కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ముందు పొత్తులకు సంబంధించి గవర్నర్కు అన్ని విషయాలు తెలుసునని, కూటమి పొత్తుల గురించి కూడా ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతిస్తూ బీజేపీ గవర్నర్కు ఇచ్చిన లేఖను ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదట మూడు పార్టీలను గవర్నర్ ఆహ్వానించారని, ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోవడంతో విధిలేక రాష్ట్రపతి పాలన విధించారని వివరించారు. అనంతర పరిణామాల్లో ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చిందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. బీజేపీకి మద్దతునిస్తూ 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అజిత్ పవార్ ఇచ్చారని, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత హోదాలో అజిత్ లెటర్ హెడ్లో ఎమ్మెల్యేలతో సంతకాలతో ఈ లేఖ ఉందని వివరించారు. చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి? బీజేపీ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఈ 170 మంది ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్ద ఉందని వివరించారు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ విచక్షణాధికారాలు ఉంటాయని, గవర్నర్ నిర్ణయంపై న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టుకు లేదని, వెంటనే ఈ పిటిషన్ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను ఆహ్వానించే హక్కు గవర్నర్కు ఉందని, 170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చాక దేవేంద్ర ఫడ్నవిస్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో తప్పేముందని, ప్రశ్నించారు. గవర్నర్ విడివిడిగా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడలేరు కదా అని వ్యాఖ్యానించారు. పార్టీలు సమర్పించిన జాబితానే గవర్నర్ విశ్వసిస్తారని తెలిపారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ ఎవరికీ జవాబుదారీ కాదని పేర్కొన్నారు. ఫిరాయింపులపై ఆలోచించాకే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని సొలిసిటర్ జనరల్ చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఆదివారం సెలవురోజు అయినప్పటికీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఫడ్నవీస్ను ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్ గవర్నర్కు రాసిన లేఖను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ లేఖలను సోలిసిటర్ జనరల్ సోమవారం న్యాయస్థానానికి అందజేశారు. ఈ రెండు లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఆదివారం విచారణ సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ లేకపోవడంతో ఆ లేఖలను తమకు అందజేసే బాధ్యత తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. అయితే, 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్ను ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆ లేఖలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం ‘24 గంటల్లోగా బల నిరూపణను ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్ను గవర్నర్ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్కు ఫడ్నవీస్ పంపిన లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ‘మహా వికాస్ అఘాడి’ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్ను ఆదేశించాలన్న వినతిని సైతం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వినతిని పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సెలవు రోజైనప్పటికీ ఆదివారం విచారణను కోర్టు ప్రారంభించడం విశేషం. చదవండి: విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం! -
మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న బీజేపీ.. ప్రతిపక్ష శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుండటంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను వేర్వేరు హోటళ్లకు తరలించి.. వారు జంప్ కాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి. అయినా ఆయా పార్టీలను ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి బీజేపీ నిఘా పెట్టినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో తిరుగుతున్న ఇద్దరు పోలీసులను ఎన్సీపీ నేతలు గుర్తించి నిలదీయడం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ సర్కార్ ఉసిగొల్పడంతోనే పోలీసులు ఇలా మాములు చొక్కాలు ధరించి.. తమపై గూఢచర్యం నెరుపుతున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో పోలీసులు కనిపించడంతో అప్రమత్తమైన ఎన్సీపీ అధినాయకత్వం తమ ఎమ్మెల్యేలను ఆ హోటల్ నుంచి హోటల్ హయత్కు ఆదివారం సాయంత్రం మార్చింది. ముంబై పొవైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో ఇద్దరు పోలీసులు కనిపించడంతో వారిని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ నిలదీశారు. పోలీసుల ఐడీ కార్డులు చెక్చేసిన ఆయన.. ‘ఉన్నతమైన పదవుల్లో ఉన్న మీరు ఎలాంటి కారణం లేకుండా ఇక్కడ తిరుగుతున్నారని చెబితే నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్లమా?’ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బీజేపీ తరఫున పోలీసులు గూఢచర్యం నెరుపుతున్నారని, ఎమ్మెల్యేల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీజేపీకి చెరవేస్తున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సైతం బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్లో బీజేపీ కూడా రూమ్లు బుక్ చేస్తోందని, తద్వారా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ కాంటాక్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ గాలానికి అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్కు తరలించారు. అటు శివసేన తన ఎమ్మెల్యేలను గట్టి నిఘా నడుమ ముంబై ఎయిర్పోర్ట్కు సమీపంలోని లలిత హోటల్లో ఉంచింది. -
ఎన్సీపీలోనే ఉన్నా.. శరద్ మా నేత!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్పవార్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని, తన నేత శరద్పవారేనని స్పష్టం చేశారు. బీజేపీ–ఎన్సీపీ సంకీర్ణం మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఐదేళ్లు కొనసాగుతుందని ట్వీట్ చేశారు. దీనిపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘శివసేన, కాంగ్రెస్లతో కూటమి ఏర్పాటు చేయాలనేది ఎన్సీపీ ఏకగ్రీవ నిర్ణయం’ అని శరద్ పవార్ ట్వీట్ చేశారు. ‘అజిత్ పవార్ ప్రకటన అబద్ధం. గందరగోళం సృష్టించే ఉద్దేశంతో ఇచ్చినట్లుగా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ను తొలగించి, ఆ స్థానంలో సీనియర్ నేత జయంత్ పాటిల్ను నియమించామని గవర్నర్కు ఎన్సీపీ సమాచారమిచ్చింది. సంబంధిత లేఖతో ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ గవర్నర్ నివాసం రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి ఆ సమాచారం అందజేశారు. ఆ తరువాత ఆయన నేరుగా అజిత్ పవార్ నివాసానికి వెళ్లడం విశేషం. తప్పు దిద్దుకుని, బీజేపీ నుంచి తిరిగి వెనక్కు రావాల్సిందిగా పవార్ను కోరేందుకే తాను వెళ్లానని ఆ తరువాతమీడియాకు చెప్పారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి అజిత్ పవార్ కృతజ్ఙతలు తెలిపారు. ఇంటికి తిరిగొచ్చిన అజిత్ పవార్ శనివారం తన సోదరుడి ఇంట్లో గడిపిన అజిత్ పవార్ ఆదివారం చర్చ్గేట్ దగ్గర్లోని తన నివాసానికి తిరిగి వచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నేతలను కలుసుకున్నారు. మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు 170కి పైగా ఎమ్మెల్యేల మద్దతుందని, సునాయాసంగా విశ్వాస పరీక్షను నెగ్గుతామని బీజేపీ తెలిపింది. విశ్వాస పరీక్షకు గవర్నర్ నవంబర్ 30 వరకు సమయమిచ్చారని బీజేపీ నేత ఆశిశ్ షెలర్ తెలిపారు. బీజేపీకి మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలతో త్వరలో భేటీ అవుతామన్నారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత కాబట్టి.. అజిత్ పవార్ విప్ జారీ చేస్తే.. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా ఆ విప్కు బద్ధులై ఉండాల్సిందేనన్నారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే భేటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలున్న రినాయిజన్స్ హోటల్లో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్ధవ్ కుమారుడు, పార్టీ నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలున్న హోటల్లోకి సివిల్ దుస్తుల్లో పోలీసులు రావడంపై ఎన్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బస మారింది బీజేపీ నుంచి బేరసారాలకు వీలు లేకుండా, తమ ఎమ్మెల్యేలకు కాపాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ ఆదివారం రాత్రి వారిని మొదట బస చేసిన హోటల్ నుంచి మార్చి వేరే హోటల్కు మార్చాయి. మొదట, ఎన్సీపీ ఎమ్మెల్యేలను రినాయిజెన్స్ రిసార్ట్లో ఉంచగా, ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి వారిని మరో హోటల్కు మార్చారు. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు మొదట అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర్లోని లలిత్ హోటల్లో బస చేశారు. ఆదివారం రాత్రి వారిని కూడా వేరే రహస్య ప్రాంతానికి తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం జుహూలోని జేడబ్ల్యూ మేరియట్ హోటల్లోనే ఉన్నారు. ఫడ్నవీస్ను అభినందిస్తున్న చంద్రకాంత్ పాటిల్ ముంబైలోని తన నివాసానికి వస్తున్న అజిత్పవార్ -
అజిత్కు కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్
ముంబై : ఎన్సీపీ రెబల్ నేత, మహారాష్ట్ర ఉపమఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్కు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. అజిత్ తన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే అజిత్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా శరద్ పవార్ స్పష్టం చేశారు. శివసేన, కాంగ్రెస్తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు.. బీజేపీకి మద్దతునిచ్చే దిశగా తమ పార్టీ చీఫ్ ఆలోచిస్తున్నారని అజిత్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘నేను ఎన్సీపీలో ఉన్నాను. ఎప్పటికీ ఎన్సీపీలోనే కొనసాగుతాను. మా నాయకుడు శరద్ పవారే. బీజేపీ-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తుంది. ప్రజా సంక్షేమం కోసమే మా ప్రభుత్వం ఏర్పడింది’అని అజిత్ ట్వీట్ చేశారు. మరొక ట్వీట్లో.. దేనికి గురించి బాధ పడాల్సిన పనిలేదు. అంతా సవ్యంగానే ఉంటుంది. అయితే, కొంత సంయమనం పాటించాలి. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు’అని పేర్కొన్నాడు. కాగా, అనూహ్య మలుపుల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 105 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి విశ్వాస పరీక్షలో నెగ్లాలంటే మరో 40 మంది సభ్యుల మద్దతు కావాలి.. ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య 54. -
బ్రేకింగ్ న్యూస్ ఏమో కానీ.. : సుప్రియా సూలే
ముంబై/న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలే సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. మహారాష్ట్రలో జరుగుతున్న నాటకీయ పరిణామాలను కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో శరద్ పవార్ వెళ్తున్న కారును వెంబడించిన మీడియా ప్రతినిధులు.. ప్రమాదకర రీతిలో వీడియో చిత్రీకరించారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. వెనకాల ఉన్న వ్యక్తి వీడియో చిత్రీకరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన సుప్రియా.. ‘మీరు చేస్తున్నది బ్రేకింగ్ న్యూస్ కోసమని తెలుసు.. కానీ కాస్త జాగ్రత్త తీసుకోండి. నేను ఆ బైక్ డ్రైవర్, కెమెరామెన్ గురించి ఆందోళన పడుతున్నాన’ని పేర్కొన్నారు. బంధుత్వాలు ముఖ్యమని నమ్ముతాను.. అజిత్ పవార్ బీజేపీకి మద్దతుగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఉద్దేశించి సుప్రియా తన వాట్సాప్ స్టేటస్లో పలు పోస్ట్లను ఉంచారు. కుటుంబం, పార్టీలో చీలిక వచ్చిందని పేర్కొన్న ఆమె.. తాను జీవితంలో ఇంత దారుణంగా మోసపోతానని అనుకోలేదని అన్నారు. తాము అతన్ని నమ్మినందుకు, ప్రేమించినందుకు.. తిరిగి తమకు ఏమి లభించిందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. ‘అధికారం వస్తుంది.. పోతుంది. కానీ బంధుత్వాలు ముఖ్యమని నేను నమ్ముతాను’, ‘ గుడ్ మార్నింగ్.. విలువలే చివరకు విజయం సాధిస్తాయి. నిజాయితీ, శ్రమ ఎప్పటికీ వృథా కాదు.. ఈ మార్గం చాలా కష్టమైనదైనప్పటికీ దీర్ఘకాలం నిలిచిపోతుంది’ అంటూ కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటీ నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అధికార పంపిణీ విషయంలో శివసేన, బీజేపీల మధ్య పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీతో మంతనాలు జరిపింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ముగియడంతో గవర్నర్.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ క్రమంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా యత్నించింది. ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చింది. శనివారం రోజున గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు సిద్ధమైంది. కానీ, బీజేపీ తెరవెనక మంతనాలు జరపడంతో.. రాత్రికి రాత్రే మహా రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీ మద్దతుగా నిలువడంతో.. గవర్నర్ దేవేంద్ర ఫడ్నవిస్చే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీం కీలక ఆదేశాలు జారీచేసింది. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
అజిత్ దాదా పవర్ ఇదీ...
ముంబై: అజిత్ పవార్ తండ్రి అనంత్రావ్ పవార్ కొన్నాళ్లపాటు ప్రముఖ దర్శకుడు వి. శాంతారాం దగ్గర పనిచేశారు. ఆ సినీ వాసనలేమైనా వంటబట్టాయో ఏమో, అజిత్ బాలీవుడ్ థ్రిల్లర్ని తలదన్నేలా మహా రాజకీయాన్ని నడిపారు. ఇన్నాళ్లూ చిన్నాన్న శరద్ పవార్ నీడలో నీడలా కలిసిపోయిన పవార్ ఆయనకే రాజకీయంగా గట్టి ఝలక్ ఇచ్చి ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించు కున్నారు. శరద్ అనే వటవృక్షం నీడ నుంచి తప్పుకోవాలని అజిత్ భావిస్తున్నారని ఎప్పట్నుంచో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజిత్ సొంత పార్టీ పెడతారనీ గతంలో వార్తలొచ్చాయి. మహారాష్ట్ర సీఎం కావాలని అజిత్ పవార్ ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. 2004, 2009లో కాంగెస్, ఎన్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినా ఆయన కల నెరవేరలేదు. అప్పట్నుంచే తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి అజిత్ పవార్ పావులు కదుపుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. కుటుంబ తగాదాలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీరుపై అజిత్కు ఎప్పట్నుంచో అసంతృప్తి నెలకొని ఉంది. పవార్ తన కుమార్తె సుప్రియా సూలెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, తన కుమారుడు పార్థ్ పవార్ విషయంలో చాలా అనాసక్తిగా ఉన్నారని అజిత్ లోలోపల రగిలిపోతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవార్ కుమారుడు పార్థ్ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. పార్థ్ ఓటమికి తన చిన్నాన్నే కారణమని అజిత్ నిందించినట్టుగా ఎన్సీపీలో పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు నేతలు చెబుతున్నారు. స్వతంత్రభావాలు, ప్రజాకర్షణ అజిత్కు అద్భుతమైన పాలనాదక్షుడు, సర్వ స్వతంత్ర భావాలు కలిగిన నాయకుడిగా పేరుంది. ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా పేరున్న అజిత్ పవార్ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. పుణె జిల్లాలో బారామతి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ వరసగా ఏడుసార్లు అక్కడ నుంచే గెలుపొంది రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసున్న అజిత్ పవార్ ఈ సారి ఎన్నికల్లో 1.65 లక్షల మెజార్టీతో నెగ్గి నియోజకవర్గంపై తనకున్న పట్టుని మరోసారి చాటుకున్నారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాల కారణంగా అభిమానులు ఆయనను దాదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. 1959, జులై 22న రైతు కుటుంబంలో పుట్టిన అజిత్ పవార్ విద్యాభ్యాసం అంతా బోంబేలోనే సాగింది. 1982లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ కోపరేటివ్ బోర్డు సభ్యుడయ్యారు. 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే తన చిన్నాన్న కోసం లోక్సభ పదవిని వదులుకొని అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రి పదవుల్ని సమర్థంగా నిర్వహించారు. 1991లో తొలిసారిగా సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వ హయాంలో మంత్రి అయ్యారు. వ్యవసాయం, గ్రామీణ భూ పరిరక్షణ, విద్యుత్, సాగునీరు వంటి శాఖల మంత్రిగా పనిచేశారు. -
అవినీతి ఆరోపణలు.. ఈడీ కేసులు
రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమలుపుకి కారణమైన అజిత్ పవార్ సహా ఎన్సీపీ అధినేత శరద్పవార్పైనా, ఇతర నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు. ఎన్సీపీ నేతలపై మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం మొదలుకొని పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయి. అజిత్ పవార్, ఇరిగేషన్ స్కాం... అజిత్ పవార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుని మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుని బట్టి విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్ పవార్పై ఆరోపణలు వచ్చాయి. అయితే తన నిర్ణయాలన్నీ సెక్రటరీ స్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా తీసుకున్నవేనని అజిత్ పవార్ ఆ తరువాత సమర్థించుకున్నారు. సెప్టెంబర్ 2012న అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి, తిరిగి నియామకం అయ్యారు. శరద్ పవార్, అజిత్ పవార్లపై ఈడీ కేసు... ఈ యేడాది సెప్టెంబర్లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెలముందు ఎన్సీపీ నేత శరద్పవార్, అజిత్పవార్లపై ఇతర మనీ ల్యాండరింగ్ కేసులతో పాటు 25 వేల కోట్ల మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంకు కుంభకోణం కేసుని మోపారు. 2010 నవంబర్ 10 నుంచి 2014 సెప్టెంబర్ 26 వరకు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఎటువంటి నిబంధనలను పాటించకుండా, ఆర్థిక బలాలను పరిగణనలోనికి తీసుకోకుండా చక్కెర ఫ్యాక్టరీలకు విచ్చలవిడిగా రుణాలివ్వడం ద్వారా జనవరి 1, 2007 నుంచి 2017 డిసెంబర్ 31 మధ్య కాలంలో ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఎంఎస్సీసీ బ్యాంకుల నుంచి కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలకు ఎటువంటి పూచీ లేకుండా రుణాలిచ్చి, ఆ తరువాత వాటిని ఖాయిలాపడ్డ పరిశ్రమలుగా చూపించారన్న ఆరోపణలున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్సీపీ, శివసేనల నేతలు దిలీప్రావ్ దేశ్ముఖ్, ఇషార్లాల్ జైన్, జయంతి పాటిల్, శివాజీ రావ్, ఆనంద్రావు. రాజేంద్ర షింఘేన్, మాధవ్ పాటిల్లపై ఈడీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంకుల చట్టాలను, ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించిన విషయాన్ని నాబార్డ్ ఆడిట్ రిపోర్టు వెల్లడించింది. చగన్ భుజ్బల్పై ఈడీ కేసు... మనీ ల్యాండరింగ్, నేరపూరిత దుష్ప్రవర్తన, కుట్ర, మోసపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎన్సీపీ నాయకుడూ, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి చగన్ భుజ్బల్ను 2016 మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండగా 2005లో ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండా, కె.ఎస్.చమాంకర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని భుజ్బల్పై ఆరోపణలున్నాయి. -
ఆ ఎమ్మెల్యేలపై శరద్ పవార్ మండిపాటు
న్యూఢిల్లీ/సాక్షి,ముంబై: అజిత్ పవార్తోపాటు అతని వెంట ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. ఎన్సీపీలో అంతర్గత పోరుతోనే అజిత్ బయటకు వెళ్లారన్నది అవాస్తవమన్నారు. బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన ఫడ్నవీస్తో హడావుడిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం చట్ట విరుద్ధమంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని, తక్షణమే శాసనసభను రద్దు పరిచి, బల పరీక్ష జరిపించాలని కోరాయి. ఈ పిటిషన్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు విచారణకు రానుంది. మా వాళ్లంతా తిరిగి వస్తారు: పవార్ ఆకస్మిక రాజకీయ పరిణామాలపై శనివారం ఉదయం ఆయన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకార సమయంలో అక్కడున్న 10–11 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ మా వద్దకు వచ్చారు. మిగతా వారూ వస్తారు’ అని శరద్ తెలిపారు. అజిత్ చర్య క్రమశిక్షణారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ‘అజిత్తోపాటు వెంట ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడం ఖాయం. అజిత్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ప్రజలే ఓడిస్తారు’అని అన్నారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమికి అసెంబ్లీలో 170 మంది సభ్యుల బలముంది’ అని అన్నారు. బీజేపీవి చీకటి రాజకీయాలు: ఉద్ధవ్ తాజా పరిణామాలపై ఉద్ధవ్ స్పందించారు. ‘శివసేన ఏదైనా బాహాటంగానే చేస్తుంది. చీకటి రాజకీయాలు మేం చేయం. ఇదివరకు బీజేపీ ఈవీఎం వ్యవహారం నడిపించింది. ఇప్పుడు ఇదో కొత్త నాటకం. ఇకపై ఎన్నికలు కూడా అవసరమని నేను అనుకోను. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మాదిరిగానే కేంద్ర కేబినెట్ ఉదయాన్నే తీసుకున్న ఈ నిర్ణయం నకిలీస్టైక్స్(ఫర్జికల్ స్టైక్స్). మహారాష్ట్ర ప్రజలు శిక్షించక తప్పదు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదో చీకటి అధ్యాయం: కాంగ్రెస్ మహారాష్ట్రలో అక్రమ మార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని, భారతదేశ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయమని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కాంట్రాక్టు పుచ్చుకున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. మహారాష్ట్రలో కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–శివసేన–ఎన్సీపీ కూటమి బీజేపీని ఓడిస్తుందని పేర్కొంది. ఉదయం సుప్రీం విచారణ ఫడ్నవీస్తో సీఎం ప్రమాణం చేయిస్తూ గవర్నర్ కోష్యారీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎమ్మెల్యే బేరసారాలకు మరింతగా అవకాశం ఇవ్వకుండా వెంటనే శాసనసభలో బల నిరూపణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. అజిత్ పవార్పై వేటు ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ను ఆ పార్టీ తొలగించింది. ఎన్సీపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపినందున అతన్ని తొలగించినట్లు తెలిపింది. దీంతో విప్జారీచేసే అధికారం అజిత్ కోల్పోయారని తెలిపింది. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎన్నికయ్యే వరకు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ రాజ్యాంగపర హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఈ సమావేశానికి మొత్తం 54 మందికిగానూ 49 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి బలం నిరూపించుకునేందుకు ఈ నెల 30 వరకూ సమయం ఉందని, అందులో బీజేపీని ఓడించి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చెప్పారు. ఫడ్నవీస్, అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్భవన్లో ఉన్న తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తుదకు శరద్ పవార్ వద్దకు చేరడం గమనార్హం. ఎప్పుడేం జరిగింది ? దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగాæ ప్రమాణం చేయడానికి ముందు రాత్రి నుంచి జరిగిన పరిణామాలివీ... నవంబర్ 22 8:00 (రాత్రి) ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతల భేటీ 8:45–9:00 భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన అజిత్ పవార్ 10:00–10:30 ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రెస్మీట్లో వెల్లడించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 11:30–11:50 బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న అజిత్ నవంబర్ 23 12:00 (అర్ధరాత్రి): తెల్లవారేసరికి ప్రమాణ స్వీకారం ముగుస్తుందని కీలక వ్యక్తులకు సమాచారమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ 12:15–12:40: ఢిల్లీ వెళ్లే పర్యటనను రద్దు చేసుకున్న మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ. ఉదయం ఆయన ప్రయాణం కావాల్సి ఉంది. 12:30: రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శిని కోరిన కోష్యారీ 2:30–2:45: రాష్ట్రపతి పాలన ఎత్తివేసే పత్రాలు తయారు చేయడానికి రెండు గంటలు పడుతుందని చెప్పిన గవర్నర్ కార్యదర్శి. ఉదయం ఏడున్నర గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సూచన. 5:30: రాజ్భవన్ చేరుకున్న అజిత్, ఫడ్నవీస్ 5:47: రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ప్రకటించిన గవర్నర్ 7:50: ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ కోష్యారీ. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం. 8:45: ఫడ్నవీస్, అజిత్ పవార్లను అభినందించిన ప్రధాని మోదీ. 8.50: ప్రమాణస్వీకారం బయటికి తెలియడంతో శరద్ పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ వద్దకి చేరుకున్న ఎన్సీపీ నేతలు 9.00: ఉద్దవ్ ఠాక్రే నివాసస్థానం మాతోశ్రీ, శరద్ పవార్ నివాసస్థానం సిల్వర్ ఓక్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు. 10.10: బీజేపీ ఎమ్మెల్యేలందరూ ముంబైకి రావాలని ఆదేశాలు 10.30: శరద్తో భేటీ అయిన నవాబ్ మాలిక్ 11:00: హోటల్ మరీన్ ప్లాజాలో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ 12.30: వైబీ చవాన్ సెంటర్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల మీడియా సమావేశం 1.50:తాను ఇప్పుడేమీ చెప్పలేనని సరైన సమయంలో అన్ని విషయాలు చెప్తానన్న అజిత్ 2.30: తమ ఎమ్మెల్యేలను సురక్షిత స్థలాలకు తరలించాలని కాంగ్రెస్ నిర్ణయం సాయంత్రం 5.15: సోదరుడు శ్రీనివాస్ పవార్ నివాసంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ భేటీ. పటిష్ట భద్రత ఏర్పాటు. 6.20: సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన. రాత్రి 8.00 అజిత్పై వేటు వేసిన ఎన్సీపీ నవంబర్ 24 ఉదయం 11.30: పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం -
ఢిల్లీకి చేరిన ‘మహా’ పంచాయితీ
న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీని చేరాయి. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. అక్టోబర్ 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన దోస్తీ తెగదెంపులు కావడంతో.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో వారికి ఊహించని షాక్ తగిలింది. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. (చదవండి : శివసేన, ఎన్సీపీలతో కలిసే ఉన్నాం: కాంగ్రెస్) శనివారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ వారితో ప్రమాణం చేయించారు. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ముంబై వర్గాల సమాచారం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది. (చదవండి : ఫడ్నవిస్కు బలముందా.. ఉత్కంఠగా బలపరీక్ష!) -
‘మహా ట్విస్ట్’పై మీమ్స్.. నవ్వు ఆపుకోలేరు!
మీమ్స్.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. చూడగానే నవ్వు వస్తుంది. ఓ చిన్న బొమ్మ దాని కింద రాసే అక్షరాలు.. ఎంతో అర్థాన్ని ఇస్తాయి. అంతేకాదు కామెడీ పూయిస్తాయి. చూసినోళ్లు నవ్వకుండా ఉండలేరు. ఏ అంశం మీదైనా ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఒక్కఫోటోతో ఏం జరిగిందో కామెడీగా చెప్పేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ రోజు జరిగిన ‘మహా’ ట్విస్ట్పై కూడా సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. ఇక శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ రాత్రికిరాత్రే ఎన్నో ఎన్నోమార్పులు జరిగాయి. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయానంతా నెటిజన్లు తమదైన శైలిలో చెప్పేస్తున్నారు. సీఎం అవుతాని భావించిన ఉద్దవ్ ఠాక్రే ఆశలు ఆవిరైపోయాయి. బీజేపీ నేతలు చీటింగ్ చేశారు, మోదీ, అమిత్ షాలు కలిసి గేమ్ను ఛేంజ్ చేశారు.. అనే అర్థాలు వచ్చే విధంగా ఉన్న మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవెంటో చూసి మీరూ నవ్వుకోండి. Meanwhile #AdityaThackeray be like #MaharashtraPolitics #UddhavThackeray pic.twitter.com/FGTYhzODOU — Gayatri (@mhaskegayatri) November 23, 2019 2 people can change the game in last over#Motabhai #MaharashtraPolitics #captaincool pic.twitter.com/1WU4tlXpJD — the_meemer_boy (@meemspedia) November 23, 2019 Keep your friends close, but your enemies closer ~ @godfathermovie pic.twitter.com/h6AaX4WJdn — Milind Deora मिलिंद देवरा (@milinddeora) November 23, 2019 🤣🤣 pic.twitter.com/5UgakfcMT9 — Nithin Kumar (@sowmiyan86) November 23, 2019 BJP did Operation Kamala in Karnataka and today it finished Operation NCP.😎💪#MaharashtraPolitics pic.twitter.com/KbqeRxSxRg — @raj_mehariya (@raj_mehariya) November 23, 2019 Sanjay Raut and Uddhav Thackeray right now... #MaharashtraPolitics pic.twitter.com/8r0NRbx1mH — Indrajit Kar (@TheIndrajitKar) November 23, 2019 Amit shah to #संजय_राऊत 😂😂😂😂 #MaharashtraPolitics pic.twitter.com/nKNcOw6Ua4 — हर्ष सौदर्शन-छ.ग. (ہرش ساودارشان)🇮🇳 (@SaffronBeast) November 23, 2019 Gonna tell my kids they were the real characters from game of thrones. #MaharashtraPolitics pic.twitter.com/R7MYSrahWY — Aditya (@patheticiam) November 23, 2019 -
మహా ట్విస్ట్: పవార్, ఉద్ధవ్ ఠాక్రే ప్రెస్మీట్
ముంబై : తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు సరిపడా సంఖ్యాబలం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(బీజేపీ), డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్(ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫడ్నవిస్ ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అజిత్ పవార్ను ఎన్సీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లలేదని వ్యాఖ్యానించారు. అనర్హత వేటు తప్పదు ‘మా పార్టీ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. మేం ఏర్పాటు చేయబోయే సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతునిచ్చారు. అయితే తెల్లవారేలోగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ఆరున్నరకు తెలిసింది. మా ఎమ్మెల్యేలలో కొంతమందిని అజిత్ పవార్ రాజ్ భవన్కు వెళ్లారు. ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. అక్కడున్న వాళ్లతో అజిత్ మాట్లాడిస్తున్నారు. బహుశా ఆయన వెంట 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటారు అంతే. అయితే వాళ్లంతా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బీజేపీ బల నిరూపణ చేసుకోలేదు. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది’ అని శరద్ పవార్ పేర్కొన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ చేతులు కలిపేది లేదని స్పష్టం చేశారు.(అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్పై వివరణ) ఈ సందర్భంగా రాజ్ భవన్కు వెళ్లిన కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఆయన మీడియాతో మాట్లాడించారు. ‘ అజిత్ పవార్ ఫోన్ చేసి రాజ్ భవన్కు రమ్మంటే వెళ్లాం. అయితే అప్పటికే అక్కడ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడున్న వాతావరణంతో మేం షాక్కు గురయ్యాం. మేం అజిత్ వెంట వెళ్లడం లేదు. మా మద్దతు శరద్ పవార్కే’ అని ముగ్గురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం పరిణామాలపై చర్చించేందుకు సాయంత్రం నాలుగన్నర గంటలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో శరద్ పవార్ సమావేశం కానున్నారు. కాగా ఈ శివసేన, ఎన్సీపీ ఉమ్మడి పత్రికా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. ఎన్నికలు జరగాల్సిన అవసరం లేదేమో: ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర తాజా పరిణామాలపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ అన్ని సిద్ధాంతాలను విస్మరించింది. పార్టీలను చీల్చి అధికారం చేపట్టిందని ధ్వజమెత్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను కూడా ఆయన శత్రువులు వెన్నుపోటు పొడిచిన విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును ప్రజాస్వామ్యం మీద సర్జికల్ స్ట్రైక్గా ఆయన అభివర్ణించారు. ‘తొలుత ఈవీఎంలతో ఆటలాడారు. ఇప్పుడు కొత్త ఆట మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇక ముందు ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది’ అని అసహనం వ్యక్తం చేశారు